ఇకపై ప్రతిరోజు జీహెచ్ఎంసీ, జలమండలి సిబ్బంది క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తారని.. నీటిని వృథాగా వదిలేవారిని గుర్తించి భారీగా జరిమానాలు విధిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ తెలిపారు. దానకిషోర్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ, జలమండలి ఉన్నతాధికారుల సంయుక్త సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ స్పందిస్తూ.. ఇళ్లు, వాహనాలు కడగడం ద్వారా భారీగా నీరు వృథా అవుతుందన్నారు. నీరు వృథా చేసేవారిని గుర్తించి జరిమానాలు విధించాలని నిర్ణయించినట్లు తెలిపారు. నగరవాసులకు మంచినీటి సరఫరాకు రూ.700 కోట్లు విద్యుత్ఛార్జీలు చెల్లిస్తున్నట్లు చెప్పారు. రూ.200 కోట్ల మేర విద్యుత్ బిల్లులకు సరపడా నీరు వృథాగా పోతుందన్నారు. జీహెచ్ఎంసీ, జలమండలి ఆధ్వర్యంలో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
Breaking News
- ఏడు నెలల పాలనలో జగన్ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
- ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
- కృష్ణాజిల్లా: కీసర టోల్ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్ కౌంటర్ల ద్వారా టోల్ వసూలు చేస్తున్న సిబ్బంది.
- చిత్తూరు టూటౌన్ పీఎస్ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్స్టేషన్ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
- చెన్నై వన్డేలో టాస్గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్. భారత్-విండీస్ మధ్య తొలివన్డే.
- తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
- విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.