దుబ్బాకలో నవంబర్ 3న సెలవు
దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలింగ్ జరిగే నవంబర్ 3న ఆ నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలకు సెలవు ప్రకటించింది.
November 3 Holiday : దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలింగ్ జరిగే నవంబర్ 3న ఆ నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవోను విడుదల చేసింది.
పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సామాగ్రి, పంపిణీ కేంద్రాల ఏర్పాటుకు వినియోగించే ప్రభుత్వ భవనాలు, విద్యా సంస్థలకు నవంబర్ 2, 3 తేదీల్లో సెలవు ప్రకటించింది. నవంబర్ 10న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. అవసరమైతే ఆ రోజు కూడా సెలవు ప్రకటించే అవకాశం ఉంది. ఈ వారం రోజుల పాటు ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పూర్తి భద్రతను ఏర్పాటు చేశారు. పోలింగ్కు ఒక రోజు ముందు ప్రచారం పూర్తిగా నిలివేయనున్నారు.
టీఆర్ఎస్ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఈ స్థానానికిగాను నవంబర్ 3న పోలింగ్ జరగనుంది. ఈ స్థానం కోసం మూడు ప్రధాన పార్టీలు ఢీ అంటే ఢీ అనే స్థాయిలో పోటీ పడుతున్నాయి.