<urlset xmlns:xsi="http://www.w3.org/2001/XMLSchema-instance" xmlns:image="http://www.google.com/schemas/sitemap-image/1.1" xsi:schemaLocation="http://www.sitemaps.org/schemas/sitemap/0.9 http://www.sitemaps.org/schemas/sitemap/0.9/sitemap.xsd http://www.google.com/schemas/sitemap-image/1.1 http://www.google.com/schemas/sitemap-image/1.1/sitemap-image.xsd" xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9"><url><loc>https://tv9telugu.com/photo-gallery/rahu-transit-2026-2-zodiac-signs-set-to-experience-raja-yoga-and-unprecedented-success-1915462.html</loc><lastmod>2026-09-19T23:10:51+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/rahuvu-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Rahuvu 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/astro-20.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/astrology-2-4.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య శాస్త్రంలో రాహువు  గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రెండు రాశుల వారికీ మేలు చేయబోతున్నాడు. 
ఇంకా మొదలు పెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఇక వీళ్ళకి ఇక అన్ని మంచి రోజులే. మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సమయం వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/dhanusu-rashi-1.jpg</image:loc><image:caption><![CDATA[ ధనుస్సు రాశి : మీరు అనుకున్న విధంగా మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న గవర్నమెంట్ జాబ్ వస్తుంది. కొత్తగా ఏదైనా వ్యాపారాలు స్టార్ట్ చెయ్యాలనుకునేవారికి ఇదే కరెక్ట్ సమయం. ఈ రాశివారి జీవితంలో కొత్త మార్పులు రాబోతున్నాయి. ఎంతలా అంటే వీరి ఊహకందని విధంగా  అద్భుతాలు చూస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/kumbha-rashi-6.jpg</image:loc><image:caption><![CDATA[ కుంభ రాశి : మొదలు పెట్టిన ప్రతి పనిని చేస్తారు.మీరు కొత్త పనులు మొదలు పెట్టె ముందు మీ ఇంట్లో వారికీ చెప్పి చేస్తే ఆ పనిని విజయవంతం అవుతుంది.  కొత్త ఇల్లు  లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది.  రాజకీయ నాయకులకు కలిసి వస్తుంది. కష్ట పడిన వాళ్ళకి మంచి ఫలితం వస్తుంది ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/astrology-7.jpg</image:loc><image:caption><![CDATA[ Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/healthy-leftover-rice-recipe-karivepaku-palli-ghee-rice-in-5-minutes-1915455.html</loc><lastmod>2026-09-19T22:45:17+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/karivepaku-palli-ghee-rice-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Karivepaku Palli Ghee Rice (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/karivepaku-palli-ghee-rice-1.jpg</image:loc><image:caption><![CDATA[ ముఖ్యంగా జుట్టు రాలడాన్ని అరికట్టి, కంటిచూపును మెరుగుపరిచే దివ్యౌషధమైన కరివేపాకును, వేరుశనగ గుళ్లు , స్వచ్ఛమైన ఆవు నెయ్యి మరియు ఇంగువతో కలిపి చేసే &#039;కరివేపాకు పల్లీ రైస్&#039; ఎంతో తేలికగా, త్వరగా పూర్తవుతుంది.  ఈ సింపుల్ అండ్ సూపర్ టేస్టీ రెసిపీ తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/karivepaku-palli-ghee-rice-2.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు: 1 పెద్ద బౌల్ రాత్రి మిగిలిన అన్నం, 1 గుప్పెడు తాజా కరివేపాకు, 2 చిన్న చెంచాల పల్లీలు, ఒకటిన్నర నుండి రెండు చెంచాల స్వచ్ఛమైన నెయ్యి, అర చెంచా పచ్చిశనగపప్పు, పావు చెంచా ఆవాలు, పావు చెంచా జీలకర్ర, 2 నుండి 3 - కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు తుంచిన ఎండుమిర్చి, కారానికి తగినట్లుగ కారం పొడి
చిటికెడు ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/karivepaku-palli-ghee-rice-3.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానం: ముందుగా రాత్రి మిగిలిన అన్నాన్ని చేతులతో నలిపి పొడిపొడిగా చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీలో కడిగి ఆరబెట్టుకున్న గుప్పెడు కరివేపాకును వేసి నూనె లేకుండా డ్రై రోస్ట్ చేయాలి. ఆకులు కరకరలాడుతూ వేగిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే బాండీలో రెండు చెంచాల పల్లీలు వేసి లో ఫ్లేమ్‌లో దోరగా వేయించి చల్లారనిచ్చి పొట్టు తీసేయాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లో వేయించిన కరివేపాకు, పొట్టు తీసిన పల్లీలు వేసి చుక్క నీరు కూడా లేకుండా బరకగా పొడి చేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/karivepaku-palli-ghee-rice-4.jpg</image:loc><image:caption><![CDATA[ బాండీలో ఒకటిన్నర చెంచా నెయ్యి వేడిచేయాలి. నెయ్యి కాగిన తర్వాత పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి ముక్కలు వేసి దోరగా వేయించాలి. తాలింపు వేగిన వెంటనే గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు-పల్లీల పొడిని బాండీలో వేసి చిన్న మంటపై ఒక నిమిషం పాటు వేయించాలి. ఆ వెంటనే పావు చెంచా కారం పొడి వేసి కలపాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/karivepaku-palli-ghee-rice-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు పొడిపొడిగా చేసుకున్న అన్నాన్ని బాండీలో వేయాలి. దీనిపై రుచికి సరిపడా ఉప్పు, మంచి ఫ్లేవర్ కోసం చిటికెడు ఇంగువ చల్లుకోవాలి. మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి అన్నం మెతుకులకు కరివేపాకు పొడి, నెయ్యి, ఉప్పు సమంగా పట్టేలా నెమ్మదిగా కలిపి వేడెక్కే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, రాత్రి మిగిలిన అన్నంతో ఘుమఘుమలాడే కరివేపాకు పల్లీ రైస్ సిద్ధం! వేడివేడిగా తింటే నెయ్యి, వెల్లుల్లి సువాసనలతో ఎంతో కమ్మగా ఉంటుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/oscar-2026-marathi-thriller-gondhal-outshines-33-films-as-indias-official-entry-here-the-movie-story-1915427.html</loc><lastmod>2026-09-19T22:36:32+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gondal.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gondal ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gondal-film.jpg</image:loc><image:caption><![CDATA[ మొత్తం 33 చిత్రాలను అధిగమించి మరాఠీ చిత్రం &#039;గోంధాల్&#039; 99వ అకాడమీ అవార్డులు, అంటే 2027 ఆస్కార్స్‌కు భారతదేశం తరపున అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. భారీ వాణిజ్య విజయాన్ని నమోదు చేసిన, వార్తల్లో నిలిచిన అనేక చిత్రాలను ఓడించి &#039;గోంధాల్&#039; ఈ ప్రతిష్టాత్మక అవకాశాన్ని గెలుచుకుంది. ఈ విషయమై ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారిక ప్రకటన చేసింది. &#039;ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం&#039; విభాగంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి &#039;గోంధాల్&#039; ఎంపికైనందుకు చిత్ర బృందం మొత్తానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gondal-movie.jpg</image:loc><image:caption><![CDATA[ ఇది మరాఠీ చిత్ర పరిశ్రమకు కూడా గర్వకారణంగా భావిస్తున్నారు. &#039;గోంధాల్&#039; ఆస్కార్ గెలవడంతో, మరాఠీ సినిమా పేరు మరోసారి అంతర్జాతీయ వేదికకు చేరింది.సంతోష్ దావ్‌ఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కిషోర్ కదమ్, ఇషితా దేశ్‌ముఖ్, యోగేష్ సోహోని, నిషాద్ భోయిర్, అనుజ్ ప్రభు, సురేష్ విశ్వకర్మ, మాధవి జువేకర్, ఐశ్వర్య షిండే, కైలాష్ వాఘ్మారే, ప్రభాకర్ మఠపతి, విఠల్ కాలే, ప్రవీణ్ దాలింబ్కర్, శరద్ జాదవ్, పూనమ్ పాటిల్ , ప్రశాంత్ దేశ్‌పాండే ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఆస్కార్‌కు నామినేట్ అయిందన్న వార్త బయటకు రావడంతో నటీనటులందరిలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gondal-oot.jpg</image:loc><image:caption><![CDATA[ గ్రామీణ మహారాష్ట్ర నేపథ్యంలో సాగే ఈ కథలో సుమన్ అనే వివాహిత కేంద్రబిందువు. ఆనంద్ అనే ధనవంతుడితో ఇష్టం లేని పెళ్లి జరగడంతో ఆమె తన దాంపత్య జీవితంలో అసంతృప్తిగా జీవిస్తుంటుంది. అదే సమయంలో &#039;గోంధాలి&#039; కళాకారుడైన సాహెబా అనే వ్యక్తితో ఆమె ప్రేమలోపడుతుంది. ఈ క్రమంలో తన భర్త నుంచి బయటపడి ప్రేమికుడితో వెళ్లిపోవాలని పథకం వేస్తుంది. అయితే, వీరి ప్లాన్లోకి ఆనంద్ బావమరిది అయిన సర్జేరావు ప్రవేశించడంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gondal-pics.jpg</image:loc><image:caption><![CDATA[ ఒక్క రాత్రిలో జరిగే &#039;గోంధాల్&#039; పూజ వేడుకల వెనుక కామం, అసూయ, నమ్మకద్రోహం, హత్య కుట్రలు ఎలా చోటుచేసుకున్నాయనేది ఈ చిత్ర ప్రధానాంశం. అనుమానాలు, రహస్యాల నడుమ ప్రతి పాత్ర తన ఉనికి కోసం, స్వార్థం కోసం చేసే పోరాటం ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడుతుంది. ఈ చిత్రానికి స్వరమాంత్రికుడు ఇళయరాజా అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచాయి. సంస్కృతిని, సైకలాజికల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌ని దర్శకుడు సమర్థవంతంగా మేళవించిన తీరు పట్ల ఆస్కార్ ఎంపిక కమిటీ చైర్మన్ పి. శేషాద్రి నేతృత్వంలోని 14 మంది సభ్యుల జ్యూరీ ప్రశంసలు కురిపించింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gondal-telugu.jpg</image:loc><image:caption><![CDATA[ జల్నాకు చెందిన కైలాస్, &#039;శివాజీ అండర్‌గ్రౌండ్ ఇన్ భీమ్‌నగర్ మొహల్లా&#039; అనే నాటకంలో తన సొంత యాసలో ఒక పాత్ర పోషించారు. ఈ నాటకానికి ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందన ఆయనకు చాలా ముఖ్యమైనది. ఈ విజయం ఆయన ఆత్మవిశ్వాసాన్ని పెంచింది, ఆ తర్వాత ఆయనకు సినిమా అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. దీని గురించి మాట్లాడుతూ, కైలాస్ తన భాష గురించి ఒక ముఖ్యమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  ప్రామాణిక భాష, గ్రామీణ భాషల మధ్య తేడా చూపడాన్ని, ఒకటి మంచిది, మరొకటి చెడ్డది అని చెప్పడాన్ని ఆయన వ్యతిరేకిస్తారు. తన గ్రామ భాష అక్కడి ప్రజలకు సమానంగా స్వచ్ఛమైనదని, అదేవిధంగా ముంబైలో మాట్లాడే భాష ముంబైకి చెందిన స్వచ్ఛమైన భాష అని ఆయన అభిప్రాయపడ్డారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/traditional-andhra-nalla-karam-podi-recipe-authentic-spicy-podi-for-idli-dosa-and-hot-rice-1915439.html</loc><lastmod>2026-09-19T22:32:44+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/nalla-karam-podi-7-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Nalla Karam Podi (7) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/nalla-karam-podi-1.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే చాలామంది ఎండుమిరపకాయలను కాయలు కాయలుగానే వేయించేస్తుంటారు; దీనివల్ల లోపల ఉండే విత్తనాలు పచ్చిగా ఉండిపోయి కారం పూర్తి రుచి రాదు. కాయలను తుంచి విత్తనాలను వేరుచేసి, వాటిని ప్రత్యేకంగా నూనెలో దోరగా వేయించి పొడి చేస్తే నల్ల కారానికి అసలైన సువాసన, గాఢత వస్తాయి. ఒకసారి చేసి పెట్టుకుంటే చాలా నెలల పాటు నిల్వ ఉండే ఈ అథెంటిక్ నల్ల కారం తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/nalla-karam-podi-2.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు: 50 గ్రాముల గుంటూరు ఎండుమిర్చి, సుమారు 2 నుండి 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీస్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీస్పూన్ జీలకర్ర, పులుపుకి సరిపడా చింతపండు, 10 నుండి 15 వెల్లుల్లి రెబ్బలు, రెండు రెమ్మల కరివేపాకు, 2 నుండి 3 స్పూన్ల వంట నూనె, రుచికి సరిపడా ఉప్పు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/nalla-karam-podi-3.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానం: ఎండుమిరపకాయల తొడిమలు తీసి, వాటిని మధ్యలోకి తుంచుకోవాలి. ఇలా తుంచడం వల్ల లోపల ఉన్న గింజలు/విత్తనాలు బయటకు రాలిపోతాయి; వాటిని ఒక గిన్నెలోకి వేరుగా తీసుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్‌లో రెండు మూడు స్పూన్ల నూనె వేడిచేయాలి. నూనె మరీ ఎక్కువ కాగకముందే తుంచిన ఎండుమిర్చి ముక్కలను వేసి లో ఫ్లేమ్‌పై మాడిపోకుండా దోరగా వేయించి వేరే ప్లేట్‌లోకి తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/nalla-karam-podi-4.jpg</image:loc><image:caption><![CDATA[ మిగిలిన నూనెలో ఒక టీస్పూన్ పచ్చిశనగపప్పు వేసి లేత రంగు వచ్చే వరకు వేయించాలి. ఆ వెంటనే ధనియాలు వేసి నిదానంగా వేపాలి. ధనియాలు కొద్దిగా వేగాక, ముందుగా వేరుచేసి పెట్టుకున్న ఎండుమిర్చి విత్తనాలను కూడా వేసి వేయించాలి. అనంతరం జీలకర్ర, కరివేపాకు రెబ్బలు మరియు చింతపండు వేసి చిన్న మంటపై వేయించాలి. నూనెలో చింతపండు కాస్త మెత్తబడితే మిక్సీ పట్టినప్పుడు సులభంగా నలుగుతుంది. ఈ దినుసులన్నీ వేగిన వెంటనే ప్లేట్‌లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/nalla-karam-podi-5.jpg</image:loc><image:caption><![CDATA[ దినుసులు చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో మొదట వేయించిన ధనియాలు, జీలకర్ర, పప్పు, ఎండుమిర్చి గింజలు, చింతపండు మరియు సరిపడా ఉప్పు వేసి మెత్తటి పొడిలా చేసి ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే జార్‌లో వేయించి ఉంచుకున్న ఎండుమిర్చిని వేసి విడిగా పొడి చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా చేసిన దినుసుల పొడిని కూడా ఇందులో వేసి రెండూ సమంగా కలిసేలా మరోసారి మిక్సీ పట్టాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/nalla-karam-podi-6.jpg</image:loc><image:caption><![CDATA[ చివరగా 10 నుండి 15 వెల్లుల్లి రెబ్బలను వేసి జస్ట్ ఒక్కసారి మాత్రమే పల్స్ తిప్పాలి. ఇక్కడ వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచినట్టు ఉండాలి తప్ప మెత్తని పేస్ట్‌లా చేయకూడదు. ఈ పొడిని గిన్నెలోకి తీసుకుని గరిటెతో పైనుంచి కిందికి బాగా కలిపి గాలి చొరబడని సీసాలో నిల్వ చేసుకోవాలి. అంతే, గుమగుమలాడే సంప్రదాయ ఆంధ్రా నల్ల కారం పొడి సిద్ధం! వేడి అన్నంలో స్వచ్ఛమైన నెయ్యి వేసుకుని తిన్నా, ఇడ్లీ దోశలపై చల్లుకున్నా అదిరిపోయే రుచినిస్తుంది ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/ttd-kobbari-pachadi-recipe-authentic-tirumala-style-fried-coconut-chutney-1915429.html</loc><lastmod>2026-09-19T22:33:41+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/kobbari-pachadi-7.jpg</image:loc>
					<image:title><![CDATA[ Kobbari Pachadi (7) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/kobbari-pachadi-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యితో కలిపి మొదటి ముద్ద తింటే వదిలిపెట్టడం ఎవరి వల్లా కాదు. చాలామంది పచ్చి కొబ్బరిని నేరుగా రుబ్బుతుంటారు; కానీ తిరుమల దేవస్థానం స్టైల్‌లో పచ్చి కొబ్బరి ముక్కలను నూనెలో లేత బంగారు రంగు వచ్చే వరకు డీప్ ఫ్రై చేసి, పచ్చిశనగపప్పు, ఘాటైన ఎండుమిర్చితో నూరుతారు. ఇలా చేయడం వల్ల పచ్చడికి తిరుగులేని కమ్మదనం రావడమే కాకుండా కనీసం 3 నుండి 4 రోజుల పాటు నిల్వ ఉంటుంది.  ఈ పర్ఫెక్ట్ టెంపుల్ రెసిపీని ఇప్పుడు వివరంగా చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/kobbari-pachadi-2.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు: 200 గ్రాముల పచ్చి కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు,  మీ కారానికి తగినట్లుగా ఎండుమిరపకాయలు సుమారు 15 నుండి 20, చిన్న నిమ్మపండంత చింతపండు, పావు టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా కల్లుప్పు, వేయించడానికి సరిపడా నూనె తాలింపు కోసం: 2-3 టేబుల్ స్పూన్ల నూనె, అర టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, కొద్దిగా  ఇంగువ (ఇది చాలా ముఖ్యం), రెండు రెమ్మలు కరివేపాకు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/kobbari-pachadi-3.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానం: ముందుగా పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడిచేసి, కొబ్బరి ముక్కలను వేయాలి. మీడియం మంటపై గారెలు వేయించినట్లుగా కొబ్బరి ముక్కలు లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించి జల్లెడ గరిటెతో నూనె వడకట్టి బౌల్‌లోకి తీసుకోవాలి. ఇదే పచ్చడికి అసలైన స్మోకీ రుచిని ఇస్తుంది. ఆ తర్వాత అదే వేడి నూనెలో 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసి దోరగా ఎర్రగా వేయించి కొబ్బరి ముక్కల్లోకి కలపాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/kobbari-pachadi-4.jpg</image:loc><image:caption><![CDATA[ అనంతరం అదే నూనెలో 15 నుండి 20 ఎండుమిరపకాయలను వేసి మీడియం ఫ్లేమ్‌పై ఎర్రగా వేయించాలి. ఎండుమిర్చి చక్కగా పొంగి వేగిన తర్వాత తీసి కొబ్బరి ముక్కలతో పాటు ఉంచాలి. మిక్సీ జార్‌లో వేయించిన కొబ్బరి ముక్కలు, శనగపప్పు, ఎండుమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, నానబెట్టిన చింతపండు, పావు టీస్పూన్ పసుపు వేయాలి. అవసరమైన మేరకే కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పచ్చడిని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/kobbari-pachadi-5.jpg</image:loc><image:caption><![CDATA[ పాన్‌లో 2-3 చెంచాల నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి. తాలింపు వేగిన వెంటనే స్టవ్ ఆపేసి, గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పచ్చడిని బాండీలో వేసి నూనె అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. అంతే, అచ్చం తిరుమల తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సత్రంలో వడ్డించే సుప్రసిద్ధమైన కొబ్బరి పచ్చడి సిద్ధం! వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా, ఇడ్లీ దోశల్లోకి నంజుకున్నా అమృతంలా ఉంటుంది ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/temple-style-sambar-recipe-authentic-no-onion-no-garlic-sambar-with-secret-fresh-coconut-paste-1915416.html</loc><lastmod>2026-09-19T22:07:08+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sambar-7.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sambar (7) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sambar-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు: 1 గిన్నెడు కందిపప్పు, నిమ్మకాయ సైజు రసం తీసి పెట్టుకున్న చింతపండు, పావు కప్పు పచ్చికొబ్బరి ముక్కలు కూరగాయ ముక్కలు: ఆనపకాయ, తీపి గుమ్మడికాయ, మునక్కాడ, క్యారెట్, ముల్లంగి, బెండకాయ, నాటు దోసకాయ, 2 నాటు టమోటాలు, 3 పచ్చిమిర్చి, కచ్చాపచ్చాగా దంచిన చిన్న అల్లం ముక్క, అర టీస్పూన్ పసుపు, 1-2 టేబుల్ స్పూన్ల బెల్లం - రుచిని బ్యాలెన్స్ చేయడానికి, రుచికి సరిపడా ఉప్పు, తాజా కరివేపాకు, కొత్తిమీర తరుగు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sambar-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ సీక్రెట్ సాంబార్ మసాలా పేస్ట్ కోసం: 1 స్పూన్ నూనె, పావు టీస్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ మసూర్ దాల్ లేదా పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీస్పూన్ జీలకర్ర,  3 ఎండుమిర్చి, పావు కప్పు పచ్చికొబ్బరి. ఘుమఘుమలాడే తాలింపు కోసం: 3 టేబుల్ స్పూన్ల వేరుశనగ నూనె, 1 టేబుల్ స్పూన్ స్వచ్ఛమైన నెయ్యి, 1 టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, అర స్పూన్ ఇంగువ - చాలా ముఖ్యం, కరివేపాకు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sambar-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానం: కందిపప్పును కుక్కర్‌లో శుభ్రంగా కడిగి 4 గిన్నెల నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టాలి. ఆ తర్వాత మీడియం మంటపై 4 విజిల్స్ రానిచ్చి మెత్తగా ఉడికించి, పప్పుగుత్తితో పలుకులు లేకుండా మెదుపుకోవాలి. చింతపండును నానబెట్టి పులుసు తీసి ఉంచాలి. పాన్‌లో ఒక స్పూన్ నూనె వేడిచేసి మెంతులు వేసి లేత రంగు వచ్చే వరకు వేపాలి. అందులోనే మినప్పప్పు, మసూర్ దాల్, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలు వేసి లో ఫ్లేమ్‌పై దోరగా గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. అనంతరం పావు కప్పు పచ్చికొబ్బరి వేసి మరో రెండు నిమిషాలు వేపి చల్లారనివ్వాలి. చల్లారాక మిక్సీ జార్‌లో కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్‌లా రుబ్బుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sambar-4-1.jpg</image:loc><image:caption><![CDATA[  సాంబార్ పాత్రలో 2 చెంచాల వేరుశనగ నూనె వేసి ఆనపకాయ, గుమ్మడికాయ, మునక్కాడ, క్యారెట్, ముల్లంగి ముక్కలు, పచ్చిమిర్చి, దంచిన అల్లం మరియు సరిపడా ఉప్పు వేసి మీడియం మంటపై కలపాలి. మూతపెట్టి 70% మగ్గిన తర్వాత దోసకాయ, బెండకాయ, టమోటా ముక్కలు కూడా వేసి మరో 2-3 నిమిషాలు నూనెలోనే మగ్గించాలి నూనెలో మగ్గితే ముక్కలకు అద్భుతమైన రుచి వస్తుంది; తర్వాత అల్లం ముక్కను తీసేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sambar-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ మగ్గిన కూరగాయల్లో ఉడికించిన కందిపప్పు, గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్, చింతపండు రసం మరియు తగినన్ని నీళ్లు పోయాలి. ఇందులోనే పసుపు, బెల్లం తురుము, కరివేపాకు రెమ్మలు వేసి రుచి చూసి ఉప్పు సరిచేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి 10 నుండి 15 నిమిషాల పాటు సాంబార్‌ను చక్కగా మరిగించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sambar-6.jpg</image:loc><image:caption><![CDATA[  వేరే పాన్‌లో వేరుశనగ నూనె, నెయ్యి వేడిచేసి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు మరియు అర స్పూన్ ఇంగువ వేసి దోరగా వేయించాలి. ఈ తాలింపును మరిగిన సాంబార్‌లో పోసి కలిపి, చివరగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ కట్టేయాలి. అంతే, ఉత్సవాల్లో వడ్డించే కమ్మటి టెంపుల్ స్టైల్ సాంబార్ సిద్ధం! వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసి ఈ సాంబార్‌తో వడ్డిస్తే లొట్టలేసుకుంటూ తింటారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/nalla-senaga-guggillu-boiled-black-chickpeas-benefits-2-handfuls-for-energy-strength-and-protein-1915407.html</loc><lastmod>2026-09-19T22:03:42+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sengalu-1-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sengalu 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sengalu-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఒక కోడిగుడ్డు సుమారు 72 కేలరీల శక్తిని ఇస్తుంది.  