టర్కీ భూకంప బీభత్సం.. మూడేళ్ళ చిన్నారి.. శిథిలాల నుంచి సజీవంగా…

టర్కీలో శుక్రవారం సంభవించిన భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. రిక్టర్ స్కేలుపై  6.8  తీవ్రతగా నమోదైన ఈ విలయంలో మరణించినవారి సంఖ్య 29 కి  చేరింది. 1200 మందికి పైగా గాయపడ్డారు. ముఖ్యంగా ఎలాజిగ్ నగరం ఈ భూకంపానికి చిగురుటాకులా వణికిపోయింది.  భవన శిథిలాలకింద ఇంకా 30 మంది చిక్కుకునే ఉన్నారు. వీరిని రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కాగా-24 గంటల అనంతరం శిథిలాల నుంచి సజీవంగా ఉన్న మూడేళ్ళ బాలికను ఈ బృందాలు రక్షించాయి. […]

టర్కీ భూకంప బీభత్సం.. మూడేళ్ళ చిన్నారి.. శిథిలాల నుంచి సజీవంగా...
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 26, 2020 | 5:05 PM

టర్కీలో శుక్రవారం సంభవించిన భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. రిక్టర్ స్కేలుపై  6.8  తీవ్రతగా నమోదైన ఈ విలయంలో మరణించినవారి సంఖ్య 29 కి  చేరింది. 1200 మందికి పైగా గాయపడ్డారు. ముఖ్యంగా ఎలాజిగ్ నగరం ఈ భూకంపానికి చిగురుటాకులా వణికిపోయింది.  భవన శిథిలాలకింద ఇంకా 30 మంది చిక్కుకునే ఉన్నారు. వీరిని రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కాగా-24 గంటల అనంతరం శిథిలాల నుంచి సజీవంగా ఉన్న మూడేళ్ళ బాలికను ఈ బృందాలు రక్షించాయి. కల్లా కపటం ఎరుగని ఈ చిన్నారి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ.. స్వల్ప గాయాలకు గురైన కారణంగా ఆమెను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ బాలిక తలిదండ్రులెవరో, బంధువులెవరో వారి ఆచూకీ తెలియడంలేదని రెస్క్యూ టీమ్స్ చెబుతున్నాయి. అటు-భూకంపానికి కుప్ప కూలిన భవనాలు, ఇతర కట్టడాలు జరిగిన బీభత్సానికి సాక్షిగా నిలుస్తున్నాయి.