గ్యాస్ లీక్ కలకలం..భయం గుప్పిట్లో జనం
విశాఖలో జరిగిన LG పాలిమర్స్ ఘటనను గుర్తు చేసుకుని ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందోనని ఆ చుట్టుపక్కల జిల్లాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా.. తూర్పుగోదావరి జిల్లాలో ఓఎన్జీసీ టెర్మినల్ నుంచి భారీగా దుర్వాసన రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అల్లవరం మండలం ఓడలరేవు ONGC టెర్మినల్ నుంచి నిన్న రాత్రి 7 గంటల నుంచి దుర్వాసన ఎక్కువగా రావడంతో కడుపులో తిప్పుతోందని స్థానికులు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. గ్యాస్ లీక్ జరగలేదు… దీంతో రెవెన్యూ అధికారులు […]
విశాఖలో జరిగిన LG పాలిమర్స్ ఘటనను గుర్తు చేసుకుని ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందోనని ఆ చుట్టుపక్కల జిల్లాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా.. తూర్పుగోదావరి జిల్లాలో ఓఎన్జీసీ టెర్మినల్ నుంచి భారీగా దుర్వాసన రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అల్లవరం మండలం ఓడలరేవు ONGC టెర్మినల్ నుంచి నిన్న రాత్రి 7 గంటల నుంచి దుర్వాసన ఎక్కువగా రావడంతో కడుపులో తిప్పుతోందని స్థానికులు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు.
గ్యాస్ లీక్ జరగలేదు…
దీంతో రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని టెర్మినల్లో పరిస్థితిని సమీక్షించారు. అయితే ఓఎన్జీసీ అధికారులు మాత్రం లేదని చెబుతున్నారు. ఇది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్లో భాగమే అంటున్నారు. గాలి గ్రామాల వైపు వెళ్లడం వల్ల వాసన ఎక్కువగా వస్తోందని తెలిపారు. అయితే ఇలాంటి ఘటనలు జరగక్కుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలంలోని వేమవరం గ్రామంలో మొన్న బోరు పంపు నుంచి గ్యాస్ లీకైంది. ఇటు కోనపోతుగుంట గ్రామంలో చేతి పంపు నుంచి మంటలు వ్యాపించాయి. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా ఓడలరేవు ఓఎన్జీసీ టెర్మినల్ నుంచి దుర్మాసన వస్తోంది. దీంతో రెండు జిల్లా ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.