100 గ్రాముల కోడిగుడ్డులో దాదాపు 100 కేలరీల శక్తి ఉంటుంది. గుగ్గిళ్ళు తయారుచేసే పప్పుధాన్యాలు, అంటే బొబ్బర్లు, శనగలు, పెసలు వంటివి 100 గ్రాములకు 340 నుంచి 350 కేలరీల శక్తిని అందిస్తాయి. అంటే, గుడ్ల కంటే మూడు రెట్లకు పైగా బలం గుగ్గిళ్ళలో ఉందని స్పష్టమవుతుంది. ప్రత్యేకించి సోయా చిక్కుడు గింజలు మరింత బలమైనవి. 100 గ్రాముల సోయాలో దాదాపు 440 కేలరీల శక్తి, 43 గ్రాముల ప్రోటీన్ ఉంటాయి, ఇది అపారమైన బలమని అంటున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sengalu-6.jpg</image:loc><image:caption><![CDATA[ బొబ్బర్లను కనీసం 10 గంటలు నీటిలో నానబెట్టాలి. రాత్రిపూట నానబెడితే ఉదయానికి సిద్ధంగా ఉంటాయి. నానబెట్టిన పప్పుధాన్యాలను కుక్కర్‌లో వేసి మెత్తగా ఉడికించాలి. గుగ్గిళ్ళు సాధారణంగా మెత్తగా ఉంటాయి. ఉడికించిన గింజలలో 30-40% పప్పులను తీసి మిక్సీలో పలుకుపలుకుగా  గ్రైండ్ చేయాలి. మరీ పిండిలా కాకుండా వడలకు ఎలా రుబ్బుతారో అలా రుబ్బాలి. మిగతా 50-60% పప్పులను అలాగే ఉంచుకోవాలి. మెత్తగా రుబ్బిన పప్పును, ఉడికించిన పప్పును కలపాలి. ఇలా చేయడం వల్ల గుగ్గిళ్ళు కొంచెం గ్రేవీ లాగా ఉండి, తినడానికి రుచికరంగా ఉంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sengalu-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ మిశ్రమానికి నెయ్యితో తాలింపు పెట్టాలి. నూనె కంటే నెయ్యి గుగ్గిళ్ళకు మంచి రుచిని ఇస్తుంది. తాలింపులో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, కరివేపాకు వేయాలి. తాలింపు వేసిన తర్వాత, అందులో కొద్దిగా చాట్ మసాలా పొడిని కలపాలి. ఇది ప్రత్యేక రుచిని ఇస్తుంది మరియు ఉప్పు అవసరాన్ని తగ్గిస్తుంది. చాట్ మసాలాలో రాక్ సాల్ట్, మామిడి పొడి వంటివి ఉండటం వల్ల ఉప్పు వేసిన ఫీలింగ్ కలుగుతుంది. చివరగా, నిమ్మరసం పిండుకుని తింటే రుచి మరింత పెరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sengalu-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ బొబ్బర్లతో పాటు, శనగలు కూడా తిసుకోవచ్చు. మనకి ఇవే అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇది తినండి. పెసలు, సోయా చిక్కుడు గింజలతో కూడా గుగ్గిళ్ళు చేసుకోవచ్చు. ప్రతి రోజుకో రకం పప్పుధాన్యంతో గుగ్గిళ్ళు తయారుచేసి ఇవ్వడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు, వారికి విసుగు అనిపించదు. మొలకెత్తిన పప్పుధాన్యాలు తినని వారికి గుగ్గిళ్ళు ఒక అద్భుతమైన ఎంపిక. ఇవి శరీరానికి ఎటువంటి హాని కలిగించవు, కేవలం లాభాలనే చేకూరుస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sengalu-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ గుడ్లు, పాలపై పెట్టే ఖర్చును తగ్గించి, బదులుగా ఇటువంటి బలవర్ధకమైన గుగ్గిళ్ళను ఆహారంలో చేర్చుకోవడం వల్ల మనము, మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటామని అంటున్నారు. మందులపై ఆధారపడకుండా, ఖర్చుతో కూడుకున్న ఇతర ఆహారాల జోలికి వెళ్లకుండా, సహజసిద్ధమైన, బలమైన గుగ్గిళ్ళ ద్వారా ఆరోగ్యాన్ని పొందాలని ఆయన సూచించారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/poppy-seed-water-benefits-can-it-help-with-nerve-pain-and-muscle-cramps-1915384.html</loc><lastmod>2026-09-19T21:43:59+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gasa-gasalu.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gasa Gasalu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gasa-gasalu-1.jpg</image:loc><image:caption><![CDATA[ మన భారతీయ వంటకాలలో మసాలా దినుసుగా విరివిగా ఉపయోగించే గసగసాలు కేవలం రుచికి మాత్రమే కాకుండా, అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. గసగసాల యొక్క అద్భుత ఔషధ గుణాలను, వాటిని సరైన రీతిలో వినియోగించే పద్ధతులను నిపుణులు ఎన్నో విషయాలు చెప్పారు. గసగసాలలో ఉండే కొన్ని ప్రత్యేకమైన ఆల్కలాయిడ్ కాంపౌండ్స్ శరీరంలో కలిగే నొప్పులను, ముఖ్యంగా కండరాల తిమ్మిర్లను తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తాయని అంటున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gasa-gasalu-2.jpg</image:loc><image:caption><![CDATA[ చాలా మంది తరచుగా ఎదుర్కొనే సమస్య కండరాల తిమ్మిర్లు. ముఖ్యంగా పిక్కలు, కాళ్ళు పట్టేయడం, నిద్రలో, దగ్గినప్పుడు లేదా ఆవలిచ్చినప్పుడు కూడా ఈ తిమ్మిర్లు రావడం సాధారణం. ఇలాంటి తిమ్మిర్ల నుండి ఉపశమనం పొందడానికి గసగసాలను పేస్ట్‌గా చేసి వాడుకోవచ్చు ఇంకా డికాక్షన్ కాచి త్రాగవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gasa-gasalu-3.jpg</image:loc><image:caption><![CDATA[ గసగసాలు నొప్పి నివారిణిగా పనిచేయడంతో పాటు, ఇంకొక ముఖ్యమైన పరోక్ష ప్రయోజనాన్ని కూడా అందిస్తాయి. గసగసాలను లోపలికి తీసుకున్నప్పుడు అవి ఊపిరితిత్తులలో పేరుకుపోయిన కంజెషన్‌ను గణనీయంగా తగ్గిస్తాయని సైంటిఫిక్‌గా నిరూపితమైంది. శ్లేష్మాన్ని, కఫాన్ని తగ్గించడంలో ఇవి చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gasa-gasalu-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఆస్తమాతో బాధపడేవారు, కఫం, శ్లేష్మం సమస్యలు ఉన్నవారు, తరచుగా పిల్లికూతలు, దగ్గుతో ఇబ్బంది పడేవారు, ఉదయం లేవగానే గట్టి తెమడలు ఎక్కువగా వచ్చే వారికి గసగసాలు ఎంతో మేలు చేస్తాయి. ఊపిరితిత్తులలోని అధిక స్రావాలను తగ్గించి, కంజెషన్‌ను నివారిస్తూ, శ్వాసనాళాలను, గాలి గొట్టాలను వ్యాకోచింపజేయడం వలన ఇవి శ్వాస ప్రక్రియను మెరుగుపరుస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gasa-gasalu-6.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే, ఈ అద్భుతమైన ప్రయోజనాలను మీరు పూర్తిగా పొందాలంటే గసగసాలను సరైన పద్ధతిలో వాడుకోవడం చాలా ముఖ్యం. మనం సాధారణంగా గసగసాల పేస్ట్‌ను మసాలా ముద్దలాగా నూనె మరిగిన తర్వాత తాలింపులో వేసి వేపుతుంటాము. ఇలా చేయడం వల్ల గసగసాలలో ఉండే విలువైన ఆల్కలాయిడ్ కాంపౌండ్స్ దెబ్బతింటాయని అంటున్నారు. ఈ అధిక ఉష్ణోగ్రత వద్ద గసగసాలలో ఉండే ఔషధ గుణాలు, ఆల్కలాయిడ్స్ నాశనం అవుతాయి. అందువల్ల మీరు ఆశించిన ఫలితాలు లభించవు. వేగినప్పుడు మంచి సువాసన వస్తుండవచ్చు, కానీ ఆరోగ్య ప్రయోజనాలను మాత్రం కోల్పోతారు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/leafy-greens-carrots-beetroot-for-eye-health-foods-that-support-better-vision-1915363.html</loc><lastmod>2026-09-19T21:30:07+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/a-carrot-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ A Carrot 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/aaku-kuralu.jpg</image:loc><image:caption><![CDATA[ కంటి ఆరోగ్యానికి విటమిన్ ఎ అత్యంత కీలకం. ప్రతిరోజూ మన శరీరానికి సుమారు 900 మైక్రోగ్రాముల విటమిన్ ఎ అవసరం. ఈ పోషకం ఆకుకూరల్లో సమృద్ధిగా లభిస్తుంది. ముఖ్యంగా మునగాకు, తోటకూర, కొత్తిమీర వంటి వాటిలో ఇతర ఆకుకూరల కంటే విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ప్రతిరోజూ మధ్యాహ్న భోజనంలో ఆకుకూరలను చేర్చుకోవడం వల్ల కంటిచూపు లోపాలు రాకుండా విటమిన్ ఎ పుష్కలంగా అందుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/aaku-kuralu-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఆకుకూరలను తినడం వల్ల కంటి ఆరోగ్యంతో పాటు రక్తం ఉత్పత్తి పెరుగుతుంది, కాల్షియం అందుతుంది, ఎముకలు పటిష్టంగా మారతాయి. కందిపప్పు,  పెసరపప్పుతో కలిపి వండుకున్నా విటమిన్ ఎ నష్టం జరగదు కాబట్టి, వారానికి రెండు మూడు సార్లు పప్పుతో వండిన ఆకుకూరలను తీసుకోవచ్చు. పిల్లలకు కూడా చిన్నతనం నుండే ఆకుకూరలు అలవాటు చేయడం వల్ల వారి కంటి ఆరోగ్యం బాగుంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/a-carrot.jpg</image:loc><image:caption><![CDATA[ శాఖాహారాల్లో లభించే బీటా కెరోటిన్ మన శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది. క్యారెట్లలో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది.
ఒక ప్రత్యేక జ్యూస్ కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. ఉదయం పూట రెండు క్యారెట్లు, రెండు నాటు టమాటాలు, ఒక కీరదోసకాయ, చిన్న బీట్రూట్ ముక్కలను తీసుకోవాలి. ముందుగా కీరదోసకాయ, టమాటా ముక్కలను మిక్సీలో వేసి తిప్పిన తర్వాత, క్యారెట్లు, బీట్రూట్ ముక్కలు వేసి నీళ్ళు కలపకుండా గ్రైండ్ చేయాలి. ఈ జ్యూస్‌ను ఫిల్టర్ చేసి, కాస్త తేనె, నిమ్మరసం కలుపుకుని త్రాగాలి. కొత్తిమీర, పుదీనా లేదా కరివేపాకు వాసన ఇబ్బంది లేని వారు జ్యూస్ చేసేటప్పుడు వాటిని కూడా కలుపుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/a-carrot-2.jpg</image:loc><image:caption><![CDATA[ సాయంత్రం పాఠశాల నుండి తిరిగి వచ్చిన పిల్లలకు లేదా పెద్దలకు ఐదున్నర గంటల ప్రాంతంలో ఒక గ్లాసు పండ్ల రసం ఇవ్వడం మంచిది. పండ్ల రసాలు మంచి విటమిన్లు, మినరల్స్ అందిస్తాయి, ఇవి కంటికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. కంటి ఆరోగ్యానికి తగినంత నిద్ర అత్యవసరం. కంటి కణజాలం ఆరోగ్యంగా పనిచేయడానికి ఎనిమిది నుండి తొమ్మిది గంటల విశ్రాంతి అవసరం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/a-carrot-3.jpg</image:loc><image:caption><![CDATA[ పూర్వకాలంలో ప్రజలు ఎక్కువ నిద్రపోయేవారు కాబట్టి, 90 ఏళ్ల వయస్సులో కూడా సూదిలో దారం గుచ్చేంత స్పష్టమైన చూపు ఉండేది. కానీ నేటి తరం పిల్లలకు చిన్న వయస్సులోనే చూపు మందగిస్తోంది. కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర పిల్లలకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, కంప్యూటర్లు అధికంగా వాడే వారికి కంటి చూపును దెబ్బతీయకుండా కాపాడుతుంది. తగినంత నిద్ర కంటిని రీఛార్జ్ చేసి, దాని సామర్థ్యాన్ని పెంచుతుంది. కంటిచూపు మెరుగుదలకు ఉప్పు వినియోగాన్ని తగ్గించడం చాలా ముఖ్యం. అధిక ఉప్పు కంట్లోని సూక్ష్మ రక్తనాళాలను గట్టిపడేలా చేస్తుంది, రక్తప్రసరణ తగ్గుతుంది. ఉప్పు తగ్గించడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంతవరకు రాత్రి భోజనానికి బదులుగా కేవలం పండ్లను తీసుకోవడానికి ప్రయత్నించాలి. సహజమైన ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పండ్లు రాత్రి భోజనానికి ఉత్తమమైన ఎంపిక. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/andhra-pradesh/vizag-marine-clean-up-cm-chandrababus-vision-for-sustainable-coasts-fishermen-1915355.html</loc><lastmod>2026-09-19T21:15:58+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/cm-chandrababu-on-vizag-marine-clean-up.jpg</image:loc>
					<image:title><![CDATA[ Cm Chandrababu On Vizag Marine Clean Up ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chandrababu-naidu.jpg</image:loc><image:caption><![CDATA[ విశాఖపట్నం ఆర్‌కే బీచ్‌లో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సాగర స్వచ్ఛత కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన సీఎం.. సముద్రాన్ని ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి విముక్తి చేసేందుకు చేపడుతున్న చర్యలను అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, మత్స్యకారులు, స్కూబా డైవర్లను అడిగి తెలుసుకున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chandrababu-naidu-2.jpg</image:loc><image:caption><![CDATA[ పెదజాలరిపేటలో ఏర్పాటు చేసిన ఓషన్ ప్లాస్టిక్ రికవరీ సెంటర్ పైలట్ సైట్‌ను సీఎం చంద్రబాబు నాయడు వర్చువల్‌గా ప్రారంభించారు. సముద్రంలో సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను డిజిటల్ తూకం వేసే విధానాన్ని పరిశీలించారు. ప్లాస్టిక్ సేకరణలో పాల్గొంటున్న మత్స్యకారులతో చంద్రబాబు ముఖాముఖి మాట్లాడారు. చేపల వేటతో పాటు సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించడం ద్వారా తమకు ప్రోత్సాహకం లభిస్తోందని, దీంతో అదనపు ఆదాయం సమకూరుతోందని మత్స్యకారులు సీఎంకు వివరించారు. అనంతరం సముద్ర వ్యర్థాల సేకరణకు సంబంధించిన ప్రోత్సాహకాన్ని సీఎం స్వయంగా మత్స్యకారులకు అందించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chandrababu-naidu-1.jpg</image:loc><image:caption><![CDATA[ స్కూబా డైవర్లతోనూ సీఎం మాట్లాడారు. సముద్ర గర్భంలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, పాత చేపల వలలను ఎలా గుర్తించి తొలగిస్తున్నారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. సాగర స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా 1,200 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. మ్యాన్‌హోళ్లు, మురుగు కాల్వల శుభ్రత కోసం జీవీఎంసీ అందుబాటులోకి తెచ్చిన ఆధునిక సీవరేజ్ రోబో పనితీరును కూడా చంద్రబాబు పరిశీలించారు. మానవులు ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆధునిక సాంకేతికతను ఉపయోగించడంపై అధికారులు వివరించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chandrababu-naidu-3.jpg</image:loc><image:caption><![CDATA[ జీవీఎంసీ చేపడుతున్న సాగర స్వచ్ఛత ప్రాజెక్టుకు లభించిన అంతర్జాతీయ గుర్తింపు, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై బ్లూమ్‌బెర్గ్ ప్రతినిధులతో సీఎం చర్చించారు. విశాఖ సాగర తీరాన్ని మరింత పరిశుభ్రంగా, పర్యావరణహితంగా మార్చేందుకు చేపడుతున్న చర్యలపై వివరాలు తెలుసుకున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chandrababu-naidu-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఆర్‌కే బీచ్‌ పరిసరాల్లో మురిమిక్చర్ విక్రయిస్తున్న ఓ మహిళతోనూ చంద్రబాబు మాట్లాడారు. ఆమె జీవనోపాధి, కుటుంబ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆమె ఒంటరి మహిళ అని తెలుసుకున్న సీఎం.. ఆమెకు పెన్షన్ మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆమె విక్రయిస్తున్న మురిమిక్చర్‌ను చంద్రబాబు స్వయంగా రుచి చూశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chandrababu-naidu-4.jpg</image:loc><image:caption><![CDATA[ సాగర స్వచ్ఛతతో పాటు సముద్రంపై ఆధారపడి జీవించే మత్స్యకారులకు అదనపు ఆదాయం కల్పించడం, ఆధునిక సాంకేతికతను వినియోగించడం, తీర ప్రాంతాల్లో జీవనోపాధికి భరోసా కల్పించడం వంటి అంశాలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/vinayaka-annadanam-sambar-recipe-mixed-vegetable-sambar-for-300-people-1915343.html</loc><lastmod>2026-09-19T21:04:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sambar-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sambar 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sambar.jpg</image:loc><image:caption><![CDATA[ సువాసనలు వెదజల్లుతూ అందరికి నచ్చే  ఒక అద్భుతమైన వంటకం సాంబార్. ప్రత్యేకంగా పెళ్లిళ్లకు వడ్డించే సాంబార్ రుచిని, చిక్కదనాన్ని ఇంటి వద్దే ఆస్వాదించాలనుకునే వారికి ఈ రెసిపీ మంచిది. ఈ వంటకం కేవలం సాధారణ సాంబార్ మాత్రమే కాదు, ఇంట్లో తయారుచేసిన ప్రత్యేకమైన సాంబార్ పొడితో కలిపి, ఒక ప్రత్యేకమైన సువాసనను, సంప్రదాయ రుచిని అందిస్తుంది. ఈ సాంబార్ అన్నం, ఇడ్లీ, దోశ, వడ, పొంగల్ వంటి వాటితో అద్భుతంగా తినొచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sambar-1.jpg</image:loc><image:caption><![CDATA[ కుక్కర్‌లో ముప్పావు కప్పు కందిపప్పును శుభ్రంగా కడిగి, మూడు కప్పుల నీళ్ళు,  ఉప్పు, పసుపు, నూనె వేసి, 4 నుండి 6 విజిల్స్ వచ్చేంతవరకు మెత్తగా ఉడికించండి. ఉడికిన పప్పును పప్పు గుత్తితో  మెత్తగా మెదపండి. చింతపండును ఒక కప్పు నీటిలో నానబెట్టండి. సాంబార్ పొడి కోసం సూచించిన అన్ని దినుసులను నేరుగా మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయండి. ఎక్కువ పరిమాణంలో నిల్వ చేసుకోవాలనుకుంటే, దినుసులను తక్కువ మంటపై వేయించి లేదా ఎండలో ఎండబెట్టి పొడి చేసుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sambar-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఒక పెద్ద కళాయిలో నూనె వేడి చేయండి. నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి, కరివేపాకు వేసి దోరగా వేయించండి.  తాలింపు వేగిన తర్వాత, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ముల్లంగి, క్యారెట్, సొరకాయ, ములక్కాయ ముక్కలను వేయండి. కూరగాయలకు సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి, మూత పెట్టి మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sambar-3.jpg</image:loc><image:caption><![CDATA[ నానబెట్టిన చింతపండును బాగా పిసికి, చింతపండు పులుసును కూరగాయల్లోకి వేయండి. తిరిగి ఇంకొక కప్పు నీళ్ళు వేసి మిగిలిన పులుసును కూడా తీసి కలుపుకోండి. పులుసుతో పాటు కూరగాయలను 5-10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇప్పుడు మీ రుచికి తగ్గట్టు  కారం, తయారుచేసుకున్న సాంబార్ పొడి మొత్తాన్ని వేసి కలపండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sambar-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంకా దీనిలో నీళ్ళు పోసి, కలిపి మూత పెట్టి నీళ్ళు మరిగేంత వరకు ఉడికించండి. నీళ్ళు మరుగుతున్నప్పుడు, ఉడికించి మెత్తగా చేసుకున్న పప్పును వేసి బాగా కలపండి. రుచి చూసి, అవసరమైతే ఉప్పు సర్దుబాటు చేయండి. చిక్కదనం కావాలంటే మరికొద్దిసేపు ఉడికించండి, పలుచగా కావాలంటే కొద్దిగా నీళ్ళు కలపవచ్చు. మధ్యస్థ మంటపై 5-10 నిమిషాలు ఉడికిస్తే సాంబార్ సరైన చిక్కదనానికి వస్తుంది. చివరగా, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి, స్టవ్ ఆపి వేడివేడిగా వడ్డించండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/sports/cricket-news/wapl-t20-launch-nara-brahmani-mithali-raj-1915280.html</loc><lastmod>2026-09-19T20:02:45+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/wapl-2026-ap-mithali-raj-brahmani-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Wapl 2026 Ap Mithali Raj Brahmani (5) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/wapl-2026-ap-mithali-raj-brahmani-6.jpg</image:loc><image:caption><![CDATA[ మంగళగిరి: మహిళా యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసి, వారిని ఉమెన్ ప్రీమియర్ లీగ్, భారత మహిళా క్రికెట్ జట్టు వైపు నడిపించడమే లక్ష్యంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) తలపెట్టిన మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్(WAPL) టీ-20 క్రికెట్ తొలి సీజన్ ప్రారంభమైంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/wapl-2026-ap-mithali-raj-brahmani-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శనివారం సాయంత్రం నిర్వహించిన ఉమెన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-1 ప్రారంభోత్సవ వేడుకలకు హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/wapl-2026-ap-mithali-raj-brahmani-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ సందర్భంగా మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ను నారా బ్రాహ్మణి లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా స్టేడియం ప్రాంగణానికి చేరుకున్న నారా బ్రాహ్మణికి ఎంపీ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, రాజ్యసభ ఎంపీ, ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ బాబు ఘనస్వాగతం పలికారు. అనంతరం డబ్ల్యూఏపీఎల్ ను ప్రారంభించారు. భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ తో కలిసి ట్రోఫీని ఆవిష్కరించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/wapl-2026-ap-mithali-raj-brahmani-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ.. ఉమెన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్స వేడుకలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని, తమ ప్రతిభను నిరూపించుకునేందుకు మహిళా క్రికెటర్లకు ఇదో అద్భుతమైన అవకాశమని పేర్కొన్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/wapl-2026-ap-mithali-raj-brahmani-2.jpg</image:loc><image:caption><![CDATA[ భవిష్యత్ తరాలకు వీరంతా రోల్ మోడల్స్ గా నిలుస్తారని చెప్పారు. ప్రతిభ ఉండి అవకాశం వస్తే మహిళా క్రీడాకారిణులు అద్భుతంగా రాణిస్తారని తెలిపారు. మంగళగిరి వేదికగా యువ మహిళా క్రికెటర్లకు అవకాశం కల్పించిన ఏసీఏ నిర్వాహకులను ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/wapl-2026-ap-mithali-raj-brahmani-1.jpg</image:loc><image:caption><![CDATA[ భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ డబ్ల్యూఏపీఎల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఫ్రాంచైజీ విధానంలో రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న డబ్ల్యూఏపీఎల్ టీ-20 క్రికెట్ పోటీల్లో నాలుగు జట్లు రాయలసీమ జెన్ స్టార్స్, గోదావరి ఈగల్స్, అమరావతి ఈ-ఛాంపియన్స్, వైజాగ్ ఫైర్ బర్డ్స్ తలపడనున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/wapl-2026-ap-mithali-raj-brahmani.jpg</image:loc><image:caption><![CDATA[ మంగళగిరిలోని ఏసీఏ క్రికెట్ స్టేడియంలో 7 రోజుల పాటు 13 మ్యాచ్ లు జరగనున్నాయి. శనివారం మధ్యాహ్నం రాయలసీమ జెన్ స్టార్స్, గోదావరి ఈగల్స్ మధ్య ప్రారంభ మ్యాచ్ జరిగింది. సాయంత్రం అమరావతి ఈ-ఛాంపియన్స్, వైజాగ్ ఫైర్ బర్డ్స్ మధ్య రెండో మ్యాచ్ జరిగింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/wapl-2026-ap.jpg</image:loc><image:caption><![CDATA[ డబ్ల్యూఏపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నారా బ్రాహ్మణికి నిర్వాహకులు ప్రత్యేక జ్ఞాపికను అందించి సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/wapl-2026-ap-mithali-raj-brahmani-7.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ కార్యక్రమంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ బాబు, ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్, ఏసీఏ కోశాధికారి దండమూడి శ్రీనివాస్, ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ మెంబర్ డి.విష్ణుతేజ, ఏసీఏ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ, ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ వైఎస్ రంగనాథ్ పాల్గొన్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/weekly-horoscope-september-20-26-2026-career-finance-and-luck-predictions-for-all-12-zodiac-signs-1915178.html</loc><lastmod>2026-09-19T18:35:21+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/weekly-horoscope-20-26-september-2026.jpg</image:loc>
