<urlset xmlns:xsi="http://www.w3.org/2001/XMLSchema-instance" xmlns:image="http://www.google.com/schemas/sitemap-image/1.1" xsi:schemaLocation="http://www.sitemaps.org/schemas/sitemap/0.9 http://www.sitemaps.org/schemas/sitemap/0.9/sitemap.xsd http://www.google.com/schemas/sitemap-image/1.1 http://www.google.com/schemas/sitemap-image/1.1/sitemap-image.xsd" xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9"><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/do-you-know-who-this-heroine-is-who-has-only-done-three-films-as-a-heroine-she-is-kavya-kalyan-ram-1837239.html</loc><lastmod>2026-06-08T21:29:17+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/actress-15.jpg</image:loc>
					<image:title><![CDATA[ Actress ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/actress-pic-3.jpg</image:loc><image:caption><![CDATA[ చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలతోనే పాపులర్ అవుతుంటారు. అయితే అందరూ హీరోయిన్స్ గా రాణించలేరు. వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఒకరు. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఎందరో ఇప్పుడు హీరోలుగా, హీరోయిన్స్ గా నటించి మెప్పిస్తున్నారు. ఈ అమ్మడు కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/kavya.jpg</image:loc><image:caption><![CDATA[ ఆమె ఎవరో కాదు చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసి మెప్పించింది, పవన్ కళ్యాణ్, చిరంజీవిలాంటి స్టార్ హీరోల సరసన నటించింది. ఆమె ఎవరో కాదు కావ్య కళ్యాణ్ రామ్. 2003లో వచ్చిన గంగోత్రిలో బాలనటిగా తెలుగు తెరకు అరంగేట్రం చేసిన కావ్య కళ్యాణ్ రామ్ బాలనటిగా మంచిపేరు తెచ్చుకుంది. ‘వ‌ల్లంకి పిట్టా వల్లంకి పిట్టా మెల్లంగ ర‌మ్మంటా’ అని సాగే పాటలో ఆమె నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/kavya-new.jpg</image:loc><image:caption><![CDATA[ కావ్య కళ్యాణ్ రామ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా స్నేహమంటే ఇదేరా, ఠాగూర్, అడవి రాముడు, విజయేంద్ర వర్మ, బాలు, బన్నీ, సుభాష్ చంద్రబోస్, పాండురంగడు వంటి పలు సినిమాల్లో నటించింది. అయితే 2022లో సాయి కిరణ్ దర్శకత్వం వహించిన హర్రర్ చిత్రం మసూదలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చింది కావ్య కళ్యాణ్ రామ్.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/kavya-pic.jpg</image:loc><image:caption><![CDATA[ ఆతర్వాత 2023లో వచ్చిన బలగం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో కావ్య తన నటనతో పేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా తర్వాత కావ్య ఉస్తాద్ అనే సినిమాలో నటించింది.  సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి తనయుడు శ్రీసింహా సరసన కావ్య కళ్యాణ్ రామ్ నటించిన చిత్రం ఉస్తాద్. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/kavya-pics.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. కారణం తెలియకపోయిన ఈ అమ్మడు 2023 తర్వాత కావ్యకల్యాణ్ రామ్ సినిమాలు చేయడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది కావ్యకల్యాణ్ రామ్. ఈ అమ్మడి ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.  ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/dreaming-of-these-4-animals-it-could-signal-wealth-luck-and-major-success-ahead-1837228.html</loc><lastmod>2026-06-08T21:10:54+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/dream-astrology.jpg</image:loc>
					<image:title><![CDATA[ Dream Astrology ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/dreams-1.jpg</image:loc><image:caption><![CDATA[ కలలు మన జీవితంలో ఒక ఆసక్తికరమైన భాగం. నిద్రలో కనిపించే కొన్ని దృశ్యాలు మనసులో చాలా కాలం నిలిచిపోతాయి. భారతీయ సంప్రదాయాల్లో స్వప్న శాస్త్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ శాస్త్రం ప్రకారం, కొన్ని కలలు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలకు సంకేతాలుగా భావిస్తారు. ముఖ్యంగా కొన్ని జంతువులు కలలో కనిపిస్తే అవి అదృష్టం, సంపద, విజయాలకు సూచనలుగా పరిగణించబడతాయి. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో ఈ నాలుగు జంతువులు కనిపించడం అత్యంత శుభప్రదమైనదిగా చెబుతారు. ఇవి జీవితంలో ఆర్థిక పురోగతి, గౌరవం, విజయాలు, అదృష్టాన్ని సూచిస్తాయని విశ్వసిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/dreams1.jpg</image:loc><image:caption><![CDATA[ 1. కలలో సింహం కనిపిస్తే... 
సింహాన్ని జంతువుల రాజుగా పిలుస్తారు. అందుకే కలలో సింహం కనిపించడం రాజయోగానికి సంకేతంగా భావిస్తారు. ఈ కల మీలో ఉన్న ధైర్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను ప్రతిబింబిస్తుంది. ఉద్యోగం, వ్యాపారం లేదా సామాజిక జీవితంలో పెద్ద స్థాయిలో గుర్తింపు పొందే అవకాశం ఉందని ఇది సూచిస్తుంది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు మీ వైపు రావచ్చని స్వప్న శాస్త్రం పేర్కొంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/dreams2.jpg</image:loc><image:caption><![CDATA[ 2. కలలో గుడ్లగూబ కనిపిస్తే... 
హిందూ సంప్రదాయంలో గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా భావిస్తారు. అందువల్ల కలలో గుడ్లగూబ కనిపించడం ఆర్థిక శ్రేయస్సుకు సంకేతంగా పరిగణిస్తారు. ఇది ధనలాభం, కొత్త ఆదాయ మార్గాలు, పెట్టుబడుల ద్వారా లాభాలు లేదా నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశాలను సూచిస్తుందని చెబుతారు. అంతేకాకుండా, మీరు తీసుకునే నిర్ణయాల్లో వివేకం పెరుగుతుందని కూడా ఈ కలకు అర్థం చెబుతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/dreams3.jpg</image:loc><image:caption><![CDATA[ 3. కలలో నాగుపాము లేదా నల్ల పాము కనిపిస్తే.. 
సాధారణంగా పామును చూసి చాలామంది భయపడతారు. అయితే స్వప్న శాస్త్రంలో నాగుపాము లేదా నల్ల పాము కనిపించడం అనేక సందర్భాల్లో శుభసూచకంగా భావిస్తారు. ముఖ్యంగా ఈ కల ఆకస్మిక ధనలాభం, ఆర్థిక పరిస్థితి మెరుగుదల, సంపద పెరుగుదల,   జీవితంలో కొత్త అవకాశాలకు సంకేతంగా చెబుతారు. కొందరి అభిప్రాయం ప్రకారం ఇది దాగి ఉన్న అదృష్టం త్వరలో వెలుగులోకి రాబోతోందని సూచిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/dreams4.jpg</image:loc><image:caption><![CDATA[ 4. కలలో ఏనుగు కనిపిస్తే.. 
ఏనుగుకు భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. స్వప్న శాస్త్రం ప్రకారం ఏనుగు లక్ష్మీదేవి కటాక్షానికి ప్రతీకగా భావించబడుతుంది. కలలో ఏనుగు కనిపించడం వల్ల ఆర్థిక లాభాలు, కుటుంబంలో శుభకార్యాలు, గౌరవ ప్రతిష్ఠలు పెరగడం వంటి ఫలితాలు కలుగుతాయని చెబుతారు. ముఖ్యంగా రావలసిన డబ్బు తిరిగి రావడం, వ్యాపారంలో పురోగతి, ఉద్యోగంలో ప్రమోషన్ వంటి శుభ పరిణామాలకు ఇది సంకేతమని విశ్వసిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/dreams5.jpg</image:loc><image:caption><![CDATA[ స్వప్న శాస్త్రం ఏమి చెబుతోంది?..  
స్వప్న శాస్త్రం ప్రకారం కలలు కేవలం ఊహలు మాత్రమే కాకుండా మన అంతర్మనస్సు, ఆలోచనలు, భవిష్యత్తు అవకాశాలకు సంబంధించిన సంకేతాలను కూడా తెలియజేస్తాయని నమ్మకం. అయితే కలల ఫలితాలు వ్యక్తిగత పరిస్థితులు, కల వచ్చిన సమయం,  అందులో కనిపించిన ఇతర అంశాలపై కూడా ఆధారపడి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం స్వప్న శాస్త్రం, జ్యోతిష్యం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/lifestyle/fish-storage-tips-how-long-can-you-keep-fish-in-the-freezer-1837176.html</loc><lastmod>2026-06-08T19:40:32+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/how-long-can-you-freeze-fish.jpg</image:loc>
					<image:title><![CDATA[ How Long Can You Freeze Fish ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/fish-4-2.jpg</image:loc><image:caption><![CDATA[ చికెన్ ,మటన్ తరహాలో మనకు డేలీ చేపలు దొరకాలంటే చాలా కష్టం. ఎందుకంటే వీటి లభ్యత తక్కువగా ఉంటుంది కాబట్టి, కేవలం వారంలో ఒక్కరోజు మాత్రమే ఇవి మార్కెట్‌లొ కనిపిస్తాయి. అందుకే చాలా మంది ఒకేసారి వాటిని తెచ్చి ప్రజ్‌లో స్టోర్ చేసుకుంటారు. అయితే చాలా మందికి ఇక్కడ కొన్ని సందేహాలు ఉన్నాయి. చేపలు ఎన్ని రోజులు ప్రిజ్‌లో ఉంచడం మంచింది. ఎక్కువ రోజులు ఉంచితే ఏమవుతుందని. దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/fish-3-2.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే చేపల రకాన్ని బట్టి ప్రిజ్‌లో ఎన్ని రోజులు నిల్వ చేయాలి అనేది ఆదారపడి ఉంటుంది. అవును సార్డినెస్, తిలాపియా వంటి చేపలను ఫ్రీజర్‌లో ఆరు నుండి ఎనిమిది నెలల వరకు నిల్వ చేయవచ్చు. అదే సాల్మన్, మాకెరెల్, ట్రౌట్ వంటి కొవ్వు ఎక్కువగా ఉండే చేపలను ఫ్రీజర్‌లో రెండు నుండి మూడు నెలల వరకు నిల్వ చేయవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/fish-2-2.jpg</image:loc><image:caption><![CDATA[ అలాగే చేపలను ఏ ఉష్ణోగ్రత వద్ద ప్రిజ్‌లో పెడుతున్నామన్నది కూడా చాలా ముఖ్యం. చేప ఏదైనప్పటికీ, ఫ్రీజర్‌లోని ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండేలా చూసుకోండి. దానిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయాలి. దానిని ప్లాస్టిక్ లేదా అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టి ఫ్రీజర్‌లో నిల్వ చేయడం మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/fish-1-3.jpg</image:loc><image:caption><![CDATA[ మీరు చేపను కొన్న తర్వాత దానిని ఎక్కువసేపు బయట ఉంచకూడదు. వీలైనంత త్వరగా ఫ్రీజర్‌లో పెట్టాలి. అదే సమయంలో చేపలు కొనేప్పుడు కూడా మీరు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఎప్పుడూ తాజాగా కనిపించే చేపలను మాత్రమే కొనుగోలు చేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/fish-9.jpg</image:loc><image:caption><![CDATA[ తాజా చేపలను ఎలా గుర్తించాలంటే.. తాజా చేపల కళ్ళు మెరుస్తూ, పైకి ఉబ్బినట్లు ఉంటాయి. పాత చేపల కళ్ళు లోపలికి పోయి, మసకగా ఉంటాయి. చేపల మొప్పలను తెరిచి చూస్తే అవి మంచి ఎరుపు రంగులో ఉండాలి. చేపను తోక భాగం పట్టుకుని పైకి లేపితే అది వంగకుండా నిటారుగా నిలబడాలి. చేప శరీరాన్ని వేలితో నొక్కినప్పుడు, ఆ నొక్కిన భాగం వెంటనే సాధారణ స్థితికి వచ్చేయాలి. అలా కాకుండా అక్కడ గుంత పడితే అది తాజా చేప కాదని అర్థం కాబట్టి కొనే ముందు ఇవి గుర్తుంచుకోండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/hotel-style-aloo-egg-kurma-recipe-dhaba-style-egg-potato-curry-1837134.html</loc><lastmod>2026-06-08T19:15:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/aloo-egg-kurma-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Aloo Egg Kurma (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/aloo-egg-kurma-1.jpg</image:loc><image:caption><![CDATA[ ధాబా లేదా హోటల్ స్టైల్‌లో ఉండే ఈ వంటకానికి ఒక ప్రత్యేకమైన హోంమేడ్ మసాలా పొడిని జోడించడం వల్ల దీని టేస్ట్ డబుల్ అవుతుంది. బ్యాచిలర్స్ కూడా ఎంతో సులభంగా, తక్కువ సమయంలో చేసుకోగలిగే ఈ కమ్మని ఆలూ ఎగ్ కుర్మా తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/aloo-egg-kurma-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ కుర్మా రుచిగా రావడానికి ప్రధాన కారణమైన ఆ సీక్రెట్ మసాలా పొడి కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో లైట్‌గా ఫ్రై చేసి చల్లార్చుకున్న రెండు కప్పుల ధనియాలు, ఒక కప్పు ఎండి కొబ్బరి ముక్కలు, ఏడు నుండి ఎనిమిది వెల్లుల్లి రెమ్మలు, రెండు ఇంచుల దాల్చిన చెక్క ముక్కలు, ఆరు లవంగాలు మరియు ఒక చిన్న టీస్పూన్ జీలకర్ర వేసి మెత్తటి ఫైన్ పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/aloo-egg-kurma-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ పొడిని ఫ్రిజ్‌లో ఉంచితే దాదాపు 20 రోజుల పాటు నిల్వ ఉంటుంది. దీనిని ఏ నాన్ వెజ్ లేదా మసాలా కర్రీస్‌లోకైనా వాడుకోవచ్చు. ఆ తర్వాత అదే జార్‌లోకి బాగా పండిన టమోటాలను ముక్కలుగా కోసి మెత్తటి ప్యూరీలా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని తగినంత నూనె వేసి వేడెక్కాక బిర్యానీ ఆకులు, హాఫ్ టీస్పూన్ జీలకర్ర మరియు హోల్ బిర్యానీ దినుసులు వేయాలి. ఆపై ఒక బౌల్ నిండా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/aloo-egg-kurma-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు, పసుపు వేయాలి. ఉల్లిపాయలు మగ్గాక పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి, రెండు రెమ్మల తాజా కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. కరివేపాకు ఈ కూరకు మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు ముందుగా సిద్ధం చేసుకున్న టమోటా ప్యూరీని వేసి పచ్చి వాసన పోయే వరకు, నూనె పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/aloo-egg-kurma-5.jpg</image:loc><image:caption><![CDATA[ టమోటా గ్రేవీ బాగా ఉడికాక, ఉడికించి ముక్కలుగా కోసుకున్న బంగాళాదుంపలు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి ఐదు నుండి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్‌పై ఉడికించాలి. గ్రేవీ చిక్కబడ్డాక, మనం మొదట తయారుచేసుకున్న ధనియాల-కొబ్బరి మసాలా పొడిని ఒకటిన్నర టీస్పూన్ వేసి బాగా కలపాలి. చివరగా, ఉడికించి లైట్‌గా ఆయిల్‌లో ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను (ఎగ్స్) గాట్లు పెట్టి ఈ గ్రేవీలో వేసి మరో ఐదు నిమిషాలు చిన్న మంటపై ఉంచాలి. అంతే, ఎంతో రుచికరమైన హోటల్ స్టైల్ ఆలూ ఎగ్ కుర్మా సిద్ధం. దీనిని బగారా రైస్‌తో తింటే ఆ తృప్తే వేరు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/simple-daily-habits-for-a-healthy-and-happy-life-1837114.html</loc><lastmod>2026-06-08T19:05:07+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/healthy-habits-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Healthy Habits (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/healthy-habits-1.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుత ఆధునిక కాలంలో టెక్నాలజీ పెరిగేకొద్దీ మనుషులలో శారీరక శ్రమ తగ్గిపోతోంది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఏదో ఒక ఒత్తిడి, ఆందోళన మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడిని మనం అస్సలు మర్చిపోకూడదు. ఎందుకంటే సంపద ఎంత ఉన్నా, అనుభవించడానికి సరైన ఆరోగ్యం లేకపోతే జీవితంలో సంతోషం ఉండదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/healthy-habits-2.jpg</image:loc><image:caption><![CDATA[ మొదటిగా, మన శరీరానికి సరైన ఇంధనం లాంటిది పోషకాహారం. ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ ఎట్టిపరిస్థితుల్లోనూ స్కిప్ చేయకూడదు. జంక్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన ఆహార పదార్ధాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మన ఇంట్లో వండుకునే ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు మరియు తాజా పండ్లను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి శరీరానికి కావలసిన విటమిన్లు, ఖనిజాలను అందించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆహారంతో పాటు ప్రతిరోజూ కనీసం ఎనిమిది నుండి పది గ్లాసుల నీరు తాగడం చాలా ముఖ్యం. నీరు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా, శరీరంలోని హానికరమైన వ్యర్థాలను బయటకు పంపుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/healthy-habits-3.jpg</image:loc><image:caption><![CDATA[ రెండవ ముఖ్యమైన విషయం శారీరక శ్రమ. రోజుకు కనీసం ముప్పై నిమిషాల పాటు నడక, యోగా, వ్యాయామం లేదా సైక్లింగ్ వంటివి చేయడం వల్ల గుండె పనితీరు మెరుగవుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల బరువు అదుపులో ఉండటమే కాకుండా, రోజంతా ఎంతో చురుగ్గా పని చేయవచ్చు. శారీరక ఆరోగ్యంతో పాటే మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మానసిక ఒత్తిడి. దీనిని అధిగమించడానికి ప్రతిరోజూ కొద్దిసేపు ధ్యానం (మెడిటేషన్) చేయడం లేదా ప్రకృతితో గడపడం వంటివి అలవాటు చేసుకోవాలి. మనసుకు నచ్చిన పనులు చేయడం వల్ల ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/healthy-habits-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక అన్నింటికంటే కీలకమైనది సరైన నిద్ర. రాత్రి పూట కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల గాఢ నిద్ర శరీరానికి ఎంతో అవసరం. నిద్రపోయే సమయానికి కనీసం గంట ముందే మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లకు దూరంగా ఉండటం మంచిది. ఇది నిద్ర నాణ్యతను పెంచుతుంది. చివరగా, క్రమం తప్పకుండా హెల్త్ చెకప్స్ చేయించుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే అనారోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి నివారించవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/healthy-habits-5.jpg</image:loc><image:caption><![CDATA[ చెప్పాలంటే, ఆరోగ్యం అనేది ఒక్కరోజులో వచ్చేది కాదు. ఇది మనం ప్రతిరోజూ పాటించే జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. ప్రకృతి మనకు ఇచ్చిన ఈ అందమైన జీవితాన్ని సంతోషంగా గడపడానికి నేటి నుండే మంచి అలవాట్లను ప్రారంభిద్దాం. ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడంలో మనవంతు పాత్ర పోషిద్దాం. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/director-krishna-vamsi-and-actress-ramya-krishnan-love-story-secrets-1837098.html</loc><lastmod>2026-06-08T18:40:27+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/ramya-krishna-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ramya Krishna (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/ramya-krishna-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఒకరు తన అద్భుతమైన నటనతో, గ్లామర్‌తో సౌత్ ఇండియాను ఊపేసిన అగ్ర నటి కాగా.. మరొకరు తెలుగు సినిమా ట్రెండ్‌ను మార్చిన విలక్షణ దర్శకుడు. విభిన్నమైన మనస్తత్వాలు కలిగిన వీరిద్దరి మధ్య అసలు ప్రేమ ఎలా చిగురించింది? వీరు ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలని ఏ క్షణంలో అనుకున్నారో తెలుసుకోవడానికి సినీ అభిమానులు ఎప్పుడూ ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/ramya-krishna-2.jpg</image:loc><image:caption><![CDATA[ వీరిద్దరి పరిచయానికి బీజం పడింది &#039;గులాబి&#039; సినిమా పాటలతోనే. అప్పటికే రమ్యకృష్ణ పెద్ద స్టార్. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన &#039;గులాబి&#039;లోని &#039;మేఘాలలో తేలిపొమ్మన్నది&#039; వంటి పాటలు చూసి రమ్యకృష్ణ ఫిదా అయిపోయారట. ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో పాటకైతే ఫేవరేట్‌ అయ్యారు. అప్పటి నుంచి రమ్యకృష్ణ హృదయం..ఏ రోజైతే చూశానో నిన్ను.. అంటూ పదేపదే కలవరిస్తోందట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/ramya-krishna-3.jpg</image:loc><image:caption><![CDATA[ వీరిద్దరి పరిచయం కృష్ణవంశీ దర్శకత్వం వహించిన క్లాసిక్ హిట్ &#039;నిన్నే పెళ్లాడతా&#039; సినిమాతో మొదలైంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ ఒక చిన్న అతిథి పాత్రలో మెరిశారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా కృష్ణవంశీ తెరకెక్కించిన &#039;అంతఃపురం&#039; సినిమాలో రమ్యకృష్ణ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ముఖ్యంగా కృష్ణవంశీ మేకింగ్ స్టైల్, ఆయనకున్న క్రియేటివిటీ రమ్యకృష్ణను ఎంతో ఆకట్టుకున్నాయి. అలాగే రమ్యకృష్ణ నటన, ఆమెకున్న డెడికేషన్ చూసి కృష్ణవంశీ కూడా ఆమెతో ప్రేమలో పడిపోయారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/ramya-krishna-4.jpg</image:loc><image:caption><![CDATA[ కృష్ణవంశీ దర్శకత్వంలో కాకపోయినా, రమ్యకృష్ణ నటించిన ఒక బ్లాక్‌బస్టర్ సినిమాలోని రొమాంటిక్ సాంగ్ షూటింగ్ సమయం నుండి వీరిద్దరి లవ్ స్టోరీ అధికారికంగా మరింత ఊపందుకుంది. కృష్ణవంశీ సెట్స్‌లో ఎంతో కఠినంగా, కోపంగా ఉంటారని పేరున్నప్పటికీ.. రమ్యకృష్ణ దగ్గరకు వచ్చేసరికి ఆయన ఎంతో సాఫ్ట్‌గా మారిపోయేవారట. ఇద్దరి మధ్య అభిప్రాయాలు కలవడంతో, దాదాపు ఏడేళ్ల పాటు తమ ప్రేమ విషయాన్ని ఎక్కడా బయటపడకుండా సీక్రెట్‌గా మెయింటైన్ చేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/ramya-krishna-5.jpg</image:loc><image:caption><![CDATA[ చివరకు ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి, 2003 జూన్ 12న ఇరువైపులా ఉన్న కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో అత్యంత నిరాడంబరంగా వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరికి &#039;రిత్విక్&#039; అనే కుమారుడు ఉన్నాడు. పెళ్లయిన తర్వాత కూడా రమ్యకృష్ణ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో &#039;బాహుబలి&#039; వంటి చిత్రాలతో గ్లోబల్ రేంజ్‌లో దూసుకుపోతున్నారు.  ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/new-passenger-reservation-system-to-end-server-crashes-and-speed-up-online-ticket-booking-1837059.html</loc><lastmod>2026-06-08T18:12:50+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/railway.jpg</image:loc>
					<image:title><![CDATA[ Railway ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/indian-railways-1-2.jpg</image:loc><image:caption><![CDATA[ రైల్వే ప్రయాణికులకు సూపర్ న్యూస్. ఇక నుంచి రైల్వే టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్ కష్టాలు తప్పనున్నాయి. ఇకపై అత్యంత వేగంగా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం కొత్త ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌ను రైల్వేశాఖ త్వరలో తీసుకురానుంది. దశాబ్దాల నుంచి పాత సిస్టమ్ స్థానంలో కొత్త సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేస్తోంది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ వ్యవస్థ 1986 నుంచి వాడుకలో ఉంది. పలుమార్లు ఇందులో మార్పులు చేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/indian-railways-2-2.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ఇప్పుడు కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. గతంలో పోలిస్తే ఇప్పుడు ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్ చేసుకునేవారు కూడా ఎక్కువైపోయారు. డిమాండ్‌కు తగ్గట్లు ప్రస్తుత రిజర్వేషన్ సిస్టమ్ లేదు. దీంతో ప్రయాణికులందరూ ఒకేసారి టికెట్లు బుక్ చేసుకునే సమయంలో సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. వెబ్ సైట్ క్రాష్ అవ్వడం, నెమ్మదించడం లాంటివి చోటుచేసుకుంటున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/indian-railways-3-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ క్రమంలో ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా కొత్త వ్యవస్థను అప్‌గ్రేడ్ చేస్తున్నారు. కొత్త సిస్టమ్‌లో ఎలాంటి సర్వర్ సమస్యలు ఉండవు. నిమిషాల వ్యవధిలోనే వేగంగా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. లక్షలాది మంది ఒకేసారి బుక్ చేసుకునే సామర్థ్యంతో వ్యవస్థను రూపొందిస్తున్నారు. 2002లో రైల్వేశాఖ ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్ చేసుకునే విధానం ప్రారంభించింది. అప్పటినుంచి ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్ చేసుకునేవారు పెరిగిపోయారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/indian-railways-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుతం ఎక్కువమంది ఆన్‌లైన్‌లోనే టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. రైల్వే టికెట్లలో 88 శాతం బుకింగ్స్ కేవలం ఆన్ లైన్ ద్వారానే జరుగుతున్నాయి. దీంతో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ వ్యవస్థలో కొన్ని లోపాల వల్ల సర్వర్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు పాత వ్యవస్థ స్థానంలో కొత్త రిజర్వేషన్ సిస్టమ్ ప్రవేశపెడుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/indian-railways-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇటీవల రిజర్వేషన్ వ్యవస్థలో ఏఐ టూల్స్‌ను కూడా రైల్వేశాఖ ప్రవేశపెట్టింది. దీని వల్ల వెయిటింగ్ టికెట్లు కన్పార్మ్ అవుతాయా.. లేదా అనేది ప్రయాణికులు ముందుగానే తెలుసుకోవచ్చు. ఏఐ వ్యవస్థ ఖచ్చితమైన అంచనాతో సమాచారం అందిస్తుంది. గతంలో 53 శాతం ఖచ్చితత్వం ఉండగా.. ఇప్పుడు 94 శాతానికి చేరుకుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/5-simple-kitchen-hacks-to-save-lpg-gas-and-money-every-month-1837049.html</loc><lastmod>2026-06-08T18:37:59+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/how-to-make-your-lpg-cylinder-last-longe.jpg</image:loc>
					<image:title><![CDATA[ How To Make Your Lpg Cylinder Last Longe ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/gas-saving-tips-3.jpg</image:loc><image:caption><![CDATA[ పాత్రలపైమూత పెట్టడం: వంట చేసేటప్పుడు లేదా నీటిని మరిగించేటప్పుడు పాత్రపై ఎప్పుడూ మూత పెట్టాలి. మూత లేకుండా వండితే ఆవిరితో పాటు వేడి కూడా బయటకు పోతుంది. దీనివల్ల వంట అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీని వల్ల త్వరగా అయిపోతుంది.  అలాగే చాలా మంది గిన్నెలు కడిగిన వెంటనే తడిగా ఉన్నప్పుడే స్టవ్‌పై పెట్టేస్తారు. ఆ పాత్రపై ఉన్న నీరు ఆరడానికే మొదట్లో 1 నుండి 2 నిమిషాల గ్యాస్ వృథా అవుతుంది. కాబట్టి పాత్రను పొడి గుడ్డతో తుడిచిన తర్వాతే స్టవ్‌పై పెట్టండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/gas-saving-tips-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఫ్రిజ్‌లోని వస్తువులను నేరుగా వేడి చేయడం: పాలు, కూరగాయలు లేదా పిండిని వంటి వాటిని చాలా మంది ఫ్రిజ్ నుండి తీసిన వెంటనే వేడి చేస్తారు. తద్వారా గ్యాస్ ఎక్కవ ఖర్చు అవుతుంది. ఎందుకంటే చల్లని వస్తువు వేడి కావడానిక టైం తీసుకుంటుంది. కాబట్టి మీరు ప్రిజ్‌లో ఉన్న వాటితో వంటచేయాలి అనుకుంటే.. వాటిని బయటకు తీసి గది ఉష్ణోగ్రత వద్దకు వచ్చిన తర్వాత వండండి. ఇలా చేస్తే గ్యాస్ వృథా కాకుండా ఉంటుంది. అలాగే వంటచేస్సుడు మంటను మీడియం ప్లేమ్‌లో ఉంచండి, ఎక్కవ మంట పెట్టడం ద్వారా అది సగం గాల్లో కలిసి వృథా అయ్యే అవకాశ ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/gas-saving-tips-1.jpg</image:loc><image:caption><![CDATA[ అవసరమైనంత నీరు: పప్పు, అన్నం లేదా కూరగాయలు వండేటప్పుడు అవసరానికి మించి ఎక్కువ నీరు పోయకండి. ఎక్కువ నీటిని మరిగించడానికి గ్యాస్ ఎక్కువ సేపు ఆన్‌లో ఉంచాల్సి వస్తుంది. దీనివల్ల గ్యాస్ వృథా అవ్వడమే కాకుండా, ఆహారంలోని పోషకాలు కూడా నశిస్తాయి. అలాగే పప్పులు, అన్నం, బంగాళాదుంపలు లేదా గట్టి కూరగాయలను విడిగా వండటానికి బదులు ప్రెజర్ కుక్కర్‌లో వండండి. కుక్కర్‌లో ఆవిరి ఒత్తిడి కారణంగా ఆహారం 3 రెట్లు వేగంగా ఉడుకుతుంది. తద్వారా గ్యాస్ సేవ్ అవుతుంది ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/gas-saving-tips-2.jpg</image:loc><image:caption><![CDATA[ బర్నర్ క్లీనింగ్: మీ గ్యాస్ మంట పసుపు లేదా ఎరుపు రంగులో వస్తుంటే, బర్నర్ రంధ్రాలలో చెత్త ఉందని అర్థం. అలా ఉంటే గ్యాస్ సరిగ్గా మండకా వృథా అవుతుంది. కాబట్టి బర్నర్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి. అలాగే పూరీలు, బజ్జీలు వేయించేటప్పుడు మరీ పెద్ద కడాయిని వాడకండి. పెద్ద కడాయిలోని నూనె వేడెక్కడానికి, ఆ వేడిని అలాగే ఉంచడానికి ఎక్కువ గ్యాస్ అవసరం అవుతుంది. అందుకోసం చిన్న, లోతుగా ఉండే కడాయిని ఉపయోగించడం మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/gas-saving-tips.jpg</image:loc><image:caption><![CDATA[ ముందే ప్రిపరేషన్ చేసుకోండి: వంట చేయడం ప్రారంభించే ముందే కూరగాయలు కోయడం, మసాలాలు సిద్ధం చేసుకోవడం వంటి పనులన్నీ పూర్తి చేసుకోండి. స్టవ్ వెలిగించిన తర్వాత కూరగాయలు కోయడం లాంటివి చేస్తే, ఈ లోపు గ్యాస్ వృథాగా కాలిపోతుంది. అలాగే పప్పులు, బియ్యం లేదా శనగలు వంటి వాటిని వండటానికి కనీసం అర గంట లేదా గంట ముందే నీటిలో నానబెట్టండి. ఇలా చేయడం వల్ల అవి త్వరగా ఉడుకుతాయి. అలాగే గ్యాస్ వినియోగం కూడా చాలా వరకు తగ్గుతుంది. ఈ కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా మీరు గ్యాస్‌తో పాటు డబ్బును కూడా ఆదా చేసుకోవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/jupiter-and-mars-aspect-money-and-power-for-these-zodiac-signs-details-in-telugu-1837039.html</loc><lastmod>2026-06-08T17:54:39+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/money-astrology-2026-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Money Astrology 2026 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/money-astrology.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువును తన స్వస్థానమైన మేష రాశి నుంచి కుజుడు వీక్షించడం జరుగుతోంది. ఈ వీక్షణ ఈ నెల (జూన్) 20 వరకు కొనసాగుతుంది. మిత్ర గ్రహాలైన కుజ, గురువులు ఒకరికొకరు కేంద్ర స్థానాల్లో (4, 10) ఉండడమే ఒక విశేషం కాగా కుజుడు ఈ గురువును వీక్షించడం మరొక విశేషం. దీనివల్ల మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, మీన రాశుల వారికి ఆదాయం పెరగడం, అధికారం లభించడం, కొన్ని వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడం, వివాదాలు సమసిపోవడం వంటివి తప్పకుండా జరుగుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/1-mesha-rashi-1.jpg</image:loc><image:caption><![CDATA[ మేషం: రాశ్యధిపతి కుజుడు చతుర్థ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువును వీక్షించడం వల్ల ఈ రాశివారికి రాజయోగాలతో పాటు ధన యోగాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో తప్ప కుండా అధికారయోగం కలుగుతుంది. ఆకస్మిక ధన లాభం, అప్రయత్న ధన ప్రాప్తి వంటివి అను భవానికి వస్తాయి. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగుల కల సాకారమవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/3-mithuna-rashi-3.jpg</image:loc><image:caption><![CDATA[ మిథునం: ఈ రాశికి ధన స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువును లాభ స్థానం నుంచి కుజుడు వీక్షించడం వల్ల మహా భాగ్య యోగం పట్టే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరగడంతో పాటు జీతభత్యాలు, అదనపు రాబడి కూడా బాగా వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అప్రయత్న ధన లాభం ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. అనేక విధాలుగా సంపద వృద్ధి చెందుతుంది. ఆస్తి కలిసి వచ్చే అవకాశముంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/4-karkataka-rashi-2.jpg</image:loc><image:caption><![CDATA[ కర్కాటకం: ఈ రాశికి అత్యంత శుభులైన కుజ, గురువులు ఒకరికొకరు కేంద్రంలో ఉండడం, గురువును కుజ గ్రహం వీక్షించడం వల్ల ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. విలువైన ఆస్తి కలిసి వస్తుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలకు భారీగా పెట్టుబడులు అందుతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా విజయం వరిస్తుంది. ఉద్యోగంలో భారీ జీతభత్యాలతో హోదా పెరుగుతుంది. వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/7-tula-rashi-3.jpg</image:loc><image:caption><![CDATA[ తుల: ఈ రాశికి దశమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువును కుజుడు వీక్షించడం వల్ల ఉద్యోగ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగం మారే ప్రయత్నాలు ఘన విజయం సాధిస్తాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ఊహించని అదృష్టాలు పడతాయి. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగరీత్యా ఇతర దేశాలకు తరచూ వెళ్లే అవకాశం కలుగుతుంది. గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/8-vrushchika-rashi-2.jpg</image:loc><image:caption><![CDATA[ వృశ్చికం: భాగ్య స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువును రాశ్యదిపతి కుజుడు స్వస్థానం నుంచి వీక్షించడం వల్ల ఆదాయపరంగా శుభ యోగాలు చోటు చేసుకుంటాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం గానీ, పెళ్లి సంబంధం కుదరడం గానీ జరుగుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆస్తి విలువ బాగా పెరుగుతుంది. బాగా విలువైన ఆస్తి కలిసి వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/12-meena-rasi-2.jpg</image:loc><image:caption><![CDATA[ మీనం: ఈ రాశికి ధన స్థానంలో ఉన్న కుజుడు పంచమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న రాశ్యధిపతి గురువును చూడడం వల్ల ప్రభుత్వ మూలక ధన లాభం, గుర్తింపు పొందడం జరుగుతుంది. భూలాభం కలుగుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలు ప్రకాశిస్తాయి. కొద్ది ప్రయత్నంతో వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా దూసుకుపోతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. జీవిత భాగస్వామికి కూడా ఊహించని అదృష్టం పడుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/these-3-zodiac-signs-may-receive-wealth-career-growth-and-good-news-this-week-1837012.html</loc><lastmod>2026-06-08T17:16:12+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/astrology-predictions.jpg</image:loc>
