ప్రభుత్వ కార్యాలయాల్లో సెల్ఫీ అటెండెన్స్.. ఎక్కడో తెలుసా..?

ములుగు జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల అటెండెన్స్ విధానంలో కలెక్టర్ నారాయణ వినూత్న మార్పు తీసుకొచ్చారు. ఉద్యోగులంతా సమయ పాలన పాటించాలని.. సెల్ఫీ అటెండెన్స్ విధానాన్ని తీసుకొచ్చారు. ఆయనే స్వయంగా ఈ యాప్‌ను తయారు చేయించారు. ములుగు వెలుగు అటెండెన్స్ అనే పేరుతో యాప్ ను రూపొందించారు. వైద్య ఆరోగ్య శాఖ, స్కూల్, పంచాయత్ రాజ్ శాఖ, ఆర్‌అండ్‌బీ, ఆస్పత్రి.. ఇలా శాఖ ఏదైనా సరే కచ్చితంగా ఉద్యోగులంతా ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిందే అని […]

ప్రభుత్వ కార్యాలయాల్లో సెల్ఫీ అటెండెన్స్.. ఎక్కడో తెలుసా..?
Follow us

| Edited By:

Updated on: Jul 27, 2019 | 12:21 PM

ములుగు జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల అటెండెన్స్ విధానంలో కలెక్టర్ నారాయణ వినూత్న మార్పు తీసుకొచ్చారు. ఉద్యోగులంతా సమయ పాలన పాటించాలని.. సెల్ఫీ అటెండెన్స్ విధానాన్ని తీసుకొచ్చారు. ఆయనే స్వయంగా ఈ యాప్‌ను తయారు చేయించారు. ములుగు వెలుగు అటెండెన్స్ అనే పేరుతో యాప్ ను రూపొందించారు. వైద్య ఆరోగ్య శాఖ, స్కూల్, పంచాయత్ రాజ్ శాఖ, ఆర్‌అండ్‌బీ, ఆస్పత్రి.. ఇలా శాఖ ఏదైనా సరే కచ్చితంగా ఉద్యోగులంతా ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిందే అని కండీషన్ పెట్టారు. ఉదయం 9 గంటల వరకూ ఆఫీసుకు వెళ్లి తమ సీట్లలో కూర్చొని సెల్ఫీ దిగి యాప్ ద్వారా కలెక్టర్‌కు పంపాలి. ఒక వేళ నైట్ ఎవరైనా ఉద్యోగి పనిచేస్తే ఆ వివరాలు కూడా యాప్‌ ద్వారా తెలియజేయాలి. అయితే ఈ విధానం పై కొందరు ఉద్యోగులు గుర్రుగా ఉన్నా.. ప్రజలు మాత్రం కలెక్టర్ ను మెచ్చుకుంటున్నారు. దీనివల్ల అధికారులు ఆఫీసులకు సమయానికి వస్తున్నారని చెబుతున్నారు.