					<image:title><![CDATA[ Weekly Horoscope 20 26 September 2026 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/1-mesha-rashi-31-31.jpg</image:loc><image:caption><![CDATA[ మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ తగిన ప్రతిఫలం ఉంటుంది. వృత్తి జీవితంలో యాక్టివిటీ బాగా విస్తరిస్తుంది. వ్యాపారాల్లో కొత్త వ్యూహాలను, ప్రణాళికలను అమలు చేస్తారు. ఆర్థిక విషయాల్లో వారమంతా బాగానే గడిచిపోతుంది. ప్రధాన గ్రహాల సంచారం బాగున్నందువల్ల ముఖ్యమైన పనులన్నీ సానుకూలపడతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధించే అవ కాశం ఉంది. కొద్దిగా పట్టు విడుపులతో వ్యవహరిస్తే బంధుమిత్రుల నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందుతాయి. ఆదాయానికి లోటుండదు. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/2-vrushaba-rasi-41-11.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి బాగా పెరిగే అవకాశం ఉంది. అదనపు బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు, శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఆదాయపరంగా ఇతరులకు సహాయం చేసే పరిస్థితిలో ఉంటారు. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. దగ్గర బంధువులతో వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లు పెరుగుతారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. షేర్లు బాగా లాభిస్తాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/3-mithuna-rashi-21-21.jpg</image:loc><image:caption><![CDATA[ మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఉద్యోగులకు అధికార యోగం పడుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో ఇతరుల మీద ఆధారపడక పోవడం మంచిది. వారం మధ్యలో ఒక శుభ పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. అయితే, కుటుంబ ఖర్చులు బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. అవసరానికి మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవు తాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఎటువంటి పనులు చేపట్టినా  విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో జీవిత భాగస్వామికి గుర్తింపు లభిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/4-karkataka-rashi-41-21.jpg</image:loc><image:caption><![CDATA[ కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): వృత్తి, ఉద్యోగాల్లో చాలావరకు అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. అదనపు బాధ్యతల వల్ల కొద్దిగా శ్రమ పెరిగినప్పటికీ ఆర్థిక ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారాల్లో భాగస్వాములతో విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలన్నీ సానుకూలపడతాయి. మాటకు విలువ పెరు గుతుంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. నిరుద్యోగులు ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. సోదరులతో ఆస్తి వివాదాలు ఇబ్బంది కలిగి స్తాయి. తలపెట్టిన పనులు కొద్దిగా నిదానంగా పూర్తవుతాయి. దాదాపు అన్ని రంగాల వారి మీదా ఒత్తిడి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాల్లో ఎదురు చూస్తున్న శుభవార్తలు అందుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/5-simha-rashi-21-21.jpg</image:loc><image:caption><![CDATA[ సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందుతారు. ఉద్యోగానికి సంబంధించి మెరుగైన అవకాశాలు అంది వస్తాయి. నిరు ద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బందులు తొలగుతాయి. సాధారణంగా ఏ పని తలపెట్టినా సానుకూల ఫలితాలనిస్తుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల్ని సమ యస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ముందుకు సాగుతుంది. కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శిస్తారు. రాజకీయాలు, రియల్ ఎస్టేట్, డాక్టర్లు, ఇంజనీర్లకు నిమిషం కూడా తీరిక దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగాల కారణంగా దూర ప్రయా ణాలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఆశించిన శుభవార్తలు వింటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/6-kanya-rashi-31-11.jpg</image:loc><image:caption><![CDATA[ కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. ఆస్తుల కొనుగోలుకు అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో కొత్త ఉత్సాహంతో పురోగతి చెందుతారు. ఉద్యోగంలో పని భారం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రతిఫలాలు, ప్రోత్సాహకాలు లభి స్తాయి. గృహ నిర్మాణానికి సకాలంలో రుణం అందుతుంది. కొత్త కార్యక్రమాలు చేపట్టి సజావుగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్నిస్తుంది. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభించకపోవచ్చు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆదాయ ప్రయత్నాల్లో శ్రమ పెరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/7-tula-rashi-41-21.jpg</image:loc><image:caption><![CDATA[ తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఉద్యోగంలో పని ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. వృత్తి జీవితం బాగా బిజీగా సాగుతుంది. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించి వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. ప్రయాణాల్లో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇతరులతో వివాదాలకు బాగా దూరంగా ఉండడం మంచిది. వారం చివర్లో కొద్దిగా శ్రమతో కానీ పనులు పూర్తి కావు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/8-vrushchika-rashi-21-11.jpg</image:loc><image:caption><![CDATA[ వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): గ్రహ బలం బాగున్నందువల్ల వృత్తి, ఉద్యోగాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు బాగా పెరుగుతాయి. సోదరులతో ఆస్తి వివాదం ఇబ్బంది పెడు తుంది. పిల్లలు చదువుల్లో బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. తలపెట్టిన పనులు చాలావరకు పూర్త వుతాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఖర్చుల్ని నియంత్రించడం మంచిది.బంధు మిత్రులతో ఆచితూచి వ్యవహరించడం అవసరం. కుటుంబ సమస్యల విషయంలో జీవిత భాగ స్వామిని కూడా సంప్రదించడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన స్పందన కనిపిస్తుంది. వ్యక్తిగత సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/9-dhanusu-rashi-111.jpg</image:loc><image:caption><![CDATA[ ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఉద్యోగంలో జీత భత్యాలు, ప్రమోషన్లకు సంబంధించిని శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల విస్తరణకు మార్గం సుగమం అవు తుంది. ఆర్థికపరమైన ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. మిత్రులతో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్య మైన వ్యవహారాల్లో అంచనాలను అందుకుంటారు. దూరపు బంధువుల సహాయంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. కుటుంబ జీవితంలో ఒకటి రెండు శుభ పరిణామాలు సంభవిస్తాయి. గృహ, వాహన సౌకర్యాలకు ప్లాన్ వేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఆదాయానికి లోటుండదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/10-makara-rashi-51-21.jpg</image:loc><image:caption><![CDATA[ మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఉద్యోగాల్లో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్ని విస్తరించే అవకాశం ఉంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. వాహన యోగం పడుతుంది. ముఖ్య మైన వ్యవహారాల్లో శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది. సోదరులతో ఆస్తి వివాదంలో రాజీ మార్గం అనుసరిస్తారు. కొన్ని వ్యక్తిగత పనుల్లో జాప్యం జరిగినా, నిదానంగా పూర్తి చేస్తారు. స్వల్ప అనా రోగ్యానికి అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. ఇంటా బయటా పని ఒత్తిడి ఉంటుంది. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా పురోగతి ఉంటుంది. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు లభిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/11-kumbha-rashi-31-11.jpg</image:loc><image:caption><![CDATA[ కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపో తాయి. కుటుంబంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభి స్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ పెద్దల సలహాలను కూడా తీసుకోవడం మంచిది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త కార్యక్రమాలను ప్రారంభించి సకా లంలో పూర్తి చేస్తారు. బంధువులతో ఇంట్లో సందడిగా గడుపుతారు. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/12-meena-rasi-11-11.jpg</image:loc><image:caption><![CDATA[ మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో సామాన్య లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి, అదనపు ఆదాయ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించడం మంచిది. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంది. కుటుంబ సమేతంగా దైవ దర్శనాలు చేసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వారం మధ్యలో దూర ప్రాంతం నుంచి శుభవార్తలు అందుతాయి. కొత్త వాహనం సమకూరే అవకాశం ఉంది. సోదరులతో సఖ్యత, సామరస్యం ఏర్పడతాయి. కొందరు సన్నిహితుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/vastu-tips-keep-these-5-auspicious-items-at-home-for-peace-prosperity-and-wealth-1915155.html</loc><lastmod>2026-09-19T17:47:16+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/vastu-tips-telugu-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Vastu Tips Telugu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/vastu-tips1.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రతి ఒక్కరూ తమ ఇల్లు ఎల్లప్పుడూ సంతోషం, శాంతి, శ్రేయస్సుతో నిండి ఉండాలని కోరుకుంటారు. కుటుంబ సభ్యులు తమ వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధించాలని ఆశిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నిర్మాణంతో పాటు ఇంట్లో ఉంచే వస్తువులు, వాటి స్థానం కూడా ముఖ్యమైనవిగా భావిస్తారు. కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుందని, సంపద, సంతోషం, శ్రేయస్సు కలుగుతాయని నమ్మకం. అలాంటి 5 వస్తువుల గురించి తెలుసుకుందాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/vastu-tips2.jpg</image:loc><image:caption><![CDATA[ వెండి నాణెం: మత విశ్వాసాలు, జ్యోతిష్య శాస్త్రంలో వెండిని పవిత్రమైన లోహంగా భావిస్తారు. వాస్తు ప్రకారం ఇంట్లో వెండి నాణెం ఉంచడం సానుకూల శక్తికి సూచికగా పరిగణిస్తారు. పూజా  మందిరంలో లేదా ధనాన్ని భద్రపరిచే ప్రదేశంలో వెండి నాణెం ఉంచితే లక్ష్మీదేవి, చంద్రుడి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/vastu-tips3.jpg</image:loc><image:caption><![CDATA[ గులాబీ మొక్క: గులాబీ పువ్వును లక్ష్మీదేవితో ముడిపెట్టి చూసే మత విశ్వాసాలు ఉన్నాయి. అందువల్ల ఇంట్లో గులాబీ మొక్కను పెంచడం శుభప్రదంగా భావిస్తారు. వాస్తు నమ్మకాల ప్రకారం బాల్కనీ లేదా   ఇంటి ఆవరణలో గులాబీ మొక్కను పెంచడం వల్ల ఆర్థిక, వృత్తిపరమైన విషయాల్లో అనుకూల ఫలితాలు లభిస్తాయని చెబుతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/vastu-tips4.jpg</image:loc><image:caption><![CDATA[ లోహపు తాబేలు: వాస్తులో తాబేలు శుభానికి ప్రతీకగా భావిస్తారు. ఇత్తడి లేదా వెండితో తయారు చేసిన తాబేలును ఇంట్లో ఉంచడం వల్ల వృత్తిలో పురోగతి కలుగుతుందని నమ్మకం. అలాగే కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం, సఖ్యత కొనసాగుతాయని విశ్వాసం. తాబేలు విష్ణుమూర్తితో కూడా అనుసంధానించబడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/vastu-tips5.jpg</image:loc><image:caption><![CDATA[ పసుపు గడ్డ: పసుపును గురు గ్రహం, విష్ణుమూర్తితో సంబంధం ఉన్న పవిత్రమైన వస్తువుగా భావిస్తారు. ఇంట్లో పసుపు గడ్డను ఉంచడం వల్ల ఆనందం, శ్రేయస్సు, సంపద కలుగుతాయని మత విశ్వాసం. ముఖ్యంగా గురువారం పసుపుతో చేసే పూజలు, పరిహారాలు శుభప్రదంగా భావిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/vastu-tips6.jpg</image:loc><image:caption><![CDATA[ గవ్వలు: గవ్వలను లక్ష్మీదేవికి సంబంధించినవిగా భావిస్తారు. ఐదు లేదా 11 గవ్వలను లక్ష్మీదేవి పాదాల వద్ద లేదా ఇంటి ధనాన్ని భద్రపరిచే ప్రదేశంలో ఉంచడం వల్ల ఆర్థిక శ్రేయస్సు కలుగుతుందని నమ్మకం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/vastu-tips7.jpg</image:loc><image:caption><![CDATA[ మొత్తంగా, వాస్తు విశ్వాసాల ప్రకారం ఈ వస్తువులు ఇంట్లో సానుకూల వాతావరణం, శాంతి, శ్రేయస్సుకు ప్రతీకలుగా భావిస్తారు. అయితే వీటిని మతపరమైన, వాస్తు విశ్వాసాలుగా మాత్రమే పరిగణించాలి. (Disclaimer: ఈ కథనంలోని వాస్తు, మతపరమైన అంశాలు సంప్రదాయ విశ్వాసాల ఆధారంగా అందించబడ్డాయి. వీటికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని భావించకూడదు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/day-7-vinayaka-chavithi-special-quick-15-minute-minapa-vada-recipe-for-naivedyam-1915101.html</loc><lastmod>2026-09-19T17:22:07+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/minapa-garelu-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Minapa Garelu 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/minapa-garelu-2.jpg</image:loc><image:caption><![CDATA[ మొదటగా, ఒక గ్లాసు మినపగుళ్లను తీసుకొని, శుభ్రంగా రెండు మూడు సార్లు కడగాలి. తరువాత, నిండుగా నీళ్లు పోసి రెండు నుండి నాలుగు గంటలపాటు నానబెట్టాలి. త్వరగా చేయాలంటే రెండు గంటలు సరిపోతుంది, కానీ మంచి ఫలితాల కోసం నాలుగు గంటలు నానబెట్టడం ఉత్తమం. పప్పు చక్కగా నానిన తర్వాత, మళ్లీ ఒకటి రెండు సార్లు కడిగి, నీళ్లు లేకుండా పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/minapa-garelu.jpg</image:loc><image:caption><![CDATA[ నానబెట్టిన పప్పును నీళ్లు అస్సలు లేకుండా మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. పిండిని మెత్తగా, వెన్నలా రుబ్బుకోవడానికి చిన్న మిక్సీ జార్‌ను ఉపయోగిస్తే మంచిది. పప్పు రుబ్బుతున్నప్పుడు ఒక టీ స్పూన్ ఉప్పు వేయాలి. ఉప్పు నుండి వచ్చే తేమతోనే పప్పు మెదుగుతుంది కాబట్టి, అదనపు నీటిని వేయకుండా ఉండాలి. ఎక్కువ నీళ్లు వేస్తే పిండి పల్చబడి వడలు నూనె ఎక్కువగా పీల్చుకుంటాయి. అవసరమైతే, ఒకటి లేదా రెండు టీ స్పూన్ల నీళ్లు మాత్రమే వేయాలి. ఇలా మెత్తగా రుబ్బిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే పద్ధతిలో మిగిలిన పప్పును కూడా రుబ్బుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/minapa-garelu-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఒక టేబుల్ స్పూన్ బియ్యంపిండి,  ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ. బొంబాయి రవ్వ లేకపోతే, ఇడ్లీ రవ్వను కూడా ఉపయోగించవచ్చు. ఈ రెండింటిని పిండిలో బాగా కలిపి, మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ పిండిని వెంటనే ఉపయోగించవచ్చు లేదా ఫ్రిజ్‌లో పెట్టి మరుసటి రోజు ఉదయం వడలు చేసుకోవచ్చు. ముందు రోజు రాత్రి పిండిని సిద్ధం చేసుకుంటే, మరుసటి రోజు వడలు సులభంగా చేసుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/minapa-garelu-3.jpg</image:loc><image:caption><![CDATA[ వడలు లోపల  రావడానికి, పిండిలోకి పావు టీ స్పూన్ వంటసోడా మరియు పావు టీ స్పూన్ ఇంగువ కలపాలి. మిక్సీలో రుబ్బినప్పుడు పిండికి వంటసోడా అవసరం, గ్రైండర్లో రుబ్బితే అవసరం లేదు. వంటసోడా కలపకపోతే వడలు గట్టిగా వస్తాయి. ఈ మిశ్రమాన్ని ఒక స్పూన్‌తో లేదా విస్కర్‌తో రెండు మూడు నిమిషాలపాటు బాగా బీట్ చేయాలి. ఇలా చేయడం వల్ల పిండిలో గాలి చేరి, వడలు ఫ్లఫీగా వస్తాయి. ఇంకా ఈ పిండిలోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి (ఒక టేబుల్ స్పూన్), అల్లం తురుము (ఒక టేబుల్ స్పూన్), సన్నగా తరిగిన కరివేపాకు (రెండు టేబుల్ స్పూన్లు), సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు (ఒక కప్పు), జీలకర్ర (ఒక టీ స్పూన్), మిరియాల పొడి (అర టీ స్పూన్) వేసి బాగా కలుపుకోవాలి. వ్రతాలు లేదా పూజల కోసం చేస్తే ఉల్లిపాయలను వేసుకోకపోయినా ఏం కాదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/minapa-garelu-4.jpg</image:loc><image:caption><![CDATA[ వడలు వేయడానికి, చేతిని నీటితో తడుపుకొని పిండిని తీసుకొని వడల ఆకారంలో ఒత్తుకొని వేడి నూనెలో వేయవచ్చు. అయితే, మొదటిసారి చేసే వారికి లేదా వడలు ఒకే ఆకృతిలో రావడానికి ఒక ప్రత్యేక పద్ధతి ఉంది. వస్త్రం అంచును నీటితో తడిపి, చేతిని తడుపుకొని, పిండిని వస్త్రంపై వడ ఆకారంలో ఒత్తి, మధ్యలో చిన్న రంధ్రం చేయాలి. ఇలా చేసిన వడలను జాగ్రత్తగా వేడి నూనెలో వేయాలి. నూనె బాగా వేడిగా ఉండాలి. వడలు వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌కు తగ్గించి, రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు, కరకరలాడే స్వభావం వచ్చేవరకు వేయించాలి. ఇలా వేయించిన వడలను నూనె నుండి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ పద్ధతిలో చేసిన వడలు చాలా సేపటి వరకు కరకరలాడుతూ, ఎలాంటి కాంబినేషన్‌తోనైనా అద్భుతంగా ఉంటాయి. ఈ చిట్కాలను పాటిస్తూ ఇంట్లోనే పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ మినప వడలను తయారు చేసుకోండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/green-chilli-egg-thokku-recipe-budget-friendly-poor-mans-dum-biryani-side-dish-with-2-eggs-1915065.html</loc><lastmod>2026-09-19T16:28:05+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pachi-mirchi-egg-tokku-6-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Pachi Mirchi Egg Tokku 6 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pachi-mirchi-egg-tokku-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు చెప్పుకోబోయే రెసిపీ పేదోళ్ళ ఇంట్లో ఎవర్ గ్రీన్ వంటకం. ఈ రెసిపీ పచ్చి మిర్చి, కోడిగుడ్డుతో చేస్తే ఆ టేస్ట్ కి ఎవరైనా రెండు ప్లేట్స్ ఆపకుండా లాగిస్తారు. ఇది కారం కారంగా ఉంటుంది. మీరు దీనిని నోట్లో వేసుకోగానే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రుచి వస్తుంది. పేదోళ్ళ ధమ్ బిర్యానీ ఇదే. మీరు కూడా మీ ఇంట్లో ట్రై  చేయండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pachi-mirchi-egg-tokku-2.jpg</image:loc><image:caption><![CDATA[ పచ్చిమిర్చి ఎగ్ తొక్కుకు కావలసిన పదార్థాలు: పది పచ్చిమిర్చి, రెండు కోడిగుడ్లు, రెండు కప్పుల ఉల్లిపాయలు,  5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినంత ఉప్పు , అర టీ స్పూన్ పసుపు, మీరు మంట ఎక్కువగా తినే వాళ్ళు అయితే  కారం కూడా వేసుకోండి , నాలుగు టేబుల్ స్పూన్స్ నూనె , 10 కరివేపాకు ఆకులు, చిన్న కట్ట కొత్తిమీరను తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pachi-mirchi-egg-tokku-3.jpg</image:loc><image:caption><![CDATA[ పచ్చిమిర్చి ఎగ్ తొక్కు తయారీ విధానం: మీరు ముందుగా పచ్చిమిర్చిని తీసుకుని కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కారం ఎక్కువగా కావాలి అంటే దీనిలో ఇంకా వేసుకుని తినొచ్చు. ఇంకోవైపు నాలుగు వెల్లుల్లి, ఉల్లి పాయ ముక్కలను రోటిలో వేసి బాగా నూరి రెడీ చేసుకోవాలి. ఆ తరువాత కోడిగుడ్లను తీసుకుని బ్రేక్ చేసి దీనిలో వేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pachi-mirchi-egg-tokku-4.jpg</image:loc><image:caption><![CDATA[ పచ్చిమిర్చి ఎగ్ తొక్కు తయారీ విధానం స్టెప్ 1 : ముందుగా గ్యాస్ పొయ్యి వెలిగించి స్టవ్ మీద పాన్ పెట్టి దానిలో నూనె వేసి, 