					<image:title><![CDATA[ Astrology Predictions ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rashifal-6.jpg</image:loc><image:caption><![CDATA[ వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, వాటి పరస్పర కలయికలకు విశేష ప్రాధాన్యత ఉంది. ప్రతి గ్రహం తన స్థానాన్ని    మార్చినప్పుడు దాని ప్రభావం వ్యక్తుల జీవితాలపై కనిపిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతారు. జూన్ రెండో వారంలో కొన్ని ముఖ్యమైన గ్రహస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో కొన్ని రాశుల వారికి ప్రత్యేకమైన అవకాశాలు, ఆర్థిక పురోగతి, కెరీర్‌లో సానుకూల మార్పులు కనిపించే సూచనలు ఉన్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rashifal2-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ సమయంలో గురు, శుక్ర గ్రహాలు ఒకే రాశిలో సంచరించడం వల్ల శుభ ఫలితాలు పెరుగుతాయని భావిస్తున్నారు. అలాగే కుజుడి బలమైన స్థానం ధైర్యం, నాయకత్వ లక్షణాలను పెంచుతుందని చెబుతున్నారు. ఈ గ్రహస్థితుల ప్రభావంతో ముఖ్యంగా మూడు రాశుల వారు అనుకూల ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నట్లు జ్యోతిష్య విశ్లేషణలు సూచిస్తున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rashifal3-5.jpg</image:loc><image:caption><![CDATA[ తులా రాశి.. ఈ రాశి వారికి ఈ వారం పురోగతి దిశగా అడుగులు పడే అవకాశం ఉంది. ఉద్యోగ రంగంలో మీ పనితీరుకు గుర్తింపు లభించవచ్చు. కొత్త బాధ్యతలు లేదా నాయకత్వ అవకాశాలు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. చాలాకాలంగా ఎదురుచూస్తున్న కొన్ని పనులు విజయవంతంగా పూర్తయ్యే అవకాశముంది. ఆర్థికంగా కూడా పరిస్థితులు మెరుగుపడతాయి. పెట్టుబడులు లేదా అదనపు ఆదాయ వనరుల ద్వారా లాభాలు పొందవచ్చు. కుటుంబ సభ్యుల సహకారం పెరిగి, ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దాంపత్య జీవితంలో సఖ్యత మరింత బలపడే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rashifal4-5.jpg</image:loc><image:caption><![CDATA[ మేష రాశి.. ఈ రాశి వారికి ఈ వారం ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరిగే సమయంగా చెప్పవచ్చు. కార్యాలయంలో మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు మీ కెరీర్‌కు మేలు చేసే అవకాశముంది. ఆర్థికంగా అనూహ్య లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్యాల ద్వారా ప్రయోజనం కలగవచ్చు. విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ప్రయత్నాలు సానుకూలంగా మారే అవకాశముంది. కుటుంబంలో శుభకార్యాల చర్చలు ప్రారంభమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rashifal5-2.jpg</image:loc><image:caption><![CDATA[ మిథున రాశి.. ఈ రాశి వారికి ఈ వారం అనేక రంగాల్లో అనుకూల ఫలితాలు కనిపించవచ్చు. ఆదాయం పెరగడంతో పాటు ఆర్థిక స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారులకు కొత్త కస్టమర్లు, కొత్త మార్కెట్లు అందుబాటులోకి రావచ్చు. వ్యక్తిగత జీవితంలో కూడా సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. జీవిత భాగస్వామితో ఉన్న చిన్నచిన్న విభేదాలు తగ్గి పరస్పర అవగాహన పెరుగుతుంది. సమాజంలో మీకు గౌరవం, గుర్తింపు పెరిగే అవకాశముంది. ఆరోగ్య పరంగా కూడా ఈ వారం సాధారణంగా అనుకూలంగానే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్యం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/indian-railways-facts-why-old-train-tickets-had-tiny-holes-on-both-sides-and-the-secret-technology-behind-it-1836976.html</loc><lastmod>2026-06-08T18:22:13+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/railways-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Railways ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/railways-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రతీఒక్కరూ ఎప్పుడో ఒకసారి రైళ్లల్లో ప్రయాణం చేసి ఉంటారు. కౌంటర్ దగ్గరకు వెళ్లి లైన్లో నిల్చోని టికెట్ తీసుకుని ఉండి ఉంటారు. అయితే ట్రైన్ టికెట్‌కి సంబంధించి చాలా ఆసక్తికర విషయాలు ఉన్నాయి. టికెట్‌పై ఛార్జీ, ఎక్కడ నుంచి ఎక్కడి వరకు అనేవి ముద్రించి ఉంటాయి. అయితే పాత రోజుల్లో  టికెట్‌కు రెండు వైపులా చివరిలో చిన్న రంధ్రాలు ఉండేవి. అసలు ఆ రంధ్రాలు ఎందుకు ఉన్నాయి? అనే అనుమానం చాలామందికి వచ్చి ఉంటుంది. దానికి సమాధానాలు ఇప్పుడు చూద్దాం ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/railways-2.jpg</image:loc><image:caption><![CDATA[ రైలు టికెట్‌పై ఉండే చిన్న రంధ్రాలను చూసి అలంకరణ కోసమో లేదా ఆకర్షణీయమైన డిజైన్ కోసం అని చాలామంది అనుకుంటారు. కానీ దీని వెనుక పెద్ద సీక్రెట్ ఉంది. ఒక పెద్ద సాంకేతిక కారణం ఉంది.  పాత రోజుల్లో టెక్నాలజీ, కంప్యూటర్లు, ప్రింటర్లు అంతగా అందుబాటులో ఉండేవి కాదు. దీంతో రైలు టికెట్లను ముద్రించేందుకు ప్రత్యేక యంత్రాలను ఉపయోగించేవారు. ఈ యంత్రాల కారణంగానే ఈ చిన్న రంధ్రాలు అవసరమయ్యాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/railways-3.jpg</image:loc><image:caption><![CDATA[ వీటిని స్ప్రోకెట్ రంధ్రాలుగా పిలుస్తారు. అప్పట్లో డాట్ మ్యాట్రిక్స్ ప్రింట్లను రైల్వేశాఖ ఉపయోగించేది. టికెట్ల జారీ కోసం వీటిని అభివృద్ది చేశారు. పాత రోజుల్లో టికెట్లను వేర్వేరు పేజీలుగా కాకుండా పొడవైన కాగితంపై ముద్రించేవారు. ప్రింటర్ కాగితాన్ని సరిగ్గా పట్టుకుని ముందుకు కదిలించడానికి వీలుగా ఇరువైపులా రంధ్రాలను కాగితానికి సమాన దూరంలో ఉంచేవారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/railways-4.jpg</image:loc><image:caption><![CDATA[ పాత డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్లు పూర్తిగా యాంత్రికమైనవి. వాటి లోపల చిన్న పళ్ళ చక్రాలు ఉండేవి. ఈ చక్రాలు కాగితం అంచులలోని రంధ్రాలలోకి సరిపోయి కాగితాన్ని ముందుకు లాగేవి. ఈ చిన్న రంధ్రాలు లేకపోతే కాగితం జారిపోయి వంకరగా అయ్యేది. అలా జరిగితే టికెట్‌పై ముద్రించిన సమాచారం సరైన స్థానంలో కాకుండా తప్పుగా ఉండేది. స్ప్రాకెట్ రంధ్రాల కారణంగా కాగితం సరళ రేఖలో కదలడమే కాకుండా ప్రతి టికెట్ సరిగ్గా ముద్రించబడేది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/railways-5.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ప్రస్తుతం ఆధునిక థర్మల్, డిజిటల్ ప్రింటర్లు అందుబాటులోకి వచ్చాయి. కొత్త ప్రింటర్లకు కాగితాన్ని కదిలించేందుకు గేర్‌వీల్ వ్యవస్థ అవసరం లేదు. నిరంతరం కదులుతూ ఉండే పొడవైన కాగితపు షీట్ల వాడకం కూడా తగ్గింది. ఫలితంగా టిక్కెట్ల పక్కల ఉండే ఆ చిన్న రంధ్రాలు క్రమంగా కనుమరుగయ్యాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/bathini-fish-prasadam-himalayan-secret-for-asthma-and-respiratory-relief-2026-1836902.html</loc><lastmod>2026-06-08T15:05:27+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chepa-prasadam.jpg</image:loc>
					<image:title><![CDATA[ Chepa Prasadam ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chepa-prasadam-4.jpg</image:loc><image:caption><![CDATA[ బత్తిని కుటుంబ కథనం ప్రకారం, వారి పూర్వీకుడు ఆరు తరాల ముందుకు చెందిన బత్తిని వీరన్న గౌడ్ వద్ద హిమాలయాల నుంచి వచ్చిన ఒక ముని సుమారు రెండు వారాల పాటు ఆశ్రయం పొందారు. వీరన్న గౌడ్ సేవాభావానికి మెచ్చిన ఆ ముని చేప ప్రసాదం తయారీ రహస్యాన్ని అందించడంతో పాటు కొన్ని కఠినమైన నియమ నిబంధనలను కూడా విధించారు. అప్పటి నుంచి దాదాపు 190 సంవత్సరాలుగా అదే సంప్రదాయాలు, నియమాలను పాటిస్తూ ప్రసాదం తయారు చేస్తున్నామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఏడాది చేప ప్రసాదం పంపిణీ జూన్ 8 రాత్రి 9 గంటల నుంచి, పంతులుగారు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ప్రారంభం కానుంది చేప ప్రసాదం పంపిణీ. అయితే ప్రసాదం తయారీకి సంబంధించిన ఏర్పాట్లు మాత్రం రెండు నెలల ముందే మొదలవుతాయని తెలిపారు.చేప ప్రసాదం తయారీకి ఉపయోగించే ఫార్ములా కుటుంబంలోని కేవలం నలుగురికే తెలుసని బత్తిని కుటుంబ సభ్యులు వెల్లడించారు. కుటుంబ సభ్యులందరూ తయారీ ప్రక్రియలో పాల్గొన్నప్పటికీ, అసలు రహస్యం మాత్రం ఎంపిక చేసిన అర్హులకే చెబుతారని తెలిపారు.కుటుంబ పెద్దలు సేవాగుణం, బాధ్యత, ప్రవర్తన వంటి అంశాలను పరిశీలించి తదుపరి తరానికి చెందిన వ్యక్తులను ఎంపిక చేస్తారని, అర్హులుగా భావించిన తర్వాతే తయారీ రహస్యం  వెల్లడిస్తారని చెప్పారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chepa-prasadam-3.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రసాదం తయారీలో ఉపయోగించే వనమూలికలను 400 నుంచి 500 కిలోల వరకు ప్రత్యేకంగా నూరుతారు. ఇందుకోసం ఉపయోగించే అమంద హస్త అనే చిన్న రోలు దాదాపు 100 ఏళ్ల చరిత్ర కలిగి ఉందని తెలిపారు. వనమూలికలు నూరే సమయంలో విపరీతమైన వేడి ఉత్పన్నమవుతుందని చెప్పారు.ముని విధించిన నియమాల ప్రకారం చేప ప్రసాదం తయారీ హైదరాబాద్‌లోని దూద్‌బౌలిలో ఉన్న బత్తిని కుటుంబ ఇంటిలోనే జరగాలి. ఆ ఇంటిలోని బావి నీటినే ఉపయోగించాలనే కచ్చితమైన నిబంధన ఇప్పటికీ కొనసాగుతోంది.ప్రతి ఏడాది మొదటి ప్రసాదం కూడా ఆ ఇంటిలోనే పంపిణీ చేసి, అనంతరం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రజలకు అందిస్తారు. చివరి ప్రసాదం కూడా తిరిగి అదే ఇంటిలో అందించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chepa-prasadam-1.jpg</image:loc><image:caption><![CDATA[ చేప ప్రసాదం తయారీకి ముందు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తారు. జూన్ 7న జరిగే పూజా కార్యక్రమాల అనంతరం ప్రసాదం తయారీ ప్రారంభమవుతుంది. మొత్తం ప్రక్రియ పూర్తవ్వడానికి సుమారు 12 నుంచి 14 గంటల సమయం పడుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు.చేప ప్రసాదం ఫార్ములా కోసం ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు కోట్ల రూపాయల ఆఫర్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని బత్తిని కుటుంబం తెలిపింది. కొందరు బ్లాంక్ చెక్కులు కూడా ఇచ్చేందుకు ముందుకొచ్చారని, అయినప్పటికీ ముని నియమం ప్రకారం ఇది పూర్తిగా సేవగా మాత్రమే కొనసాగించాలనే ఉద్దేశంతో ఫార్ములాను ఎప్పుడూ వెల్లడించలేదని స్పష్టం చేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chepa-prasadam-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఉబ్బసం, ఆయాసం వంటి సమస్యలతో బాధపడేవారు చేప ప్రసాదాన్ని కనీసం ఐదు సంవత్సరాల పాటు వరుసగా తీసుకోవాలని తాము సూచిస్తామని బత్తిని కుటుంబ సభ్యులు చెప్పారు.1997 వరకు చేప ప్రసాదం పంపిణీ పూర్తిగా దూద్‌బౌలిలోని ఇంటి నుంచే జరిగేదని తెలిపారు. ఆ సమయంలో అన్ని ఖర్చులు, ఏర్పాట్లు కుటుంబ సభ్యులే నిర్వహించేవారని చెప్పారు. అయితే భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని అవసరమైన సదుపాయాలు కల్పిస్తూ కార్యక్రమాన్ని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు తరలించిందని వెల్లడించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chepa-prasadam-2.jpg</image:loc><image:caption><![CDATA[ గత ఏడాది సుమారు నాలుగు లక్షల మంది భక్తులు చేప ప్రసాదం కోసం వచ్చారని, ఈ ఏడాది కూడా అదే స్థాయిలో లేదా అంతకంటే ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇప్పటికే అన్ని శాఖల సమన్వయంతో ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని తెలిపారు.భక్తులకు ముఖ్యమైన సూచన చేస్తూ, చేప ప్రసాదం కేవలం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మాత్రమే అందిస్తామని బత్తిని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. తమకు ఎలాంటి ఆన్‌లైన్ సేవలు లేవని, ఎవరైనా ఆన్‌లైన్ ద్వారా ప్రసాదం అందిస్తామని చెబితే అది మోసమని గుర్తించాలని హెచ్చరించారు.బత్తిని అనిరుద్ గౌడ్ మాట్లాడుతూ, ప్రస్తుతం తాము ఏడో తరం ప్రతినిధులుగా చేప ప్రసాదం సేవను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. తమ నాయనమ్మ, తండ్రి, బాబాయిలు సహా నలుగురికే ఫార్ములా రహస్యం తెలుసని, సేవాభావం, బాధ్యతాయుతమైన ప్రవర్తన ఉన్నవారికే భవిష్యత్తులో ఈ సంప్రదాయాన్ని అప్పగిస్తామని చెప్పారు.189 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం తెలంగాణలో ప్రత్యేక ఆధ్యాత్మిక-సాంప్రదాయ సేవగా నిలిచింది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/ketu-transit-june-30-4-zodiac-signs-face-major-troubles-1836874.html</loc><lastmod>2026-06-08T14:48:08+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/ketu-sanchar.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ketu Sanchar ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/ketu-sanchar-1.jpg</image:loc><image:caption><![CDATA[ అలాగే చాలా వరకు కేతువు నక్షత్ర సంచారం లేదా రాశి సంచారం చేసినప్పుడు కొన్ని రాశుల వారికి ఇది శుభాలను తీసుకొస్తే మరికొన్ని రాశులకు అనేక ఇబ్బందులను తీసుకొస్తుంది. అయితే జూన్ 30న కేతువు మాఘ నక్షత్రంలోకి సంచారం చేయనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి అనేక ఇబ్బందులు ఎదురు కానున్నాయంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/ketu-sanchar-2.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభ రాశి : వృషభ రాశి వారికి ప్రతి రోజూ సమస్యలే ఎదురు అవుతాయి. కేతువు నక్షత్ర సంచారం వీరికి అనేక ఇబ్బందులు తీసుకొస్తుంది. