దుబాయ్‌లోని ప్రవాస భారతీయులకు గుడ్ న్యూస్

కొత్తగా అములులోకి వచ్చిన రెన్యూవల్ పాలసీ ప్రకారం.. ప్రవాసుల నుంచి పాస్‌పోర్టు దరఖాస్తు స్వీకరించిన రోజే సంబంధిత ప్రక్రియ ప్రారంభమవుతుందని దుబాయిలోని కౌన్సిల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది...

దుబాయ్‌లోని ప్రవాస భారతీయులకు గుడ్ న్యూస్
Follow us

|

Updated on: Aug 02, 2020 | 10:29 AM

దుబాయ్‌లో ఉంటున్న ప్రవాస భారతీయులకు గుడ్ న్యూస్. ఇక్కడి ప్రవాస భారతీయులు కేవలం రెండు రోజుల్లోనే తమ పాస్‌పోర్ట్‌లను రెన్యూవల్‌ చేసుకునేందుకు వీలుగా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు.

ఇవాళ్టి నుంచే…

ఇవాళ్టి నుంచి ఇది అమలులోకి వచ్చింది. కొత్తగా అమలులోకి వచ్చిన రెన్యూవల్ పాలసీ ప్రకారం.. ప్రవాసుల నుంచి పాస్‌పోర్టు దరఖాస్తు స్వీకరించిన రోజే సంబంధిత ప్రక్రియ ప్రారంభమవుతుందని దుబాయిలోని కౌన్సిల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. అయితే పోలీసుల నిర్ధారణ, భారత్‌ నుంచి అనుమతులు లభించాల్సి రావటం తదితర ప్రత్యేక అనుమతులు అవసరమైన సందర్భాల్లో ఈ ప్రక్రియ సుమారు రెండువారాల పాటు కొనసాగవచ్చని వెల్లడించింది.

మరో అద్భుతమైన అవకాశం…

అంతేకాకుండా ఏ ఎమిరేట్స్‌ సభ్యదేశంలో నివసించే భారతీయుడైనా ఇకపై దుబాయిలో ఉన్న భారత రాయబార కార్యాలయంలో పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు. కాగా, ఇప్పటి వరకు సభ్య దేశాలకు వేర్వేరు పాస్‌పోర్ట్‌ ధృవీకరణ కేంద్రాలను నిర్వహించేవారు. గత సంవత్సరం ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా అధికంగా ఇక్కడి కార్యాలయం రెండు లక్షలకు పైగా పాస్‌పోర్టులను జారీ చేసిందని ఇక్కడి అధికారులు తెలిపారు.