అది వేడయ్యాక దీనిలో ముందుగా కరివేపాకు ఆకులు వేసి వేయించాలి. ఆ దానిని నూరిన తర్వాత ఉల్లిపాయల, పచ్చి మిర్చి పేస్ట్ కూడా వేసి గోల్డ్ కలర్లోకి మారే వరకు వేయించాలి. ఈ సమయంలోనే మంచి వాసన వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pachi-mirchi-egg-tokku-5.jpg</image:loc><image:caption><![CDATA[ పచ్చిమిర్చి ఎగ్ తొక్కు తయారీ విధానం స్టెప్ 2 : ఇప్పుడు దీనిలో పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా దీనిలో వేసి  సన్నని మంటపై  వేయించాలి. అప్పుడు గట్టిగా అవుతుంది, ఆ తరవాత మూతపెట్టి 15 నిముషాల పాటు దీనిని పచ్చి వాసన పోయే వరకు  ఉడికిస్తే మెత్తగా అవుతుంది.  అడుగు అంటకుండా 3 నిముషాల కొకసారి కలుపుతూ ఉండాలి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/water-chestnut-benefits-nutrient-rich-singhara-supports-energy-this-is-the-panacea-that-banishes-psoriasis-and-viral-fevers-1915050.html</loc><lastmod>2026-09-19T15:44:20+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/water-chestnut-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Water Chestnut 3 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/water-chestnut-4.jpg</image:loc><image:caption><![CDATA[ మనందరికీ కూడా రకరకాల విత్తనాలు తింటే ఆరోగ్యానికి మంచిదని తెలుసు. ప్రకృతిలో లభించే కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, దుంపకూరలు, మాంసాహారాలతో పోలిస్తే గింజలే అధిక పోషకాలు, ప్రోటీన్, శక్తి, కొవ్వును అందిస్తాయి. అయితే, కొవ్వు, ప్రోటీన్‌లు ఎక్కువగా ఉంటాయనే అపోహతో చాలా మంది విత్తనాలను తినడం తగ్గించి, కేవలం కూరగాయలు, పండ్లు, ఆకుకూరలపైనే ఆధారపడతారు. దీనివల్ల అనేక పోషక లోపాలు వస్తాయని నేను తరచుగా చెబుతూ ఉంటాను. అలాంటి వారికి, పోషకాలు సమృద్ధిగా ఉండి, కొవ్వు,  కేలరీలు తక్కువగా ఉండే విత్తనం వాటర్ చెస్ట్‌నట్ ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/water-chestnut.jpg</image:loc><image:caption><![CDATA[ సాధారణంగా వాల్‌నట్స్, మెకడమియా నట్స్ వంటివి 700 కేలరీల వరకు శక్తిని ఇస్తే, పెసలు, బొబ్బర్లు, శనగలు కూడా 300-350 కేలరీల శక్తిని అందిస్తాయి. కానీ, వాటర్ చెస్ట్‌నట్ అత్యంత తక్కువ శక్తినిచ్చే విత్తనం. 100 గ్రాముల డ్రై వాటర్ చెస్ట్‌నట్‌లో కేవలం 97 కేలరీలు మాత్రమే ఉంటాయి. దీనిలోని పోషక విలువల గురించి వింటే మీరు ఆశ్చర్యపోతారు. 100 గ్రాముల వాటర్ చెస్ట్‌నట్‌లో 70 గ్రాముల నీటి శాతమే ఉంటుంది. కొవ్వు సున్నా గ్రాములు, ప్రోటీన్ కేవలం 2 గ్రాములు, కార్బోహైడ్రేట్లు 24 గ్రాములు, మరియు ఫైబర్ 3 గ్రాములు ఉంటాయి. దీనిలో కొవ్వు, ప్రోటీన్ చాలా తక్కువగా ఉండటం, కేలరీలు అతి తక్కువగా ఉండటం వల్ల ఇది అందరికీ స్నేహపూర్వకమైన విత్తనంగా చెప్పవచ్చు. డ్రై ఫ్రూట్ షాపుల్లో లభించే ఈ విత్తనం కిలో 450-500 రూపాయలలో లభిస్తుంది. దీనిని పైన తొక్క తీసి పప్పును నేరుగా తినవచ్చు, ముక్కలుగా చేసి సలాడ్స్‌లో వేసుకోవచ్చు, లేదా పౌడర్ చేసి ఉపయోగించుకోవచ్చు. కావాలంటే కొద్దిగా వేయించి కూడా తినవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/water-chestnut-1.jpg</image:loc><image:caption><![CDATA[ వైరల్ జ్వరాలు, టైఫాయిడ్, కామెర్లు (జాండిస్), మలేరియా, డెంగ్యూ, కోవిడ్-19 వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారి నుండి కోలుకోవడానికి ఇది అద్భుతంగా సహాయపడుతుంది. ఈ వ్యాధులు వచ్చినప్పుడు రక్షణ వ్యవస్థ విడుదల చేసే టి.ఎన్.ఎఫ్-ఆల్ఫా, ఇంటర్లూకిన్స్ వంటి రసాయనాలు శరీరంలో మిగిలిపోయి బలహీనతను కలిగిస్తాయి. వాటర్ చెస్ట్‌నట్ ఈ రసాయనాలను బ్లడ్ నుండి తొలగించి, శరీరాన్ని త్వరగా సాధారణ స్థితికి తీసుకురావడానికి సహాయపడుతుంది. కొరియాలోని జంగ్వోన్ యూనివర్సిటీ 2015లో చేసిన పరిశోధన ఈ విషయాన్ని సైంటిఫిక్‌గా నిరూపించింది. ఇందులో ఎనిమిది రకాల శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/water-chestnut-2.jpg</image:loc><image:caption><![CDATA[ సోరియాసిస్, ఎగ్జిమా వంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్‌లో రోగనిరోధక కణాల (ఇమ్యూన్ సెల్స్) హైపర్ ఆక్టివిటీని నియంత్రించి, వాటిని సాధారణ స్థితికి తీసుకురావడంలో వాటర్ చెస్ట్‌నట్ సహాయపడుతుంది. ఇది ఎన్.ఎఫ్-ఆల్ఫా-బి (NF-κB) పాత్‌వేను నియంత్రించడం వలన ఈ ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇన్ఫెక్షన్ సమయంలో హైపర్ ఆక్టివ్‌గా ఉండే ఇమ్యూన్ సెల్స్ వల్ల కలిగే ఇబ్బందిని తగ్గించి, వాటిని నార్మల్ చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/water-chestnut-5.jpg</image:loc><image:caption><![CDATA[ వాటర్ చెస్ట్‌నట్‌లో ఉండే ఫెరులిక్ యాసిడ్ ఊబకాయం ఉన్నవారికి ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది. కొవ్వు కణాలలో లిపిడ్ పెరాక్సిడేషన్ జరిగి, కణాలు దెబ్బతిన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. ఫెరులిక్ యాసిడ్ ఈ నష్టాన్ని తగ్గించి, కాలేయ కణాలను  కొవ్వు కణాలను సాధారణ స్థితికి తీసుకురావడంలో సహాయపడుతుంది. యూకేకు చెందిన పరిశోధకులు 2003లో ఈ విషయాన్ని నిరూపించారు, ముఖ్యంగా ఊబకాయం ఉన్నవారిలో కాలేయంలో కొవ్వు అధికంగా ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరమని తెలిపారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/coconut-oil-for-cracked-heels-simple-home-remedy-to-soften-dry-cracked-feet-overnight-1915018.html</loc><lastmod>2026-09-19T15:08:49+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/cracked-heels-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Cracked Heels 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/cracked-heels.jpg</image:loc><image:caption><![CDATA[ అమ్మాయిల్లో చాలా మంది ఎవరికీ వారు అందంగా ఉండాలని కోరుకుంటారు నిజం చెప్పాలంటే వీరికి అందం ముఖ్యం పాదాల నుంచి ముఖం వరకు అన్నింటి మీద ప్రత్యేకమైన కేర్ తీసుకుంటారు. ముఖం మీద వచ్చిన మచ్చలను అయితే తగ్గించుకోవచ్చు. పాదాల పగుళ్లు అయితే స్పెషల్ కేర్ తీసుకోకపోతే ఇవి తగ్గవు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/cracked-heels-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ కాళ్ళ పగుళ్ళు అందాన్ని పూర్తిగా దెబ్బ తీస్తాయి. ఇంకా నడుస్తున్నప్పుడు నొప్పిని కలిగిస్తాయి. దుమ్ము, ధూళి వలన ఈ సమస్య పెరుగుతుంది తప్ప తగ్గదు. ఇంకా పాదాలకు తేమ తగలేకపోవడం వలన ఈ సమస్య వస్తుంది. దీనిని తగ్గించుకోవడం కోసం 
 రకరకాల క్రీమ్స్  వాడుతారు అయినా కూడా ఫలితం ఉండదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/cracked-heels-2.jpg</image:loc><image:caption><![CDATA[ మీరు దీని కోసం ఎన్నో రకాల మందులను వాడాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉండే కొబ్బరి నూనెతో  దీనికి మీరు చెక్ పెట్టవచ్చు. కొబ్బరి నూనెను తీసుకుని మీ పాదాలను ముందుగా తుడిచి ఆ తరువాత ఆయిల్ ను రాయాలి. ఇలా మీరు రాసిన తరువాత దానిలో ఉన్న మృతకణాలు పోతాయి. ఇది మీ పగుళ్లను మొత్తం మాయం చేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/cracked-heels-3.jpg</image:loc><image:caption><![CDATA[ చాలామంది కాళ్ళ పగుళ్లు చూడగానే ఏదొక ట్యూబ్ రాస్తారు. ఈ చిట్కాలను మీరు పాటిస్తే ఇక వేరేవి ఏవి కూడా వాడరు.  మీరు రోజూ రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెను తీసుకుని ఆ తరువాత మసాజ్ చేయాలి.  ఇది పాటించే ముందు మీ పాదాలను మంచిగా చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఆయిల్ రాసి మసాజ్ చేసి, ఉదయాన్నే శుభ్రంగా కడగాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/cracked-heels-4.jpg</image:loc><image:caption><![CDATA[ (నోట్ : మీరు వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తప్పసరిగా తీసుకోవాలి. ఇక్కడ అందించిన వివరాలు కేవలం మీ అవగాహనకు కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఇందులో రాసిన అంశాలకు టీవీ9 బాధ్యత వహించదని గమనించగలరు) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/october-2026-astrology-these-zodiac-signs-may-see-financial-growth-and-success-due-to-planetary-transits-1914972.html</loc><lastmod>2026-09-19T14:32:04+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/money-4.jpg</image:loc>
					<image:title><![CDATA[ Money 4 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/astro-19.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/astro-2-11.jpg</image:loc><image:caption><![CDATA[ ముఖ్యమైన గ్రహాలు తమ స్థానాన్ని ఒక రాశి నుంచి ఇంకో రాశి లోకి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే సమయంలో ఈ  కొన్ని అద్భుత యోగాలు ఏర్పడతాయి. అలాంటి సమయంలో రెండు రాశుల వారికి మంచిగా ఉంటే, మిగతా వారికీ మిశ్రమ ఫలితాలను ఇవ్వనున్నాయి. మరి, ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/kanya-rashi-4.jpg</image:loc><image:caption><![CDATA[ కన్య రాశి : ఒక్క దెబ్బకు మొత్తం సెటిల్ అవుతుంది ఇంకా వీరికున్న అప్పులు కూడా పోతాయి. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న  సమయం వచ్చేస్తుంది అలాగే, జరగవు అనుకున్న పనులు కూడా జరుగుతాయి. పాత భూములు మంచి రేటుకు పలుకుతుంది అలాగే మీ వద్ద ఉన్న డబ్బు కూడా రెండింతలు అవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/vrushabha-rashi-1.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభ రాశి : ఈ రాశి వారికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఇంకా వీరికి అన్ని వైపులా ధన లాభం కలుగుతుంది. అలాగే, ఆర్థిక పరిస్థితిల్లో కూడా కొత్త మార్పులు వస్తాయి.  ఇంకా వీరి జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారి కల నెరవేరుతుంది. ఇంకా కొత్తగా వ్యాపారాలు చేసే వారికి  లాభాలు వస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/astro-1-15.jpg</image:loc><image:caption><![CDATA[ Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/ganesh-nimajjanam-whisper-3-words-in-ganesha-ear-for-wish-fulfillment-1914952.html</loc><lastmod>2026-09-19T14:10:51+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ganesh-17.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ganesh ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ganesh-1-6.jpg</image:loc><image:caption><![CDATA[ వినాయకుడి పండుగ అంటే చాలు పల్లె, పట్నం అన్ని చోట్ల ఆ సందడే వేరుంటుంది. ప్రతి రోజూ ఉదయం సాయంత్రం పూజలు, కోలాటం, ఆట పాటలతో సందడి నెలకొటుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ గణేష్ ఉత్సవాలలో చాలా ఆనందంగా పాల్గొంటారు. అయితే ఇప్పటికే కొన్ని చోట్ల నిమజ్జనాలు కూడా ప్రారంభం అయ్యాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ganesh-2-6.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే నిమజ్జనం చేసిన సమయంలో వినాయకుడి చెవిలో ఈ పదాలు చెబితే చాలు మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయంట. ఇంతకీ అవి ఏవి అనుకుంటున్నారా.  నిమజ్జనానికి తరలించే ముందు , వినాయకుడి ఎడమ చెవిలో మీ కోరికను చెప్పాలంట. కుడి చేతితో మీ నోటికి చేయి అడ్డు పెట్టి, మనసులో ఉన్నది గణేషుడికి చెప్పాలంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ganesh-3-5.jpg</image:loc><image:caption><![CDATA[ అంతే కాకుండా మీ కోరికను చెప్పిన తర్వాత నా కోరికను నెరవేర్చు స్వామి, గౌరవాన్ని కాపాడు, మేలు కలిగేలాచూడు స్వామి.. ఉద్యోగం, ఇంట్లో సంతోషం, ఐశ్వర్యం కలగాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని దీవించు అని ఆయనకు చెప్పాలంట. ఇలా చెప్పడం వలన మీరు కోరిన కోరిక నెరవేరుతుందని చెబుతున్నారు పండితులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ganesh-4-4.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ఇలా చెప్పడం వెనుక ఒక కారణం ఉన్నది అంటున్నారు పండితులు. అది ఏమిటి అంటే? నిమజ్జనం అంటే వినాయకుడు భూలోకాన్ని వదిలి కైలాసం చేరుకోవడం. నిమజ్జనం తర్వాత వినాయకుడు నేరుగా కైలాసానికి చేరుకొని తన తల్లిదండ్రులను కలిసి వారి ఆశీస్సులు తీసుకుంటాడంట.  అందువలన మీరు ఆ సమయంలో చెప్పిన సన్ని వేశాన్ని ఆయన శివ పార్వతులకు చెరవేస్తాడని విశ్వసిస్తారు. అందువలన  నిమజ్జనం రోజు ఎవరికీ వినపడకుండా మీ కోరికను వినాయకుడి చెవిలో చెప్పాలంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ganesh-5-4.jpg</image:loc><image:caption><![CDATA[ నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/must-watch-this-interesting-army-drama-series-that-trending-on-ott-it-is-operation-safed-sagar-1914961.html</loc><lastmod>2026-09-19T13:57:43+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ott-movie-13.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ott Movie ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ott-new.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో కంటెంట్‌కు కొదవే లేదు. ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. థియేటర్లలో మిస్ అయిన సినిమాలను ఓటీటీలో చూసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుండగా.. మరోవైపు రియల్ లైఫ్ సంఘటనలు, చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్‌లకు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా వార్, యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లకు ఓటీటీ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ott-movie-12.jpg</image:loc><image:caption><![CDATA[ అలాంటి కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓ వెబ్ సిరీస్ ‘ఆపరేషన్ సఫేద్ సాగర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ది కార్గిల్ వార్’. 1999 కార్గిల్ యుద్ధంలో భారత వైమానిక దళం చేపట్టిన కీలక ఆపరేషన్ ‘సఫేద్ సాగర్’ నేపథ్యంగా ఈ సిరీస్‌ను రూపొందించారు. ఆగస్టు 7, 2026న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సిరీస్ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. 1999లో కార్గిల్ యుద్ధం తీవ్ర రూపం దాల్చిన సమయంలో, అత్యంత క్లిష్టమైన పర్వత ప్రాంతాల్లో భారత సైన్యానికి మద్దతుగా భారత వైమానిక దళం కీలక పాత్ర పోషించింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ott.jpg</image:loc><image:caption><![CDATA[ అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ చేపట్టిన ఈ వైమానిక చర్యకు ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ అనే పేరు వచ్చింది.ఈ సిరీస్ ప్రధానంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ‘గోల్డెన్ యారోస్’ స్క్వాడ్రన్ చుట్టూ తిరుగుతుంది. శత్రు ప్రాంతాల్లోకి వెళ్లి ప్రమాదకరమైన మిషన్లను పూర్తి చేయాల్సిన పైలట్ల సాహసాలు, వారికి ఎదురైన సవాళ్లు, యుద్ధ సమయంలో తీసుకున్న కీలక నిర్ణయాలు, అలాగే వారి వ్యక్తిగత జీవితాల్లోని భావోద్వేగాలను కూడా సిరీస్‌లో చూపించారు.   ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/movie-pic.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ సిరీస్‌లో నటుడు సిద్దార్థ్ ఫ్లైట్ కమాండర్ అజయ్ అహుజా పాత్రలో కనిపించారు. ఆయనతో పాటు జిమ్మీ షెర్గిల్, అభయ్ వర్మ, దియా మిర్జా, ప్రజక్తా కోలి, అదిల్ హుస్సేన్, మిహిర్ అహుజా, తారుక్ రైనా, అర్వణ్ భాసిన్, అమృత బాగ్చి తదితరులు కీలక పాత్రలు పోషించారు. జిమ్మీ షెర్గిల్ బి.ఎస్. ధనోవా పాత్రలో నటించగా, అభయ్ వర్మ రాజ్‌పాల్ సింగ్ ధాలీవాల్ పాత్రలో కనిపించారు. కథలో యుద్ధ రంగంతో పాటు సైనికుల వ్యక్తిగత జీవితాలు, కుటుంబ సభ్యుల భావోద్వేగాలను కూడా ప్రాధాన్యంగా చూపించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/movienews.jpg</image:loc><image:caption><![CDATA[ ఆపరేషన్ సఫేద్ సాగర్’కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అంశాల్లో షూటింగ్ విధానం కూడా ఒకటి. సిరీస్‌ను రూపొందించే సమయంలో భారత వైమానిక దళానికి చెందిన మాజీ అధికారుల నుంచి విస్తృతంగా సమాచారం, సలహాలు తీసుకున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. అంతేకాదు, నిజమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లు, విమానాలు, మౌలిక సదుపాయాలను ఉపయోగిస్తూ సిరీస్‌ను మరింత వాస్తవికంగా తెరకెక్కించారు. హై-ఆల్టిట్యూడ్ ప్రాంతాల్లోని క్లిష్టమైన పరిస్థితులను తెరపై చూపించేందుకు ప్రత్యేకంగా శ్రమించారు. నెట్‌ఫ్లిక్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, షూటింగ్ సమయంలో 16,000 అడుగుల ఎత్తులో తీవ్ర చలికాల పరిస్థితుల్లో కూడా చిత్రీకరణ జరిగింది.  ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/anand-sai-shared-interesting-details-about-the-food-pawan-kalyan-eats-and-his-diet-1914933.html</loc><lastmod>2026-09-19T13:52:11+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pawan-kalyan-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Pawan Kalyan ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pawan-kalyan-5.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆహారపు అలవాట్లు, ఆయన జీవనశైలిపై పలు ఆసక్తికర విషయాలను పవన్ కళ్యాణ్ మిత్రుడు  ఆనంద్ సాయి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. పవన్ కళ్యాణ్ జీవితంలో సాధారణత్వం, ఆరోగ్యానికి ఆయన ఇచ్చే ప్రాధాన్యత గురించి వివరంగా తెలిపారు ఆనంద్ సాయి. ఆనంద్ సాయి మాటల ప్రకారం, పవన్ కళ్యాణ్ ఆహారం విషయంలో చాలా నిరాడంబరంగా ఉంటారు. ఆయన ఉదయం అల్పాహారం చాలా తక్కువగా తీసుకుంటారు.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pawan-kalyan-latest.jpg</image:loc><image:caption><![CDATA[ కొన్నిసార్లు అసలు తీసుకోరని తెలిపారు. ఉదయం పూట యోగా, వ్యాయామం వంటి శారీరక శ్రమకు ఆయన అధిక ప్రాధాన్యత ఇస్తారు. మధ్యాహ్న భోజనానికి వచ్చేసరికి, పవన్ కళ్యాణ్ ఎక్కువగా పెరుగు అన్నం తినడానికి ఇష్టపడతారు. దీనికి కారణం, హెవీ ఫుడ్ తీసుకోవడం వల్ల పనితీరు మందగించి, ముఖ్యమైన మీటింగ్‌లకు హాజరు కాలేమని ఆయన భావించడమే. మాంసాహారం విషయంలో కూడా ఆయన అదే తీరును అవలంబిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pawan-kalyan-latest-pic.jpg</image:loc><image:caption><![CDATA[ చాలా తక్కువగా నాన్-వెజ్ తింటారని, కొన్నిసార్లు కేవలం గ్రేవీని మాత్రమే తీసుకుంటారని ఆనంద్ సాయి వివరించారు. రుచి కంటే ఆకలి తీరడం, శరీరానికి అవసరమైన శక్తి లభించడం ఆయన ప్రధాన ఉద్దేశ్యం. ఈ భోజన విధానం కేవలం శారీరక ఆరోగ్యానికే కాకుండా, ఆయన మానసిక స్థితికి కూడా అద్దం పడుతుంది. జీవితం పట్ల ఆయనకున్న ఫిలాసఫీని కూడా ఆనంద్ సాయి పంచుకున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pawan-kalyan-latest-pics.jpg</image:loc><image:caption><![CDATA[ మనిషి అర్థం కోసం అన్వేషణ (A Mans Search for Meaning) వంటి పుస్తకాలను ఆయన చదువుతారని, నొప్పి ఎదురైనప్పుడే మనిషి బలంగా మారుతాడు అనే సిద్ధాంతాన్ని ఆయన నమ్ముతారని తెలిపారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను, కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలనేది ఆయన ఆలోచన.మనిషికి తన అంతర్గత స్వరమే ఉత్తమ సలహాదారు అని, ఏది మంచో, ఏది చెడో మన మనసు మనకు చెబుతుందని ఆనంద్ సాయి పేర్కొన్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pawan-kalyan-pic.jpg</image:loc><image:caption><![CDATA[ అధికంగా తినడం, తక్కువగా తినడం వంటి విషయాల్లో కూడా మన శరీరం మనకు సంకేతాలు ఇస్తుందని ఆయన అన్నారు. ఈ అంతర్గత జ్ఞానాన్ని విని, దానిని అనుసరించడమే నిజమైన ఆరోగ్యమని పవన్ కళ్యాణ్ భావిస్తారని. డబ్బు, హోదా ఎంత ఉన్నా, మనిషి ప్రాథమిక అవసరాలు మారవు అనే సత్యాన్ని కూడా పవన్ కళ్యాణ్ మాటల ద్వారా ఆనంద్ సాయి వివరించారు. బంగారం తినలేము, సాధారణ ఆహారమే మనిషికి అవసరం. బయట ఎన్ని రకాల రుచికరమైన ఆహారాలు ఉన్నా, ఇంటి భోజనం, ముఖ్యంగా అమ్మ చేతి వంటకు ఉండే తృప్తి, రుచి వేరే దేనికీ ఉండదని ఆయన అన్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/aalu-jalebi-recipe-taste-next-level-potato-jalebi-for-a-unique-sweet-treat-1914951.html</loc><lastmod>2026-09-19T13:52:06+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/alu-jilebi-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Alu Jilebi 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/alu-jilebi-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఆలు జిలేబీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. మైదా పిండి 100 గ్రాములు, ఉడికించిన బంగాళదుంపలు మూడు లేదా నాలుగు, పెరుగు అర కప్పు, ఈనో, వంట నూనె, కుంకుమ పువ్వు, యాలకుల పొడి, పంచదార ఒక కప్పు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/alu-jilebi-1.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా పాకం తయారు చేసుకోవాలి. దీని కోసం ఒక బౌల్ తీసుకొని, అందులో  చక్కెర, నీరు పోసి మంచిగా మరిగించాలి. కాస్త తీగ పాకంలా తాయు చేసుకోవాలి. పాకం ప్రిపేర్ అవుతుంది అనుకునే సమయంలో అందులో యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/alu-jilebi-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు జిలేబీలు తయారు చేయడం కోసం పిండి ప్రిపేర్ చేసుకోవాలి. దీని కోసం ముందుగా ఆలు తీసుకొని శుభ్రం చేసి, చాలా మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత దీనిని మెత్తగా పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. అందులో మైదా, పెరుగు, సోడా అన్నీ వేసి బాగా కలిపి పక్కనపెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/alu-jilebi.jpg</image:loc><image:caption><![CDATA[ తర్వాత స్టవ్ ఆన్ చేయాలి. దానిపై లోతైన కాస్త వెడల్పాటి పాన్ పెట్టి, జిలేబీలు వేయించుకోవడానికి సరిపడ నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడి అయ్యేలా చూసుకోవాలి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకోవాలి. ఈ పిండిని ఒక కాటన్ క్లాత్‌లోకి లేదా, జిలేబీలు చేసే పాత్రలాంటి దానిలోకి తీసుకొని, వాటిని వేడి నూనెలో జిలేబీల ఆకారంలో ఒత్తుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/alu-jilebi-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు వాటిని రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. తర్వాత వేడి వేడి జిలేబీలను తీస్తూ మనం తయారు చేసుకున్న పాకంలో వేసుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ ఆలు జిలేబీలు రెడీ. మరి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/october-horoscope-gajakesari-yoga-brings-massive-wealth-for-4-zodiacs-1914904.html</loc><lastmod>2026-09-19T13:22:05+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gaja-kesari-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gaja Kesari 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gaja-kesari.jpg</image:loc><image:caption><![CDATA[ అక్టోబర్ నెలలో కర్కాటక రాశిలోకి గురు గ్రహం సంచారం చేయనుంది. అంతే కాకుండా అప్పటికీ అదే రాశిలో చంద్రుడు కూడా సంచారంలో ఉంటాడు. అయితే ఈ రెండు గ్రహాల కలయిక వలన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. కాగా, దీని వలన ఏ రాశుల వారికి ఎక్కువ ప్రయోజనాలు కలగనున్నాయో ఇప్పుడు మనం చూసేద్దాం పదండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gaja-kesari-2.jpg</image:loc><image:caption><![CDATA[ కన్యా రాశి : కన్యా రాశి వారికి ఆదాయం రెట్టింపు అవుతుంది.  ఈ రాశి విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. అన్ని విధాలుగా వీరికి చాలా ప్రయోజనకరంగా ఈ సమయం ఉంటుందని చెప్పాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gaja-kesari-3.jpg</image:loc><image:caption><![CDATA[ మేష రాశి : మేష రాశి వారికి గజ కేసరి రాజయోగం వలన ఊహించని లాభాలు కలుగుతాయి. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే సాఫ్ట్‌వేర్ జాబ్ కొట్టాలి అని చూస్తున్నారో వారి కల నెరవేరుతుంది. ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఈ రాశి వారు ఈ సమయం మొత్తం చాలా ఆనందంగా గడుపుతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gaja-kesari-4.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభ రాశి : వృషభ రాశి వారికి చాలా అద్భుతమైన సమయం అని చెప్పాలి. కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి. ఇవి మీకు ఎక్కువ మొత్తంలో లాభాలను తీసుకొస్తాయి. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది. గతంలో పెట్టుబడులు పెట్టిన వాటి నుంచి కూడా ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించుకుంటారు. ఆర్థికంగా చాలా కలిసి వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gaja-kesari-5.jpg</image:loc><image:caption><![CDATA[ మకర రాశి : మకర రాశి వారికి ఇది మంచి సమయం. మీ ప్రతిభ, శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. అంతే కాకుండా ఈ రాశి రియలెస్టేట్ వ్యాపారులు ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించుకుంటారు. ఆర్థికంగా కూడా వీరికి ఇది చాలా అద్భుతమైన మంచి సమయం అని చెప్పాలి. ఇంటా బయట సానుకూల వాతావరణం నెలకుంటుంది. అన్నింట్లో వీరికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/december-11-saturn-direct-gemini-leo-virgo-brace-for-challenges-1914905.html</loc><lastmod>2026-09-19T13:21:02+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/shani-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Shani ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/shani-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే డిసెంబర్ 11న శని వక్ర గతి నుంచి బయటకు వస్తుంది. ఆ రోజు నుంచి నేరుగా సంచరిస్తుంది. అయితే ఈ సమయంలో కొన్ని రాశుల వారు చాలా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందంట. ముఖ్యంగా మూడు రాశుల వారు దీని వలన చాలా ప్రభావితం అవుతారని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే? ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/shani-3.jpg</image:loc><image:caption><![CDATA[ మిథున రాశి : మిథున రాశి వారికి శని సంచారం చాలా సమస్యలను తీసుకొస్తుంది. వీరు ఆర్థికంగా నష్టపోతారు. అంతే కాకుండా ఆరోగ్యం కూడా పూర్తిగా క్షీణిస్తుంది. ఉద్యోగం చేసే వారు ఉన్నతాధికారులు, సన్నిహితుల నుంచి ఇబ్బందులు ఎదుర్కుంటారు. శని ప్రభావంతో వీరు అన్ని విధాలుగా ఎక్కువగా నష్టాలు చవి చూసే ప్రమాదం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/shani-4.jpg</image:loc><image:caption><![CDATA[ సింహ రాశి : సింహ రాశి వారికి కూడా ఇది మానసిక ఆందోళనను పెంచుతుంది. విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఆదాయం కూడా తగ్గిపోతుంది. దూర ప్రయాణాలు నష్టాలు, అనారోగ్య సమస్యలకు కారణం అవుతాయి. మనశ్శాంతి కరువు అవుతుంది. ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారు చాలా వరకు జాగ్రత్తగా ఉండటం మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/shani-5.jpg</image:loc><image:caption><![CDATA[ కన్యా రాశి : కన్యారాశి వారికి అనారోగ్య సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తాయి. కుటుంబంలో అశాంతి నెలకుంటుంది. భార్య భర్తల మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నదంట. అందువలన ఈ రాశి వారు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/shani-2.jpg</image:loc><image:caption><![CDATA[ నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/laxmanchanda-women-farmers-association-a-new-era-in-agriculture-1914881.html</loc><lastmod>2026-09-19T12:53:14+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/women-farmers-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Women Farmers 3 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/women-farmars.jpg</image:loc><image:caption><![CDATA[ 350 మంది మహిళలు.. ఒకే లక్ష్యం.. నిర్మల్ జిల్లా లక్ష్మణ చందా మండలంలోని 12 గ్రామాలకు చెందిన 350 మంది మహిళా రైతులు కలిసి 2023లో ‘లక్ష్మణచందా మహిళా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ’ ఏర్పాటు చేసుకున్నారు. మహిళల సమష్టి ఆలోచనకు కార్యరూపమే ఈ సమాఖ్య. సంస్థను పారదర్శకంగా నిర్వహించేందుకు 12 గ్రామాల నుంచి 12 మంది డైరెక్టర్లను, ఒక అధ్యక్షురాలిని ఎన్నుకున్నారు. బాధ్యతలను పంచుకుని.. సమష్టి నిర్ణయాలతో సంస్థను ముందుకు తీసుకెళ్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/women-farmers-1.jpg</image:loc><image:caption><![CDATA[ రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను అందించడమే ధ్యేయంగా ఈ సమాఖ్య ను నడుపుతున్నారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా రైతులకు అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులను అందించడమే తమ ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇది కేవలం అమ్మకాల కేంద్రం మాత్రమే కాదు.. రైతులకు సలహాలు ఇచ్చే వ్యవసాయ వేదిక కూడా అని నిరూపిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/women-farmars-1.jpg</image:loc><image:caption><![CDATA[ పంటల కాలాన్ని బట్టి ఏ విత్తనం ఎంచుకోవాలి..? ఎప్పుడు ఎరువులు వేయాలి..? తెగుళ్లు వస్తే ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి..? వంటి అంశాలపై రైతు సభ్యులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తూ గ్రామాభివృద్దికి పంటల సాగుకు వెన్ను దన్నుగా నిలుస్తున్నారు లక్ష్మణచందా మండల సమాఖ్య మహిళా రైతులు. సమాఖ్య సూచనలు, సలహాలు పాటిస్తున్న రైతులు మంచి దిగుబడులు సాధిస్తున్నారని మహిళా రైతులు చెబుతున్నారు. నిన్నటి వరకు రైతు కుటుంబాలకి వ్యవసాయ కూలీలుగా తోడుగా ఉన్న మహిళలు.. నేడు రైతు కుటుంబాల వ్యవసాయ నిర్ణయాలకు మార్గదర్శకులుగా మారడం వారి కృషిని చాటుతుంది. వ్యవసాయ రంగంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ.. గ్రామీణ మహిళ సాధికారతకు కొత్త నిర్వచనం చెబుతున్నారు లక్ష్మణచందా మండల మహిళా రైతు సమాఖ్య. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/women-farmars-5.jpg</image:loc><image:caption><![CDATA[ 2023లో ప్రారంభమైన ఈ సమాఖ్యను విజయవంతంగా కొనసాగిస్తున్న మహిళలు.. ప్రభుత్వం నుంచి మరింత సహకారం అందితే తమ కార్యకలాపాలను విస్తరించాలని భావిస్తున్నారు. ప్రత్యేకంగా ధాన్యం కొనుగోలు కేంద్రం మంజూరు చేస్తే రైతులకు మరింత చేరువ కావడంతో పాటు.. సమాఖ్యకు కూడా మరింత ఆదాయం సమకూరే అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు. ఒకప్పుడు ఇంటి గడప దాటని మహిళా చేతులు.. ఇప్పుడు వ్యవసాయ వ్యాపారాన్ని నడిపిస్తున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/women-farmers-4.jpg</image:loc><image:caption><![CDATA[ విత్తనాలు, మందులు, యూరియా రైతు పంటకు అవసరమయ్యే అన్ని సరుకులు అమ్ముతున్నారు.. రైతులకు సలహాలు సైతం ఇస్తున్నారు.. మార్కెట్‌ను అర్థం చేసుకుంటున్నారు.. సంస్థను మరింత ముందుకు తీసుకెళుతున్నారు. ఇది కేవలం ఓ మహిళా సమాఖ్య విజయగాథ కాదు. గ్రామీణ భారతంలో మారుతున్న మహిళా శక్తికి ప్రతీక.వ్యవసాయంలో మహిళలు కూలీలుగా కాదు.. నిర్ణయాధికారులుగా ఎదుగుతున్నారనడానికి లక్ష్మణచందా మహిళా రైతులే సజీవ సాక్ష్యం. మహిళలే మహారాణులు.. వ్యవసాయం కూడా వారి సామ్రాజ్యమే.. సమష్టి కృషే వారి విజయ మంత్రం. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/jeera-water-what-happens-when-you-drink-cumin-water-every-day-for-30-days-1914848.html</loc><lastmod>2026-09-19T12:33:37+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/jeera-water-for-weight-loss.jpg</image:loc>
					<image:title><![CDATA[ Jeera Water For Weight Loss ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ow-to-make-jeera-water.jpg</image:loc><image:caption><![CDATA[ జీర్ణ వ్యవస్థ సులభతరం అవుతుంది: జీలకర్రలో థైమోల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది జీర్ణ రసాల ఉత్పత్తిని వేగవంతం చేస్తుంది. ఉదయాన్నే ఈ నీరు తాగడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, అజీర్తి సమస్యలు తగ్గుతాయి. తిన్న ఆహారం త్వరగా అరిగి, మలబద్ధకం దూరమవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/cumin-water.jpg</image:loc><image:caption><![CDATA[ బరువు తగ్గడానికి సులువైన మార్గం: శరీర బరువును అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి జీలకర్ర నీరు ఒక గొప్ప హెల్త్ డ్రింక్. ఇది శరీర జీవక్రియ రేటును పెంచుతుంది, దీనివల్ల కేలరీలు త్వరగా కరుగుతాయి.
శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలను బయటకు పంపి డీటాక్సీఫైయర్‌గా పనిచేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/cumin-water-for-diabetes.jpg</image:loc><image:caption><![CDATA[ రోగనిరోధక శక్తి పెంపు: జీలకర్రలో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, తరచూ వచ్చే జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తాయి. టైప్-2 మధుమేహంతో బాధపడేవారికి జీలకర్ర నీరు ఎంతో మేలు చేస్తుంది. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచి, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సాధారణ స్థితిలో ఉంచడానికి తోడ్పడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/jeera-water.jpg</image:loc><image:caption><![CDATA[ చర్మ సౌందర్యం: జీలకర్రలోని విటమిన్-ఈ, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచుతాయి. మొటిమలు,యు చర్మ ఇన్ఫెక్షన్లను అరికట్టడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో జీలకర్ర నీరు కీలక పాత్ర పోషిస్తుంది. రోజువారీ ఆహారంలో దీనిని చేర్చుకోవడం ఎంతో శ్రేయస్కరం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/jeera-water-benefits.jpg</image:loc><image:caption><![CDATA[ జీలకర్ర నీటిని ఎలా తయారు చేసుకోవాలి?: ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ జీలకర్ర వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని మరిగించి, వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. కావాలనుకుంటే ఇందులో కొద్దిగా నిమ్మరసం లేదా తేనె కలుపుకోవచ్చు. ప్రతిరోజూ పరగడుపున ఈ సహజ సిద్ధమైన డ్రింక్ తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని సులభంగా కాపాడుకోవచ్చు! ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/gold-price-today-september-19-gold-surges-1420-in-hyderabad-silver-jumps-5000-per-kg-1914773.html</loc><lastmod>2026-09-19T10:06:11+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-rates-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold Rates ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-1-11.jpg</image:loc><image:caption><![CDATA[ బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఈ వారంలో ధరలు పుంజుకుంటున్నాయి. భారత్‌పై 100 శాతం దిగుమతి సుంకాలు విధించే బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన క్రమంలో మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. దీంతో గోల్డ్‌లోకి పెట్టుబడులు వస్తుండటంతో ఈ లోహానికి డిమాండ్ పెరిగింది. దీంతో ధరలు ఎగబాకుతున్నాయి. ముడి చమురు ధరలు తగ్గడంతో, డాలర్ బలపడటంతో పసిడి ధరలపై తీవ్ర ప్రభావం పడుతోంది. సెప్టెంబర్ 19న దేశంలో ధరలు ఎలా ఉన్నాయంటే.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-2-11.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,840 వద్ద కొనసాగుతుండగా..  ఇవాళ ఒక్కరోజే రూ.1420 పెరిగాయి. 22 క్యారెట్ల రేటు రూ.1,42,850 వద్ద ట్రేడవుతోండగా.. నేడు రూ.1300 మేర పెరిగాయి. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-3-11.jpg</image:loc><image:caption><![CDATA[ చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,840 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,850గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,55,840గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,850 వద్ద కొనసాగుతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-4-11.jpg</image:loc><image:caption><![CDATA[ దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,990గా ఉండగా.... 22 క్యారెట్ల రేటు రూ.1,43,000 వద్ద కొనసాగుతోంది. అటు బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండి రూ.5 వేలు ఒక్కసారిగా పెరిగింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-5-10.jpg</image:loc><image:caption><![CDATA[ ఢిల్లీలో కిలో వెండి ప్రస్తుతం రూ.2.55 లక్షలుగా ఉండగా.. శుక్రవారం రూ.2.50 లక్షల వద్ద స్థిరపడింది. చెన్నైలో కేజీ సిల్వర్ రూ.2.60 లక్షల వద్ద ఉండగా.. నిన్న రూ.2.55 లక్షల వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ రూ.2.60 లక్షల వద్ద ట్రేడవుతోంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/ganesh-nimajjanam-2026-dates-muhurtam-and-how-to-perform-immersion-rituals-1914772.html</loc><lastmod>2026-09-19T10:01:39+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ganesh-visarjan-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ganesh Visarjan 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ganesh-visarjan-2.jpg</image:loc><image:caption><![CDATA[ వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 14న గణేశ్ చతుర్థి సందర్భంగా వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించడం జరిగింది. ఇప్పటికీ ఆరు రోజుల నుంచి ఘనంగా వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు. అయితే ఇక రోజులు గుడుస్తున్నాయి. దీంతో చాలా మందిలో  నిమజ్జనంపై అనేక సందేహాలు నెలకొంటున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ganesh-visarjan-1.jpg</image:loc><image:caption><![CDATA[ 2026లో వినాయక చవితి సెప్టెంబర్ 14వ తేదీ సోమవారం రోజున వచ్చింది. అయితే అందరూ 11వ రోజు అయిన అనంత చతుర్దశి వరకు బప్పాను ఇంట్లో ఉంచరు. కొందరు కుటుంబ ఆచారం ప్రకారం 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు నిమజ్జనం చేస్తుంటారు. అయితే ఎవరు అయితే ఏడవ రోజు నిమజ్జనం చేయాలి అనుకుంటున్నారో, వారు  సెప్టెంబర్ 20, ఆదివారం 2026 రోజున చేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ganesh-visarjan-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ఏడవ రోజు ఏ సమయంలో చేయాలి. శుభ ముహూర్తాలు ఉన్నాయా? లేదా అని టెన్షన్ పడుతుంటారు. అయితే వారి కోసమే ఈ సమాచారం, ఏడవ రోజు ఏ ఏ సమయాల్లో వినాయకుడిని నిమజ్జనం చేయాలో ఇప్పుడు చూసేద్దాం.  శుభ ముహూర్తం: ఉదయం 07:58 గంటల నుంచి మధ్యాహ్నం 12:32 గంటల వరకు (చర, లాభ, అమృత),మధ్యాహ్నం 02:03 గంటల నుంచి 03:34 గంటల వరకు .  సాయంత్రం 06:37 గంటల నుంచి రాత్రి 11:03 గంటల వరకు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ganesh-visarjan-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక 7వ రోజు ఎందుకు నిమజ్జనం చేస్తారు అనే ప్రశ్న చాలా మందిలో మొదలు అవుతుంది. అయితే కొంత మంది తమ కుటుంబ గణపతిని చతుర్దశి వరకు ఉంచరు. విగ్రహ ప్రతిష్టాపన కాలవ్యవధి కుటుంబం, ప్రాంతీయ సంప్రదాయాలను బట్టి మారుతూ ఉంటుంది. పంచాంగం ప్రకారం, 3 వరోజు, 5వ రోజు, 7వ రోజు కొన్ని ప్రాంతాలలో తొమ్మిదవ రోజు కూడా నిమజ్జనం చేస్తుంటారు. అంటే బేసీ సంఖ్యల్లో మాత్రమే నిమజ్జనం చేయవచ్చు.  ఇక సాంప్రదాయకంగా అయితే, గణేష్ చతుర్థి తర్వాత 11వ రోజు వచ్చే చతుర్దశి రోజు వినాయకుడిని నిమజ్జనం చేయాలి. కానీ చాలా మంది దీనికి అంటే ముందుగానే నిమజ్జనం చేస్తుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ganesh-visarjan-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక నిమజ్జనం చేయడానికి ముందు కూడా గణపతిని పూజించి గంగమ్మ ఒడిలోకి పంపించాలి. నిమజ్జనానికి ముందు చివరిసారిగా వినాయకుడికి హారతిని ఇచ్చి, పూలు, గరిక, ఉండ్రాళ్లు, పండ్లు నైవేద్యం సమర్పించి, తర్వాత భక్తి శ్రద్ధలతో, పర్యావరణ నిబంధనలు పాటిస్తూ, నిమజ్జనం చేయాలి అని పండితులు సూచిస్తున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/how-many-bank-accounts-should-you-really-have-know-the-benefits-rules-and-best-practices-1914751.html</loc><lastmod>2026-09-19T09:15:51+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/is-it-good-to-have-multiple-bank-accounts.jpg</image:loc>
					<image:title><![CDATA[ Is It Good To Have Multiple Bank Accounts ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/multiple-bank-accounts-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఒకటి మించిన బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఏం జరుగుతుందని చాలా మంది మొదటల్లో ఒక ప్రశ్న ఉండిపోయింది. దీనికి సమాదానం మనం ఇక్కడ తెలుసుకుందాం. ఆర్థిక నిపుణుల ప్రకారం.. ఒక వ్యక్తి ఓ ప్రైమరీ అకౌంట్, ఒక సేవింగ్ అకౌంట్ ఉంచే సరిపోతుందని నిపుణులు అంటున్నారు. అవసరం, ఆర్థిక కార్యకలాపాలను బట్టి మరో అకౌంట్ తీసుకోవచ్చు. కానీ మీకు ఎలాంటి అవరసం లేకుండా ఎక్కువ అకౌంట్స్ ఓపెన్ చేయడం వల్ల ఎలాంటి లాభం లేదని నిపుణులు అంటున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/multiple-bank-accounts-3.jpg</image:loc><image:caption><![CDATA[ మీకు ఒకటి కంటే ఎక్కవ  బ్యాంక్ అకౌంట్‌  ఉంటే మీ డబ్బును అవసరానికి తగ్గట్టు డివైడ్ చేసుకోవచ్చు.  ఉదాహరణకు.. ఓ అకౌంట్‌ను మీరు సాలరీ కోసం యూజ్ చేస్తూ.. మరో అకౌంట్‌ను ఇంటి ఖర్చులు, రోజువారి లావాదేవీలకు కోసం వాడొచ్చు. మరో అకౌంట్‌ను సేవింగ్స్ కోసం వాడొచ్చు.. ఇది ఇది ఖర్చులను, పొదుపును వేర్వేరుగా మెయింటేన్ చేసేందుకు సహాయపడడమే కాకుండా.. మీ ప్రతి నెల ఎంత ఖర్చు అవుతుంది.. మీకు ఎంత ఆదాయం వస్తుందనేది తెలుసుకోవడం ఈజీ అవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/multiple-bank-accounts-2.jpg</image:loc><image:caption><![CDATA[ మీ దగ్గర రెండు అకౌంట్స్ ఉంటే మీరు సెకండ్ అకౌంట్‌ను మొదటి దానికి ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. అంటే మీ మొదటి అకౌంట్‌లో ఏవైనా సాంకేతిక సమస్య వస్తే.. మీకు ఆర్థిక ఇబ్బందుకు లేకుండా రెండో అకౌంట్‌ను తాత్కాలికంగా వాడుకోవచ్చు. ఈ పద్దతి ఫాలో అవ్వడం ద్వారా మన సేవింగ్స్ డబ్బును డైలీ ఖర్చుల నుంచి సేఫ్‌గా ఉంచొచ్చు.. అలాగే సేవింగ్స్ అనవసరంగా ఖర్చు చేయకుండా కాపాడుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/multiple-bank-accounts-1.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ఆర్థిక లావాదేవీలు ఎక్కువ చేసేవారు, వివిధ నగరాల్లో వ్యాపారాలు కలిగిన వ్యక్తులకు మూడో ఖాతా అవసరం అవుంతుంది. ఇలాంటి వ్యక్తులు ఓ అకౌంట్‌ను రోజూ ఖర్చుల కోసం, రెండో అకౌంట్‌ను సేవింగ్స్ కోసం, మూడో అకౌంట్‌లో అవసరమైన లావాదేవీల కోసం వాడుకోవచ్చు.  అయితే, ఇందులో గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రతి ఖాతాకు ఒక స్పష్టమైన ప్రయోజనం ఉండాలి. అలా కాదని.. కేవలం ఆఫర్లు, క్యాష్‌బ్యాక్  వంటి స్వల్ప ప్రయోజనాల కోసం మాత్రమే కొత్త అకౌంట్ ఓపెన్ చేయడం మంచిది కాదు. కాబట్టి మళ్లీ కొత్త అకౌంట్ తీసుకోవాలంటే.. కొన్ని విషయాలు గర్తుంచుకోండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/multiple-bank-accounts.jpg</image:loc><image:caption><![CDATA[ మీరు ఉన్న అకౌంట్లే కాకుండా కొత్తది తీసుకోవాలి అనుకుంటే కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.. మీ పాత అకౌంట్ల కంటే కొత్త వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి. తీసుకునే కొత్త అకౌంట్‌లో మినిమమ్ బ్యాలన్స్ ఎంత మెయింటేన్ చేయాలి. మినిమమ్ బ్యాలన్స్ మెయింటేన్ చేయకపోతే ఏమైనా ఛార్జెస్ వేస్తారా? డిజిటల్ బ్యాంకింగ్ సేవల ప్రయోజనాలు, భద్రతా ఫీచర్లు ఏమిటి? అనేది తెలుసుకోవాలి. ఇలా అన్ని తెలుసుకున్న తర్వాత మీకు అకౌంట్ తీసుకోవడం అనేది ముఖ్యం అనుకుంటేనే మళ్లీ కొత్త అకౌంట్ తీసుకోండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/protein-rich-drumstick-leaves-pachadi-a-healthy-and-delicious-recipe-1914720.html</loc><lastmod>2026-09-19T08:32:54+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/munagaku-chutny-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Munagaku Chutny 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/munagaku-chutny-1.jpg</image:loc><image:caption><![CDATA[ కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే..  మునగాకు: రెండు కప్పులు లేతవి మాత్రమే తీసుకోవాలి ,  నువ్వులు: అర కప్పు, ధనియాలు: ఒక టీ స్పూన్,   పచ్చిమిరపకాయలు,  టమాటా ముక్కలు: ఒక కప్పు,   చింతపండు: నిమ్మకాయ సైజు ,  వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర: అర టీ స్పూన్, ఉప్పు: రుచికి సరిపడా,  నూనె: ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు,   కరివేపాకు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/munagaku-chutny-4.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో అర కప్పు నువ్వులు, ఒక టీ స్పూన్ ధనియాలు వేసి మీడియం ఫ్లేమ్‌లో నువ్వులు చిటపటమనే వరకు వేయించాలి. వేగిన నువ్వులను మిక్సీ గిన్నెలోకి తీసుకుని చల్లారనివ్వాలి.  తర్వాత అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె తీసుకొని, కట్ చేసి పెట్టుకున్న పచ్చి మిర్చి, కరివేపాకు బాగా వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/munagaku-chutny-2.jpg</image:loc><image:caption><![CDATA[ దీని తర్వాత మునగాకును కూడా అలాగే వేయించాలి. మునగాకు పచ్చి వాసన పోయి, దగ్గర పడే వరకు వేయించుకుంటూనే ఉండాలి. తర్వాత  అదే కడాయిలో కొద్దిగా నూనె తీసుకొని, ఒక కప్పు టమాటా ముక్కలు, చింత పండు వేసి మూతపెట్టాలి. అవి మంచిగా ఉడికి, మగ్గే వరకు కలుపుతూ ఉండాలి. మగ్గిన తర్వాత చల్లారనివ్వాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/munagaku-chutny-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో  మనం ముందుగా వేయించి పెట్టుకున్న  నువ్వులు, కరివేపాకు , పచ్చి మిర్చి , మునగాకు, టమాటా చింత పండు, వెల్లుల్లి రెబ్బలు గుప్పెడు, అరటీస్పూన్ జీలకర్ర, సరిపడ ఉప్పు ఇవన్నీ రోటీలో వేసి మంచిగా దంచుకోవాలి. బాగా మెత్తగా దంచిన తర్వాత దీనిని మరొక బౌల్‌లోకి తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/munagaku-chutny.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు పోపు ప్రిపేర్ చేసుకోవాలి. దీని కోసం స్టవ్ ఆన్ చేసి, చిన్న పోపు పాన్ పెట్టి, అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఇంగువ, ఎండు మిరిపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, అన్నీ వేసి వేయించుకోవాలి. చివరగా పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత ఈ పోపును మనం రుబ్బుకున్న మునగాకు పేస్ట్‌లో వేయాలి. అంతే మునగాకు రోటీ పచ్చడి రెడీ. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/digital-gold-investors-alert-centre-plans-rbi-sebi-regulation-for-digital-gold-investments-1914727.html</loc><lastmod>2026-09-19T08:22:36+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/digital-gold.jpg</image:loc>
					<image:title><![CDATA[ Digital Gold ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/digital-gold-1.jpg</image:loc><image:caption><![CDATA[ బంగారంపై పెట్టుబడులు పెట్టేవారు ఇటీవల పెరిగిపోతున్నారు. ఫిజికల్ బంగారం కొని పెట్టుకోవడం కంటే డిజిటల్ విధానంలో కొనుగోలు చేస్తున్నారు. గత రెండేళ్లల్లో రికార్డ్ స్థాయిలో గోల్డ్ రేట్లు పెరగ్గా.. రానున్న రోజుల్లో మరింత పెరిగితే లాభం వస్తుందనే ఉద్దేశంతో డిజిటల్ గోల్డ్ కొంటున్నారు. డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. యాప్స్ ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుగోలు చేయవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/digital-gold-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఒకవేళ విక్రయించాలనుకున్నా సెకన్లలోనే డబ్బులు అకౌంట్లో జమ అవుతాయి. ఇక బంగారం కావాలనుకుంటే మీ ఇంటికి డోర్ డెలివరీ చేస్తారు. ఫోన్ పే, పేటీఎం లాంటి యూపీఐ యాప్స్ ద్వారా సులువుగా డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పటివరకు డిజిటల్ గోల్డ్‌పై నియంత్రణ లేకపోవడంతో పెట్టుబడి పెట్టేవారికి రక్షణ ఉండటం లేదు. ఈ క్రమంలో డిజిటల్ గోల్డ్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/digital-gold-3.jpg</image:loc><image:caption><![CDATA[ డిజిటల్ గోల్డ్‌ను ఆర్బీఐ, సెబీ పర్యవేక్షణలోకి తీసుకొచ్చే యోచనలో కేంద్రం ఉంది. ప్రస్తుతం ఈ పెట్టుబడులపై ప్రభుత్వం నియంత్రణ లేకపోవడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. దీంతో ప్రతీ డిజిటల్ గోల్డ్ యూనిట్‌కు ఫిజికల్ బులియన్ బ్యాకింగ్ ఉండేలా చేయాలని కేంద్రం సమాలోచనలు చేస్తోంది. ఆర్బీఐ, సెబీ పర్యవేక్షణలోకి తీసుకొస్తే నియంత్రణ ఉంటుందని భావిస్తోంది ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/digital-gold-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పటికే బ్యాంకులు, రెగ్యూలేటర్లతో కేంద్ర ఆర్ధికశాఖ సంప్రదింపులు జరిపింది. సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్ (రెగ్యులేషన్) యాక్ట్, 1956 కింద డిజిటల్ గోల్డ్‌ను సెక్యూరిటీగా గుర్తించాలనే ప్రతిపాదనకు అన్ని వర్గాల నుంచి ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఇప్పటివరకు సెక్యూరిటీలుగా డిజిటల్ గోల్డ్ నోటిఫై కాలేదు. కమోడిటీ డెరివేటివ్స్‌గా కూడా నియంత్రణ లేదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/digital-gold-5.jpg</image:loc><image:caption><![CDATA[ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్‌ల తరహాలో డిజిటల్ గోల్డ్‌కు రెగ్యూలేటరీ రక్షణ లేదు. ఇప్పటివరకు డిజిటల్ గోల్డ్ ఇండస్ట్రీలో 3 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇప్పటివరకు వీటికి అనుమతి లేకపోవడం వల్ల అనధికార అపరేటర్లు కూడా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. దీంతో మనీలాండరింగ్ వంటివి కూడా చోటుచేసుకుంటున్నాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/tamannaah-bhatia-intresting-comments-about-siddharth-malhotra-1914588.html</loc><lastmod>2026-09-18T22:29:28+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/tamannaah-bhatia.jpg</image:loc>
					<image:title><![CDATA[ Tamannaah Bhatia ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/thamanna-pics.jpg</image:loc><image:caption><![CDATA[ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా సౌత్, నార్త్ ఇండస్ట్రీల్లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ అందాల భామ.. వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతోంది. తాజాగా ‘ది వ్యాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమన్నా చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/thamanna.jpg</image:loc><image:caption><![CDATA[ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో తన కో-స్టార్ సిద్ధార్థ్ మల్హోత్రా గురించి మాట్లాడుతూ తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన రెండు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి పనిచేశానని చెప్పిన తమన్నా.. సిద్ధార్థ్ లాంటి అందమైన నటుడిని మాత్రం ఇంతవరకు చూడలేదని ప్రశంసించారు. ‘హ్యాండ్‌సమ్’ అనే పదానికి సిద్ధార్థ్ మల్హోత్రానే నిలువెత్తు రూపం అన్నట్టుగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/thamanna-pic-new.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక సినిమాలో తమన్నా, సిద్ధార్థ్ మధ్య కనిపించనున్న ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ కూడా ప్రత్యేకంగా ఆకట్టుకునేలా ఉందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ‘ది వ్యాన్’ సినిమాలో బిహారీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఛఠ్ పూజ నేపథ్యంలో ఓ ప్రత్యేకమైన పాటను చిత్రీకరించారు. ఈ పాట గురించి మాట్లాడుతున్న సమయంలో తమన్నా తన వ్యక్తిగత అనుభవాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/thamanna-pic.jpg</image:loc><image:caption><![CDATA[ ముంబయిలో పుట్టి పెరిగిన తనకు జుహూ బీచ్‌లో వేలాది మంది మహిళలు ఛఠ్ పూజ నిర్వహించడం చాలాసార్లు కనిపించేదని ఆమె తెలిపారు. అయితే ఈ పూజ వెనుక ఉన్న సంప్రదాయం, భక్తి, కఠినమైన ఆచారాల గురించి సినిమా షూటింగ్ సమయంలోనే మరింత లోతుగా తెలుసుకున్నానని వెల్లడించారు. ఛఠ్ పూజలో మహిళలు పాటించే కఠినమైన నియమాల గురించి కూడా తమన్నా ప్రస్తావించారు. దాదాపు 36 గంటల పాటు నీళ్లు కూడా తీసుకోకుండా ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలో పాల్గొంటారని ఆమె తెలిపారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/thamanna-new.jpg</image:loc><image:caption><![CDATA[ బిహారీ సంస్కృతిలో ఛఠ్ పూజకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉందని, సాధారణంగా మనం ఉదయించే సూర్యుడికి పూజలు చేస్తామని.. అయితే ఛఠ్ పూజలో అస్తమించే సూర్యుడికి కూడా సమానమైన ప్రాధాన్యత ఇవ్వడం తనను ఎంతగానో ఆకట్టుకుందని తమన్నా పేర్కొన్నారు. ఛఠ్ పూజ పాట షూటింగ్ సమయంలో తనకు ఒక ప్రత్యేకమైన అనుభూతి కలిగిందని తమన్నా చెప్పారు. షూటింగ్ సమయంలో తనలో ఏదో తెలియని అతీతమైన శక్తి ప్రవేశించినట్టుగా, ఒక దివ్యమైన భావోద్వేగాన్ని అనుభవించానని తమన్నా చెప్పుకొచ్చారు.  ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/shruti-haasans-statement-that-men-should-also-have-periods-is-goes-viral-1914565.html</loc><lastmod>2026-09-18T22:18:36+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sruthi-haasan-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sruthi Haasan ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sruthi-haasan.jpg</image:loc><image:caption><![CDATA[  సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు శ్రుతి హాసన్. విలక్షణ నటుడు కమల్ హాసన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె.. నటిగా మాత్రమే కాకుండా సింగర్‌గానూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. అయితే తాజాగా శ్రుతి హాసన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని బయటకు చెప్పడానికి తాను పడిన ఇబ్బందుల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sruthi-haasan-latest.jpg</image:loc><image:caption><![CDATA[ నటి సోహా అలీ ఖాన్ నిర్వహిస్తున్న ‘ఆల్ అబౌట్ హర్’ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న శ్రుతి హాసన్.. తన వ్యక్తిగత అనుభవాలను ఓపెన్‌గా పంచుకుంది. తనకు PCOS సమస్య ఉండటంతో పీరియడ్స్ సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవని తెలిపింది. చిన్నప్పటి నుంచే పీరియడ్స్ తనకు చాలా బాధాకరంగా ఉండేవని చెప్పిన శ్రుతి.. కొన్ని సందర్భాల్లో విపరీతమైన నొప్పితో పాటు వాంతులు చేసుకోవడం, స్పృహ కోల్పోవడం వంటి పరిస్థితులు కూడా ఎదురయ్యాయని తెలిపింది. కొన్నిసార్లు పరిస్థితి తీవ్రంగా మారడంతో ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చేదని తన అనుభవాలను వివరించింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sruthi-haasan-latest-pics.jpg</image:loc><image:caption><![CDATA[  సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఈ సమస్య తనకు మరింత ఇబ్బందికరంగా మారిందని శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది. ముఖ్యంగా షూటింగ్ సమయంలో యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనేటప్పుడు కడుపునొప్పి తీవ్రంగా ఉన్నప్పటికీ.. ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేక చాలా ఇబ్బంది పడేదానినని తెలిపింది. తనకు ఏదైనా సమస్య ఉందని చెప్పడం కంటే.. దాన్ని దాచుకోవడమే మంచిదని అప్పట్లో భావించేదానినని చెప్పింది. అయితే అలా తన సమస్యను దాచుకోవడం వల్ల తాను ఎందుకు డల్‌గా, ఎనర్జీ లేకుండా కనిపిస్తున్నాననే విషయం చుట్టుపక్కల వారికి అర్థం కాకపోయేదని పేర్కొంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sruthi-haasan-new.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ఒకసారి తనతో కలిసి పనిచేస్తున్న ఓ ఆర్టిస్ట్‌కు సర్జరీ జరగడంతో అతని పరిస్థితిని మేకర్స్‌కు వివరించగా.. వారు అతనికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారని శ్రుతి తెలిపింది. అంతేకాదు, అతనికి ఇబ్బంది కలగకుండా షూటింగ్ సమయాలను సైతం మార్చారని చెప్పింది. ఆ సంఘటనను చూసిన తర్వాత తాను కూడా తన సమస్యను మేకర్స్‌కు చెబితే వారు అర్థం చేసుకుంటారనే నమ్మకం కలిగిందని తెలిపింది. ఆ తర్వాత ఓ దర్శకుడికి తన పీరియడ్స్ సమస్య గురించి చెప్పానని, ఆయన ఎంతో సానుకూలంగా స్పందించారని చెప్పుకొచ్చింది. ఆ దర్శకుడికి కూడా కుమార్తె ఉండటంతో తనకు మరింత ధైర్యం వచ్చిందని వెల్లడించింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sruthi-haasan-pic.jpg</image:loc><image:caption><![CDATA[ అప్పటి నుంచి తన సమస్యను దాచుకోకుండా అవసరమైనప్పుడు ఓపెన్‌గా చెప్పడం ప్రారంభించానని శ్రుతి హాసన్ పేర్కొంది. ఇదే సందర్భంలో శ్రుతి హాసన్ మగవాళ్లపై సరదాగా సెటైరికల్ కామెంట్ చేసింది. మగవాళ్లకు కూడా పీరియడ్స్ వస్తే బాగుంటుందని ఆమె వ్యాఖ్యానించింది. అలా జరిగితే హీరోయిన్లతో కుదుర్చుకునే కాంట్రాక్టుల్లో పీరియడ్స్ విషయాన్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించి.. వారికి హాలిడేస్ ఇచ్చేవారేమో అంటూ సరదాగా చెప్పింది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/soft-rava-laddu-recipe-perfect-measurements-for-melt-in-mouth-laddus-that-stay-fresh-for-a-month-1914558.html</loc><lastmod>2026-09-18T22:09:21+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ravva-laddu.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ravva Laddu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ravva-laddu-1.jpg</image:loc><image:caption><![CDATA[ Ravva Laddu 1 ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ravva-laddu-2.jpg</image:loc><image:caption><![CDATA[ రవ్వ లడ్డుకు కావలసిన పదార్థాలు:  మూడు కప్పుల బొంబాయి రవ్వ,  ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 10 బాదం పప్పు, 10 కిస్మిస్, రెండు కప్పుల పంచదార , మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి, కప్పున్నర పాలు, మూడు టేబుల్ స్పూన్లు నూనెను తీసుకోవాలి. చివర్లో  డ్రై ఫ్రూట్స్ ను కలపాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ravva-laddu-3.jpg</image:loc><image:caption><![CDATA[ నోరూరించే రవ్వ లడ్డూలను సులభమైన పద్ధతిలో ఎలా తయారు చేయాలో వివరించారు. ఈ సంప్రదాయ వంటకం ముఖ్యంగా పండుగలు, వేడుకలలో ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ రెసిపీలో పచ్చి కొబ్బరి చక్కెర పాకం ప్రధాన పదార్థాలుగా ఉంటాయి, ఇవి లడ్డూలకు ప్రత్యేకమైన రుచిని, మృదుత్వాన్ని అందిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ravva-laddu-4.jpg</image:loc><image:caption><![CDATA[ మళ్ళీ కొత్త పాన్ తీసుకుని దానిలో నెయ్యి వేసి బొంబాయి రవ్వను కూడా వేసి, మంచి వచ్చే వరకు మీడియం మంటపై ఉంచి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత వీటిని ఒక ప్లేట్ లేదా గిన్నెలోకి తీసుకోవాలి. ఇక ఆ తర్వాత పాకం కూడా మీరు ముందే  రెడీ చేసుకోవాలి. ఇక దీనిలో వేయించిన పంచదార కూడా వేసి బాగా కలపాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ravva-laddu-5.jpg</image:loc><image:caption><![CDATA[ పక్కా కొలతలతో తయారు చేస్తే ఈ రవ్వ లడ్డూలు నోట్లో వెన్నలా కరిగిపోతాయి. వీటి ప్రత్యేకత కేవలం రుచిలో మాత్రమే కాదు, నిల్వ సామర్థ్యంలో కూడా ఉంది. సరైన పద్ధతిలో తయారు చేసిన ఈ లడ్డూలు నెల రోజుల పాటు తాజాగా, సుతిమెత్తగా ఉంటాయి, పాడైపోకుండా నిల్వ ఉంటాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/drumstick-tomato-curry-benefits-healthy-moringa-recipe-perfect-with-roti-and-chapati-1914512.html</loc><lastmod>2026-09-18T21:06:36+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/mulakkaya-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Mulakkaya 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/mula.jpg</image:loc><image:caption><![CDATA[ మొదటగా, ఉల్లిగడ్డలను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఎర్రటి, గట్టి టమాటాలను కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. మునక్కాయలను మరీ పొడవుగా కాకుండా చిన్న ముక్కలుగా కోయడం ముఖ్యం. ఇది ఉప్పు బాగా పట్టడానికి, రుచి మెరుగుపడటానికి సహాయపడుతుంది. మునక్కాయ పై తొడిమను శుభ్రంగా తీసేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/mulakkaya.jpg</image:loc><image:caption><![CDATA[ ఒక వెడల్పాటి గిన్నెలో సరిపడా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కగానే, ఎండుమిర్చి, రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు వేయాలి. శనగపప్పు మంచి రుచిని ఇస్తుంది. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూను ఆవాలు, ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసి చిటపటలాడే వరకు వేయించాలి. చివరగా కరివేపాకు వేసి తాళింపు సిద్ధం చేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/mulakkaya-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిగడ్డలను వేసి, అవి రంగు మారే వరకు మెత్తబడే వరకు తక్కువ మంటపై వేయించాలి. ఉల్లిగడ్డలు కూరకు మంచి రుచిని అందిస్తాయి. ఉల్లిగడ్డలు వేగిన తర్వాత, కోసి ఉంచుకున్న మునక్కాయ ముక్కలను వేసి, నూనెలో ఐదు నిమిషాల పాటు మగ్గించాలి. మునక్కాయలు పూర్తిగా ఉడకకుండా, కేవలం వాటి పచ్చిదనం పోయేలా చూసుకోవాలి. మంటను తక్కువగా ఉంచాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/mulakkaya-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిగడ్డలను వేసి, అవి రంగు మారే వరకు మెత్తబడే వరకు తక్కువ మంటపై వేయించాలి. ఉల్లిగడ్డలు కూరకు మంచి రుచిని అందిస్తాయి. ఉల్లిగడ్డలు వేగిన తర్వాత, కోసి ఉంచుకున్న మునక్కాయ ముక్కలను వేసి, నూనెలో ఐదు నిమిషాల పాటు మగ్గించాలి. మునక్కాయలు పూర్తిగా ఉడకకుండా, కేవలం వాటి పచ్చిదనం పోయేలా చూసుకోవాలి. మంటను తక్కువగా ఉంచాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/mulakkaya-4.jpg</image:loc><image:caption><![CDATA[ టమాటాలు పూర్తిగా మగ్గిన తర్వాత, 3/4 టేబుల్ స్పూను పసుపు, ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిమిషాలు వేయించాలి, అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయే వరకు కలపాలి. ఆ తర్వాత 1.5 టేబుల్ స్పూన్ల కారం, ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఇంట్లో తయారుచేసిన ధనియాల పొడిని ఉపయోగిస్తే కూరకు మరింత రుచి వస్తుంది. మసాలాలు బాగా కలిసిన తర్వాత, కొద్దిగా నీళ్లు పోయాలి. మునక్కాయలు పూర్తిగా ఉడకడానికి ఈ నీరు సహాయపడుతుంది. ఎక్కువ నీరు పోయాల్సిన అవసరం లేదు. రెండు మూడు నిమిషాల పాటు ఉడికించి, కూర చిక్కబడి నూనె పైకి తేలే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/eating-black-cumin-discover-these-amazing-health-benefits-1914446.html</loc><lastmod>2026-09-18T19:37:11+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/kalonji-for-skin.jpg</image:loc>
					<image:title><![CDATA[ Kalonji For Skin ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/kalonji-benefit.jpg</image:loc><image:caption><![CDATA[ ఆయుర్వేదంలో, నిత్య వంటకాలలో కలోంజీ లేదా నల్ల జీలకర్ర కు ఎంతో ప్రాధాన్యత ఉంది. చిన్నగా, నల్లగా కనిపించే ఈ గింజల్లో శరీరానికి మేలు చేసే అనేక పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నిండి ఉన్నాయి. రోజూ పరిమిత పరిమాణంలో కలోంజీని తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉండటమే కాకుండా, చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. అలాగే, రోగనిరోధక శక్తిని పెంచడంలో, జుట్టు రాలడం తగ్గించడంలో, జీర్ణక్రియను వేగవంతం చేయడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కలోంజీ వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలను వివరంగా తెలుసుకుందాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/nigella-sativa.jpg</image:loc><image:caption><![CDATA[ డయాబెటిస్‌తో బాధపడేవారికి కలోంజీ అద్భుతమైన నివారణగా పనిచేస్తుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచడానికి, ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడానికి సహాయపడుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా రక్తపోటు నియంత్రణలోకి వచ్చి గుండె సంబంధిత సమస్యల ముప్పు తగ్గుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/black-seeds.jpg</image:loc><image:caption><![CDATA[ ఇందులో ఉండే థైమోక్వినోన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇది వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, వైరస్‌ల నుండి శరీరాన్ని కాపాడుతుంది. కలోంజీ తీసుకోవడం వల్ల కడుపులో ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణక్రియ సులభతరం కావడానికి ఇది తోడ్పడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/eating-black-cumin.jpg</image:loc><image:caption><![CDATA[ కలోంజీ నూనెను జుట్టుకు రాయడం వల్ల కుదుళ్లు బలంగా మారి జుట్టు రాలడం తగ్గుతుంది. అలాగే చర్మంపై ఉండే మచ్చలు, మొటిమలు తగ్గించడంలో, చర్మానికి సహజమైన కాంతిని ఇవ్వడంలో ఇది సహాయపడుతుంది. శరీరంలోని జీవక్రియలను వేగవంతం చేసి, అనవసరమైన కొవ్వును కరిగించడంలో కలోంజీ సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/kalonji.jpg</image:loc><image:caption><![CDATA[ ఎలా ఉపయోగించాలి?: రోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు కలోంజీ పొడి లేదా కొన్ని గింజలు వేసి తాగడం వల్ల లేదా పరగడుపున అర టీస్పూన్ కలోంజీ నూనెను తేనెతో కలిపి తీసుకోవడం వల్ల ఈ ఆరోగ్య ప్రయోజనాలన్నీ పొందవచ్చు. అయితే, ఏదైనా కొత్త ఆహార అలవాటును ప్రారంభించే ముందు పరిమాణం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/poornam-boorelu-recipe-easy-traditional-andhra-sweet-recipe-with-perfect-texture-1914400.html</loc><lastmod>2026-09-19T16:58:38+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/poornam-boorelu.jpg</image:loc>
					<image:title><![CDATA[ Poornam Boorelu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/poornam-boorelu-1.jpg</image:loc><image:caption><![CDATA[ పూర్ణం బూరెల పై పొర పర్ఫెక్ట్‌గా రావడానికి పిండి తయారీ చాలా కీలకం. ముందుగా, ఒక కప్పు బియ్యం (రేషన్ బియ్యం లేదా సాధారణ బియ్యం) ముప్పావు కప్పు మినపగుళ్ళు తీసుకోవాలి. వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి, కనీసం నాలుగైదు గంటలు నానబెట్టాలి. రాత్రి నానబెట్టి ఉదయం చేసుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/poornam-boorelu-2.jpg</image:loc><image:caption><![CDATA[ నానిన పప్పు, బియ్యాన్ని విడివిడిగా రుబ్బుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలు వస్తాయి. మినపపప్పును నీళ్లు వంపేసి, కొద్దికొద్దిగా నీరు చేరుస్తూ మెత్తగా, కాటుకలా గ్రైండ్ చేసుకోవాలి. పప్పు ఎంత మెత్తగా ఉంటే అంత ఉదుగ్గా వస్తుంది. బియ్యాన్ని మాత్రం మరీ మెత్తగా కాకుండా, కాస్త రవ్వ రవ్వలా (బరకగా) రుబ్బాలి. ఇది బయటి పొర కరకరలాడటానికి సహాయపడుతుంది. రుబ్బిన బియ్యప్పిండి, మినప్పప్పు పిండిని ఒక గిన్నెలో కలిపి, రెండు టీస్పూన్ల చక్కెర, చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/poornam-boorelu-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ చక్కెర బూరెలకు మంచి రంగును ఇస్తుంది. ఈ పిండిని పూర్ణం తయారుచేసే వరకు పక్కన పెట్టాలి. పిండి కాస్త గట్టిగా అనిపిస్తే వేయించే ముందు కొద్దిగా నీళ్లు చేర్చవచ్చు. వంట సోడా వేయడం (వెంటనే చేసేట్లయితే) బూరెలు కరకరలాడేలా చేస్తుంది.