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు అధికం అవుతాయి. ఏ పని చేసినా కలిసి రాకపోవడం, మనశ్శాంతి కరువు అవ్వడం వంటిది జరుగుతుంది. అందుకే ఈ రాశి వారు జూన్ 30 నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు పండితులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/ketu-sanchar-3.jpg</image:loc><image:caption><![CDATA[ కన్యా రాశి : కన్యా రాశి వారికి అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా దూర ప్రయాణం చేసే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంది. కుటుంబంలో గొడవలు అధికం అవుతాయి. అవి మీ మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయి. ఎవరు అయితే చాలా రోజుల నుంచి విదేశీ ప్రయాణం చేయాలి అనుకుంటున్నారో వారికి ఈ సారి కూడా కలిసి రాదు, ఆర్థిక నష్టం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖర్చు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/ketu-sanchar-4.jpg</image:loc><image:caption><![CDATA[ మీన రాశి : మీన రాశి వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. అప్పుల బాధలు పెరుగుతాయి. వ్యాపారంలో ఎక్కువ నష్టాలు వస్తుంటాయి. అంతే కాకుండా భాగస్వామ్య వ్యాపారులు తమ భాగస్వాముల నుంచి ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఒత్తిడి అధికం అవుతుంది. ఏం చేయాలో తోచని పరిస్థితులు ఎదురు అవుతాయి. చాలా నష్టపోవాల్సి వస్తుంది. పనుల్లో ఆటంకాలు ఎక్కువ అవుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/ketu-sanchar-5.jpg</image:loc><image:caption><![CDATA[ ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి జూన్ 30 నుంచి అనేక ఇబ్బందులు ఎదురు అవుతాయి. చాలా రకాల సమస్యలు ఎదుర్కుంటారు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. లేకపోతే మాట పట్టింపులు వచ్చే ఛాన్స్ ఉంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/know-this-horror-movie-still-trending-in-hot-star-ott-last-2-years-that-is-munjya-1836883.html</loc><lastmod>2026-06-08T14:47:45+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/munjya-ott-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Munjya Ott ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/munjya-ott.jpg</image:loc><image:caption><![CDATA[ సినిమా పరిశ్రమలో ఒకరి అదృష్టం ఎప్పుడు మారుతుందో చెప్పలేం. కోట్ల రూపాయలు సంపాదించే సూపర్‌స్టార్లు, పెద్ద హీరోయిన్లు నటించిన సినిమాలు ఫ్లాప్ అవుతాయి. కానీ సరిగ్గా రెండేళ్ల క్రితం, 2024 జూన్ 7న, ఒక సినిమా థియేటర్లలోకి వచ్చి పరిశ్రమలోని లెక్కలన్నింటినీ మార్చేసింది. పెద్ద స్టార్ కాస్ట్ ఎవరూ లేకుండా, ఈ సినిమా కేవలం ఒకే కథ బలంతో బాక్సాఫీస్ వద్ద డబ్బు సంపాదించింది. ఈ సినిమా మ్యాడాక్ ఫిల్మ్స్ వారి సూపర్ హిట్ &#039;ముంజ్యా&#039;. ఈ హారర్-కామెడీ చిత్రం విడుదలై రెండు సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ వైరలవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/munjya.jpg</image:loc><image:caption><![CDATA[ &#039;స్త్రీ&#039;, &#039;భేదియా&#039; విజయాల తర్వాత దినేష్ విజన్ &#039;ముంజ్యా&#039;ను ప్రకటించినప్పుడు, చాలామంది ఇది ఒక చిన్న ప్రయోగం అవుతుందని భావించారు. కేవలం 30 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం బడ్జెట్‌లో సగం, అంటే సుమారు 15 కోట్ల రూపాయలు, కేవలం &#039;ముంజ్య&#039; పాత్ర విఎఫ్ఎక్స్ , యానిమేషన్‌ను రూపొందించడానికే ఖర్చు చేశారు. ఈ డిజిటల్ దెయ్యాన్ని నిజంగా, సజీవంగా కనిపించేలా చేయడానికి చిత్రనిర్మాతలకు పూర్తి ఒక సంవత్సరం పట్టింది. కానీ ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చినప్పుడు, దాని విలక్షణమైన కథ, అద్భుతమైన విఎఫ్ఎక్స్, కొంకణి సంస్కృతి స్పర్శకు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/munjya-film.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ సినిమా కథ మహారాష్ట్రకు చెందిన ఒక పాత జానపద కథ ఆధారంగా రూపొందించబడింది. ఈ కథ ప్రకారం, &#039;ముంజ్య&#039; అనే ఒక యువకుడి దెయ్యం పెళ్లి చేసుకోవడానికి చాలా తొందరపడుతూ ఉంటుంది. ఈ దెయ్యం బిట్టును వెంటాడటం మొదలుపెట్టడంతో, అతని కుటుంబం మొత్తం మీద పడిన శాపం బయటపడుతుంది. &#039;బిట్టు&#039; పాత్రలో అభయ్ వర్మ తన సహజ నటనతో, అద్భుతమైన హాస్య సమయస్ఫూర్తితో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. నటి శర్వరి వాఘ్ &#039;బేలా&#039; పాత్రకు ఎంతటి జీవం పోసిందంటే, ఈ ఒక్క సినిమానే ఆమెకు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/munjya-movie.jpg</image:loc><image:caption><![CDATA[ ఇది కాకుండా, బిట్టు తల్లి పాత్రలో మోనా సింగ్ నటించగా, &#039;కట్టప్ప&#039; ఫేమ్ దక్షిణాది నటుడు సత్యరాజ్ పోషించిన టెక్నీషియన్ &#039;ఎల్విస్ కరీం ప్రభాకర్&#039; పాత్ర బాగా ప్రజాదరణ పొందింది. ఈ చిత్రం తొలిరోజే అనూహ్యంగా 4.21 కోట్ల ఓపెనింగ్ వసూళ్లతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించింది. తొలి వారంలోనే రూ. 35 కోట్ల మార్కును, రెండు వారాల్లో రూ. 70 కోట్ల మార్కును దాటింది. భారతదేశంలో ఈ చిత్రం మొత్తం రూ. 107.48 కోట్ల నికర వసూళ్లను రాబట్టగా, ప్రపంచవ్యాప్తంగా ఈ తక్కువ బడ్జెట్ చిత్రం రూ. 132.13 కోట్ల బంపర్ కలెక్షన్ సాధించి చరిత్ర సృష్టించింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/munjya-news.jpg</image:loc><image:caption><![CDATA[ కథకు సరైన పస ఉంటే, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి పెద్ద స్టార్స్ అవసరం లేదని &#039;ముంజ్యా&#039; నిరూపించింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ జియో హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. హిందీ, మరాఠీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలోనూ ఈ చిత్రం అందుబాటులో ఉంది. హారర్ సినిమా.. ఆద్యంతం భయపెట్టే సన్నివేశాలు.. ఊహించని మలుపులతో ఈ సినిమా సాగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి ఓటీటీలో విపరీతమైన  రెస్పాన్స్ వస్తుంది. రెండేళ్లు గడిచినప్పటికీ ఈ మూవీ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/gruha-pravesam-ritual-importance-of-boiling-milk-and-its-impact-1836861.html</loc><lastmod>2026-06-08T14:33:17+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/shouldnt-milk-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Shouldnt Milk 3 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/shouldnt-milk-1.jpg</image:loc><image:caption><![CDATA[ అందమైన ఇల్లు కట్టుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కరి అందమైన కల అది. వారికి ఇష్టమైన భవనం నిర్మించుకోవడం కోసం ఎంతో కష్టపడుతుంటారు. అయితే ఇల్లు కట్టుకోవడం, తర్వాత గృహ ప్రవేశం చేసి పాలు పొంగించడం అనేది కామన్. మన హిందూ సంప్రదాయంలో ఇంటిలోకి వెళ్లిన తర్వాత పాలు పొంగించడం చాలా శుభప్రదమని చెబుతుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/shouldnt-milk.jpg</image:loc><image:caption><![CDATA[ మరి అసలు గృహ ప్రవేశం సమయంలో పాలు ఎందుకు పొంగించాలి అని చాలా మందిలో ఉంటుంది. దానికి పండితులు ఏం చెబుతున్నారు అంటే? పాలు చాలా స్వచ్ఛమైనవి. ఏ ఇంటిలో అయితే మొదటగా పాలు పొంగిస్తారో, ఆ ఇంటిలో పాలు ఎలా పొంగిపోతాయో.. వారి ఇంటిలో సిరి సంపదలు కూడా అలా పొంగిపొర్లు తాయని అర్థం. అంతే కాకుండా ఇంటిలో సుఖ సంతోషాలు, ధన లాభం కలగాలని పాలు పొంగిస్తారని చెబుతున్నారు పండితులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/shouldnt-milk-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఏ ఇంటిలో అయితే మొదటగా పాలు పొంగిస్తారో ఆ ఇల్లు సుఖ సంతోషాలతో కలకల లాడటమే కాకుండా, ప్రతి కూల శక్తి నశించి సానుకూలత పెరుగుతుందంట. పాలు పొంగడం వలన ధనం పెరుగుతుందంట.  అంతే కాకుండా ఆ ఇంటిలో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరగడం, వంశాభివృద్ధికి దోహదం చేస్తాయంట. అందుకే ప్రతి ఇంటిలో మొదటగా పాలు పొంగించి, ఆ పాలతో స్వీట్ తయారు చేసి సమర్పిస్తుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/shouldnt-milk-4.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ఎవరో ఒకరో తెలిసో తెలియక కొన్ని సార్లు పాలు పొంగించడం మర్చిపోవడమూ లేక, పాలు పొంగనివ్వకుండా వదిలేయడం చేస్తుంటారు. మరి ఇలా పాలు పొంగించకపోతే ఏమైనా సమస్యలు ఎదురు అవుతాయా? అంటే, పాలు పొంగించడం శుభ సూచకం. కానీ ఒక వేళ అనివార్య కారణాల వలన పాలు పొంగించకపోతే ఇంటిలో కలహాలు ఎక్కువ అవుతాయిని చెబుతున్నారు  పండితులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/shouldnt-milk-5.jpg</image:loc><image:caption><![CDATA[ అందుకే తప్పకుండా పాలు పొంగించాలంట, ఏదైన కారణం చేత పొంగించకపోయినా, మరో సారి మంచి రోజు చూసుకొని పాలు పొంగిచుకోవడం శుభ ప్రదం అని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.  నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/monsoon-rains-unraveling-the-science-behind-pre-rain-humidity-and-heat-1836764.html</loc><lastmod>2026-06-08T13:33:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rain-5-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Rain 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rain-2.jpg</image:loc><image:caption><![CDATA[ నైరుతి రుతుపవనాలు తీరం దాటి వచ్చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు ప్రారంభం అయ్యాయి. కొన్ని చోట్ల తొలకరి చినుకులు పడుతుంటే, మరికొన్ని చోట్ల వర్షాలు దంచి కొడుతున్నాయి. అయితే వర్షం పడటానికి ముందు మనకు ప్రకృతి కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది అంటారు. ముఖ్యంగా మన పెద్దవారు కొన్ని విషయాలు చెబుతుంటారు. చాలా ఉక్కపోతగా ఉంది కాసేపట్లో తప్పకుండా వర్షం వస్తుంది బయటకు వెళ్లకండి అని. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు వర్షం పడే ముందు ఉక్కపోత ఎందుకు ఉంటుంది. అసలు దీని గురించి నిపుణులు ఏమంటున్నారో మనం తెలుసుకుందాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rain.jpg</image:loc><image:caption><![CDATA[ వర్షా కాలం ప్రారంభం అయ్యింది. నైరుతి రుతుపవనాలు రాకతో తొలకరి చినుకులు పడుతున్నాయి. ఇక చాలా రోజుల నుంచి ఎండ, వేడితో ఇబ్బంది పడిన వారికి ఈ వర్షాలు కాస్త హాయిని ఇచ్చాయనే చెప్పాలి. అయితే వర్షం పడే ముందు ఉక్కపోత చాలా ఎక్కువగా ఉంటుంది. దాని వలన ఇబ్బంది పడుతుంటారు, కొందరైతే ఉక్కపోతత సతమతం అవుతుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rain-1.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే అలా ఉక్కపోత ఎక్కువగా ఉన్న సమయంలో మన అమ్మమ్మ తాతమ్మ వాళ్లు చెబుతుంటారు. ఉక్కపోత చాలా ఎక్కువగా ఉంది కాసేపట్లో తప్పకుండా వర్షం పడుతుంది అని. వారు చెప్పినట్లుగానే చాలా సార్లు ఉక్కపోతగా ఉండి, కాసేపటికే వర్షం పడుతుంది. మరి అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? అసలు ఉక్కపోతకు వర్షం రాకకు సంబంధం ఏమిటి అని ఆలోచించారా? దీనికి అనేక కారణాలు ఉన్నాయంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rain-3.jpg</image:loc><image:caption><![CDATA[ వర్షం వచ్చే ముందు నల్లని మేఘాలు ఆకాశాన్ని కమ్మేస్తుంటాయి. ఈ సమయంలో వాతావరణంలో  తేమ శాతం ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా వేడి గాలి మొత్తం ఆకాశంలోకి చేరి మేఘాలుగా మారుతుందంట. అంతే కాకుండా మన శరీరంలో కూడా ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఆ వేడిని తగ్గించడానికి సహజంగానే శరీరం నుంచి చెమట పెరుగుతుంది. ఉక్కపోత ద్వారా శరీరంలోని వేడి తగ్గుతుంది. అందువల్లనే మనకు వర్షం పడే ముందు విపరీతమైన ఉక్కపోత ఉంటుందంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rain-4.jpg</image:loc><image:caption><![CDATA[ అంతే కాకుండా, వాతావరణంలో తేమ పెరిగిపోవడం వలన శరీరంలోని చెమట ఆవిరి కాకుండా అలాగే ఉండిపోతుందంట. దీంతో శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి, ఉక్కపోత పెరగడం జరుగుతుందంట. ఈ కారణాల వలన వర్షం పడే ముందు ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది అని చెబుతున్నారు నిపుణులు. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/is-your-ac-leaking-water-at-home-then-know-common-causes-and-easy-diy-fizes-1836749.html</loc><lastmod>2026-06-08T13:14:18+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/simple-ways-to-fix-ac-water-leaking-issue-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Simple Ways To Fix Ac Water Leaking Issue ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/simple-ways-to-fix-ac-water-leaking-issue-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంట్లోని ఏసీ నుండి నీరు లీక్ అవ్వడానికి అన్నిటికంటే పెద్ద,  అత్యంత సాధారణ కారణం కండెన్సేట్ డ్రెయిన్ లైన్ మూసుకుపోవడం. ఏసీ నడుస్తున్నప్పుడు గదిలోని తేమను లాగి, నీటి రూపంలో బయటకు పంపే పైపులో కాలక్రమేణా దుమ్ము, ధూళి లేదా నాచు పేరుకుపోతాయి. ఈ విధంగా చెత్తాచెదారం ఇరుక్కుపోయినప్పుడు, నీరు బయటకు వెళ్లే మార్గం లేక రివర్స్ అయి ఇండోర్ యూనిట్ గుండా గది లోపలికి లీక్ అవ్వడం మొదలవుతుంది. దీనిని వెట్/డ్రై వాక్యూమ్ క్లీనర్ లేదా ఒక గట్టి బ్రష్ సహాయంతో ఇంట్లోనే శుభ్రం చేసి సమస్యను పరిష్కరించవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/simple-ways-to-fix-ac-water-leaking-issue.jpg</image:loc><image:caption><![CDATA[ రెండో ప్రధాన కారణం ఏసీ ఎయిర్ ఫిల్టర్లను నిర్లక్ష్యం చేయడం. ఎయిర్ ఫిల్టర్‌ను చాలా కాలం పాటు శుభ్రం చేయకపోతే దానిపై దుమ్ము దట్టంగా పేరుకుపోయి, గాలి ప్రవాహం పూర్తిగా ఆగిపోతుంది. గాలి సరిగ్గా ఆడనప్పుడు ఏసీ లోపల ఉండే ఎవాపరేటర్ కాయిల్ విపరీతంగా చల్లబడిపోయి, దానిపై మంచు గడ్డకట్టడం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఏసీ ఆఫ్ చేసినప్పుడు లేదా కంప్రెషర్ ఆగినప్పుడు ఆ మంచు ఒక్కసారిగా కరిగి, వాటర్ ట్రే నుండి నీరు పొంగి కిందకు పడుతుంది. అందుకే ప్రతి 1 నుండి 3 నెలలకు ఒకసారి ఎయిర్ ఫిల్టర్లను తీసి శుభ్రం చేయడం లేదా మార్చడం అలవాటు చేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/simple-ways-to-fix-ac-water-leaking-issue-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక మూడవ సాంకేతిక కారణం ఏసీలో రిఫ్రిజెరెంట్ అంటే కూలింగ్ గ్యాస్ స్థాయి తగ్గిపోవడం. ఏసీ పైపుల్లో ఎక్కడైనా చిన్న లీకేజీలు ఉండి గ్యాస్ తగ్గిపోతే, సిస్టమ్‌లో ఒత్తిడి మారిపోయి ఎవాపరేటర్ కాయిల్స్ గడ్డకట్టుకుపోతాయి. ఈ మంచు కరిగినప్పుడు కూడా నీరు లీక్ అయ్యే సమస్యలు వస్తాయి. ఒకవేళ గ్యాస్ తక్కువగా ఉందని గమనిస్తే, వెంటనే నిపుణుడైన టెక్నీషియన్‌ను పిలిపించి లీకేజ్ చెక్ చేయించి గ్యాస్ నింపించడం ఒక్కటే మార్గం. ఇది కాకుండా ఏసీని గోడకు బిగించేటప్పుడు దాని కోణం లేదా అలైన్‌మెంట్ కొద్దిగా తప్పుగా ఉన్నా కూడా నీరు డ్రెయిన్ పైపులోకి వెళ్లకుండా లోపలికి పడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/simple-ways-to-fix-ac-water-leaking-issue-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఒకవేళ మీ స్ప్లిట్ ఏసీ మరమ్మత్తుకు ఎక్కువ సమయం పట్టేటట్లయితే లేదా టెక్నీషియన్ రావడం ఆలస్యమైతే, తాత్కాలిక కూలింగ్ కోసం ఎక్కడికైనా సులభంగా తరలించగలిగే పోర్టబుల్ ఏసీ ఒక గొప్ప, తెలివైన ప్రత్యామ్నాయం అవుతుంది. అలాగే ఏసీ కొనేటప్పుడు మీ గది పరిమాణాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం ముఖ్యం. మీ గది చిన్నగా ఉంటే నీరు, విద్యుత్తును ఆదా చేయడానికి 1-టన్ ఏసీ ఉత్తమ ఎంపికగా నిలుస్తుంది. ఏసీని క్రమ పద్ధతిలో సర్వీసింగ్ చేయించడం వల్ల ఇలాంటి చిన్న చిన్న సమస్యలు రాకుండా ఎక్కువ కాలం మన్నిక వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/simple-ways-to-fix-ac-water-leaking-issue-3.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుత రోజుల్లో కొత్త ఎలక్ట్రానిక్స్ లేదా ఏసీ కొనుగోలు చేసేటప్పుడు జేబుకు ఎక్కువ చిల్లు పెట్టాల్సిన అవసరం లేదు. మార్కెట్లోని వివిధ డీలర్ ఆఫర్లు, బ్రాండ్ డిస్కౌంట్లు, బజాజ్ ఫైనాన్స్ వంటి నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లను ఒకదానితో ఒకటి కలిపి సరిచూసుకోవచ్చు. దీనివల్ల ఏసీ కొనుగోలుపై పెద్ద మొత్తంలో డబ్బు ఆదా అవుతుంది. వేసవి ముగిసేలోపు మీ ఏసీ ఫిల్టర్లను ఒకసారి తనిఖీ చేసుకుని, చల్లని గాలితో పాటు ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించండి ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/mercury-transit-in-gemini-zodiac-signs-likely-to-gain-extra-income-1836723.html</loc><lastmod>2026-06-08T13:00:28+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/extra-income-astrology.jpg</image:loc>
