నాలుగంత‌స్తుల భ‌వ‌నంపై వేలాడిన యువ‌తి.. గట్టిగా అర‌వ‌డంతో..

కోవిద్-19 విజృంభిస్తోంది. ఇప్పుడు భారత్ లో విలయతాండవం చేస్తోంది. లాక్ డౌన్ సడలింపులతో ప్రజా జీవనం తిరిగి ప్రారంభమయింది. అయితే.. గుజరాత్‌లోని వల్సాడ్‌లో నాలుగు అంతస్తుల భవనంపై పిట్ట‌గోడ‌కు వేలాడుతున్న ఒక యువ‌తిని స్థానికులు ర‌క్షించారు. ఈ ఘటన పర్నేరాలో చోటుచేసుకుంది. భ‌వ‌నంపైకప్పు మీదకు చేరుకున్న ఆ బాలిక ప‌ట్టుత‌ప్ప‌డంతో ఈ ఘటన చోటుచేసుకుంద‌ని తెలుస్తోంది. కాగా.. పదిహేడేళ్ల ఏళ్ల యువ‌తి తానుంటున్న‌ అపార్ట్‌మెంట్ పైనున్న పిట్ట‌గోడ నుంచి వేలాడుతున్న విష‌యాన్ని స్థానికులు గ‌మ‌నించారు. ఈ సమయంలో […]

నాలుగంత‌స్తుల భ‌వ‌నంపై వేలాడిన యువ‌తి.. గట్టిగా అర‌వ‌డంతో..
Follow us

| Edited By:

Updated on: Jun 01, 2020 | 12:35 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. ఇప్పుడు భారత్ లో విలయతాండవం చేస్తోంది. లాక్ డౌన్ సడలింపులతో ప్రజా జీవనం తిరిగి ప్రారంభమయింది. అయితే.. గుజరాత్‌లోని వల్సాడ్‌లో నాలుగు అంతస్తుల భవనంపై పిట్ట‌గోడ‌కు వేలాడుతున్న ఒక యువ‌తిని స్థానికులు ర‌క్షించారు. ఈ ఘటన పర్నేరాలో చోటుచేసుకుంది. భ‌వ‌నంపైకప్పు మీదకు చేరుకున్న ఆ బాలిక ప‌ట్టుత‌ప్ప‌డంతో ఈ ఘటన చోటుచేసుకుంద‌ని తెలుస్తోంది.

కాగా.. పదిహేడేళ్ల ఏళ్ల యువ‌తి తానుంటున్న‌ అపార్ట్‌మెంట్ పైనున్న పిట్ట‌గోడ నుంచి వేలాడుతున్న విష‌యాన్ని స్థానికులు గ‌మ‌నించారు. ఈ సమయంలో చాలా మంది వీడియోలు కూడా తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంత‌లో ఇద్ద‌రు స్థానికు‌లు ఆమెకు చేయి అందించి, పైకి తీసుకువ‌చ్చారు. ఈ క్రమంలో వల్సాద్‌కు చెందిన పోలీసు అధికారి మాట్లాడుతూ ఆ యువ‌తి అపార్ట్‌మెంట్ పైక‌ప్పుకు చేరుకున్నాక కాలు ప‌ట్టుత‌ప్పి ప్ర‌మాదానికి గుర‌య్యింద‌న్నారు. వెంట‌నే ఆమె అర‌వ‌డంతో స్థానికులు ఆమెను కాపాడారని తెలిపారు.

Also Read: తెలంగాణలో జులై 1 నుంచి పాఠశాలలు ప్రారంభం.. మార్గదర్శకాలు ఇవే!