పూర్ణం బూరెలకు రుచిని ఇచ్చేది లోపలి పూర్ణమే. ఒక కప్పు పచ్చిశనగపప్పును శుభ్రంగా కడిగి, ఒకటి రెండు గంటలు నానబెట్టాలి. నానిన పప్పులోని నీరు వంపేసి, కుక్కర్‌లో తీసుకోవాలి. ఏ కప్పుతో పప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు నీళ్లు, ఒక టీస్పూన్ నెయ్యి కలిపి మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. నెయ్యి వేయడం వల్ల పప్పు పొంగిపోకుండా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/poornam-boorelu-4.jpg</image:loc><image:caption><![CDATA[ పప్పు మెత్తగా ఉడికిన తర్వాత, అందులో అదనపు నీరు లేకుండా చూసి, మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఒక కప్పు బెల్లం, ఒకటి రెండు టీస్పూన్ల నీళ్లు లేదా నెయ్యి వేసి, తక్కువ మంటపై బెల్లం కరిగే వరకు ఉడికించాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత, గ్రైండ్ చేసుకున్న పచ్చిశనగపప్పు పేస్ట్‌ను చేర్చి, బాగా కలిపి, మీడియం మంటపై మూడు నాలుగు నిమిషాలు ఉడికించాలి. పూర్ణం పాన్‌కు అంటుకోకుండా విడివడుతుందంటే అది సరైన పాకానికి వచ్చినట్లు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/poornam-boorelu-6.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ దశలో, అర టీస్పూన్ యాలకుల పొడి, ఒక టీస్పూన్ సోంపు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలిపి, మరో రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. పూర్ణం చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. పూర్ణం పలుచబడినట్లయితే, రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వను దోరగా వేయించి పూర్ణంలో కలిపితే ఐదు నిమిషాల్లో గట్టిపడుతుంది. మిగిలిన పూర్ణాన్ని ఫ్రిజ్‌లో ఐదు ఆరు రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/juicy-rava-sweet-recipe-easy-suji-gulab-jamun-style-sweet-for-festivals-1914423.html</loc><lastmod>2026-09-18T18:26:22+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/suji-gulab-jamun-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Suji Gulab Jamun (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/suji-gulab-jamun-1.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు: అర కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు పాలు, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, 1 కప్పు పంచదార, 1 కప్పు నీళ్లు, 3 యాలకులు, 1 టీస్పూన్ నెయ్యి,  ఒక్క చిటికెడు బేకింగ్ సోడా, డీప్ ఫ్రైకి సరిపడా నూనె ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/suji-gulab-jamun-2.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్‌లో అర కప్పు బొంబాయి రవ్వ, ఒక యాలక్కాయ వేసి 2 నిమిషాలు కాస్త రవ్వ రవ్వగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్‌లో ఒక కప్పు పాలు పోసి ఒక పొంగు రానివ్వాలి. పాలు పొంగిన తర్వాత లో ఫ్లేమ్‌లో ఉంచి, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసి కలపాలి. ఆపై గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వను వేస్తూ ఉండలు కట్టకుండా గరిటెతో మ్యాష్ చేస్తూ కలపాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/suji-gulab-jamun-3.jpg</image:loc><image:caption><![CDATA[ రవ్వ పాలన్నింటినీ పీల్చుకుని ముద్దలా పాన్‌ను వదిలే సమయంలో ఒక టీస్పూన్ నెయ్యి వేసి కలిపి, స్టవ్ ఆఫ్ చేసి గోరువెచ్చగా అయ్యే వరకు మూతపెట్టి పక్కన ఉంచాలి. మరొక గిన్నెలో ఒక కప్పు పంచదార, ఒక కప్పు నీళ్లు పోసి పంచదార కరిగే వరకు మరిగించాలి. ఇందులో దంచిన రెండు యాలకులు వేయాలి. తీగ పాకం అవసరం లేదు; గులాబ్ జామున్ పాకంలా చేత్తో తాకితే కాస్త జిగురుగా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ కట్టేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/suji-gulab-jamun-4.jpg</image:loc><image:caption><![CDATA[ గోరువెచ్చగా ఉన్న రవ్వ ముద్దలో ఒక్క చిటికెడు వంట సోడా వేసి, చేతితో 5 నిమిషాల పాటు బాగా ఒత్తుతూ సాఫ్ట్ పిండిలా మర్దన చేయాలి. ఆ తర్వాత ఏమాత్రం పగుళ్లు  లేకుండా చిన్న చిన్న బాల్స్ లాగా లేదా అందమైన సిలిండ్రికల్ బుల్లెట్ షేప్‌లో చుట్టుకోవాలి. బాండీలో నూనెను మీడియం వేడిలో ఉంచాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/suji-gulab-jamun-5.jpg</image:loc><image:caption><![CDATA[ తయారుచేసిన బుల్లెట్లను నూనెలో వేసి, వెంటనే కదపకుండా పైకి తేలిన తర్వాత అన్ని వైపులా ఎర్రగా వేయించి తీసుకోవాలి. ఇలా వేయించిన వెంటనే గోరువెచ్చని పంచదార పాకంలో వేసి కలపాలి. ఒక గంట పాటు పాకంలో నాననిస్తే రవ్వ స్వీట్లు పాకాన్ని పూర్తిగా పీల్చుకుని జ్యూసీగా తయారవుతాయి. అంతే, ఇంట్లోని పదార్థాలతోనే ఎంతో రుచికరమైన జ్యూసీ రవ్వ స్వీట్ సిద్ధం! పండుగల వేళ ఇంటికి వచ్చే బంధువులకు వడ్డిస్తే లొట్టలేసుకుంటూ తింటారు! ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/protein-rich-pappula-podi-recipe-tasty-dal-powder-for-rice-and-tiffins-1914406.html</loc><lastmod>2026-09-18T18:03:19+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pappula-podi-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Pappula Podi (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pappula-podi-1.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు: 200 గ్రాముల కప్పు కందిపప్పు, 200 గ్రాముల పెసరపప్పు, 100 గ్రాముల పుట్నాల పప్పు, 25 గ్రాముల ఎండుమిరపకాయల ముక్కలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 గుప్పెడు కరివేపాకు, 30 నుండి 40 - కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్ల నూనె, 1 టీస్పూన్ ఇంగువ, 2 టేబుల్ స్పూన్లు డ్రై మ్యాంగో పౌడర్ (ఐచ్ఛికం), రుచికి సరిపడా ఉప్పు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pappula-podi-2.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానం: స్టవ్ వెలిగించి పాన్‌లో కందిపప్పును లో-మీడియం మంటపై ఎర్రగా, కమ్మటి సువాసన వచ్చేలా మాడకుండా వేయించి పక్కన ఉంచాలి. ఆ తర్వాత పెసరపప్పును కూడా దోరగా వేయించి తీసుకోవాలి. అనంతరం పుట్నాల పప్పును కేవలం 2 నిమిషాలు లైట్‌గా వేపి తీయాలి. అన్ని పప్పులను కలిపి కాకుండా విడివిడిగా వేయిస్తేనే సమంగా వేగుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pappula-podi-3.jpg</image:loc><image:caption><![CDATA[ పాన్‌లో తుంచిన ఎండుమిర్చిని లో ఫ్లేమ్‌లో వేయించి తీయాలి. ఆపై జీలకర్రను మంచి వాసన వచ్చే వరకు వేపాలి. తర్వాత కరివేపాకును నూనె లేకుండా బాగా క్రిస్పీగా అయ్యేవరకు వేయించి వేరే గిన్నెలోకి తీసుకోవాలి. చివరగా పాన్‌లో రెండు స్పూన్ల నూనె వేసి, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలను ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pappula-podi-4.jpg</image:loc><image:caption><![CDATA[ పప్పులు, దినుసులు పూర్తిగా చల్లారిన తర్వాత.. మిక్సీ జార్‌లో ఎండుమిర్చి, జీలకర్ర, ఇంగువ, ఉప్పు వేసి ముందుగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత వేయించిన పప్పులను ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా వేస్తూ బరకగా రుబ్బుకోవాలి. చివరగా వేయించిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మరోసారి పల్స్ చేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pappula-podi-5.jpg</image:loc><image:caption><![CDATA[ గ్రైండ్ చేసిన పొడిని ప్లేట్‌లోకి తీసుకుని, వేయించి పెట్టుకున్న క్రిస్పీ కరివేపాకును చేత్తో నలిపి పొడిలో కలపాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల ఆమ్‌చూర్ పౌడర్ వేసి సమంగా కలపాలి. పొడి వేడి పూర్తిగా తగ్గిన తర్వాత గాలి చొరబడని గాజు సీసాలో నిల్వ చేసుకుంటే ఎన్నో రోజుల పాటు తాజాగా ఉంటుంది. అన్నంలోకి, ఇడ్లీ, దోశల్లోకి అద్భుతమైన రుచినిచ్చే ఈ ప్రొటీన్ రిచ్ పప్పుల పొడిని తప్పకుండా ప్రయత్నించండి! ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/moon-saturn-transit-2-zodiac-signs-may-face-challenges-during-moon-saturn-movement-1914382.html</loc><lastmod>2026-09-18T17:46:50+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/moon.jpg</image:loc>
					<image:title><![CDATA[ Moon ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/astro-4-3.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే గ్రహాలు , రాశులు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటూనే ఉంటాయి. అయితే, కొన్ని సార్లు బాగా కలిసి వస్తుంది, మరికొన్ని సార్లు అస్సలు కలిసి రాదు. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/astro-18.jpg</image:loc><image:caption><![CDATA[ గ్రహాలు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండవు ఇంకా ఇవి ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్తాయి. అయితే, మరి కొద్దీ రోజుల్లో  చంద్రుడు వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశిలోకి సంచారం చేయనున్నాడు.ఇక ఈ సమయంలో ధనుస్సు రాశిలో ఉన్న చంద్రుడిపై శని దేవుడి దృష్టి పడనుంది. అదే విధంగా రెండు రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/vrushbha-rashi-2.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభ రాశి : ఈ రాశి వారు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు. ఇంకా  వీరికి  ధన నష్టం, అలాగే ఊహించని ఖర్చులు కూడా ఎదురవుతాయి. దీని వలన షేర్ మార్కెట్ వారికీ కూడా కష్టాలు వస్తాయి. అలాగే,  పై అధికారులతో ఇంకా మీ  సీనియర్లతో వాదనలకు దిగకుండా మీరు బాధ్యతగా ఉండాలి. అలాగే, మీ ప్రతికూలతలు మీ నుంచి దూరమవ్వాలంటే హనుమాన్ చాలీసా చదవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/tula-rashi-5.jpg</image:loc><image:caption><![CDATA[ తులా రాశి : చంద్రుడు, శని గ్రహాల వలన వీరికి ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అలాగే, ఇంకా మీరు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకపోవడమే  మంచిది. అలాగే, మీ ఆఫీసులో అనవసర వాదనలకు దూరంగా ఉండాలి. అలాగే, మానసిక ఒత్తిడికి లోనుకాకుండా చూసుకోండి. మీ మనసు మంచిగా ఉండటానికి మంత్రాలను కూడా జపించాలని చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/astro-1-14.jpg</image:loc><image:caption><![CDATA[ Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/andhra-pradesh-and-telangana-weather-report-imd-forecasts-bay-of-bengal-low-pressure-heavy-rains-for-3-days-1914183.html</loc><lastmod>2026-09-18T17:30:02+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/telangana-andhra-latest-weather-report.jpg</image:loc>
					<image:title><![CDATA[ Telangana, Andhra Latest Weather Report ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/andhra-latest-weather-report-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఉత్తర థాయిలాండ్ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో కొనసాగుతూ, సగటు  సముద్ర మట్టానికి 9.4 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని.. ఇది సాయంత్రానికి ఉత్తర అండమాన్ సముద్రం వైపు కదిలే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో  సెప్టెంబర్ 19,వ తేది  సాయంత్రం నాటికి అదే ప్రాంతంలో అల్పపీడనంగా ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత, ఇది క్రమంగా బలపడి, తదుపరి 3-4 రోజులలో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా - ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు పయనించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/andhra-latest-weather-report-4.jpg</image:loc><image:caption><![CDATA[ అలాగే ఉత్తర అంతర్గత తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న  ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోందని.. మరాఠ్వాడా, దాని పరిసర ప్రాంతాల నుండి అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న అల్పపీడన ద్రోణి ఈరోజు బలహీనపడిందని తెలిపింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/andhra-latest-weather-report-3.jpg</image:loc><image:caption><![CDATA[ వీటి ఫలితంగా రాష్ట్రంలోని కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో సెప్టెంబర్ 18, 19 తేదీల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని.. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల  కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక 20వ తేదీన ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని.. అలాగే గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/andhra-latest-weather-report-1.jpg</image:loc><image:caption><![CDATA[ అలాగే రాయలసీమలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల  కురిసే అవకాశముందని.. శని, ఆదివారాల్లో ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే ఛాన్స్ ఉందని.. అలాగే వర్షాల సమయంలో గంటలకు 40 -50 కిలోమీటర్ల వేగముతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/andhra-latest-weather-report.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక ఈ అల్పపీడన ప్రభావం తెలంగాణపై కూడా ఉందని.. దీని ప్రభావంతో అటు ఉత్తర, దక్షిణ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవాకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/quick-2-minute-maggi-masala-fried-rice-recipe-for-kids-lunch-box-1914371.html</loc><lastmod>2026-09-18T17:01:36+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/maggi-masala-fried-rice-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Maggi Masala Fried Rice (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/maggi-masala-fried-rice-1.jpg</image:loc><image:caption><![CDATA[ ముఖ్యంగా పిల్లలకు ఎంతగానో ఇష్టమైన &#039;మ్యాగీ మసాలా-ఏ-మ్యాజిక్&#039; ప్యాకెట్‌తో ఈ అన్నం చేస్తే ఆ సువాసనకే పిల్లలు లంచ్ బాక్స్‌ను ఒక్క మెతుకు కూడా వదలకుండా ఖాళీ చేసి తీసుకొస్తారు.  ఈ క్విక్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రైస్ తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/maggi-masala-fried-rice-2.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు: బాస్మతి లేదా సోనా మసూరి ఉడికించిన అన్నం, 2 స్పూన్ల నూనె, 1 - సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 3 - చీలికల పచ్చిమిర్చి, 1 - సన్నని క్యారెట్ తరుగు, కొద్దిగా కరివేపాకు, 2 మధ్యస్థ సైజు టమోటా సన్నని ముక్కలు, 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీస్పూన్ ఉప్పు, అర టీస్పూన్ కారం పొడి, పావు టీస్పూన్ కంటే తక్కువ పసుపు, 2 ప్యాకెట్ల మ్యాగీ మసాలా, తాజా కొత్తిమీర తరుగు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/maggi-masala-fried-rice-3.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానం:  స్టవ్ వెలిగించి బాండీ లేదా వెడల్పాటి కడాయి పెట్టి రెండు స్పూన్ల నూనె వేడిచేయాలి. నూనె వేడెక్కగానే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, క్యారెట్ తరుగు మరియు కొద్దిగా కరివేపాకు వేయాలి. మంటను హై ఫ్లేమ్‌లో ఉంచి కేవలం అర నిమిషం పాటు వేగంగా టాస్ చేస్తూ వేయించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/maggi-masala-fried-rice-4.jpg</image:loc><image:caption><![CDATA[ అందులోనే సన్నగా తరిగిన రెండు టమోటా ముక్కలు వేసి మరో అర నిమిషం హై ఫ్లేమ్‌పై కలపాలి. ఆ తర్వాత ఒక టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా 10 సెకన్ల పాటు వేగంగా వేయించాలి.  ఇందులో అర టీస్పూన్ ఉప్పు, అర టీస్పూన్ కారం, చిటికెడు పసుపు వేయాలి. ఆ వెంటనే ప్రధాన పదార్థమైన 2 ప్యాకెట్ల మ్యాగీ మసాలా-ఏ-మ్యాజిక్ పొడిని చల్లాలి. ఇప్పటికే ఉప్పు ఉంటుంది కాబట్టి అదనపు ఉప్పును కాస్త జాగ్రత్తగా చూసుకుని వేయాలి. ఈ మసాలాలన్నీ నూనెలో బాగా కలిసేలా ఒక్కసారి తిప్పాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/maggi-masala-fried-rice-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు పొడిపొడిగా ఉడికించిన రైస్‌ను మసాలాకు సరిపడా వేసి, మంట హై ఫ్లేమ్‌లోనే ఉంచి మసాలా అంతా అన్నం మెతుకులకు పట్టేలా 10 నుండి 15 సెకన్ల పాటు వేగంగా కలపాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ఘుమఘుమలాడే 2-మినిట్ మ్యాగీ మసాలా రైస్ సిద్ధం! దీనికి ఎలాంటి సైడ్ డిష్ లేదా రైతా అవసరం లేదు, పిల్లలు నేరుగా ఇలాగే ఎంతో ఇష్టంగా తినేస్తారు! ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/baking-soda-for-plants-how-to-use-kitchen-soda-neem-oil-and-soap-spray-for-pests-and-heavy-flowering-1914350.html</loc><lastmod>2026-09-18T16:30:29+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/flower-plants-7-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Flower Plants (7) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/flower-plants-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ చాలామంది పువ్వులు ఎక్కువగా రావాలని అతిగా నైట్రోజన్, పొటాషియం ఎరువులు వేస్తుంటారు. కానీ అధిక మోతాదులో ఎరువులు వేయడం, అవసరానికి మించి నీళ్లు పోయడం
వల్ల వేర్లు కుళ్ళిపోవడమే కాకుండా.. ఆకుల అడుగున కంటికి కనిపించని సూక్ష్మ పురుగులు, పేనుబంక, పిండినల్లి ఆశించి మొక్క ఎదుగుదలను దెబ్బతీస్తాయి. ఈ తెగుళ్లన్నింటినీ అరికట్టి మొక్కలు తిరిగి నర్సరీలా గుత్తులు గుత్తులుగా పూలు పూయడానికి మన వంటింట్లోని &#039;వంట సోడా&#039; ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఈ ఆర్గానిక్ స్ప్రే తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/flower-plants-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు-కొలతలు: 2 లీటర్ల నీళ్లు, లీటరుకు 1 స్పూన్ చొప్పున 2 చెంచాల వంట సోడా,  లీటరుకు 5 ml చొప్పున 10 ml వేప నూనె-ఒకవేళ వేపనూనె లేకపోతే సాధారణ వంట నూనె కూడా వాడుకోవచ్చు, నీటిలో నూనె సమంగా కరగడానికి 5 చుక్కల హ్యాండ్ వాష్ / షాంపూ / సర్ఫ్. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/flower-plants-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ రెండు లీటర్ల వాటర్ స్ప్రేయర్ బాటిల్‌లో మంచి నీటిని తీసుకోవాలి. అందులో రెండు స్పూన్ల వంట సోడా వేయాలి. ఆ తర్వాత 10 ml వేప నూనె మరియు 5 చుక్కల హ్యాండ్ వాష్ లేదా షాంపూ వేయాలి. వేప నూనె నీటితో సమంగా కలవడానికి ఈ లిక్విడ్ సోప్ ఎంతో ముఖ్యం. మూత గట్టిగా పెట్టి బాటిల్‌ను ఒకటికి రెండుసార్లు బాగా షేక్ చేసి కలపాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/flower-plants-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ వర్షాకాలం, చలికాలంలో ఉదయం 7 గంటల తర్వాత లేత ఎండ ఉన్న సమయంలో మాత్రమే స్ప్రే చేయాలి. సాయంత్రం వేళల్లో మంచు పడుతున్నప్పుడు స్ప్రే చేస్తే ద్రావణం సరిగ్గా పనిచేయదు. సహజంగా వర్షం పడినప్పుడు మొక్క ఎలా తడుస్తుందో.. అలాగే ఆకుల అడుగుభాగంలో, కాండం వద్ద, మొగ్గలపై మొక్క మొత్తం తడిసేలా స్ప్రే చేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/flower-plants-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ మొక్కలకు ఆకు ముడత, తెల్ల పిండినల్లి తీవ్రంగా ఉంటే ప్రతి 4 రోజులకు ఒకసారి స్ప్రే చేయాలి. సాధారణ నివారణ కోసం అయితే 15 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తే సరిపోతుంది. స్ప్రే చేసిన తర్వాత ఒకటి రెండు రోజులు పాత ఆకులు రాలిపోయినా కంగారు పడాల్సిన పనిలేదు; వెంటనే కొత్త చిగుళ్లు, బలిష్టమైన మొగ్గలు రావడం మొదలవుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/flower-plants-6-1.jpg</image:loc><image:caption><![CDATA[ అదనపు సంరక్షణ జాగ్రత్తలు: మొక్కకు రోజుకు 6 నుండి 8 గంటల పాటు తప్పనిసరిగా సూర్యరశ్మి తగలాలి. అలాగే కుండీలోని పై మట్టి డ్రై అయినప్పుడు మాత్రమే నీరు పోయాలి. ఎక్కువ తేమ ఉంటే వేర్లు పాడైపోతాయి. ఈ సహజసిద్ధమైన వంట సోడా స్ప్రేను పూల మొక్కలకే కాకుండా కూరగాయలు, పండ్ల మొక్కలకు కూడా నిరభ్యంతరంగా వాడుకోవచ్చు! ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/usirikaya-nilva-pachadi-recipe-amla-pickle-with-avakaya-style-taste-that-stays-fresh-longer-1914331.html</loc><lastmod>2026-09-18T16:13:37+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/usirikaya-11.jpg</image:loc>
					<image:title><![CDATA[ Usirikaya ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/usirikaya-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ పచ్చడి కోసం అర కేజీ ఉసిరికాయలు తీసుకోవాలి. మీరు తక్కువ, ఎక్కువ క్వాంటిటీ మీరు కావాలనుకుంటే కొలతలను అనుగుణంగా మార్చుకోవచ్చు. ఇంకా మీడియం సైజులో ఉండే, దెబ్బలు లేని, కుళ్ళిపోని, గాట్లు లేని ఉసిరికాయలను ఎంచుకోవడం ముఖ్యం. అలాగే ఉసిరికాయలను శుభ్రంగా కడిగి, కొంచం కూడా తడి లేకుండా పొడి వస్త్రంతో తుడిచి ఆరబెట్టాలి. తడి ఉంటే పచ్చడి త్వరగా పాడవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/usirikaya-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్ళు పోసి మరగనివ్వాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు, దానిపై చిల్లుల గిన్నె లేదా ప్లేటు పెట్టి, అందులో ఉసిరికాయలను వేయాలి. మీడియం ఫ్లేమ్‌లో 10 నుండి 15 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి. ఉడికిన ఉసిరికాయలను పక్కకు తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన ఉసిరికాయలను చేత్తో సులభంగా ముక్కలుగా విడదీయవచ్చు. కత్తి అవసరం ఉండదు. అన్ని ముక్కలను వేరు చేసిన తర్వాత, వాటిని ఒక ప్లేట్‌లో పరుచుకుని, ఫ్యాన్ కింద లేదా ఎండలో ఒక గంటపాటు ఆరబెట్టాలి. ఒక రోజంతా ఎండబెడితే పచ్చడి నిల్వ కాలం ఇంకా పెరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/usirikaya-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ లోపు, ఒక పాన్‌లో ఒక టేబుల్‌స్పూన్ ఆవాలు మరియు అర టేబుల్‌స్పూన్ మెంతులు వేసి దోరగా, సన్నటి సెగ మీద వేయించాలి. రంగు మారకుండా చూసుకోవాలి. వేగిన తర్వాత చల్లార్చి, మిక్సీ జార్‌లో వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
అదే పాన్‌లో ఒక కప్పు వేరుశనగలు ఇంకా నువ్వుల నూనె వేసి వేడి చేయాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత, ఆరబెట్టిన ఉసిరి ముక్కలను వేసి మీడియం ఫ్లేమ్‌లో కలుపుకుంటూ నిదానంగా వేయించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/usirikaya-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ ముక్కలు లేత గోధుమ రంగులోకి మారేవరకు వేయించాలి. ఇలా వేయించడం వల్ల ముక్కలు వగరు లేకుండా, మెత్తగా, ఆవకాయ రుచితో ఉంటాయి. వేయించిన ముక్కలను పచ్చడి కలపడానికి ఉపయోగించే బౌల్‌లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.
