పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
వికారాబాద్: సికింద్రాబాద్ నుంచి కర్ణాటకలోని సెడం వెళ్తున్న గూడ్స్ రైలు బుధవారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో వికారాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. బొగ్గుతో నింపిన 7 బోగీలు పూర్తిగా కింద పడిపోయాయి. దీంతో హైదరాబాద్ నుంచి వెళ్లే రైళ్లకు అంతరాయం కలిగింది. ఉదయం 8 గంటల సమయంలో సికింద్రాబాద్ నుంచి రైల్వే సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు.
వికారాబాద్: సికింద్రాబాద్ నుంచి కర్ణాటకలోని సెడం వెళ్తున్న గూడ్స్ రైలు బుధవారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో వికారాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. బొగ్గుతో నింపిన 7 బోగీలు పూర్తిగా కింద పడిపోయాయి. దీంతో హైదరాబాద్ నుంచి వెళ్లే రైళ్లకు అంతరాయం కలిగింది. ఉదయం 8 గంటల సమయంలో సికింద్రాబాద్ నుంచి రైల్వే సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు.