పేలిన గ్యాస్ సిలిండర్.. ముగ్గురికి గాయాలు

పిండివంటలు చేస్తున్న ఓ ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ సంఘటనలో ముగ్గురు గాయపడ్డారు. రామ‌గుండం సింగ‌రేణి కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పేలిన గ్యాస్ సిలిండర్.. ముగ్గురికి గాయాలు
Follow us

|

Updated on: Jun 22, 2020 | 6:14 PM

పిండివంటలు చేస్తున్న ఓ ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ సంఘటనలో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించి చికిత్సఅందిస్తున్నారు. రామ‌గుండం సింగ‌రేణి కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

సింగరేణి సంస్థ రామగుండం రీజియన్-3 ఓ.సి.పి-1లో ఫిట్టర్ గా విధులు నిర్వహిస్తున్న పొన్నం రాజీ రెడ్డి టి2-80లో నివాసముంటున్నాడు. సోమవారం రాజిరెడ్డి భార్య సరోజిని ఇరుపొరుగు వారితో కలిసి ఇంట్లో పిండి వంటలు చేస్తున్నారు.ఈ క్రమంలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ నుండి గ్యాస్ లీకై మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో ఎగిసిపడిన మంటలు పరిసరాలకు వ్యాపించాయి. ఈ ఘటనలో రాజిరెడ్డి భార్య సరోజిని, కొడుకు శరత్ పాటు సరోజిని స్నేహితురాలు వనమలకు గాయాలయ్యాయి.

గ్యాస్ సిలిండర్ పేలుడుపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో సరోజిని, వనమలకు స్వల్ప గాయాలు కాగా శరత్‌కు తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను గోదావరి ఖని ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ పేలుడుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.