Greater Elections Results 2020 : పాతబస్తీలోని కౌంటింగ్ ప్రాంతాలను పరిశీలించిన అదనపు కమిషనర్ డి.ఎస్.చౌహన్
జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రకియ కొనసాగుతున్నది. మరికాసేపట్లో ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సందర్భంగా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేసారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రకియ కొనసాగుతున్నది. మరికాసేపట్లో ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సందర్భంగా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేసారు. హైదరాబాద్ పాతబస్తీ మహావీర్ కాలేజీలో సంతోష్ నగర్ సర్కిల్ 7 లో కౌంటింగ్ ప్రాంతాన్ని అదనపు కమిషనర్ డి.ఎస్.చౌహన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుందని, నగరంలో ఇతర ప్రాంతాల్లో కూడా బందోబస్తూ కొనసాగుతుందని… శాంతి భద్రతుల పట్ల భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని చౌహన్ తెలిపారు. 50 వేల 331 ఓట్లు పోలయ్యాయి.