ఉద్యోగులకు షాక్..ఆ ఉత్తర్వులు వెనక్కి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం
కరోనా మహమ్మారి కట్టడి చర్యల్లో భాగంగా దేశంలో లాక్డౌన్ అమల్లో ఉన్న సమయంలో వివిధ కంపెనీలు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు పనిచేయకున్నా సరే, ఉద్యోగులకు, సిబ్బందికి పూర్తి వేతనాలివ్వాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. నాలుగో విడత లాక్డౌన్ మార్గదర్శకాలను రిలీజ్ చేస్తూ హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఈ విషయం స్పష్టం చేశారు. ఈ మేరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద ఇటీవల జారీ చేసిన ఆదేశాలను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. లాక్డౌన్ కారణంగా […]
కరోనా మహమ్మారి కట్టడి చర్యల్లో భాగంగా దేశంలో లాక్డౌన్ అమల్లో ఉన్న సమయంలో వివిధ కంపెనీలు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు పనిచేయకున్నా సరే, ఉద్యోగులకు, సిబ్బందికి పూర్తి వేతనాలివ్వాలంటూ ఇచ్చిన ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. నాలుగో విడత లాక్డౌన్ మార్గదర్శకాలను రిలీజ్ చేస్తూ హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఈ విషయం స్పష్టం చేశారు. ఈ మేరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద ఇటీవల జారీ చేసిన ఆదేశాలను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. లాక్డౌన్ కారణంగా ఆదాయం ఆగిపోయిన సమయంలో… పూర్తి వేతనాలు చెల్లించే స్తోమత లేని చాలా కంపెనీలు, పారిశ్రామిక యూనిట్లకు ఇది బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. జీతాలు చెల్లించలేని కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.