సెల్‌ఫోన్ ఇవ్వలేదని.. 15 ఏళ్ల కూతురు ఆత్మహత్య

పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. త‌ల్లి త‌న‌కు ఫోన్ ఇవ్వ‌లేదంటూ 15ఏళ్ల బాలిక ఆత్మ‌హత్య పాల్పడింది. రామగుండం ఎన్టీపీసీ కృష్ణానగర్‌కు చెందిన కంకణాల సింధుజ(15) అనే బాలిక తన ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడింది.

సెల్‌ఫోన్ ఇవ్వలేదని..  15 ఏళ్ల కూతురు ఆత్మహత్య
Follow us

|

Updated on: Aug 24, 2020 | 5:43 PM

పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. త‌ల్లి త‌న‌కు ఫోన్ ఇవ్వ‌లేదంటూ 15ఏళ్ల బాలిక ఆత్మ‌హత్య పాల్పడింది. రామగుండం ఎన్టీపీసీ కృష్ణానగర్‌కు చెందిన కంకణాల సింధుజ(15) అనే బాలిక తన ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడింది. ఎన్టీపీసీకి చెందిన రజిత మొదటి భర్త కంకణాల సుధాకర్‌ సుమారు పన్నెండేళ్ల కిందట మృతి చెందాడు. ఆతర్వాత రజిత సూరు రవికిరణ్‌ను వివాహం చేసుకుంది. సుధాకర్‌ తరపున బంధువులు ఎవరూ లేకపోవటంతో సింధుజ తల్లితోనే కృష్ణానగర్‌లో ఉంటోంది. ఇటీవల పాఠశాలలో 10వ తరగతికి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించటంతో అప్పుడప్పుడు సింధుజ మొబైల్ ఫోన్ లో ఆన్ లైన్ క్లాసులు వింటోంది. దీంతో తల్లి వద్ద ఉన్న సెల్ ఫోన్ నే వాడుకుంటోంది సింధుజ. అయితే, తనకు ప్రత్యేకంగా సెల్ ఫోన్ కావాలని పట్టుబట్టింది సింధుజ. అడిగినప్పుడు తల్లి సెల్ ఫోన్ ఇవ్వడం లేదని దివ్యాంగురాలైన సింధుజ మానసికంగా కుంగిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సింధుజ శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పైకప్పునకు చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి వచ్చి చూసేసరికి విగతజీవిగా పడి ఉన్న బిడ్డను చూసి తల్లడిల్లిపోయింది. స్థానికులు సమాచారం మేరకు ఎన్టీపీసీ ఎస్సై ఉమాసాగర్‌ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తల్లి రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎన్టీపీసీ పోలీసులు విచారణ చేపట్టారు.

అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!