యాదాద్రిలో గవర్నర్ దంపతులకు పూర్ణకుంభ స్వాగతం
గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామినిదర్శించుకున్నారు.ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారి దర్శనానికి విచ్చేసిన గవర్నర్ దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అర్చన, ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు ప్రత్యేక ఆశీర్వాచనం చేశారు. ఆలయ ఈవో గీతారెడ్డి స్వామివారి లడ్డూ ప్రసాదం అందజేశారు. దర్శనానంతరం యాదాద్రి కొండపై పునర్నిర్మితమవుతున్న ప్రధానాలయం, శివాలయం సహా అన్ని పనుల పురోగతి గురించి గవర్నర్కు వివరించారు ఆలయ అధికారులు. తొలిసారిగా స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు […]
గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామినిదర్శించుకున్నారు.ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారి దర్శనానికి విచ్చేసిన గవర్నర్ దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అర్చన, ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు ప్రత్యేక ఆశీర్వాచనం చేశారు. ఆలయ ఈవో గీతారెడ్డి స్వామివారి లడ్డూ ప్రసాదం అందజేశారు. దర్శనానంతరం యాదాద్రి కొండపై పునర్నిర్మితమవుతున్న ప్రధానాలయం, శివాలయం సహా అన్ని పనుల పురోగతి గురించి గవర్నర్కు వివరించారు ఆలయ అధికారులు. తొలిసారిగా స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు గవర్నర్. ఆలయ పునర్నిర్మిణ పనుల పట్ల హర్షం వ్యక్తం చేశారు. గవర్నర్ రాక సందర్భంగా అధికారులు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మంత్రి జగదీష్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, కలెక్టర్ అనితా రామచంద్రన్ గవర్నర్కు ఘన స్వాగతం పలికారు.