వశిష్ట వారధి..కల సాకారం ! మారనున్న లంక ప్రజల తలరాతలు
ఉభయ గోదావరి జిల్లావాసుల చిరకాల స్వప్నం నెరవేరనుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రెండు జిల్లాల ప్రజలకు ప్రయాణ కష్టాలు తీరిపోనున్నాయి. తరతరాలుగా ఎదుర్కొంటున్న లంక ప్రజల తలరాతలు మారిపోనున్నాయి. పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలను కలుపుతూ నిర్మించ తలపెట్టిన వంతెన నిర్మాణంలో అడ్డంకులు, అవంతరాలు తొలగిపోనున్నాయి. ఉభయ గోదావరి ప్రజల చిరకాల వాంఛ అయిన వశిష్ట వంతెన నిర్మాణానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇరు జిల్లాలను కలుపుతూ వశిష్ట గోదావరిపై సఖినేటిపల్లి రేవు వద్ద వారధి […]
ఉభయ గోదావరి జిల్లావాసుల చిరకాల స్వప్నం నెరవేరనుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రెండు జిల్లాల ప్రజలకు ప్రయాణ కష్టాలు తీరిపోనున్నాయి. తరతరాలుగా ఎదుర్కొంటున్న లంక ప్రజల తలరాతలు మారిపోనున్నాయి. పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలను కలుపుతూ నిర్మించ తలపెట్టిన వంతెన నిర్మాణంలో అడ్డంకులు, అవంతరాలు తొలగిపోనున్నాయి. ఉభయ గోదావరి ప్రజల చిరకాల వాంఛ అయిన వశిష్ట వంతెన నిర్మాణానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇరు జిల్లాలను కలుపుతూ వశిష్ట గోదావరిపై సఖినేటిపల్లి రేవు వద్ద వారధి నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. దీంతో అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వశిష్ట వారధి నిర్మాణం కోసం సీఎం జగన్ వంద కోట్ల నిధులు కేటాయిచడంపై రాజోలు వాసులు హర్షం వ్యక్తం చేశారు. రాజోలు వైసీపీ కో ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో జగన్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారధి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే.. తనయుడు సీఎం జగన్ వారధి నిర్మాణాన్ని పూర్తి చేస్తారని రాజేశ్వరరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, పుర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అయితే, లంకవాసుల కలగా మిగిలుతుందనుకున్న వశిష్ట వారధి నిర్మాణంపై రెండు నెలల క్రితమే టీవీ 9లో ప్రసారమైన కథనానికి మంచి ఫలితం దక్కిందని స్థానికులు సైతం సంతోషం వ్యక్తం చేశారు.