ముగిసిన జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్.. ఓటెత్తని గ్రేటర్ ఓటరు..మొత్తం ఓటింగ్ శాతం ఎంతంటే..!

గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. విశ్వనగరం కావడానికి ఉవ్విళ్లూరుతున్న హైదరాబాద్‌లో గ్రేటర్‌ ఎన్నికల్లో- ప్రజాస్వామ్యం డీలాపడింది. పెద్దసంఖ్యలో ముందునిలిచి ఓటేయాల్సిన..

ముగిసిన జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్.. ఓటెత్తని గ్రేటర్ ఓటరు..మొత్తం ఓటింగ్ శాతం ఎంతంటే..!
Follow us

|

Updated on: Dec 01, 2020 | 10:07 PM

Greater Polling Ended : గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. విశ్వనగరం కావడానికి ఉవ్విళ్లూరుతున్న హైదరాబాద్‌లో గ్రేటర్‌ ఎన్నికల్లో- ప్రజాస్వామ్యం డీలాపడింది. పెద్దసంఖ్యలో ముందునిలిచి ఓటేయాల్సిన యువతీయువకులు బాధ్యత మరిచారు. డివిజన్‌లో సమస్యపై ప్రశ్నించేవారు, నిగ్గదీసేవారు- పోలింగ్‌ రోజున గడప దాటలేదు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులతో పాటు ప్రైవేట్‌ సంస్థల ఉద్యోగులు ఓటింగ్‌లో పెద్దగా పాల్గొనలేదు.

ఓటింగ్ హడావుడి మచ్చుకైనా కనిపించలేదు. చలికాలం కదా… గంట తర్వాత ఓటేసేందుకు వచ్చే వారి సంఖ్య పెరుగుతుందని అధికారులు భావించినప్పటికి.. ఎక్కడా అలాంటి పరిస్థితి కనిపించలేదు. 150 డివిజన్లలోని కేవలం ఒకటి రెండు చోట్ల మినహా… జంటనగరాల పరిధిలో ఓటు హక్కును చాలా మంది బాధ్యతగా భావించలేదని కనిపింది.

సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్‌లో ఉన్న వారికి ఓటువేసేందుకు అవకాశం కల్పించారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు కరోనా బాధితులతో పాటు సాధారణ ఓటర్లకు కూడా అవకాశం కల్పించారు. గురువారం ఓల్డ్‌ మలక్‌పేట్‌లో రీపోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈనెల 4న ఓట్లు లెక్కింపు జరగనుంది.

పోలింగ్ ముగిసిన తరువాత ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి మందకొడిగా సాగిన పోలింగ్‌ మధ్యాహ్నం తర్వాత కాస్త పుంజుకుంది. మొత్తం 150 డివిజన్లలో కొన్ని స్థానాల్లో మాత్రమే పోలింగ్‌ 50 శాతం దాటింది. కొన్ని చోట్ల కనీసం పోలింగ్‌ 15 శాతం కూడా చేరకపోవడం గమనార్హం.

గ్రేటర్‌ పరిధిలో 74 లక్షల 44 వేల మంది ఓటర్లుంటే… మధ్యాహ్నం 3 గంటలు దాటే సమయానికి ఇందులో సగానికిపైగా ఓటు వేయలేదు. మూసపేట, జూబ్లిహిల్స్‌ వంటి నగరంలో ఉన్న డివిజన్లతో పాటు గుడిమల్కాపూర్‌, పటాన్‌ చెరు వంటి శివారు ప్రాంత ప్రజలు మాత్రం ఓటేశారు. నగరంలోని చాలా చోట్ల వృద్ధులు, గర్భిణిలు, దివ్యాంగులు సైతం ఓటు వేసేందుకు కదిలివచ్చారు.

గ్రేటర్ ఎన్నికల్లో ఈసారే అత్యంత తక్కువ శాతం ఓటింగ్ శాతం నమోదవడం విశేషంగా చెప్పుకోవాలి. 149 డివిజన్లలో అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ అత్యంత పలుచగా, ప్రశాంతంగా ముగిసింది. ఆర్సీపురం, పటాన్‌చెరు, అంబర్‌పేటలో అత్యధికంగా పోలింగ్ నమోదైంది. మలక్‌పేట్, కార్వాన్‌లో అత్యల్ప శాతం ఓటింగ్ నమోదైంది.

మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‎పై ప్రధాని మోదీ చురకలు..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!