భారత్పై సైబర్ దాడులకు చైనా కుట్ర: కేంద్రం హెచ్చరిక
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత లో రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా నేపధ్యంలో రెచ్చిపోయేందుకు సైబర్ నేరగాళ్ళు సిద్ధమయ్యారు. రాష్ట్రాలకు, వివిధ ప్రభుత్వ సంస్థలు
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత లో రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా నేపధ్యంలో రెచ్చిపోయేందుకు సైబర్ నేరగాళ్ళు సిద్ధమయ్యారు. రాష్ట్రాలకు, వివిధ ప్రభుత్వ సంస్థలు సహా ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింద ఈ సైబర్ దాడులకు ఆదివారమే ముహూర్తం కావచ్చని పేర్కొంది. ncov2019@gov.in వంటి ‘ఈ మెయిల్’ను నేరగాళ్ళు ఈ దాడులకు వినియోగించవచ్చని కేంద్రం తెలిపింది. భారతీయ కంప్యూటర్, అత్యవర విభాగాలు ఈ మేరకు ఓ సమాచారాన్ని విడుదల చేశాయి.
ఈ నేపథ్యంలో.. తెలిసిన వ్యక్తుల పేరిట వచ్చే మెయిళ్ళలోని యూఆర్ఎల్ లింకులను కూడా క్లిక్ చేయొద్దని హెచ్చరించింది. గతంలో జరిగిన సైబర్ దాడుల సందర్భంగా నిఘా వర్గాలకు చెందిన అత్యంత విలువైన సమాచారం విషయాన్ని కేంద్రం ఈ సందర్భంగా గుర్తు చేస్తోంది. ప్రముఖుల ఈ మెయిళ్ళను కూడా సైబర్ దాడులకు లక్ష్యాలుగా చేసుకుని సైబర్ నేరగాళ్ళు నేరాలకు పాల్పడవచ్చని హెచ్చరించింది. ప్రత్యేకించి అనుమానాస్పదమైన, తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఈ మెయిళ్ళను ఎట్టి పరిస్థితుల్లోనూ చూడవద్దని సూచించింది.