నేటి సాయంత్రం వరకు మద్యం దుకాణాలు బంద్.. అక్రమ రవాణాపై అధికారుల ఉక్కుపాదం..
గ్రేటర్ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. మొత్తం 150 డివిజన్లలో ఇవాళ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
గ్రేటర్ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. మొత్తం 150 డివిజన్లలో ఇవాళ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు మద్యం విక్రయాలను నిలిపేసిన సంగతి తెలిసిందే. రాజకీయ పార్టీలు ఓటర్లకు మద్యం ఎరగా వేయకుండా అధికారులు అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. ఇతర ప్రాంతాల నుంచి గ్రేటర్లోకి మద్యం సరఫరా జరగకుండా సరిహద్దుల్లో పోలీసులు ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేసారు. గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న మూడు పోలీసు కమిషనరేట్ పరిధిలో46 చెక్పోస్టులు ఏర్పాటైన సంగతి విదితమే.