Gopichand Malineni : రిలీజ్ చేసిన తర్వాత పెద్ద షాక్ తగిలింది.. నాకు వచ్చిన ఇబ్బంది ఏ డైరెక్టర్కు రాకూడదు..
ఈ సంక్రాంతికి సాలిడ్ హిట్ కొట్టాడు మాస్ రాజా రవితేజ. చాలా కాలం గా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ క్రాక్ సినిమాతో సూపర్ హిట్ ను....
Gopichand Malineni : ఈ సంక్రాంతికి సాలిడ్ హిట్ కొట్టాడు మాస్ రాజా రవితేజ. చాలా కాలం గా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ క్రాక్ సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్నారు. కరోనా తర్వాత సంచలన విజయం సాధించిన మొదటి సినిమాగా క్రాక్ నిలిచింది. క్రాక్ సినిమా ప్రస్తుతం థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది.
ఇక రవితేజతో డాన్ శీను సినిమాతో కెరియర్ ప్రారంభించిన దర్శకుడు గోపీచంద్ మలినేని. ఆతర్వాత రవితేజతో బలుపు,క్రాక్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో గోపీచంద్ మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినిమా హిట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. కరోనా తర్వాత మార్చి నుంచి అక్టోబర్ వరకూ నేను పడిన కష్టాలు చెప్పలేనివి. క్రాక్ సినిమాను ఓటీటీ రిలీజ్ చేయాలనీ చాలా ఒత్తిడి తెచ్చారు. తట్టుకోలేక క్రాక్ ఇన్ థియేటర్స్ అని ట్వీట్ చేశా.. అంత మొండిగా వ్యవహరించాల్సి వచ్చింది. ఇది మాస్ సినిమా.. థియేటర్స్ లో చూస్తే ఆ మజా వస్తుంది. జనవరి 9న రిలీజ్ చేసాం కానీ నాకు పెద్ద షాక్ తగిలింది. ఉదయం 8.45కి షో పడలేదు.. 11గంటలకు పడలేదు.. మాట్నీ కూడా పడలేదు. ఫస్ట్షో కూడా పడలేదు. ఆ టైమ్లో చాలా ఇబ్బంది అనిపించింది. దాన్ని మాటల్లో చెప్పలేను. చివరకు సెకండ్ షో పడింది. అప్పటికి జనాలు వస్తారని అనుకోలేదు. మొదటి షో తోనే సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చేసుకుంది. 50శాతం నిబంధనతో రవితేజగారి కెరీర్లోనే పెద్ద హిట్ అంటే మామూలు విషయం కాదు. సినిమా ఆగిపోతుందని అనుకున్న సమయంలో తిరుపతి ప్రసాద్గారు.. ఎన్వీ ప్రసాద్గారు.. హారికాహాసిని వంశీ, దాము గారు నాకు అండగా ఉన్నారు అంటూ చెప్పుకొచ్చాడు గోపీచంద్ మలినేని.
మరిన్ని ఇక్కడ చదవండి :
Pawan Kalyan : క్రిష్ సినిమా షూటింగ్ కు 20 రోజులు బ్రేక్ ఇవ్వనున్న పవన్.. ఈ గ్యాప్ లో..