జమ్మూ కాశ్మీర్ లో గ్రెనేడ్ ఎటాక్, ఐదుగురికి గాయాలు
జమ్మూ కాశ్మీర్ బారాముల్లా జిల్లాలోని ఆజాద్ గంజ్ ప్రాంతంలో సోమవారం ఉదయం గ్రెనేడ్ ఎటాక్ జరిగింది. అనుమానిత ఉగ్రవాదులు బాంబును పేల్చారు. సైనిక కాన్వాయ్ వెళ్తుండగా వారిని టార్గెట్ చేసి.
జమ్మూ కాశ్మీర్ బారాముల్లా జిల్లాలోని ఆజాద్ గంజ్ ప్రాంతంలో సోమవారం ఉదయం గ్రెనేడ్ ఎటాక్ జరిగింది. అనుమానిత ఉగ్రవాదులు బాంబును పేల్చారు. సైనిక కాన్వాయ్ వెళ్తుండగా వారిని టార్గెట్ చేసి.. గ్రెనేడ్ విసిరారు . అయితే అది రోడ్డు పక్కన పడి పేలిపోవడంతో అయిదుగురు వ్యక్తులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.ఆ టెర్రరిస్టుల కోసం భద్రతా దళాలు గాలించినా ఫలితం లేకపోయింది. అయితే ఆ ప్రాంతాన్నంతా జవాన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
J&K: 6 civilians injured in a grenade attack in Baramulla area. Terrorists lobbed a grenade on an Army vehicle, which missed the target and instead exploded on the road. Injured are being treated at a local hospital https://t.co/UCChxpGibc pic.twitter.com/PGTItIOD1P
— ANI (@ANI) August 31, 2020