స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారాన్ని హోరెత్తించారు.. మరి గ్రేటర్ వార్లో విజయం ఎవరిదో..?
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. అటు టీఆర్ఎస్…ఇటు బీజేపీ గెలుపే టార్గెట్గా ప్రచారాన్ని హోరెత్తించిన సంగతి తెలిసిందే.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. అటు టీఆర్ఎస్…ఇటు బీజేపీ గెలుపే టార్గెట్గా ప్రచారాన్ని హోరెత్తించిన సంగతి తెలిసిందే. నోటిఫికేషన్ నుంచి పోలింగ్ వరకు 15 రోజుల మాత్రమే సమయం ఉండటంతో.. అభ్యర్థుల కంటే ఎక్కువగా పార్టీల స్టార్ క్యాంపెయినర్లే ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోనే మాటల తూటాల్లా పేలాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలు ఎన్నికల బరిలో అభ్యర్థులు నిలిపాయి. పట్టు నిలుపుకునే దిశగా కొన్ని పార్టీలు.. పూర్వ వైభవం కోసం మరి కొన్ని పార్టీలు ప్రచారంలో సర్వ శక్తులు ఒడ్డించాయి. ఇక ఎంఐఎం గతంలో కంటే ఎక్కువ సీట్లే టార్గెట్ చేస్తోంది. మరి చూడాలి ఈ గ్రేటర్ వార్లో విజయం ఎవరి వైపు ఉంటుందో.?