బంపర్ ఆఫర్.. పెట్రోల్‌ పోయించుకుంటే బిర్యానీ ఫ్రీ‌

ఓల్డ్ మద్రాసు రోడ్డులోని ఈ ఔట్‌లెట్‌లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య, సాయంత్రం 5 నుంచి 9 గంటల మధ్య కాంప్లిమెంటరీ ఫుడ్ ప్యాకెట్లు అందిస్తామని తెలిపారు. నెల రోజుల పాటు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు...

బంపర్ ఆఫర్.. పెట్రోల్‌ పోయించుకుంటే బిర్యానీ ఫ్రీ‌
Follow us

|

Updated on: Sep 21, 2020 | 4:55 PM

బిర్యానీ ప్రియులకు ఓ పెట్రోల్ బంక్ యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రోల్ యాజమన్యాం ఏంటి.. బిర్యానీ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పడమేంటి అని అనుకుంటున్నారా.. అవును మీరు చదివినది నిజమే.. బెంగళూరులోని ఓ పెట్రోల్ బంకు ఓనర్లు తమ వినియోగదారులకు ఈ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

తమ పెట్రోల్ బంక్‌లో ఇంధనం నింపుకునే వినియోగదారులకు బిర్యానీ ఉచితంగా అందించాలని నిర్ణయించింది. తమ సేవలు ప్రారంభించి 50 ఏళ్లు నిండిన సందర్భంగా వినియోగదారుల పట్ల కృతజ్ఞత చాటుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు శ్రీ వెంకటేశ్వర ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOS) సర్వీస్ స్టేషన్ నిర్వాహకులు తెలిపారు.

ఓల్డ్ మద్రాసు రోడ్డులోని ఈ ఔట్‌లెట్‌లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య, సాయంత్రం 5 నుంచి 9 గంటల మధ్య కాంప్లిమెంటరీ ఫుడ్ ప్యాకెట్లు అందిస్తామని తెలిపారు. నెల రోజుల పాటు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. అంతే కాదు వెజ్, నాన్‌వెజ్ వెరైటీలు రెండూ అందిస్తామన్నారు.

అయితే ఫ్రీ బిర్యానీ అందించేందుకు ఈ ఫ్యూయల్ స్టేషన్ కొన్ని షరతులు కూడా పెట్టింది. వీటి ప్రకారం రూ.2 వేలు ఆపైన ఇంధనం నింపుకున్న వారికే బిర్యానీ ఫ్రీగా ఇవ్వనున్నారు. అయితే  రూ.250 ఆపైన ఇంధనం నింపుకున్న వారికి కూడా బహుమతులను ఇచ్చ  బహుమానాలు ఇవ్వనున్నారు.