కూకట్పల్లిలో గ్యాస్లీక్తో పేలుడు.. ఒకే ఇంట్లో ముగ్గురు మృతి..
హైదరాబాద్లో దారుణం చోటుచేసుకుంది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ..
హైదరాబాద్లో దారుణం చోటుచేసుకుంది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 22న ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు పరిశీలించగా…
కర్నాటకలోని కలబుర్గి జిల్లా రాళ్లగణపురానికి చెందిన తల్వార్ బిచ్చప్ప అనే వ్యక్తి హౌసింగ్ బోర్డు ప్రాంతంలోని ఎన్ ఆర్ ఎస్ ఏ కాలనీలోని ఓ అపార్ట్ మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తెకు వివాహం కాగా, చిన్న కూతురు గుల్బర్గాలో ఉంటోంది. కాగా, బిచ్చప్ప, అతడి భార్య కొడుకుతో కలిసి కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో నివసిస్తున్నారు. కొడుకు మాదాపూర్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
ఈ క్రమంలోనే ఈ నెల 22న తెల్లవారుజామున వంటచేసేందుకు గ్యాస్ స్టావ్ వెలిగించగా..ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. పేలుడు దాటికి బిచ్చప్పతో పాటు అతడి భార్య, కొడుకు మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు శబ్ధాలు, మంటలు గమనించిన స్థానికులు హుటాహుటినా ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేశారు. మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. క్షతగాత్రులను 108 సాయంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మర్నాడు ఉదయానికి బిచ్చప్ప భార్య మాధవి, అతడి కుమారుడు మరణించగా, ఆ తరువాతి రోజున బిచ్చప్ప కూడా మృతిచెందాడు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతిచెందటంతో ఆ కూతుళిద్దరూ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎవరిని ఓదార్చటం ఎవరితరం కాలేదు.