వేయించిన నూనెలోనే తాలింపు వేయాలి. ఒక టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, నాలుగైదు ఎండుమిర్చి వేసి వేయించాలి. స్టవ్ ఆపేసిన తర్వాత, రెండు రెమ్మల కరివేపాకు, అర టీస్పూన్ పసుపు, పావు టీస్పూన్ ఇంగువ, పావు కప్పు తొక్క తీసిన వెల్లుల్లిపాయలను వేసి కలపాలి. ఈ తాలింపు నూనెను పూర్తిగా చల్లారనివ్వాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/usirikaya-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ చల్లారిన ఉసిరి ముక్కలున్న బౌల్‌లోకి ఆవాలు-మెంతులు పొడి, పావు కప్పు (50 గ్రాములు) ఎండబెట్టి పొడి చేసిన కల్లుప్పు (లేదా ఉప్పు తగ్గించి సాల్ట్), 50 గ్రాములు లేదా అర కప్పు కారం వేసి బాగా కలపాలి. తర్వాత, చల్లారిన తాలింపు నూనెను వేసి మళ్ళీ కలపాలి.
పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాతే పావు కప్పు నిమ్మరసం వేసి కలపాలి. నిమ్మరసం వేడిగా ఉన్నప్పుడు వేస్తే పచ్చడి పాడవుతుంది. ఇలా కలిపిన పచ్చడిని మూత పెట్టి రెండు మూడు రోజుల పాటు ఊరనివ్వాలి. ఈ సమయంలో పులుపు, కారం ముక్కలకు పట్టి నూనె పైకి తేలుతుంది. నూనె సరిపోకపోతే కొద్దిగా వేడి చేసి చల్లార్చిన నూనెను కలుపుకోవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/lakshminarayana-yoga-mercury-venus-conjunction-to-bring-wealth-and-success-for-these-4-zodiac-signs-1914338.html</loc><lastmod>2026-09-18T16:12:33+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/mercury-venus-conjunction-lakshminarayana-yoga.jpg</image:loc>
					<image:title><![CDATA[ Mercury Venus Conjunction Lakshminarayana Yoga ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rashifal1-4.jpg</image:loc><image:caption><![CDATA[ Mercury-Venus Conjunction-Lakshminarayana Yoga Telugu: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, వాటి పరస్పర కలయికలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని జ్యోతిష్యులు చెబుతారు. ముఖ్యంగా శుభ గ్రహాలైన బుధుడు, శుక్రుడు ఒకే రాశిలో కలిసినప్పుడు లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య సంప్రదాయంలో భావిస్తారు. ఈ యోగం సంపద, వ్యాపారం, తెలివితేటలు, సౌఖ్యం వంటి అంశాలకు అనుకూల ఫలితాలను అందిస్తుందని నమ్మకం. సెప్టెంబర్ నెలాఖరులో పితృ పక్షాలు ప్రారంభమయ్యే ముందు, శుక్రుడు తన సొంత రాశి అయిన తులారాశిలోకి ప్రవేశించనున్నాడు. అప్పటికే అదే రాశిలో బుధుడు ఉండటంతో వీరిద్దరి కలయిక వల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. ఈ యోగ ప్రభావం కొన్ని రాశుల వారికి ఆర్థికంగా, వృత్తిపరంగా, కుటుంబ పరంగా అనుకూల ఫలితాలను తీసుకురావచ్చని భావిస్తారు. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఈ సమయం ప్రత్యేకంగా ఉండనుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rashifal2-4.jpg</image:loc><image:caption><![CDATA[ మిథున రాశి.. లక్ష్మీనారాయణ యోగం మిథున రాశి వారికి ఆర్థికంగా అనుకూల పరిస్థితులను తీసుకురావచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలాకాలంగా వాయిదా పడుతున్న పనులు ముందుకు సాగవచ్చు. పిల్లల చదువు లేదా పురోగతికి సంబంధించిన శుభవార్తలు కుటుంబంలో ఆనందాన్ని నింపవచ్చు. స్టాక్ మార్కెట్, మీడియా, కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rashifal3-4.jpg</image:loc><image:caption><![CDATA[ తులా రాశి.. ఈ యోగం తులారాశిలోనే ఏర్పడటం వల్ల ఈ రాశి వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని జ్యోతిష్య సంప్రదాయం చెబుతోంది. వ్యాపారులకు కొత్త అవకాశాలు, లాభాలు రావచ్చు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పరిష్కారం కావచ్చు. విదేశీ ఉద్యోగాలు, ప్రయాణాలు లేదా ప్రాజెక్టుల కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూల పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం పెరిగి కొత్త నిర్ణయాలు తీసుకునే ధైర్యం రావచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rashifal4-4.jpg</image:loc><image:caption><![CDATA[ ధనుస్సు రాశి.. ఈ యోగం వల్ల ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు, ప్రమోషన్ లేదా కెరీర్‌లో మార్పులు రావచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న యువతకు మంచి అవకాశాలు లభించవచ్చు. ఆదాయం పెరగడంతో పాటు సౌకర్యాల కోసం ఖర్చు చేసే అవకాశం కూడా ఉంటుంది. అయినప్పటికీ ఆర్థిక స్థిరత్వం మెరుగుపడవచ్చని జ్యోతిష్య అంచనాలు సూచిస్తున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rashifal5-3.jpg</image:loc><image:caption><![CDATA[ కుంభ రాశి.. కుంభ రాశి వారికి సృజనాత్మకత, కళలు, మీడియా, మార్కెటింగ్ వంటి రంగాల్లో మంచి అవకాశాలు లభించవచ్చు. తమ ప్రతిభకు గుర్తింపు రావడంతో పాటు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అదనపు లాభాలు రావచ్చు. వైవాహిక జీవితంలో భాగస్వామితో అనుబంధం మరింత బలపడే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 
(Disclaimer: ఈ కథనంలోని వివరాలు జ్యోతిష్య సంప్రదాయాలు, నమ్మకాల ఆధారంగా చెప్పబడిన ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/mars-aspect-on-venus-these-6-zodiac-signs-may-see-career-and-financial-growth-1914307.html</loc><lastmod>2026-09-18T15:53:00+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/mars-venus-astrology.jpg</image:loc>
					<image:title><![CDATA[ Mars Venus Astrology ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/1-mesha-rashi-31-2.jpg</image:loc><image:caption><![CDATA[ మేషం: సప్తమంలో ఉన్న శుక్రుడిని రాశ్యధిపతి కుజుడు చతుర్థ స్థానం నుంచి చూడడం వల్ల ఈ రాశి వారిలో వృత్తి, ఉద్యోగాల్లో అధికారం చేపట్టాలన్న కోరిక పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధం కావడం,  ఉద్యోగంలో శ్రమను పెంచడం వంటివి జరుగుతాయి. ధనార్జన మీద ఆశలు, ఆకాంక్షలు బాగా పెరుగుతాయి. అదనపు ఆదాయ మార్గాల మీద, అదనపు రాబడి మీద దృష్టి సారిస్తారు. సుఖవంతమైన జీవితం కోసం ఆరాటం ఎక్కువవుతుంది. శృంగార జీవితం మీద ధ్యాస పెరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/3-mithuna-rashi-21-4.jpg</image:loc><image:caption><![CDATA[ మిథునం: ఈ రాశివారికి పంచమ స్థానంలో ఉన్న శుక్రుడిని కుజుడు ధన స్థానం నుంచి వీక్షించడం వల్ల జీవ నశైలి పూర్తిగా మారిపోతుంది. విదేశీయానం మీద, విదేశాల్లో ఉద్యోగాల మీద దృష్టి పడుతుంది. మరింత మెరుగైన జీవితం గడపాలన్న ఏకైక లక్ష్యంతో కొత్త ప్రయత్నాలు ప్రారంభించి సఫలం అవుతారు. ఆదాయ వృద్ధి ప్రయత్నాల మీద శ్రమను పెంచుతారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకు పోవడం జరుగుతుంది. కొత్త పరిచయాలు, కొత్త పద్ధతులు, మంచి విలాస జీవితం ఏర్పడతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/4-karkataka-rashi-41-3.jpg</image:loc><image:caption><![CDATA[ కర్కాటకం: ఈ రాశికి ఉన్న కుజుడు చతుర్థ స్థానంలో ఉన్న శుక్రుడిని వీక్షించడం వల్ల భోగభాగ్యాల మీద ఆశలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతుల కోసం లేదా అధికారం కోసం తీవ్రంగా ప్రయ త్నించి విజయం సాధించడం జరుగుతుంది. విలాస జీవితానికి అలవాటు పడతారు. ప్రముఖు లతో పరిచయాలు పెరుగుతాయి. గృహ, వాహన యోగాలు పడతాయి. అదనపు ఆదాయ మార్గాల్ని విస్తరిస్తారు. ప్రేమ వ్యవహారాలు,  దాంపత్య జీవితంలో అన్యోన్యత బాగా పెరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/6-kanya-rashi-31-4.jpg</image:loc><image:caption><![CDATA[ కన్య: ఈ రాశికి ధన స్థానంలో ఉన్న శుక్రుడిని లాభ స్థానం నుంచి కుజుడు చూడడం వల్ల శృంగార సంబంధమైన కోరికలు విజృంభించడానికి అవకాశం ఉంది. అనవసర పరిచయాలు ఏర్పడతాయి. విలాస జీవితం అలవడుతుంది. వ్యక్తిగత సుఖాల మీద ఖర్చు పెరుగుతుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు చాలావరకు విజయవంతం అవుతాయి. సిరిసంపదలు కలిసి వస్తాయి. ప్రేమ జీవితం, దాంపత్య జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. సంపన్న వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/7-tula-rashi-41-6.jpg</image:loc><image:caption><![CDATA[ తుల: ఈ రాశిలో ఉన్న రాశ్యధిపతి శుక్రుడిని దశమస్థానం నుంచి కుజుడు వీక్షించడం వల్ల ఈ రాశి వారు ఆదాయ వృద్ధి కోసం బాగా శ్రమపడతారు. షేర్లు, స్పెక్యులేషన్లలో పెట్టే పెట్టుబడులు బాగా లాభిస్తాయి. సుఖసంతోషాలకు కోసం తాపత్రయపడడం జరుగుతుంది. శృంగార సంబంధమైన కోరికలు పెరుగుతాయి. గృహ, వాహన సౌకర్యాలు అమరుతాయి. విహార యాత్రల మీద ఖర్చు పెరుగుతుంది. అనవసర పరిచయాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత పదవి లభిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/10-makara-rashi-51-5.jpg</image:loc><image:caption><![CDATA[ మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో ఉన్న కుజుడు దశమ స్థానంలో ఉన్న శుక్రుడిని వీక్షించడం వల్ల ఉద్యోగంలో పదోన్నతి కోసం, జీతభత్యాల పెరుగుదల కోసం గట్టి కృషి సాగించి సఫలం అవుతారు. ఆదాయ వృద్ధికి తీవ్ర ప్రయత్నాలు సాగిస్తారు. షేర్లు, స్పెక్యులేషన్ల మీద పెట్టుబడులు పెంచడం జరుగుతుంది. లాభదాయక పరిచయాలు, లాభదాయక ఒప్పందాలు చోటు చేసుకుంటాయి. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/vinayaka-chavithi-special-6th-day-ganesh-naivedyam-bellam-jilebi-recipe-jilebis-stay-soft-for-4-days-1914271.html</loc><lastmod>2026-09-18T16:54:43+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/bellam-jilebi-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Bellam Jilebi 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/bellam-jilebi.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు: రెండు కేజీల మైదాపిండి, పావుకిలో బొంబాయి రవ్వ, ఒక టేబుల్ స్పూన్  బేకింగ్ పౌడర్, ఒక టేబుల్ స్పూన్    నిమ్మరసం, కొంచం ఉప్పు, ఇంకా సరిపడా నీళ్ళు, ఒక కప్పు తురిమిన బెల్లం,  ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, కలర్ ఫుడ్  పసుపు రంగు,  డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ ను తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/bellam-jilebi-5.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా ఒక చిన్న గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. ఇంకా దీనిలో కొంచం ఉప్పు, ఒక టీస్పూన్ బొంబాయి రవ్వను కలపాలి. బొంబాయి రవ్వ కలపడం వల్ల జిలేబీలు ఎక్కువ సమయం వరకు క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీటిని కలుపుతూ పిండిని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయాలి. పిండి మరీ పల్చగా లేదా మరీ చిక్కగా కాకుండా, జిలేబీ చేయడానికి సరిపడా కన్సిస్టెన్సీలో ఉండాలి. పిండి సిద్ధమైన తర్వాత మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/bellam-jilebi-1.jpg</image:loc><image:caption><![CDATA[ పిండి పక్కన పెట్టే సమయంలో బెల్లం పాకాన్ని సిద్ధం చేసుకోవచ్చు. ఒక పాన్‌లో ఒక కప్పు తురిమిన బెల్లం తీసుకుని, అందులో అర కప్పు నీటిని పోయాలి. బెల్లం కరిగి పాకం కాసేపు మరిగించాలి. పాకం మరీ తీగపాకంలా కాకుండా, రెండు వేళ్లతో పట్టుకుంటే అంటుకునేలా జిగురుగా ఉండాలి. ఈ దశలో అర టీస్పూన్ యాలకుల పొడి, చిటికెడు పసుపు రంగు వేయాలి. చివరిగా, ఒక టీస్పూన్ నిమ్మరసాన్ని కలపాలి. నిమ్మరసం కలపడం వల్ల పాకం తిరిగి గట్టిపడకుండా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, పాకం చల్లారకుండా మూతపెట్టి పక్కన ఉంచాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/bellam-jilebi-3.jpg</image:loc><image:caption><![CDATA[ పది నిమిషాల తర్వాత, పిండి కాస్త చిక్కబడి ఉంటుంది. దీనికి కారణం బొంబాయి రవ్వ నీటిని పీల్చుకోవడం. ఇప్పుడు పిండిని తక్షణమే పులియబెట్టడానికి మూడు టీస్పూన్ల నిమ్మరసం , అర టీస్పూన్ బేకింగ్ పౌడర్‌ను కలపాలి. బేకింగ్ పౌడర్ లేకపోతే, బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు. వీటన్నింటినీ పిండిలో బాగా కలిపి చిలుకాలి. పిండి మరీ చిక్కగా అనిపిస్తే, ఒకటి లేదా రెండు టీస్పూన్ల నీటిని కలిపి సరైన కన్సిస్టెన్సీకి తీసుకురావాలి. నిమ్మరసం,  బేకింగ్ పౌడర్ కలపడం వల్ల పిండి తక్షణమే పులిసినట్లు అవుతుంది, జిలేబీల తయారీకి సిద్ధంగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/bellam-jilebi-4.jpg</image:loc><image:caption><![CDATA[ సిద్ధం చేసుకున్న పిండిని జిలేబీ బాటిల్ లేదా చిన్న రంధ్రం ఉన్న పాలు కవర్‌లో తీసుకోవాలి. జిలేబీలు వేయించడానికి ఫ్లాట్‌గా ఉండే పాన్ తీసుకుని, డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి బాగా వేడి చేయాలి. నూనె వేడెక్కాక, మంటను మధ్యస్థ స్థాయికి తగ్గించి జిలేబీలను వేయాలి. జిలేబీలు ఒకవైపు గట్టిపడిన తర్వాత, మరోవైపు తిప్పి క్రిస్పీగా వేయించాలి. జిలేబీలను అధిక మంటపై కాకుండా, మధ్యస్థ మంటపై వేయించడం ముఖ్యం.నూనెలో క్రిస్పీగా వేగిన జిలేబీలను వెంటనే తీసి, గోరువెచ్చని బెల్లం పాకంలో వేయాలి. జిలేబీ చల్లారితే పాకాన్ని సరిగ్గా పీల్చుకోదు. కాబట్టి వేడి జిలేబీలను గోరువెచ్చని పాకంలో వేసి 30-40 సెకన్లు నానబెట్టాలి. పాకం జిలేబీలకు బాగా పట్టిన తర్వాత, వాటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. మిగిలిన పిండితో కూడా ఇదే పద్ధతిలో జిలేబీలను తయారుచేసుకోవాలి. జిలేబీ చేసేటప్పుడు పాకం చల్లారిపోతే, మళ్లీ కాస్త వేడి చేసి ఉపయోగించాలి. ఈ విధంగా తయారుచేస్తే, ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఉండే నోరూరించే బెల్లం జిలేబీలు సిద్ధమవుతాయి. ఈ జిలేబీలు రెండు రోజుల వరకు కూడా తమ క్రిస్పీనెస్‌ను కోల్పోకుండా ఉంటాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/gajakesari-yoga-october-2026-jupiter-moon-conjunction-in-cancer-may-bring-wealth-benefits-for-2-zodiac-signs-1914243.html</loc><lastmod>2026-09-18T14:36:04+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/guru-sanchar-2-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Guru Sanchar 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/astro-17.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/astro-1-13.jpg</image:loc><image:caption><![CDATA[ వచ్చే నెలలో కర్కాటక రాశిలో గురు, చంద్రుడు కలవబోతున్నారు. ఈ శక్తివంతమైన కలయిక వలన గజకేసరి యోగం ఏర్పడనుంది. అంతే కాదు,  ఈ ప్రభావం 12 రాశుల వారి పైన పడనుంది. 12 రాశులలో రెండు రాశులకు మాత్రం విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఇంకా వీరి వ్యాపారాలు కూడా విస్తరిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/kumbha.jpg</image:loc><image:caption><![CDATA[ మీ ఆదాయం పెరుగుతుంది ఇంకా మీకు రావాల్సిన డబ్బులు కూడా వస్తాయి. ఇంకా వీరి ఆర్థిక ప్రణాళికలపరిస్థితులు కూడా మెరుగుపడతాయి ఇంకా కొత్తగా ఉద్యోగంలో  జాయిన్ అయినా వారికీ కూడా మొత్తం మారుతుంది.  పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. మీ పైఅధికారుల నుండి ప్రశంసలు వస్తాయి ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/mesha.jpg</image:loc><image:caption><![CDATA[ కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టిన వాళ్ళకి అధిక  లాభాలు వస్తాయి. అలాగే మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఇంకా పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి కూడా మంచిగా ఉంటుంది. మీరు కొత్తగా చేసే ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అవకాశం వస్తుంది అప్పుడు మొత్తం మారుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/astro-2-10.jpg</image:loc><image:caption><![CDATA[ Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/shukra-yogam-effect-3-zodiac-signs-see-golden-fortunes-and-financial-prosperity-1914216.html</loc><lastmod>2026-09-18T14:25:42+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/shukra-yogam.jpg</image:loc>
					<image:title><![CDATA[ Shukra Yogam ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/shukra-yogam-1.jpg</image:loc><image:caption><![CDATA[ సెప్టెంబర్ చివరలో శుక్ర యోగం ఏర్పడనుంది. ముఖ్యంగా మూడు నక్షత్రాల్లో జన్మించిన వారిపై దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందంట. లక్ష్మీదేవి అనుగ్రహం కలగడం వలన మూడు రాశుల వారికి ఈ సమయంలో ఆర్థికంగా కలిసి రానున్నది. కాగా, ఏ రాశుల వారికి శుక్రుడి అనుగ్రహంతో అదృష్టం కలిసి వస్తుందో చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/shukra-yogam-3.jpg</image:loc><image:caption><![CDATA[ సింహ రాశి : సింహ రాశి వారికి శుక్ర యోగం వలన చాలా అద్భుతంగా ఉంటుంది. మహాలక్ష్మీ అనుగ్రహం వీరిపై ఉండటం వలన వీరికి ధనానికి ధాన్యానికి లోటే ఉండదు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. చేతినిండా డబ్బులతో చాలా ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు కూడా కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అన్నివిధాలుగా వీరికి చాలా అద్భుతంగా ఉండనుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/shukra-yogam-4.jpg</image:loc><image:caption><![CDATA[ మీన రాశి : మీన రాశి వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. ఈ రాశి వారు గత కొన్ని రోజుల నుంచి ఎవరు అయితే సమస్యలతో బాధపడతారో, వారు వాటి నుంచి బయట పడతారు. విద్యార్థులకు కూడా ఇది మంచి సమయం. ఆర్థికంగా కలిసి వస్తుంది. గత కొన్ని రోజుల నుంచి అప్పుల బాధలతో సతమతం అయ్యే  వారు కూడా ఈ సమయంలో వాటి నుంచి బయటపడతారు. ఆనందంగా ఉంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/shukra-yogam-5.jpg</image:loc><image:caption><![CDATA[ ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా వస్తాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేసే ఛాన్స్ ఉంది. అన్ని విధాలుగా వీరికి ఇది చాలా శుభ సమయం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/shukra-yogam-2.jpg</image:loc><image:caption><![CDATA[ నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు ]]></image:caption></image:image></url></urlset>