Zombie Reddy Movie: జాంబీ రెడ్డి సినిమా నుంచి ‘గో కరోనా’ సాంగ్ రిలీజ్.. ఇంట్లోనే ఉండమంటే ఊరుకుంటమా అంటూ..
తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన తేజ సజ్జ హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'జాంబీరెడ్డి'. భారత్ తొలి జాంబీ మూవీగా తెరకెక్కుతున్న
తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన తేజ సజ్జ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘జాంబీరెడ్డి’. భారత్ తొలి జాంబీ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ఆనంది, దక్ష నగార్కర్ హీరోయిన్లుగా నటిస్తున్నండగా.. వచ్చే నెల ఫిబ్రవరి 5న ఈ మూవీ విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ బైట్, బిగ్ బైట్తో సినిమాపై అంచనాలను పెంచేశారు. తాజాగా ఈ చిత్రంలోని గో కరోనా పాటను విడుదల చేసింది చిత్రబృందం.
ఇంట్లోనే ఉండమంటే ఊరకుంటమా.. రోడ్లన్నీ ఖాళీగా ఉంటే రాక ఉంటమా.. ఎవడెన్ని చెప్తా ఉన్నా మేము వింటమా.. మా వీపు పగిలే వరకు మానుకుంటమా అంటూ ఈ పాట సాగింది. దీనికి మార్క్ కె రాబిన్ ట్యూన్ అందించగా.. లాక్ డౌన్ సమయంలో జరిగిన ఇన్సిడెన్స్ ఆధారంగా ఈ పాటను చిత్రీకరించనట్లుగా కనిపిస్తోంది. దీనికి మామా సింగ్ లిరిక్స్ అందించడంతోపాటు ర్యాప్ కూడా పాడారు. అంతేకాకుండా ప్రేక్షులను గో కరోనా సాంగ్ బాగా ఆకట్టుకుంది. ఆపిల్ ట్రీ బ్యానర్ పై రాజశేఖర్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Also Read: