ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్…
ఉద్యోగులకు కేంద్రం ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్పీఎస్ టైర్ 2 అకౌంట్పై పన్ను బెనిఫిట్స్ అందిస్తున్నట్లు ప్రకటించింది. ఒక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో గవర్నమెంట్ ఉద్యోగులకు మేలు చేకూరనుంది.
ఉద్యోగులకు కేంద్రం ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్పీఎస్ టైర్ 2 అకౌంట్పై పన్ను బెనిఫిట్స్ అందిస్తున్నట్లు ప్రకటించింది. ఒక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో గవర్నమెంట్ ఉద్యోగులకు మేలు చేకూరనుంది.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్. పీ.ఎస్) స్కీమ్ టైర్ 2 ఖాతాలో డబ్బులు ఇన్వెస్ట్ చేసిన గవర్నమెంట్ ఉద్యోగులు ఆదాయపు పన్ను శాఖ సెక్షన్ 80 సీ కింద రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు పొందొచ్చు. అయితే ఈ ప్రయోజనం పొందాలంటే ఎన్పీఎస్ టైర్ 2 ఖాతాకు లాకిన్ పీరియడ్ 3 ఏళ్లుగా ఉంటుంది. ఎన్పీఎస్ టైర్ 2 ఖాతా తెరవాలంటే కనీసం రూ.1000 కావాలి. తర్వాత కనీసం రూ.250 ఇన్వెస్ట్ చేస్తే చాలు. ప్రభుత్వపు తాజా నిర్ణయంతో గవర్నమెంట్ ఉద్యోగులకు లబ్ది కలుగుతుంది. ప్రైవేట్ రంగ ఉద్యోగులతో పోలిస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్కు ట్యాక్స్ పరంగా ఇది కాస్త ఊరటనిచ్చే అంశం. ఎన్పీఎస్ పథకంలో రెండు రకాల ఖాతాలు ఉంటాయి. ఒకటేమో టైర్ 1. రెండోదేమో టైర్ 2. టైర్ 1 ఖాతా అనేది డిఫాల్ట్ అకౌంట్. ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల ట్యాక్స్ ప్రయోజనాలు పొందొచ్చు. ఇక టైర్ 2 ఖాతా అనేది ఆప్షనల్. ఎన్పీఎస్ టైర్ 1 ఖాతాపై ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లోకి సెక్షన్ 80సీసీడీ (1బీ) కింద ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్నవారు రూ.50,000 వరకు ట్యాక్స్ మినహాయింపు బెనిఫిట్ పొందొచ్చు. ఇది సెక్షన్ 80సీ కింద పొందే రూ.1.5 లక్షల ట్యాక్స్ పేయర్స్ కు అదనం.