					<image:title><![CDATA[ Extra Income Astrology ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/wealth-astrology.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిషశాస్త్రం ప్రకారం అదనపు ఆదాయానికి బుధుడు కారకుడు. మదుపులు, పెట్టుబడులు, బ్యాంకులు, వ్యాపారాలు, షేర్లు, స్పెక్యులేషన్లు వంటి ధన సంబంధమైన వ్యవహారాల మీద బుధుడికే ఆధిపత్యం ఉంటుంది. ప్రస్తుతం తన స్వస్థానమైన మిథున రాశిలో సంచారం చేస్తున్న బుధుడి వల్ల కొన్ని రాశులవారు అదనపు ఆదాయాన్ని సంపాదించుకోవడానికి అవకాశం కలిగింది. ఈ నెల(జూన్) 22 లోపల వృషభం, మిథునం, కన్య, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారు మదుపులు చేయగలిగితే తప్పకుండా సంపన్నులు, విజేతలు అయ్యే అవకాశం ఉంది. కొత్త వ్యాపారాలకు, వ్యాపారాల్లో పెట్టుబడులకు, షేర్లకు, ఆర్థిక లావాదేవీలకు సమయం అనుకూలంగా ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/2-vrushaba-rasi-2.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభం: ఈ రాశికి ధన స్థానంలో ధనాధిపతి బుధుడి సంచారం వల్ల ఈ రాశివారు అతి తక్కువ పెట్టు బడితో అత్యధికంగా లాభాలు పొందే అవకాశం ఉంది. ఎటువంటి పెట్టుబడి పెట్టినా, ఎంత పెట్టుబడి పెట్టినా బాగా  కలిసి వచ్చే అవకాశం ఉంది. కొత్తగా వ్యాపారాలు చేపట్టడానికి సమయం అనుకూలంగా ఉంది. షేర్లు, స్టాకులు కొనడం వల్ల తప్పకుండా అంచనాల్ని మించి లాభాలు పొందుతారు. స్థలాలు, ఆస్తులు, బంగారం మీద పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా ధన లాభాలు కలుగుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/3-mithuna-rashi-2.jpg</image:loc><image:caption><![CDATA[ మిథునం: ఈ రాశికి అధిపతి అయిన బుధుడు ప్రస్తుతం తన స్వస్థానమైన మిథునంలో సంచారం చేస్తున్నందు వల్ల వీరిలో వ్యాపార దక్షత పెరుగుతుంది. మదుపులు, పెట్టుబడులు అత్యధికంగా లాభిస్తాయి. వడ్డీ వ్యాపారాలు, లాటరీలు లాభాల వర్షం కురిపిస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. అతి తక్కువ పెట్టుబడితో అత్యధిక లాభాలు పొందడం కూడా జరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. ఇతరులతో కలిసి చేసే వ్యాపారాలు కూడా లాభిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/6-kanya-rashi-2.jpg</image:loc><image:caption><![CDATA[ కన్య: రాశ్యధిపతి బుధుడు దశమ కేంద్రంలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి సొంత వ్యాపారాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఆదాయం పెరగడంతో పాటు, అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల కూడా అత్యధికంగా లాభాలు పొందుతారు. షేర్లు, స్పెక్యులేషన్లు, లాటరీలు, వడ్డీ వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీల మీద పెట్టుబడులు పెట్టడం చాలా మంచిది. దూరదృష్టితో, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించే ఈ రాశివారు పట్టిందల్లా బంగారమవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/7-tula-rashi-2.jpg</image:loc><image:caption><![CDATA[ తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో సంచారం చేస్తున్న భాగ్యాధిపతి బుధుడి వల్ల ఈ రాశివారు అతి స్వల్ప కాలంలో కోటీశ్వరులయ్యే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి సమయం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాల్లో పెట్టుబడులు వంటి అదనపు ఆదాయం మీద పెట్టే పెట్టుబడులు తప్పకుండా కనక వర్షం కురిపిస్తాయి. ఎటువంటి వ్యాపారం తలపెట్టినా బాగా కలిసి వస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు అత్యధికంగా ఆర్థిక లాభాలనిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/9-dhanusu-rashi-2.jpg</image:loc><image:caption><![CDATA[ ధనుస్సు: ఈ రాశిలో సప్తమ స్థానంలో సప్తమ, దశమాధిపతి బుధుడి సంచారం వల్ల ఈ రాశివారికి ఏ భాగ స్వామ్య వ్యాపారమైనా కలిసి వస్తుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందుతారు. ఎటు వంటి పెట్టుబడి పెట్టినా, ఏ విధంగా మదుపు చేసినా లాభాల పంట పండుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల అంచనాల్ని మించి ధన లాభాలు కలుగుతాయి. కొద్ది ప్రయత్నంతో అదనపు ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆస్తుల మీద పెట్టుబడులు పెట్టడం మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/11-kumbha-rashi-2.jpg</image:loc><image:caption><![CDATA[ కుంభం: ఈ రాశికి పంచమ స్థానంలో పంచమాధిపతి బుధుడి సంచారం జరగడం వల్ల ఆస్తిపాస్తుల మీదా, రియల్ ఎస్టేట్ మీదా పెట్టుబడులు పెట్టడం వల్ల అపార ధన లాభం కలుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేయడం వల్ల లాభాలు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, బంగారం, భూమి, లాటరీల మీద పెట్టుబడులు పెట్టి ఊహించని లాభాలు పొందే అవకాశం ఉంది. అదనపు ఆదాయం అత్యధికంగా పెరిగే అవకాశం ఉన్నందువల్ల ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/maruti-suzuki-upcoming-suvs-2026-hybrid-fronx-grand-vitara-7-seater-brezza-facelift-1836777.html</loc><lastmod>2026-06-08T13:33:41+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/maruti-suzuki-suvs-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Maruti Suzuki Suvs ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/maruti-suzuki-suvs.jpg</image:loc><image:caption><![CDATA[ దేశంలో మారుతున్న కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా మారుతి సుజుకీ తన శైలిని పూర్తిగా మార్చుకుంటోంది. కంపెనీ తన &#039;విజన్ 3.0&#039; వ్యూహంలో భాగంగా ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్) విభాగంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాబోయే రోజుల్లో తన మోడళ్ల సంఖ్యను 19 నుంచి 29కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా మధ్యతరగతి, పెద్ద కుటుంబాల అవసరాలను తీర్చేందుకు సరికొత్త హైబ్రిడ్ ఇంజిన్లతో కూడిన కార్లను సిద్ధం చేస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/maruti-fronx-hybrid.jpg</image:loc><image:caption><![CDATA[ లీటరుకు 35 కిలోమీటర్ల మైలేజీతో సరికొత్త ఫ్రాంక్స్ హైబ్రిడ్: మారుతి సుజుకీ నుంచి రాబోతున్న కార్లలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మోడల్ &#039;ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్&#039;. ఈ కారులో కంపెనీ సరికొత్త స్ట్రాంగ్ హైబ్రిడ్ సాంకేతికతను ప్రవేశపెట్టబోతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ కొత్త హైబ్రిడ్ ఇంజిన్ సహాయంతో ఈ కారు లీటరు పెట్రోలుకు ఏకంగా 35 కిలోమీటర్ల వరకు అద్భుతమైన మైలేజీని అందిస్తుందని అంచనా. ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్న ప్రస్తుత తరుణంలో, మధ్యతరగతి ప్రజలకు ఈ కారు ఒక పెద్ద వరమనే చెప్పాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/grand-vitara-7-seater.jpg</image:loc><image:caption><![CDATA[ పెద్ద కుటుంబాల కోసం గ్రాండ్ విటారా 7-సీటర్: ఇప్పటికే మార్కెట్లో మంచి విజయాన్ని అందుకున్న గ్రాండ్ విటారా మోడల్‌ను ఇప్పుడు మరింత పెద్దగా మార్చబోతున్నారు. ఉమ్మడి కుటుంబాలు, ఎక్కువ మంది ప్రయాణించేందుకు వీలుగా దీనిని &#039;త్రీ-రో&#039; (మూడు వరుసల సీట్లు) 7-సీటర్ వేరియంట్‌గా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం ఉన్న 5-సీటర్ మోడల్ కంటే ఇది మరింత విలాసవంతంగా, విశాలమైన బూట్ స్పేస్‌తో రానుంది. టాటా సఫారీ, మహీంద్రా ఎక్స్‌యూవీ700 వంటి పెద్ద కార్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/maruti-brezza-facelift.jpg</image:loc><image:caption><![CDATA[ కొత్త అవతారంలో బ్రెజ్జా, గ్రాండ్ విటారా ఫేస్‌లిఫ్ట్: భారతీయ రోడ్లపై అత్యధికంగా కనిపించే బ్రెజ్జా కారును సరికొత్త హంగులతో కంపెనీ అప్‌డేట్ చేస్తోంది. ఈ సరికొత్త బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను తిరిగి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఇందులో పెద్ద ఇన్‌ఫోటైన్‌మెంట్ స్క్రీన్, అధునాతన భద్రతా ఫీచర్లు (ADAS) ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దీనితో పాటు, గ్రాండ్ విటారా 5-సీటర్ మోడల్‌ను కూడా సరికొత్త డిజైన్, అదనపు ఫీచర్లతో రీ-లాంచ్ చేయనున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/maruti-hybrid-cars.jpg</image:loc><image:caption><![CDATA[ భారతీయ ఆటోమొబైల్ రంగాన్ని శాసిస్తున్న మారుతి సుజుకీ, రాబోయే రోజుల్లో మైలేజ్, లగ్జరీ కలయికతో కొత్త సంచలనాలకు సిద్ధమైంది. వినూత్న శైలిలో రాబోతున్న ఈ సరికొత్త ఎస్‌యూవీ కార్లు కచ్చితంగా వాహన ప్రియులను అలరిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ కోరుకునే వారికి ఇవి ఉత్తమ ఎంపిక కానున్నాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/swallowing-fish-bones-dangerous-benefits-and-risks-guide-1836676.html</loc><lastmod>2026-06-08T12:13:50+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chepa-mullu-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Chepa Mullu 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chepa-mullu.jpg</image:loc><image:caption><![CDATA[ చేపలతో అనేక రకాల వంటకాలు చేస్తుంటారు. ఇక ఏ వంటకం చేసినా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా చేపల పులుసును మించినది ఉండదు అంటారు. అందుకే చాలా మంది ఎక్కువగా చేపలతో పులుసు చేసుకొని తింటారు. చాలా మంది ఫేవరెట్ కూడా ఈ రిసిపీ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chepa-mullu-3.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే కొంత మందికి చేపలు అంటే అమితమైన ఇష్టం ఉంటుంది. కానీ చేపల్లో ఉన్న ముల్లుల కారణంగా వాటిని తినడానికి భయపడుతుంటారు. కొన్ని సార్లు ఎవరైనా ముళ్లులు తీసి ఇస్తే ఇష్టంగా తింటారు. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు చేప ముళ్లు మంచిదేనా? లేదా ఇది కడుపులోకి వెళితే ఏమైన ప్రమాదమా? అని, కాగా దాని గురించి తెలుసుకుందాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chepa-mullu-2.jpg</image:loc><image:caption><![CDATA[ నిపుణుల ప్రకారం చేప ముళ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది, ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కానీ ఎప్పుడూ కూడా పెద్ద చేపల ముల్లులు తినకూడదంట. ఇవి చాలా ప్రమాదకరం అని చెబుతున్నారు వైద్యులు. కొన్ని సార్లు ఇవి పేగుల్లో గుచ్చుకోవడం లేదా, గొంతులో ఇరుక్కుపోవడం వంటి సమస్యలు ఎదురయ్యే ఛాన్స్ ఉన్నదంట. అందువలన ఒకటికి రెండు సార్లు ఆలోచించి, చాలా జాగ్రత్తగా ముల్లు కడుపులోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. అయితే ఏ చేపల ముల్లులు తినాలి అంటే? సార్డినెస్ వంటి చేపలు, కొన్ని చేపల ముల్లులు లబ్బరులా మెత్తగా ఉంటాయి. అలాంటి వాటిని తిన్నప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవంట.అంతే కాకుండా చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. అందుకే చాలా మంది చిన్న చిన్న చేపలను వండుకొని తింటారు. వీటి ముళ్లుల వలన ఎలాంటి ప్రమాదం ఉండదు క, అలాగే విటమిన్ డీ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం ఈ చేపల ముల్లుల్లో పుష్కలంగా ఉంటుంది, అందుకే చిన్న చేపల ముల్లులు తింటుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chepa-mullu-4.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే కొంత మంది చేపలు తింటుంటే అనుకోకుండా ముల్లు కడుపులోకి వెళ్తుంది. దీంతో చాలా భయపడి పోతుంటారు. అసలు ముల్లు కడుపులో అరుగుతుందా? లేదా అనే అయోమయంలో ఉంటారు. చాలా భయపడి పోతుంటారు. మరి అసలు కడుపులోకి చేప ముల్లు వెలితే అరుగుతుందా? అంటే?చేప ముళ్లు కడుపులోకి , అన్నవాహికలోకి వెళ్లినా అంత టెన్షన్ తీసుకోవాల్సిన  అవసరం లేదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chepa-mullu-6.jpg</image:loc><image:caption><![CDATA[ ఎందుకంటే? కడుపులో ఉండే ఆమ్లాలు చేప ముల్లు ను చాలా సులభంగా కరిగించేస్తాయంట. కానీ కొన్ని సార్లు కడుపులోపలికి వెళ్లి అన్నవాహిక నుంచి బయటకు వస్తాయి. అలాంటి పరిస్థితులు ఎదురు అవుతే చాలా ప్రమాదకరం. కాబట్టి చేపలు తినే ముందు ముల్లుల విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ తినాలని చెబుతున్నారు డాక్టర్ ఎం ఆర్ఎస్ హరిహరన్. నోట్ : పై సమాచారం, నిపుణులు, ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది, టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/egg-white-vs-egg-yolk-which-part-of-the-egg-is-healthier-check-details-1836663.html</loc><lastmod>2026-06-08T12:03:05+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/egg-white-vs-egg-yolk-1-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Egg White Vs Egg Yolk ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/egg-white-vs-egg-yolk-2.jpg</image:loc><image:caption><![CDATA[ గుడ్డు మొత్తం బరువులో తెల్లసొన సుమారు 60శాతం ఉంటుంది. ఇందులో కొవ్వులు, క్యాలరీలు చాలా తక్కువగా ఉండి, అత్యంత నాణ్యమైన ప్యూర్ ప్రోటీన్ లభిస్తుంది. గుడ్డులో ఉండే మొత్తం ప్రోటీన్‌లో సగానికి పైగా ఈ తెల్లసొనలోనే ఉంటుంది. కండరాల బలానికి, బరువు తగ్గడానికి ఇది ఎంతో తోడ్పడుతుంది. అయితే తెల్లసొనలో కొవ్వు అస్సలు ఉండదు కాబట్టి, కొవ్వులో కరిగే విటమిన్లు ఇందులో పూర్తిగా శూన్యం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/egg-white-vs-egg-yolk.jpg</image:loc><image:caption><![CDATA[ మరోవైపు గుడ్డు బరువులో పచ్చసొన సుమారు 30 నుంచి 35శాతం ఉంటుంది. బరువు పరంగా చూస్తే తెల్లసొనలో ఎక్కువ ప్రోటీన్ ఉన్నప్పటికీ.. గ్రామ్ టు గ్రామ్ లెక్కేస్తే తెల్లసొన (100 గ్రాములకు 10.8 గ్రా) కంటే పచ్చసొనలోనే (100 గ్రాములకు 16.4 గ్రా) ప్రోటీన్ సాంద్రత చాలా ఎక్కువ. గుడ్డుకు అసలైన పోషక బలాన్ని, రుచిని ఇచ్చేది ముమ్మాటికీ ఈ పచ్చసొన భాగమేనని సైన్స్ చెబుతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/egg-white-vs-egg-yolk-1.jpg</image:loc><image:caption><![CDATA[ విటమిన్లు, ఖనిజాల విషయానికి వస్తే పచ్చసొన ఒక పవర్‌హౌస్ లాంటిది. ఇందులో విటమిన్ బి6, బి12, ఫోలేట్, జింక్, ఐరన్, ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా మెదడు అభివృద్ధికి, కాలేయ పనితీరుకు అవసరమైన కోలిన్ అనే పోషకం ఇందులో చాలా ఎక్కువ. అంతేకాకుండా కొవ్వులో కరిగే విటమిన్లు అయిన A, D, E, K లతో పాటు హెల్తీ ఫ్యాట్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా పచ్చసొనలోనే లభిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/egg-white-vs-egg-yolk-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఆరోగ్య లక్ష్యాలను బట్టి ఎవరికి ఏది బెస్ట్ అనే విషయానికి వస్తే.. కేవలం మజిల్ గెయిన్, వెయిట్ లాస్ కోరుకునే అథ్లెట్లు మరియు బాడీబిల్డర్లకు తెల్లసొన అద్భుతమైన ఛాయిస్. ఇది కొవ్వు, కొలెస్ట్రాల్ లేకుండా ప్యూర్ ప్రోటీన్‌ను అందిస్తుంది. అదే సమయంలో మెదడు చురుకుదనం, జ్ఞాపకశక్తి, కంటి చూపు మెరుగుపడటానికి మరియు హార్మోన్ల సమతుల్యతకు పచ్చసొనలోని పోషకాలు, లూటిన్, జియాక్సంతిన్ వంటి యాంటిఆక్సిడెంట్లు ఎంతో అవసరం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/egg-white-vs-egg-yolk-47-1.jpg</image:loc><image:caption><![CDATA[ చివరగా గుండె జబ్బులు ఉన్నవారు లేదా కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు పచ్చసొనను వైద్యుల సలహాతో పరిమితంగా తీసుకోవడం మంచిది. సాధారణ వ్యక్తులు, పిల్లలు మాత్రం శరీరానికి పూర్తి స్థాయి పోషకాలు, విటమిన్లు అందాలంటే గుడ్డును మొత్తంగా తినడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. మీ శారీరక అవసరాలకు తగినట్లుగా గుడ్డును మీ డైట్‌లో భాగం చేసుకోండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/mrigasira-karthi-free-seafood-feast-fish-pulusu-gongura-prawns-in-west-godavari-1836646.html</loc><lastmod>2026-06-08T11:31:19+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/vindu-bhojanam.jpg</image:loc>
