ఏపీ : టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణులకు గ్రేడులు కేటాయిస్తూ ఉత్తర్వులు
ఏపీలోని టెన్త్, ఇంటర్మీడియట్ విద్యార్థులను పాస్ చేయడంతో పాటు వారికి గ్రేడ్లను ఇస్తూ సర్కార్ ఉత్తర్వులు వెలువరించింది.
ఏపీలోని టెన్త్, ఇంటర్మీడియట్ విద్యార్థులను పాస్ చేయడంతో పాటు వారికి గ్రేడ్లను ఇస్తూ సర్కార్ ఉత్తర్వులు వెలువరించింది. 2020 జులై పబ్లిక్ పరీక్షలకు ఫీజు చెల్లించిన విద్యార్థులు అందరికీ గ్రేడ్లు ఇవ్వటంతో పాటు వారిని పాస్ చేస్తూ ప్రకటించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్కు సూచిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్ ఉత్తర్వులు విడుదల చేశారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ అకడమిక్ ఇయర్ లో ఎగ్జామ్స్ నిర్వహించలేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఏడాది మే నెలలో నిర్వహించాల్సిన పరీక్షలు కొవిడ్ కారణంగా వాయిదా పడ్డాయని.. ఆ తరువాత లాక్ డౌన్ కొనసాగడంతో పరీక్షలు రద్దు చేసినట్టు గవర్నమెంట్ వివరించింది. అయితే టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు రాసేందుకు సన్నద్దం అయ్యి పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులను గుర్తించి పాస్ చేసి గ్రేడ్ మార్కులు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం సూచించింది. పాఠశాలలో జరిపిన పరీక్షలో సదరు విద్యార్థులు చూపిన ప్రతిభ ఆధారంగా గ్రేడ్ మార్కులు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం పేర్కొంది.
Also Read :
Bigg Boss Telugu 4 : కుమార్ సాయికి అదే బలంగా మారిందా..?