ఏడు ఏళ్ల గరిష్ట స్థాయికి పసిడి ధరలు..

భారత్‌లో బంగారం ధరలు మరోసారి భగ్గుమన్నాయి. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనావైరస్‌ బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. బంగారాన్ని పెట్టుబడిదారులు సురక్షిత మార్గంగా ఎంచుకుంటుండడంతో ధరలు అమాంతం కొండెక్కి కూర్చుంటున్నాయి. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందంటున్నారు మార్కెట్ నిపుణులు. అమెరికా, చైనాల వాణిజ్య ఉద్రిక్తతలు, మరోవైపు ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావంతో ట్రేడర్లు బంగారంపై పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ ప్రభావం భారత్ పడింది. తాజా […]

ఏడు ఏళ్ల గరిష్ట స్థాయికి పసిడి ధరలు..
Follow us

| Edited By:

Updated on: Oct 18, 2020 | 9:04 PM

భారత్‌లో బంగారం ధరలు మరోసారి భగ్గుమన్నాయి. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనావైరస్‌ బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. బంగారాన్ని పెట్టుబడిదారులు సురక్షిత మార్గంగా ఎంచుకుంటుండడంతో ధరలు అమాంతం కొండెక్కి కూర్చుంటున్నాయి. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందంటున్నారు మార్కెట్ నిపుణులు. అమెరికా, చైనాల వాణిజ్య ఉద్రిక్తతలు, మరోవైపు ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావంతో ట్రేడర్లు బంగారంపై పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ ప్రభావం భారత్ పడింది. తాజా 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 1 శాతం పెరిగి రూ.47,961 వద్ద ట్రెండింగ్ అవుతోంది. ఇక వెండి కూడా అదే బాటలో పరుగులు పెడుతోంది. కిలో వెండి ధర 5 శాతం పెరిగి రూ.48,999 వద్ద ట్రేడ్ అవుతున్నది.

అటు అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు ఏడు సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. సోమవారం బంగారం ధర 1 శాతం పెరిగి ఔన్సు ధర 1759.98 డాలర్లకు చేరుకుంది, యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్‌లోనూ 0.5 శాతం పెరిగి ఔన్స్ బంగారం 1765.70 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. 2012 అక్టోబర్ తర్వాత బంగారం ధర అత్యధికంగా పెరగడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్లాటినం 0.7 శాతం, వెండి ధరలు 2 శాతం పెరిగాయి. ఈ ఏడాది ప్రపంచ మార్కెట్లో బంగారం ధర 16 శాతం పెరిగింది.