అమ్మ కడుపులోనే పసికందుల్ని చిదిమేస్తున్నారు..
అర్హతులుండవు.. అనుమతులసలే ఉండవు.. కాసులకు కక్కుర్తి పడి బ్రూణహత్యలకు పాల్పడుతున్నారు.. ఇష్టరాజ్యంగా స్కానింగ్ సెంటర్ల నిర్వహిస్తూ లింగనిర్ధారణ చేస్తూనే ఉంటారు.. తనీఖీల్లో అడంగా దొరికిపోతున్న యధేచ్చగా దందా కొనసాగిస్తూనే ఉంటారు.
అర్హతులుండవు.. అనుమతులసలే ఉండవు.. కాసులకు కక్కుర్తి పడి బ్రూణహత్యలకు పాల్పడుతున్నారు.. ఇష్టరాజ్యంగా స్కానింగ్ సెంటర్ల నిర్వహిస్తూ లింగనిర్ధారణ చేస్తూనే ఉంటారు.. తనీఖీల్లో అడంగా దొరికిపోతున్నా యధేచ్చగా దందా కొనసాగిస్తూనే ఉంటారు.
చిత్తూరు జిల్లాలో ఎంబిబిఎస్లకు కొదువ లేకుండాపోతుంది.. చదువు డిగ్రీతో పనిలేకుండానే నకిలీ వైద్యులు దందా కొనసాగుతుంది.. ఏకంగా నర్సింగ్హోంలు.. ఆసుపత్రులు.. స్కానింగ్ సెంటర్లను నిర్వహిస్తూ దర్జాగా రాణిస్తున్నారు.. డబ్బులకోసం అబార్షన్లు, ఆపరేషన్లే కాదు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి బ్రూణహత్యలకు పాల్పడుతున్నారు. జిల్లాలో పుట్టగొడుగులా విస్తరించిన స్కానింగ్ సెంటర్లు గుట్టుచప్పుడు కాకుండానే ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్న వైనం తనిఖీల్లో బట్టబయలు అవుతోంది. పీలేరు నోబుల్ నర్సింగ్ హోం నిర్వహకుడు డాక్టర్ బాషా స్కానింగ్ చేస్తూ.. వైద్య ఆరోగ్యశాఖ అధికారుల దాడుల్లో అడ్డంగా దొరికిపోయాడు. అర్హత లేకుండా వైద్యం చేస్తూ పట్టుబడటంతో స్కానింగ్ సెంటర్ను సీజ్ చేశారు..
మరోవైపు పీలేరు, మదనపల్లి, పలమనేరు, చిత్తూరు ప్రాంతాల్లో కలకత్తా వైద్యం పేరుతో పైల్స్ నివారణకు చిక్సిత్ సెంటర్ బట్టబయలు కాగా.. గంగాధర నెల్లూరు మండలం పోలినాయుడుపల్లిలో కిడ్నీలో రాళ్లు తీస్తామంటూ మోసానికి పాల్పడుతున్న విజయ, జగన్నాధం దంపతుల గుట్టురట్టు చేశారు డీఎమ్హెచ్ఓ అధికారి రమాదేవి. మిడిమిడి జ్ఞానంతో పీన్డిటి చట్టాన్ని నీరుగార్చుతూ స్కానింగ్ సెంటర్లు అక్రమాలకు పాల్పడుతుంటే.. మరోవైపు బ్రూణహత్యలతో నకిలీ వైద్యులు దందా కొనసాగిస్తున్న వైనం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తనీఖీలతో తేటతెల్లం అవుతోంది.
ఇది కూడా చదవండి : హీరో ధనుష్కు మదురై హైకోర్టు షాక్..బర్త్ సర్టిఫికెట్ ఎక్కడ..?