Breaking : అన్లాక్-2 మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం..
అన్లాక్-2 మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. జులై 31వరకు కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ కొనసాగుతుందని వెల్లడించింది. ఈ జోన్లలో నిత్యావసర సేవలకు మాత్రమే పర్మిషన్ ఉంటుందని తెలిపింది.
అన్లాక్-2 మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. జులై 31వరకు కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ కొనసాగుతుందని వెల్లడించింది. ఈ జోన్లలో నిత్యావసర సేవలకు మాత్రమే పర్మిషన్ ఉంటుందని తెలిపింది. బుధవారం నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి.
- కంటైన్మెంట్ జోన్లలో జులై 31 లాక్డౌన్ పొడిగింపు
కంటైన్మెంట్ జోన్ల వెలుపల..
- విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధం కొనసాగింపు
- హోంమంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకే అంతర్జాతీయ ప్రయాణికులకు అవకాశం
- మెట్రో రైల్, సినిమా హాళ్లు, జిమ్ములు, స్విమ్మింగ్ పూల్స్, సమావేశ మందిరాలు, వినోద పార్కులపైనా కొనసాగనున్న నిషేధం
- రాజకీయ, ఆధ్యాత్మిక సభలు, సమావేశాలపైనా నిషేధం
- రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకే కర్ఫ్యూ ఉంటుందని ప్రకటన
- బయట తిరిగే వారికి మాస్క్ తప్పనిసరి
- ప్రతి ప్రదేశంలో 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి
- వివాహం, వివాహ సంబంధిత కార్యక్రమాలకు 50 మందికి మించి పర్మిషన్ లేదు
- అంత్యక్రియల్లో 20 మందికే అనుమతి
- బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, పాన్, గుట్కా నమలడం, పొగాకు ఉత్పత్తులు తీసుకోవడం నిషేధం
- నిర్దేశిత నియమాల ప్రకారం అంతర్రాష్ట్ర, అంతర్గత ప్రయాణికుల సర్వీసులు కొనసాగింపు
- అవకాశం ఉన్న మేరకు వర్క్ ఫ్రమ్ చేయాలి