					<image:title><![CDATA[ Vindu Bhojanam ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/vindu-bhojanam-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఏలూరు: కాలం మారుతుంది. రోహిణి కార్తె నుంచి మృగశిర మాసంలోకి ప్రవేశించాం. కార్తె మారుతున్న సమయంలో మనం తీసుకునే ఆహారం మారాలని చెబుతున్నారు నిపుణులు. వర్షాలు కురుస్తూ, చల్లని వాతావరణం ఏర్పడే సమయంలో ప్రభలే వివిధ రకాల వ్యాధుల నుంచి తప్పించుకోవాలంటే శరీరానికి పోషకవిలువలతో కూడిన ఆహారం అందించాలని చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/vindu-bhojanam-2.jpg</image:loc><image:caption><![CDATA[ అందుకే ఈ సమయంలో చాలా మంది చేపలు తింటారు. ఇక శాకాహారులు అయితే బెల్లం, ఇంగువ కలిపి తీసుకోవడం వంటిది చేస్తుంటారు. ఈరోజు ప్రతి ఒక్కరూ చేపల కర్రీ వండుకొని తింటారు. ఎందుకంటే? చేపలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వాతావరణం మారే సమయంలో వచ్చే వైరల్ ఇన్‌ఫెక్షన్స్ నుంచి కాపాడతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/vindu-bhojanam-3.jpg</image:loc><image:caption><![CDATA[ అంతే కాకుండా చేపలలో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి12 వంటివి ఎక్కువగా ఉండటం వలన చేపలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో చేపల కర్రీ వండుకుంటారు. అయితే ఇంట్లో చేపల కూర వండుకోలేని వారికి అదిరిపోయే న్యూస్ అందింది. అది ఏమిటంటే? ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/vindu-bhojanam-4.jpg</image:loc><image:caption><![CDATA[ పశ్చిమగోదావరిజిల్లా లోని జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతుసంఘం ఆధ్వర్యంలో మంచి ఆక్వా విందు ఏర్పాటు చేసారు. పాలకొల్లు, నర్సాపురం, ఆచంట నియోజక వర్గాల్లో గోంగూర రొయ్యలు, చేపల పులుసు తో పేదలకోసం విందు ఏర్పాటుచేశారు రైతులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/vindu-bhojanam-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ విందులో రొయ్యలు గుడ్డు, గోంగూర రొయ్యలు, ఘుమ ఘుమ లాడే చేపల పులుసు ఉండనున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా లో ఈ ఐటమ్స్ తో పేదలకు భోజనం ఏర్పాటుచేశారు. తెలంగాణ లో చేప పంపిణీ ప్రారంభం కాబోతుంటే ఏపీ లో చేపలు, రొయ్యల తో ఈ విందు భోజనాలు ఏర్పాటు చేయటం చర్చనీయాంశ అయింది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/diabetes-patients-beware-uncontrolled-blood-sugar-can-lead-to-serious-health-complications-1836612.html</loc><lastmod>2026-06-08T11:23:21+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/diabetes-care.jpg</image:loc>
					<image:title><![CDATA[ Diabetes Care ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/diabetes-patients.jpg</image:loc><image:caption><![CDATA[ గుండె, మెదడుకు పొంచి ఉన్న ప్రమాదం: మధుమేహం ఉన్న రోగులలో గుండెపోటు (హార్ట్ ఎటాక్), కరోనరీ ఆర్టరీ వ్యాధులు వచ్చే ముప్పు ఇతరుల కంటే చాలా ఎక్కువ. రక్తనాళాల ఆరోగ్యం క్షీణించడం వల్ల మెదడుకు రక్త సరఫరాలో ఆటంకాలు ఏర్పడి, బ్రెయిన్ స్ట్రోక్ (పక్షవాతం) వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. దీనికి తోడు మధుమేహ బాధితుల్లో హై బీపీ (అధిక రక్తపోటు) వచ్చే అవకాశం ఎక్కువ. ఈ రెండు సమస్యలు కలిస్తే గుండె, కిడ్నీలపై ఒత్తిడి మరింత పెరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/kidney-disease-diabetes.jpg</image:loc><image:caption><![CDATA[ కంటి చూపు, కిడ్నీలు దెబ్బతినడం: షుగర్ నియంత్రణలో లేకపోతే కిడ్నీలలోని సూక్ష్మ రక్తనాళాలు పాడవుతాయి. దీనివల్ల నెఫ్రోపతి అనే తీవ్రమైన కిడ్నీ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. అలాగే, మధుమేహం కంటి రెటీనా రక్తనాళాలపై ప్రభావం చూపడం వల్ల డయాబెటిస్ రెటినోపతి ఏర్పడుతుంది. ఇది చూపు మందగించడానికి, తీవ్రస్థాయిలో అంధత్వానికి దారితీయవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/type-2-diabetes.jpg</image:loc><image:caption><![CDATA[ నరాల బలహీనత, పాదాల సమస్యలు: రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ కాలం ఎక్కువగా ఉంటే నరాలు దెబ్బతింటాయి (డయాబెటిక్ న్యూరోపతి). దీనివల్ల కాళ్లలో తిమ్మిర్లు, మంటలు, మొద్దుబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్తప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల పాదాలపై అయ్యే చిన్న చిన్న గాయాలు, పుండ్లు త్వరగా మానవు. ఇవి తీవ్రమైన ఇన్ఫెక్షన్లుగా మారి ప్రాణాంతకంగా పరిణమించవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/diabetic-neuropathy.jpg</image:loc><image:caption><![CDATA[ ఇతర ఇన్ఫెక్షన్లు, ఫ్యాటీ లివర్: మధుమేహం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీనివల్ల చర్మం, మూత్రనాళాలు (UTI) మరియు చిగుళ్లలో ఇన్ఫెక్షన్లు తరచూ వస్తుంటాయి. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో కాలేయంలో కొవ్వు పేరుకుపోయే నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) ముప్పు కూడా ఎక్కువని పరిశోధనలు చెబుతున్నాయి. నోటి ఆరోగ్యం దెబ్బతినడం, చిగుళ్ల వాపు వంటి సమస్యలు కూడా కామన్ గా కనిపిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/diabetes-symptoms.jpg</image:loc><image:caption><![CDATA[ రక్తంలో చక్కెర స్థాయిలు (బ్లడ్ షుగర్) దీర్ఘకాలం పాటు అదుపులో లేకపోతే శరీరంలోని ముఖ్య అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి, షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుకోవడం, నోటి పరిశుభ్రత పాటించడం, క్రమం తప్పకుండా మందులు వాడటం ఎంతో అవసరం. అయితే, షుగర్‌ బాధితులు ప్రతి ఒక్కరికీ ఈ సమస్యలు వస్తాయని కాదు. కానీ, బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నిరంతరం ట్రాక్ చేస్తూ, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం మరియు వైద్యుల సలహాతో మందులు వాడటం ద్వారా ఈ ప్రమాదాల నుండి సురక్షితంగా ఉండవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/gold-and-silver-rate-today-check-current-prices-in-hyderabad-vijayawada-delhi-and-chennai-1836614.html</loc><lastmod>2026-06-08T11:15:57+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/silver-price-today-june-08.jpg</image:loc>
					<image:title><![CDATA[ Silver Price Today June 08 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/gold-price-today-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ భారీ హెచ్చుతగ్గుల తర్వాత హైదరాబాద్‌లో 24 క్యారట్ల స్వచ్చమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,690 గా ఉండగా ఉదయం ఈ ధర రూ.1,52,720 వద్ద కొనసాగింది. అంటే కేవలం 4 గంటల్లోనే ఏకంగా తులం బంగారంపై రూ.1040 తగ్గింది. ఇక 22 క్యారట్ల బంగారం ధర రూ.1,39,050 వద్ద కొనసాగుతుండగా.. 18 క్యారట్ల బంగారం ధర రూ.1,13,770 వద్ద కొనసాగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/gold-price-today-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక విజయవాడ, విశాఖ పట్నంలో సైతం 24 క్యారట్ల స్వచ్చమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,690 గా ఉండగా ఇక 22 క్యారట్ల బంగారం ధర రూ.1,39,050 వద్ద కొనసాగుతుండగా.. 18 క్యారట్ల బంగారం ధర రూ.1,13,770 వద్ద కొనసాగుతుంది. అలాగే దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, బెంగళూరు, కేరళ, పూణెలో సైతం ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/gold-price-today-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక దేశ రాజధాని ఢిల్లీ, చెన్నై నగరాల్లో మాత్రం మిగతా నగరాలతో పోల్చుకుంటే బంగారం, వెండి ధరలు మార్పులు ఉన్నాయి. ఢిల్లీలో 24 క్యారట్ల స్వచ్చమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,51, 840గా ఉండగా 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,200గా ఉంది. ఇక చెన్నైలో 24 క్యారట్ల తులం బంగారం ధర రూ.1,53,490గా ఉండగా 22 క్యారట్ల బంగారం ధర రూ.1,40,700 వద్ద కొనసాగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/silver-price-today.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక బంగారం బాటలోనే వెండి ధరలు కూడా నడుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.2,60,000 ఉండగా ఉదయం ఈ ధర రూ.2,69,900 వద్ద కొనసాగింది. అంటే కేవలం 4 గంటల్లోనే ఈ ధరలు రూ.10వేలు దిగొచ్చింది. ఇక ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,70,000 వద్ద కొనసాగుతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/gold-price-today-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ బంగారం కొనేవారికి ఇదే మంచి టైం.. లేదంటే బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు వచ్చే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్దం కారణంగా కొన్ని నెలల క్రితం భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. యుద్ధం తగ్గుముఖం పట్టడంతో.. దిగొచ్చాయి. అయితే తాజాగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. కాబట్టి ఈ ధరలు కూడా మళ్లీ పెరిగే అవకాశాలు లేకపోలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మీకు కొనే ఆలోచన ఉంటే ఒక సారీ మీరు కూడా నిపుణులను సంప్రదించిండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/massive-26-kg-fish-caught-during-mrigasira-season-draws-crowd-in-telangana-1836581.html</loc><lastmod>2026-06-08T11:01:11+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/huge-fish-caught-1-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Huge Fish Caught ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/mrigasira-season.jpg</image:loc><image:caption><![CDATA[ జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎద్దండి గ్రామ చెరువులో ఓ జాలరికి అరుదైన అదృష్టం దక్కింది. గ్రామానికి చెందిన కల్లెడ నగేష్ అనే జాలరి ప్రతిరోజూ లాగే చేపల వేటకై స్థానిక చెరువుకు వెళ్లాడు. మృగశిర కార్తె ప్రారంభం కావడంతో చెరువులో చేపలు పట్టేందుకు జాలర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/giant-fish-catch.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ క్రమంలో నగేష్ వేసిన వలలో ఏదో భారీ జీవి చిక్కినట్లు అనిపించింది. తోటి జాలర్ల సహాయంతో వలను పైకి లాగి చూడగా, అందులో ఏకంగా 26 కిలోల బరువున్న ఒక భారీ చేప కనిపించడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/village-pond-fishing.jpg</image:loc><image:caption><![CDATA[ సాధారణంగా చెరువుల్లో రెండు, మూడు కిలోల చేపలు పడటం సహజం. కానీ, ఏకంగా 26 కిలోల బరువున్న భారీ చేప చిక్కడంతో ఆ వార్త చుట్టుపక్కల గ్రామాల్లో దావానలంలా వ్యాపించింది. ఇంత పెద్ద చేపను తమ జీవితంలో ఎప్పుడూ చూడలేదని, అది కూడా మృగశిర కార్తె రోజే ఇలాంటి అరుదైన చేపను చూడటం ఒక అదృష్టంగా భావిస్తున్నామని గ్రామస్థులు పేర్కొన్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rare-fish-catch.jpg</image:loc><image:caption><![CDATA[ వింతను చూసేందుకు గ్రామస్థులు, తోటి జాలర్లు చెరువు వద్దకు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. ఆ భారీ చేపను తిలకించడానికి, దానితో మొబైల్ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీసుకోవడానికి పిల్లలు, పెద్దలు పోటీ పడ్డారు. చుట్టూ పక్కల ఊర్ల నుండి ప్రజలు చెరువు వద్దకు పోటెత్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/huge-fish-caught.jpg</image:loc><image:caption><![CDATA[ వర్షాకాలం ఆరంభంలో వచ్చే మృగశిర సీజన్ జాలర్లకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ఈ సమయంలో చేపల మార్కెట్లో ధరలు కూడా ఎక్కువగా ఉంటాయి. నగేష్ వలలో పడిన ఈ భారీ చేప ప్రత్యేక ఆకర్షణగా నిలవడమే కాకుండా, దానిని దక్కించుకోవడానికి స్థానికులు తీవ్రంగా పోటీ పడ్డారు. తాజా, ఇంత భారీ చేప కావడంతో దీనిని కొనుగోలు చేసేందుకు గ్రామస్థులు పోటీపడి మరీ వేలం తరహాలో ధర పలికారు. మొత్తానికి మృగశిర వేళ పడ్డ ఈ భారీ చేప ఆ జాలరి కుటుంబంలో పెద్ద సంతోషాన్ని నింపింది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/mrigasira-special-fish-curry-authentic-chepala-pulusu-recipe-for-delicious-taste-1836590.html</loc><lastmod>2026-06-08T10:50:51+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chepala-pulusu-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Chepala Pulusu 3 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chepala-pulusu-2.jpg</image:loc><image:caption><![CDATA[ చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు : చేపలు, ఆనియన్, కారం, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, మెంతి పొడి, ఉప్పు, నూనె, చింత పండు, కొత్తిమీర, పచ్చి మిర్చీ, పసుపు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chepala-pulusu-5.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానం : ముందుగా చేపలను తీసుకొని గోరు వెచ్చటి నీటిలో కొంచెం, పసుపు, నిమ్మరసం, ఉప్పు వేసి శుభ్రం చేయాలి. చేపలు శుభ్రం అయిన తర్వాత వాటిని వేరే బౌల్‌లోకి తీసుకొని చేప ముక్కల్లో కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. దాదాపు 5 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chepala-pulusu-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు ఆనియన్ తీసుకొని దానిని మంటపై మంచిగా కాల్చుకోవాలి. దీని వలన చేపల పులుసు త్వరగా పాడవకుండా ఉండటమే కాకుండా రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు కాల్చుకున్న ఆనియన్, టమాటాలను మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్‌ను పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chepala-pulusu-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టాలి. అందులో సరిపడ నూనె వేయాలి. నూనె మంచిగా వేడి అయిన తర్వాత అందులో పచ్చి మిర్చీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. పసుపు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కలను వేసి మంచిగా వేయించుకోవాలి. ముక్కలు మంచిగా వేగాలా చూసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chepala-pulusu-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టమాటా, ఆనియన్ పేస్ట్ వేసి కలుపుకోవాలి మరో ఐదు నిమిషాలు. తర్వాత అందులో చింత పండు రసం వేసుకోవాలి. అలాగే తగినన్ని నీరు కూడా వేసేసుకొని పులుసు చిక్క బడి ముక్క మెత్తగా ఉడికే వరకు, ముక్కలను కదపకుండా, పులుసు మరగబెట్టాలి. అది బాగా మరిగిన తర్వాత అందులో ధనియాల పొడి, ఉప్పు, కారం, మెంతి పొడి వేసి మరో ఐదు నిమిషాలు మరగబెట్టాలి. చివరగా అందులో కొత్తిమీర వేయాలి. అంతే టేస్టీ టేస్టీ చేపల పులుసు రెడీ. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/mrugasira-karthi-fish-tradition-boost-immunity-get-warmth-against-seasonal-changes-1836560.html</loc><lastmod>2026-06-08T09:12:39+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/mrigasira-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Mrigasira 6 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/mrigasira-3.jpg</image:loc><image:caption><![CDATA[ మృగశిర కార్తె రోజు చేపలు తినడం అనేది ఆనవాయితీ. పూర్వకాలం నుంచే మృగశిర కార్తె రోజు చేపలు తినడం చేస్తుంటారు.  ప్రతి పల్లె పట్నంలో ప్రతి ఇంటిలో చేపలకూర గుమ గుమలతో వీధి మొత్తం సందడిగా ఉంటుంది. ఈరోజు చేపలు తినడమే కాకుండా, కొంత మంది ఆస్తమా, ఉబ్బసం తగ్గడం కోసం చేప ప్రసాదం కూడా తీసుకుంటారు. మరి ఈ రోజు చేప మందు, చేపలకు ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే? ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/mrigasira-1.jpg</image:loc><image:caption><![CDATA[ మృగశిర కార్తె కంటే ముందు రోహిణి కార్తె ఉంటుంది. ఇక రోహిణి కార్తె అంటే రోకళ్లు కూడా పగిలేంత ఎండలు ఉంటాయి. విపరీతమైన వేడి, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతుంటారు. శరీరంలో నీటిశాతం తగ్గిపోతుంది. ఇక ఆ తర్వాత వెంటనే వర్షాకాలం ప్రారంభం అవుతుంది. ఆకాశం నిండా నైరుతి రుతుపవనాలు మేఘావృతమై తొలకరి చినుకులు పడతాయి. ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/mrigasira-2.jpg</image:loc><image:caption><![CDATA[ వేడి నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో మానవ శరీరంలో దాని అంత త్వరగా అలవాటు పడదు. దీంతో వైరల్ ఇన్ఫెక్షన్స్  రావడం వంటి అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అంతే కాకుండా వాతావరణం తేమగా ఉండటం వలన బ్యాక్టీరియా పెరుగుతుంది, వైరస్‌లు ఎక్కువగా వ్యాపిస్తుంటాయి. అందుకే ఈ సమయంలో రోగనిరోధక శక్తి పెంచుకొని, జలుబు, దగ్గు, ఆస్తమా, వంటి వ్యాధుల బారిన పడకుండా ఉండటానికి చేపల తింటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/mrigasira-4.jpg</image:loc><image:caption><![CDATA[ అంతే కాకుండా శరీరంలో వేడి ఉండటానికి చేపలు తింటారు. ఇక ఈ చేపల్లో అనేక పోషకాలు , విటమిన్స్, ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లాంటివి పుష్కలంగా ఉంటాయి. అయితే ఈ వాతావరణం మారే సమయంలో చేపలు తినడం వలన ఇది శరీరంలో వేడిని పెంచి, కఫం పెరగకుండా చేస్తుంది. అంతే కాకుండా గుండె , ఊపిరితిత్తులకు తగిన వేడిని అందజేస్తుంది. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అందుకే ఈ రోజున చేపలు తింటారు అని చెబుతున్నారు నిపుణులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/mrigasira-5.jpg</image:loc><image:caption><![CDATA[ ముఖ్యంగా మృగశిర అంటే వానలు మొదలు, ఈ సమయంలో చల్లటి వాతావరణం వలన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. ఈ సమయంలో చేపలు తినడం వలన అది శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచుతుంది. అంతే కాకుండా,  వాత కఫ దోషాలు పెరుగుతాయి. తొలి వాన పడగానే రైతులు పొలం పనులు ప్రారంభిస్తారు, ఆ సమయంలో ఓళ్లు నొప్పుల వంటి ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఈ రోజు చేపలు తినడం వలన ఒళ్లు  నొప్పులు, వైరల్ ఇన్‌ఫెక్షన్స్ ఎక్కువగా రావని, రైతులు మృగశిర కార్తె రోజు చేపలు తింటారు. మృగశిరన చేప తింటే ఏడాదంతా ఏ రోగం రాదు.. అని సామెత ఉంది. అందుకే చాలా మంది ఈ రోజున చేపలు తినడానికి ఆసక్తి చూపుతారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/do-this-one-thing-on-an-empty-stomach-every-morning-for-better-health-1836516.html</loc><lastmod>2026-06-08T07:45:41+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/morning-routine.jpg</image:loc>
