దాచుకున్నాడు.. దొరికిపోయాడు..
కొందరికి ఓ హ్యబీ ఉంటుంది. కొత్తగా ఏది కనిపించినా.. దానిని తన సొంతం చేసుకోవాలని అనుకుంటారు. ఇలాంటి ఓ చిన్న పొరపాటు ఓ ఉద్యోగిని నిందితుడిగా మార్చింది. ముంబైలో నాణాలు ముద్రించే మింట్ హౌస్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అందులో పనిచేస్తున్న ఓ ఉద్యోగి లాకర్లో విడుదల కాని రూ. 20 నాణెలను రెండింటిని అధికారులు గుర్తించారు. ఆ లాకర్ సెంట్రల్ ఇండస్ర్టీయల్ సెక్యూరిటీ ఫోర్స్లో పనిచేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ చబుకశ్వర్ గా గుర్తించారు. చబుకశ్వర్పై […]
కొందరికి ఓ హ్యబీ ఉంటుంది. కొత్తగా ఏది కనిపించినా.. దానిని తన సొంతం చేసుకోవాలని అనుకుంటారు. ఇలాంటి ఓ చిన్న పొరపాటు ఓ ఉద్యోగిని నిందితుడిగా మార్చింది. ముంబైలో నాణాలు ముద్రించే మింట్ హౌస్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
అందులో పనిచేస్తున్న ఓ ఉద్యోగి లాకర్లో విడుదల కాని రూ. 20 నాణెలను రెండింటిని అధికారులు గుర్తించారు. ఆ లాకర్ సెంట్రల్ ఇండస్ర్టీయల్ సెక్యూరిటీ ఫోర్స్లో పనిచేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ చబుకశ్వర్ గా గుర్తించారు. చబుకశ్వర్పై అందులో పనిచేస్తున్న కొందరు ఫిర్యాదు చేయడంతో అతని లాకర్ను అధికారులు తనిఖీ నిర్వహించారు. వారి తనిఖీల్లో ఈ నాణెలు లభించాయి.
దీంతో ఆ ఉద్యోగిపై ముంబైలోని ఎమ్మార్ఏ మార్గ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాణెలు చోరీ చేసినట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే చబుకశ్వర్ ను పోలీసులు అరెస్టు చేయలేదు. కరోనా పూర్తిగా నిర్మూలన అయిన తర్వాత అతన్ని విచారణకు ఆదేశిస్తామని, అప్పటి వరకు సహకరించాలని ఆయనకు పోలీసులు కోరారు. ఈ కేసులో దోషిగా తేలితే ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష పడనుంది. కొత్త రూ. 20 నాణెలు ఏప్రిల్ లో విడుదల కావాల్సి ఉండే. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఈ నాణెలను విడుదల చేయలేదు.