జులై 31 నుంచి చండీఘర్ ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు స్టార్ట్..
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశమంతా స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. చరిత్రలో ఎన్నడూ జరగలేని ఘటనలన్నీ చోటు చేసుకున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే కోవిడ్ కారణంగా దేశ వ్యాప్తంగా ఉన్న స్కూళ్లు కూడా మూడు నెలల నుంచి మళ్లీ తెరుచుకోలేదు. వైరస్ అంతకంతకు ఎక్కువవుతుండటంతో ప్రభుత్వ స్కూళ్లు తెరవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు..
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశమంతా స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. చరిత్రలో ఎన్నడూ జరగలేని ఘటనలన్నీ చోటు చేసుకున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే కోవిడ్ కారణంగా దేశ వ్యాప్తంగా ఉన్న స్కూళ్లు కూడా మూడు నెలల నుంచి మళ్లీ తెరుచుకోలేదు. వైరస్ అంతకంతకు ఎక్కువవుతుండటంతో ప్రభుత్వ స్కూళ్లు తెరవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహాయం చేయడం లేదు. వైరస్ కట్టడి అయిన తర్వాతే స్కూళ్లు తెరవాలని భావిస్తున్నాయి.
ఇక కొన్ని స్కూళ్లు ఆన్లైన్ పాఠాలు బోధిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు టీవీల ద్వారా పాఠాలు చెబుతున్నాయి. ఈ విషయంలో చండీఘర్ రాష్ట్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో ప్రీ నర్సరీ నుంచి 8వ తరగతికి ప్రవేశాలు ప్రారంభం కానున్నాయని యూటీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. విద్యార్థులు జులై 31వ తేదీ నుంచి ఆగష్టు 14వ తేదీలోగా ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించాలని సూచించింది. అలాగే రైట్ టూ ఎడ్యుకేషన్ నిబంధనల ప్రకారం పాఠశాలల్లో ప్రవేశాలుంటాయని వెల్లడించారు అధికారులు.
కాగా ఛండీఘర్లో మొత్తం 115 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 40 సీనియర్ సెకండరీ స్కూల్స్, 53 హై స్కూల్స్, 13 మిడిల్ స్కూల్స్, 8 ప్రైమరీ స్కూల్స్, ఒక నర్సరీ ఉన్నాయి .
Read More:
ఏపీ, తెలంగాణలో కోవిడ్ టెర్రర్.. రోజు రోజుకీ పెరిగిపోతున్న కరోనా వ్యాప్తి..
విద్యార్థులకు శుభవార్త.. పాలిసెట్ దరఖాస్తు గడువు పెంపు..
కరోనా ఎఫెక్ట్: ఆంధ్ర ప్రదేశ్లోని ఆ జిల్లాలో 24 గంటల కర్ఫ్యూ