					<image:title><![CDATA[ Morning Routine ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/constipation-relief.jpg</image:loc><image:caption><![CDATA[ రాత్రి నిద్రపోయే సమయంలో శరీరం శ్వాస, చెమట రూపంలో కొంత ద్రవాన్ని కోల్పోతుంది. ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. రాత్రి నిద్ర సమయంలో శరీరం కోల్పోయిన నీటి శాతాన్ని (డీహైడ్రేషన్) ఇది తక్షణమే భర్తీ చేస్తుంది. లేవగానే 1 నుండి 2 గ్లాసుల (250-500 మి.లీ.) నీరు సేవించడం వల్ల శరీరంలో జరిగే మార్పులేంటో, ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/skin-health.jpg</image:loc><image:caption><![CDATA[ మెదడు చురుకుదనం.. జీర్ణక్రియ మెరుగు: శరీరంలో నీటి శాతం తగ్గితే ఏకాగ్రత లోపించడం, అలసట మరియు అప్రమత్తత తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఉదయాన్నే నీళ్లు తాగడం వల్ల మెదడు పనితీరు మెరుగై, రోజంతా చురుగ్గా ఉండేందుకు సహాయపడుతుంది. అలాగే, ఖాళీ కడుపుతో నీరు సేవించడం వల్ల జీర్ణవ్యవస్థ మేల్కొంటుంది. ఆ రోజంతా మనం తినే ఆహారాన్ని సక్రమంగా అరిగించుకోవడానికి శరీరం సిద్ధమవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/importance-of-hydration.jpg</image:loc><image:caption><![CDATA[ మలబద్ధకం నివారణ.. టాక్సిన్లు దూరం: ఉదయం నీళ్లు తాగడం వల్ల పేగుల కదలికలు (Bowel movements) ప్రేరేపించబడతాయి. దీనివల్ల మల విసర్జన సులభంగా జరిగి, చాలామందిని వేధించే మలబద్ధకం సమస్య సహజంగానే దూరమవుతుంది. అలాగే శరీరంలోని వ్యర్థాలను, హానికరమైన టాక్సిన్లను బయటకు పంపడంలో కిడ్నీలకు తగినంత తేమ అవసరం. ఉదయాన్నే నీరు తాగడం వల్ల కిడ్నీల పనితీరు మెరుగుపడి, రక్తం శుద్ధి అవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/weight-loss-tips.jpg</image:loc><image:caption><![CDATA[ బరువు నియంత్రణ.. మెరిసే చర్మం: కొన్నిసార్లు మన శరీరం దాహాన్ని ఆకలిగా పొరబడుతుంటుంది. ఉదయాన్నే నీళ్లు తాగడం వల్ల అనవసరమైన ఆకలి తగ్గి, అతిగా ఆహారం తినడం అదుపులోకి వస్తుంది. ఇది బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో మేలు చేస్తుంది. శరీరంలో మెటబాలిజం రేటు కూడా పెరుగుతుంది. శరీరం ప్రాపర్గా హైడ్రేట్ అవ్వడం వల్ల చర్మం పొడిబారడం తగ్గి, ఆరోగ్యంగా, కాంతివంతంగా కనిపిస్తుంది. డీహైడ్రేషన్ వల్ల వచ్చే ఉదయపు తలనొప్పులను కూడా ఇది తగ్గిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/daily-health-tips.jpg</image:loc><image:caption><![CDATA[ ఎంత పరిమాణంలో తాగాలి?: సాధారణంగా ఉదయం లేవగానే 1 నుండి 2 గ్లాసుల (సుమారు 250–500 మి.లీ.) నీరు తాగడం చాలామందికి సరిపోతుంది. అంతకంటే ఎక్కువ మొత్తంలో ఒకేసారి లీటర్ల కొద్దీ నీటిని బలవంతంగా తాగాల్సిన అవసరం లేదు. నీటిని ఎల్లప్పుడూ ఒకేసారి గుటగుటా తాగేయకుండా, కూర్చుని నెమ్మదిగా సిప్ చేస్తూ తాగడం వల్ల గరిష్ట ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/why-you-should-drink-turmeric-and-black-pepper-water-every-morning-you-need-to-know-1836506.html</loc><lastmod>2026-06-08T06:59:40+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/turmeric-and-black-pepper-benefits-2-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Turmeric And Black Pepper Benefits 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/turmeric-and-black-pepper-benefits-2.jpg</image:loc><image:caption><![CDATA[ పసుపు, నల్ల మిరియాల నీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. వాతావరణ కాలుష్యం, తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ కణాలను దెబ్బతీస్తాయి. ఈ డ్రింక్‌లోని సమ్మేళనాలు ఆ ఫ్రీ రాడికల్స్‌ను సమర్థవంతంగా తటస్థీకరిస్తాయి. తద్వారా వృద్ధాప్య ఛాయలను ఆలస్యం చేయడంతో పాటు, కేన్సర్ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుండి కణాలను రక్షించడంలో అద్భుతంగా సహాయపడతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/turmeric-and-black-pepper-benefits-1.jpg</image:loc><image:caption><![CDATA[ పసుపులో ఉండే కర్కుమిన్, నల్ల మిరియాలలో ఉండే పైపెరిన్ అనే సమ్మేళనాలు శక్తివంతమైన సహజ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. సాధారణంగా పసుపులోని కర్కుమిన్‌ను శరీరం అంత త్వరగా గ్రహించలేదు.. కానీ నల్ల మిరియాలలోని పైపెరిన్ దీని శోషణ సామర్థ్యాన్ని ఏకంగా 2000శాతం పెంచుతుంది. ఈ రెండు కలిసి శరీరంలో దీర్ఘకాలిక వాపుకు కారణమయ్యే కారకాలను నిరోధిస్తాయి. ఫలితంగా కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులు, అంతర్గత వాపుల నుండి త్వరితగతిన ఉపశమనం లభిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/turmeric-and-black-pepper-benefits.jpg</image:loc><image:caption><![CDATA[ జీర్ణక్రియను మెరుగుపరచడంలో పచ్చి పసుపు ఒక అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. మీరు ఉదయాన్నే పచ్చి పసుపు, మిరియాలు కలిపిన గోరువెచ్చని నీటిని తీసుకోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు నయమవుతాయి. ఇది కాలేయం పనితీరును మెరుగుపరిచి, శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. పేగు ఆరోగ్యానికి కూడా ఈ డ్రింక్ ఎంతో మేలు చేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/turmeric-and-black-pepper-benefits-3.jpg</image:loc><image:caption><![CDATA[ పసుపులోని కర్కుమిన్ మెదడు ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మెదడులో ఉత్పన్నమయ్యే న్యూరోట్రోఫిన్ అనే హార్మోన్ స్థాయిలను పెంచుతుంది. ఈ ప్రోటీన్ మెదడులో కొత్త నాడీ కణాలు, కనెక్షన్లను ఏర్పరచడంలో సహాయపడుతుంది. తద్వారా వయస్సు పెరగడం వల్ల వచ్చే అల్జీమర్స్, మతిమరుపు వంటి వ్యాధుల ముప్పు తగ్గుతుంది. అంతేకాకుండా ఈ డ్రింక్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/turmeric-and-black-pepper-benefits-4.jpg</image:loc><image:caption><![CDATA[ మంచి రోజును ప్రారంభించడానికి, దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని పదిలపరుచుకోవడానికి పసుపు - నల్ల మిరియాల నీరు ఒక పరిపూర్ణమైన హెల్త్ డ్రింక్. అయితే, గర్భిణీ స్త్రీలు లేదా ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ మందులు వాడుతున్న వారు, ఈ కొత్త ఆహారపు అలవాటును ప్రారంభించే ముందు ఒకసారి ఆరోగ్య నిపుణులను లేదా వైద్యులను సంప్రదించడం ఎల్లప్పుడూ మంచిది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/fresh-raw-coconut-dates-ladoo-recipe-a-healthy-no-sugar-energy-snack-for-all-ages-1836032.html</loc><lastmod>2026-06-08T06:30:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/kobbari-dry-fruit-laddu.jpg</image:loc>
					<image:title><![CDATA[ Kobbari Dry Fruit Laddu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/kobbari-dry-fruit-laddu-5.jpg</image:loc><image:caption><![CDATA[ అసలు కొంచం పంచదార కూడా వాడకుండా..  నేచురల్ తీపితో తయారు చేసే పచ్చికొబ్బరి-ఖర్జూరం లడ్డూలు ఇలా చేస్తే  పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అంతేకాదు, ఇవి శరీరానికి కూడా ఎంతో బలం. ఇంకా ఇవి  శక్తిని కూడా అందిస్తాయి. అలాగే, సహజ రుచి ఉంటుంది. దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/kobbari-dry-fruit-laddu-3.jpg</image:loc><image:caption><![CDATA[ పచ్చికొబ్బరి-ఖర్జూరం లడ్డూలకు కావలసిన పదార్థాలు:  రెండు కప్పుల పచ్చికొబ్బరి తురుము, ఒక కప్పు ఖర్జూరాలు అది కూడా గింజలు తీసినవి తీసుకోవాలి. ఇంకా వీటి కోసం నాలుగు బాదంపప్పులు, అలాగే 10 జీడిపప్పు, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి,  ఇంకా 
ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా తీసుకోవాలి. అలాగే గస గసాలు,  ఇంకా నువ్వులు కూడా రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/kobbari-dry-fruit-laddu-2.jpg</image:loc><image:caption><![CDATA[ పచ్చికొబ్బరి-ఖర్జూరం తయారీ విధానం: ముందుగా ఖర్జూరాలను తీసుకుని 10 నిమిషాలు పాటు వెచ్చని నీటిలో బాగా నానబెట్టి వాటిని మెత్తగా చేసుకోవాలి. ఇంకా బాదం, జీడిపప్పును కూడా తీసుకుని వాటిని ముక్కలుగా చేసుకుని వాటిని బాగా  వేయించుకోవాలి.
ఇంకా ఈ పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి అలాగే,  పచ్చికొబ్బరిని కూడా 3 నిమిషాల పాటు  తక్కువ మంటపై బాగా వేయించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/kobbari-dry-fruit-laddu-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంకా ఇప్పుడు ఈ ఖర్జూరాలను కూడా దానిలో వేసి బాగా  కలుపుతూ మెత్తగా అయ్యే వరకు బాగా కలపాలి. ఇంకా దీనిలో వేయించిన బాదం, నాలుగు జీడిపప్పులు, కొద్దిగా నువ్వులు, ఇంకా ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడిని  వేసి మిక్స్ అయ్యేలా  కలపాలి. ఇంకా ఇది బాగా  చల్లారిన తర్వాత కొద్దిగా  నెయ్యి రాసుకుని లడ్డూలుగా చేసుకోవాలి. చేసిన తరవాత గాలి వెళ్ళని  డబ్బాలో వీటిలో పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/kobbari-dry-fruit-laddu-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇవి చక్కెర లేకుండానే నేచురల్ తీపితో మంచిగా ఉంటుంది. రక్త హీనతతో ఇబ్బంది పడే వాళ్ళకి సూపర్ ఫుడ్ . ఇంకా ఇది పిల్లలకు కూడా  అదిరిపోయే హెల్తీ ఫుడ్ అని చెప్పొచ్చు. ప్రయాణాల్లో  ఈ లడ్డు ఒకటి తింటే శక్తి కూడా అందుతుంది.  అందించే చాలా మంది దీనిని నేచురల్ ఎనర్జీ బూస్టర్‌గా అని చెబుతుంటారు. పిల్లల నుండి ముసలివాళ్ళ వరకు తినొచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/vellulli-karam-million-favorite-garlic-chilli-egg-recipe-make-this-delicious-2-egg-dish-in-minutes-1835979.html</loc><lastmod>2026-06-08T06:00:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/eggs-4-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Eggs 4 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/eggs-6-1.jpg</image:loc><image:caption><![CDATA[ గుడ్డు వెల్లుల్లి కారం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెసిపీని వెల్లుల్లి, కారంతో చేస్తారు. ఇవి రెండు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి కాబట్టి మీరు కూడా ఇంట్లో వీటిని తప్పకుండా ట్రై చేయండి. దీనిని ఎక్కువగా  ఎక్కువగా రోటిల్లోకి తింటారు. మరి, దీనికి కావాల్సిన పదార్ధాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/eggs-6.jpg</image:loc><image:caption><![CDATA[ గుడ్లను బాగా ఉడికించాలి: ముందుగా చికెన్ షాప్ నుంచి తెచ్చిన గుడ్లను ఉడకబెట్టి,  దానిలో టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిపి  ఉడికించుకోవాలి. ఇలా ఈ గుడ్లకు  పట్టిస్తే కూర  టేస్ట్ మారిపోతోంది తినడానికి కూడా రుచిగా ఉంటుంది. ఊర్లలో ఇప్పటికి ఎంతో మంది తింటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/eggs-1-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు వెల్లుల్లి కారంను సిద్ధం చేసుకోవాలి: ముందుగా వెల్లుల్లిని తీసుకుని వాటి పొట్టు తీసి ఆ తర్వాత  మిక్సీ  గిన్నెలో వేసి 6 వెల్లుల్లి రెబ్బలు, 10 వేయించిన ఎండుమిర్చి, ధనియాల , కొద్దిగా పసుపు,  ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా రుచికి తగినంత ఉప్పు కూడా దీనిలో వేసి దీనిని పొడి లాగా చేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/eggs-2-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇలా పోపు పెట్టుకోవాలి : ఇప్పుడు స్టవ్ వెలిగించి దానికి మీద పాన్‌ పెట్టి ఆయిల్ వేసి, అది వేడయ్యాక  అర టేబుల్ స్పూన్ తాలింపు గింజలు ఆవాలు, ఇంకా నాలుగు కరివేపాకు ఆకులు కూడా వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత  ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లను పాన్‌లో వేసి స్టవ్ మీదే ఎర్రగా వేయించాలి. ఇలా చేస్తే అన్నంలోకి మెత్తగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/eggs-5-3.jpg</image:loc><image:caption><![CDATA[ చివర్లో గుడ్లకు వెల్లుల్లి కారం పట్టించుకోవాలి : ముందుగా ఒక గిన్నెలో పెట్టుకున్న వెల్లుల్లి కారం మిశ్రమం, గుడ్లకు  పట్టేలా కనీసం 10 నిముషాల పాటు  మీడియం మంట మీద ఉంచాలి. చివర్లో కొత్తిమీర ఆకులు వేసి దించడమే. ఇంకా దీనిని వేడి వేడి అన్నంలో తింటే అద్భుతంగా ఉంటుంది. ఒకసారి తింటే అసలు వదిలిపెట్టరు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు  లాగిస్తారు . ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/korean-beauty-secret-revealed-this-turmeric-ice-cube-trick-may-help-reduce-dark-spots-and-acne-naturally-1836442.html</loc><lastmod>2026-06-07T22:50:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/turmeric-ice-cubes.jpg</image:loc>
					<image:title><![CDATA[ Turmeric Ice Cubes ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/turmeric.jpg</image:loc><image:caption><![CDATA[ Korean Beauty Secret: కొరియన్ అందగత్తెల్లా మచ్చలేని, లోపరహితమైన చర్మం కావాలని చాలా మంది కోరుకుంటారు. ఇందుకోసం ఖరీదైన ఫేషియల్స్, సీరమ్స్, రసాయన క్రీములపై వేల రూపాయలు ఖర్చు చేస్తుంటారు. అయితే మన ఇంట్లోనే సులభంగా దొరికే పసుపుతో కూడా చర్మానికి అద్భుతమైన సంరక్షణ అందించవచ్చు. శతాబ్దాలుగా ఆయుర్వేదంలో పసుపును చర్మ సౌందర్యానికి ఉపయోగిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/turmeric2.jpg</image:loc><image:caption><![CDATA[ కేవలం పసుపును ముఖానికి రాయడం కంటే, దానిని ఐస్ క్యూబ్స్ రూపంలో ఉపయోగించడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. పసుపులోని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు, ఐస్‌లోని చర్మాన్ని బిగుతుగా చేసే లక్షణాలు కలిసి పనిచేసి ముఖంపై ఉన్న నల్ల మచ్చలు, మొటిమల సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా చర్మానికి సహజమైన కాంతిని కూడా అందిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/turmeric3.jpg</image:loc><image:caption><![CDATA[ పసుపులో ఉండే కర్కుమిన్ (Curcumin) అనే శక్తివంతమైన సమ్మేళనం చర్మంలోని అధిక వర్ణద్రవ్యాన్ని తగ్గించి, నల్ల మచ్చలను క్రమంగా మసకబారుస్తుంది. అలాగే దానిలోని యాంటీబ్యాక్టీరియల్ గుణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నియంత్రించడంలో సహాయపడతాయి. మరోవైపు, ఐస్ క్యూబ్స్‌తో ముఖానికి మసాజ్ చేయడం వల్ల చర్మ రంధ్రాలు తాత్కాలికంగా కుంచించుకుపోయి, చర్మం మరింత మృదువుగా, తాజాగా కనిపిస్తుంది. చల్లదనం రక్త ప్రసరణను మెరుగుపరచి ముఖానికి సహజమైన గ్లోను తీసుకువస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/turmeric4.jpg</image:loc><image:caption><![CDATA[ పసుపు ఐస్ క్యూబ్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు..
