GHMC Elections Results 2020: కూకట్‌పల్లిలో ఓట్లు గల్లంతు..కౌంటింగ్ సిబ్బందితో బీజేపీ ఏజెంట్ల వాగ్వాదం..ఉద్రిక్తత

కూకట్‌పల్లిలోని కౌంటర్‌ సెంటర్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్‌ సిబ్బందితో బీజేపీ ఏజెంట్లు వాగ్వాదానికి దిగారు. కౌంటింగ్ సిబ్బంది, బీజేపీ అభ్యర్థులు, ఏజెంట్ల వాగ్వాదంతో టెన్షన్‌ వాతావరణం..

GHMC Elections Results 2020: కూకట్‌పల్లిలో ఓట్లు గల్లంతు..కౌంటింగ్ సిబ్బందితో బీజేపీ ఏజెంట్ల వాగ్వాదం..ఉద్రిక్తత
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 04, 2020 | 11:57 AM

కూకట్‌పల్లిలోని కౌంటర్‌ సెంటర్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్‌ సిబ్బందితో బీజేపీ ఏజెంట్లు వాగ్వాదానికి దిగారు. కౌంటింగ్ సిబ్బంది, బీజేపీ అభ్యర్థులు, ఏజెంట్ల వాగ్వాదంతో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఓటింగ్‌ రోజు పోలైన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు ఉన్నాయంటూ బీజేపీ ఏజెంట్లు, అభ్యర్థులు ఆందోళనకు దిగారు. కొన్ని బ్యాలెట్‌ బాక్సులు సీల్‌ లేకుండా కనిపించాయని బీజేపీ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. సీల్‌ లేని బాక్సులను ఎలా కౌంటింగ్‌కు అనుమతించారని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ నేతల ఆందోళనతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఆందోళనకారులకు సర్దు చెప్పే ప్రయత్నం చేశారు. సీల్ లేకుండా కనిపించిన బ్యాలెట్ బాక్సును ఏం చేయాలనే దానిపై అధికారులు చర్చిస్తున్నారు.