బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?
లాక్ డౌన్లోనూ బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కరోనా భయంతో వినియోగదారుల సంఖ్య తగ్గినా కూడా ఇండియాలో మాత్రం పసిడి ధరలు పైపైకి వెళ్తున్నాయి.
లాక్ డౌన్లోనూ బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కరోనా భయంతో వినియోగదారుల సంఖ్య తగ్గినా కూడా ఇండియాలో మాత్రం పసిడి ధరలు పైపైకి వెళ్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రామ్స్ 24 క్యారెట్స్ బంగారం ధర రూ.470 పెరుగుదలతో రూ.48,980కు చేరింది.
అదే క్రమంలో 22 క్యారెట్స్ గోల్డ్ ధర కూడా ఏకంగా రూ.470 పెరుగుదలతో 10 గ్రాములకు రూ.44,940కు ఎగసింది. పసిడి ధరలు మాదిరిగానే వెండి ధర కూడా భారీగా పెరిగింది. కేజీ వెండి ధర రూ.900 పెరిగింది. దీంతో వెండి ధర రూ.48,300కి చేరింది. ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం ధర పెరిగింది. 22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ ధర రూ.500 పెరుగుదలతో రూ.45,700కు ఎగసింది. అదే క్రమంలో 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ ధర కూడా రూ.500 పెరిగి రూ.46,900కు చేరింది. అటు కేజీ వెండి ధర రూ.900 పెరిగి రూ.48,300కు చేరింది.