జీహెచ్ఎంసీ రిజల్ట్స్ : కూకట్ పల్లి జోన్ లో 22 డివిజన్ల పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు ఇలా ఉన్నాయి
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. మొత్తం 150 డివిజన్లలో 1926 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. మొత్తం 150 డివిజన్లలో 1926 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్లో బీజేపీకి అనూహ్య ఓట్లు పోల్ అవుతున్నాయి. ఉదయం 9.30 గంటల వరకు జరిగిన కౌంటింగ్ లో బీజేపీ 46 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది. 24 ప్రాంతాల్లో టీఆర్ఎస్ ముందంజలో ఉంది . మరో 11 చోట్ల ఎంఐఎం ఆధిక్యంలో కొనసాగుతోంది. కూకట్ పల్లి జోన్ లో 22 డివిజన్ల పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు ఇలా ఉన్నాయి.. మొత్తం 190 పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ 72 ఓట్లతో ఆధిక్యంలో ఉండగా టీఆర్ఎస్ 59 పోస్టల్ ఓట్లు వచ్చాయి.