GHMC Elections 2020:ఓటు అనేది భవిష్యత్తుని నిర్మించుకోవటం వంటిది: పరిపూర్ణానంద స్వామి
"ఓటు అనేది భవిష్యత్తును నిర్మించుకోవటం' వంటిదని ఓటుకు నిర్వాచనం చెప్పారు పరిపూర్ణానంద స్వామి. ప్రజలందరూ బాధ్యతగా ఓటువేయాలని సూచించారు..
“ఓటు అనేది భవిష్యత్తును నిర్మించుకోవటం’ వంటిదని ఓటుకు నిర్వాచనం చెప్పారు పరిపూర్ణానంద స్వామి. ప్రజలందరూ బాధ్యతగా ఓటువేయాలని సూచించారు. జనం ఉంటారని, క్యూ లైన్లో వేచి ఉండాల్సి వస్తుందని భావించొద్దన్నారు. ఒక్కరోజు లైన్లో నిలబడలేకపోతే, జీవితం గాడితప్పుతుందని చెప్పారు.
బ్రతకడానికి అవకాశం ఇచ్చిన భారతదేశంపై తనకున్న ప్రేమను వివరించారు స్వామి పరిపూర్ణానంద. స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వేడుకలు గతాన్ని గుర్తుచేసుకోవటం అయితే, ఓటు అనేది భవిష్యత్తు నిర్మించుకోవటం అన్నారు. గతాన్నిమర్చిపోకుండా ఉండడం ఒక పెద్ద విషయం. అదే విధంగా భవిష్యత్తుని నిర్మించుకోవడంలో కూడా మనం క్రీయాశీలక పాత్ర వహించాలని సూచించారు. భాద్యత గల పౌరులుగా అర్హులైన అందరూ ఓటేయాలని సూచించారు.
విశ్వనగరంగా, భాగ్యనగరంగా, మహానగరంగా కలలుకంటున్న హైదరాబాద్ కోసం అందరూ ఇళ్లు దాటి వచ్చి ఓటేయాలన్నారు. ఇది ఓ పెద్ద పండగ అని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద సుందర నగరంగా తీర్చిదిద్దుకోవాలనే మన కలను సాకారం చేసుకోవటానికే ఈ అని చెప్పారు. ఓటు ద్వారా అద్భుతమైన కలను సాకారం చేసుకోవచ్చాన్నారు.