1 టేబుల్ స్పూన్ పసుపు పొడి, అర కప్పు రోజ్ వాటర్, 
అర కప్పు మరిగించి చల్లార్చిన నీరు.  
తయారు చేసే విధానం.. ఒక గిన్నెలో రోజ్ వాటర్, మరిగించి చల్లార్చిన నీటిని కలపండి. అందులో పసుపు పొడి వేసి గడ్డలు లేకుండా బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఐస్ ట్రేలో పోసి 4 నుంచి 5 గంటల పాటు ఫ్రీజర్‌లో ఉంచండి. పూర్తిగా గడ్డకట్టిన తర్వాత పసుపు ఐస్ క్యూబ్స్ ఉపయోగానికి సిద్ధంగా ఉంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/turmeric5.jpg</image:loc><image:caption><![CDATA[ ఉపయోగించే సరైన విధానం.. ముందుగా తేలికపాటి ఫేస్‌వాష్‌తో ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని, మురికి, అదనపు నూనెను తొలగించండి. తర్వాత ఒక పసుపు ఐస్ క్యూబ్‌ను తీసుకుని, శుభ్రమైన పలుచని దూది గుడ్డలో చుట్టండి. ఆ క్యూబ్‌ను ముఖంపై గుండ్రంగా, సున్నితంగా మసాజ్ చేయండి. ముఖ్యంగా కళ్ల చుట్టూ ఉన్న సున్నితమైన చర్మంపై ఎక్కువసేపు ఉంచకండి. మసాజ్ పూర్తయ్యాక ముఖంపై ఏర్పడిన పసుపు నీటిని సుమారు 10 నిమిషాల పాటు అలాగే ఉండనివ్వండి. అనంతరం చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/turmeric1.jpg</image:loc><image:caption><![CDATA[ గుర్తుంచుకోవాల్సిన విషయం.. పసుపు వల్ల కొంతసేపు చర్మంపై పసుపు రంగు కనిపించే అవకాశం ఉంటుంది. అందుకే ఈ ఐస్ క్యూబ్స్‌ను బయటకు వెళ్లే ముందు కాకుండా, రాత్రి సమయంలో లేదా ఇంట్లో ఉన్నప్పుడు ఉపయోగించడం మంచిది. అలాగే సున్నితమైన చర్మం ఉన్నవారు ముందుగా చిన్న భాగంలో పరీక్షించి తర్వాతే ఉపయోగించాలి. 
గమనిక: చర్మ సమస్యలు లేదా అలర్జీలు ఉన్నవారు ఏదైనా కొత్త గృహ చిట్కాను ఉపయోగించే ముందు చర్మ వైద్యుడి సలహా తీసుకోవడం ఉత్తమం. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/high-protein-soya-chunks-biryani-recipe-meal-maker-biryani-telugu-1836423.html</loc><lastmod>2026-06-07T20:10:19+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/soya-chunks-biryani-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Soya Chunks Biryani (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/soya-chunks-biryani-1.jpg</image:loc><image:caption><![CDATA[ నాన్ వెజ్ తినని వారికి శరీరానికి కావలసిన ప్రోటీన్లు అందడం కొంచెం కష్టమే, కానీ సోయాలో మాంసకృత్తులు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇది వండటం చాలా సులభం మరియు రుచిలో కూడా అమోఘంగా ఉంటుంది. మరి ఇంట్లోనే చాలా టేస్టీగా ఈ మీల్ మేకర్ బిర్యానీని ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/soya-chunks-biryani-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ బిర్యానీ తయారీ కోసం ముందుగా దాదాపు 150 గ్రాముల మీల్ మేకర్‌ను తీసుకుని, వేడి నీళ్లలో వేసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత వాటిని నీళ్లు లేకుండా బాగా పిండి వేసి ఒక ప్లేట్ లో పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. అందుకోసం కొద్దిగా పుదీనా, కొత్తిమీర, టమోటాలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క మరియు పచ్చిమిరపకాయలను మిక్సీ పట్టి మసాలా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/soya-chunks-biryani-3.jpg</image:loc><image:caption><![CDATA[ తదుపరి దశలో, పిండి పెట్టుకున్న మీల్ మేకర్‌ను మ్యారినేట్ చేయాలి. ఇందుకోసం మీల్ మేకర్‌లో కొద్దిగా పెరుగు, కారం, ధనియాల పొడి, పసుపు, రుచికి సరిపడా ఉప్పు మరియు బిర్యానీ మసాలా వేసి బాగా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టాలి. మరోవైపు 600 గ్రాముల బాస్మతి బియ్యాన్ని రెండు సార్లు కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు వంట పాత్రలో లేదా కుండలో కొద్దిగా నూనె, నెయ్యి వేసి వేడెక్కాక లవంగాలు, ఇలాచీ, దాల్చినచెక్క, బిర్యానీ ఆకు వంటి హోల్ గరం మసాలా దినుసులు వేయాలి. ఆపై సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/soya-chunks-biryani-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఉల్లిపాయలు వేగాక మనం ముందుగా సిద్ధం చేసుకున్న పుదీనా-అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఆ తర్వాత మ్యారినేట్ చేసిన మీల్ మేకర్ ముక్కలను కూడా వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని ఇందులో వేసి, ఎసరుకు సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి తక్కువ మంటపై దమ్ చేసుకోవాలి. అంతే, ఎంతో పొడిపొడిగా ఉండే గ్రేవీతో కూడిన మీల్ మేకర్ బిర్యానీ సిద్ధమయిపోతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/soya-chunks-biryani-5.jpg</image:loc><image:caption><![CDATA[ ముగింపుగా చెప్పాలంటే, ఈ బిర్యానీ కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. శరీరంలో కండరాలు (మజిల్) పెరగడానికి సోయా ఫుడ్ ఎంతో సహాయపడుతుంది. వేడివేడి మీల్ మేకర్ బిర్యానీలో కాస్త నిమ్మరసం పిండుకుని, ఉల్లిపాయ ముక్కలు మరియు కమ్మని పెరుగు రైతాతో తింటే ఆ తృప్తే వేరు. మీరు కూడా ఈ సండే ఈ హెల్తీ బిర్యానీని ఇంట్లో ట్రై చేసి మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదించండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/30-days-high-protein-diet-results-body-transformation-and-health-benefits-1836415.html</loc><lastmod>2026-06-07T20:03:56+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/protein-6-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Protein (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/protein-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ కేవలం 30 రోజుల పాటు మన రోజువారీ ఆహారంలో ప్రోటీన్ మోతాదును క్రమబద్ధంగా పెంచడం ద్వారా శరీరంలో ఎలాంటి ఊహించని, అద్భుతమైన మార్పులు వస్తాయో వైద్య నిపుణులు మరియు పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒక నెల రోజుల పాటు హై ప్రోటీన్ డైట్ ఫాలో అవ్వడం వల్ల మీ మెటబాలిజం, చర్మం మరియు కండరాల వ్యవస్థలో ఎలాంటి ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/protein-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ మొదటిగా, అధిక ప్రోటీన్ కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల మన జీవక్రియ (మెటబాలిజం) రేటు గణనీయంగా పెరుగుతుంది. ప్రోటీన్లను జీర్ణం చేసుకోవడానికి మన శరీరం ఎక్కువ శక్తిని ఉపయోగించాల్సి వస్తుంది. దీనినే &#039;థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్&#039; అంటారు. దీనివల్ల మనం విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కూడా శరీరంలోని కేలరీలు వేగంగా కరుగుతాయి. ప్రోటీన్ తిన్న తర్వాత కడుపు నిండిన అనుభూతి కలిగి, ఎక్కువ సమయం ఆకలి వేయదు. దీనివల్ల జంక్ ఫుడ్స్ తినాలనే కోరికలు (క్రేవింగ్స్) తగ్గి, బరువు చాలా సులభంగా అదుపులోకి వస్తుంది. ఒంటిపై ఉన్న అనవసరమైన కొవ్వు కరిగి శరీరం నాజూగ్గా మారుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/protein-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ రెండవది, కండరాల దృఢత్వం. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో కండరాల శాతం తగ్గి కొవ్వు పెరుగుతుంది. 30 రోజుల పాటు కోడిగుడ్లు, చికెన్, పప్పుధాన్యాలు, పనీర్ లేదా సోయా వంటి ప్రోటీన్ రిచ్ ఆహారాన్ని తీసుకోవడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. వ్యాయామం చేసేవారికి ఇది కండరాల పునరుద్ధరణకు (మజిల్ రికవరీ) ఎంతో సహాయపడుతుంది. శరీరం లోపలి నుండి దృఢంగా మారి, శారీరక శక్తి మరియు స్టామినా అద్భుతంగా పెరుగుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/protein-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ మూడవ ముఖ్యమైన మార్పు మన చర్మంలో కనిపిస్తుంది. చర్మం యవ్వనంగా, కాంతివంతంగా ఉండటానికి కారణమయ్యే కొల్లాజెన్ మరియు ఎలాస్టిన్ అనేవి ప్రోటీన్ల ద్వారానే తయారవుతాయి. నెల రోజుల పాటు మంచి ప్రోటీన్ డైట్ తీసుకోవడం వల్ల చర్మ కణాలు లోపలి నుండి రిపేర్ అయ్యి ముఖంపై గ్లో పెరుగుతుంది. ముడతలు, మచ్చలు తగ్గి చర్మం ఎంతో మృదువుగా, బిగుతుగా మారుతుంది. కేవలం చర్మమే కాకుండా జుట్టు రాలడం తగ్గి, గోళ్లు కూడా బలంగా తయారవుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/protein-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ చెప్పాలంటే, 30 రోజుల హై ప్రోటీన్ ఛాలెంజ్ అనేది కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాదు, సంపూర్ణ ఆరోగ్యానికి ఒక గొప్ప పునాది. అయితే, డైట్‌లో మార్పులు చేసేటప్పుడు మీ శరీర తత్వానికి తగ్గట్టుగా, తగినంత నీరు తాగుతూ సమతుల్యంగా ప్లాన్ చేసుకోవడం ముఖ్యం. నేటి నుండే మీ ప్లేట్‌లో ప్రోటీన్ శాతాన్ని పెంచండి, ఆరోగ్యకరమైన మార్పును మీరే గమనించండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/shilpa-reddy-skincare-secret-simple-tips-for-natural-face-glow-1836404.html</loc><lastmod>2026-06-07T19:56:14+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/glowing-skin-6-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Glowing Skin (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/glowing-skin-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య చర్మ సౌందర్యం తగ్గడం. కాలుష్యం, మానసిక ఒత్తిడి, సరైన ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల ముఖంపై గ్లో తగ్గిపోయి చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తూ ఉంటాయి. దీనికోసం చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల కెమికల్ ప్రొడక్ట్స్, క్రీములు వాడుతూ వేల రూపాయలు ఖర్చు పెడుతుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/glowing-skin-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రకృతి సిద్ధంగా లభించే వస్తువులతోనే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖాన్ని అందంగా, కాంతివంతంగా మార్చుకోవచ్చని ప్రముఖ మోడల్ మరియు ఫిట్‌నెస్ ఇన్ ఫ్లుయెన్సర్ శిల్పా రెడ్డి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. నిత్యం బిజీగా ఉండే ఆమె, తన చర్మాన్ని కెమికల్స్ బారిన పడకుండా ఎలా కాపాడుకుంటుందో, ఆ సింపుల్ హోమ్ మేడ్ చిట్కా ఏంటో ఇప్పుడు చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/glowing-skin-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ శిల్పా రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, కొరియన్ గ్లాస్ స్కిన్ లాంటి మెరుపును సొంతం చేసుకోవడానికి మార్కెట్ లోని స్క్రబ్‌ల కంటే ఇంట్లో తయారుచేసుకునే సహజసిద్ధమైన మిశ్రమమే ఎంతో ఉత్తమం. ఇందుకోసం మనం ప్రతిరోజూ వంటగదిలో వాడే శెనగపిండిని ప్రధానంగా ఉపయోగించవచ్చు. శెనగపిండి చర్మానికి మంచి ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. అయితే దీనిని నేరుగా ముఖానికి అప్లై చేయకూడదు. ఎందుకంటే ఇది చర్మాన్ని కాస్త పొడిగా మార్చే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/glowing-skin-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ శెనగపిండిలో కొద్దిగా సహజమైన తేనె (హనీ) మరియు ఒకటి లేదా రెండు చుక్కల బాదం నూనె (ఆల్మండ్ ఆయిల్) కలపాలి. తేనె చర్మానికి తేమను అందించి సాఫ్ట్‌గా మారుస్తుంది, అలాగే బాదం నూనె చర్మాన్ని మృదువుగా చేసి లోపలి నుండి పోషణను అందిస్తుంది. ఈ మూడింటిని బాగా కలిపి ముఖానికి జెంటిల్‌గా స్క్రబ్ లాగా అప్లై చేయడం వల్ల చర్మంపై ఉన్న మృతకణాలు (డెడ్ స్కిన్ సెల్స్) తొలగిపోయి ముఖం ప్రకాశిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/glowing-skin-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ బాహ్య సౌందర్యంతో పాటు అంతర్గత శుద్ధి కూడా చర్మ ఆరోగ్యానికి ఎంతో అవసరమని శిల్పా రెడ్డి నొక్కి చెప్పారు. అందుకోసం ప్రతిరోజూ తగినంత నీరు తాగి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. చర్మం కాంతివంతంగా మారడానికి అన్నింటికంటే ముఖ్యమైనది శారీరక శ్రమ లేదా వ్యాయామం. రోజుకు కనీసం అరగంట పాటు బాగా చెమట పట్టేలా రన్నింగ్, సైక్లింగ్ లేదా ట్రెడ్‌మిల్ చేయడం వల్ల శరీరంలోని హానికరమైన టాక్సిన్స్ అన్నీ చెమట రూపంలో బయటకు వచ్చేస్తాయి. మీరు గమనిస్తే, వ్యాయామం చేసిన వెంటనే ముఖంలో ఒక తెలియని సహజమైన కాంతి కనిపిస్తుంది. ఇది చర్మ కణాలకు రక్తప్రసరణను మెరుగుపరచడం వల్ల జరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/glowing-skin-7-1.jpg</image:loc><image:caption><![CDATA[ చివరగా, వయసు పెరగడాన్ని మనం ఆపలేము కానీ, సరైన జీవనశైలి మరియు అలవాట్ల ద్వారా ఆ వేగాన్ని ఖచ్చితంగా తగ్గించవచ్చు. శిల్పా రెడ్డి తన వ్యక్తిగత అనుభవాన్ని చెప్తూ, తన శరీరం మరియు చర్మం యొక్క పారామీటర్స్ ఆమె అసలు వయసు కంటే ఎంతో తక్కువగా చూపిస్తాయని తెలిపారు. కాబట్టి, కృత్రిమ సౌందర్య సాధనాలపై ఆధారపడటం తగ్గించి, ఈ చిన్న దేశీ చిట్కాలను నిరంతరం పాటించడం ద్వారా ఎవరైనా సరే శాశ్వతమైన మరియు సహజమైన ఫేస్ గ్లోను తమ సొంతం చేసుకోవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/vipareeta-raja-yoga-on-june-9-massive-wealth-career-growth-and-luck-await-these-4-zodiac-signs-1836225.html</loc><lastmod>2026-06-07T16:25:28+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/vipareeta-raja-yoga-2026.jpg</image:loc>
					<image:title><![CDATA[ Vipareeta Raja Yoga 2026 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rashifal-4.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల స్థాన మార్పులు, వాటి ప్రత్యేక సంయోగాలు వ్యక్తుల జీవితాలపై గణనీయమైన ప్రభావం చూపుతాయని విశ్వసిస్తారు. కొన్ని గ్రహయోగాలు అదృష్టాన్ని పెంచగా, మరికొన్ని జీవితంలో కొత్త అవకాశాలకు మార్గం సుగమం చేస్తాయి. అలాంటి శక్తివంతమైన యోగాల్లో ఒకటిగా భావించే ‘విపరీత రాజయోగం’ జూన్ 9న ఏర్పడనుంది. సాధారణంగా ప్రతికూలంగా భావించే గ్రహస్థితులు కూడా ఈ యోగం ద్వారా అనుకూల ఫలితాలను ఇవ్వగలవని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు. అధిక మాసంలో సంభవిస్తున్న ఈ ప్రత్యేక యోగం కారణంగా కొన్ని రాశుల వారికి ఆర్థిక, సామాజిక, వృత్తిపరమైన రంగాల్లో విశేషమైన పురోగతి కనిపించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా నాలుగు రాశుల వారు ఈ సమయంలో అదృష్టం బలంగా కలిసి రావడంతో ఎన్నో శుభ పరిణామాలను అనుభవించవచ్చని అంచనా వేస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rashifal1-3.jpg</image:loc><image:caption><![CDATA[ కర్కాటక రాశి.. కర్కాటక రాశి వారికి ఈ కాలం అనేక విధాలుగా అనుకూలంగా ఉండవచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన ఆస్తి సంబంధిత వ్యవహారాలు పరిష్కారం దిశగా కదిలే అవకాశముంది. కోర్టు కేసులు లేదా వివాదాల్లో కూడా సానుకూల ఫలితాలు పొందవచ్చు. సమాజంలో గౌరవం, గుర్తింపు పెరగడంతో పాటు విదేశీ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్తలు అందే సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయ రంగానికి చెందిన వారికి కూడా కొత్త అవకాశాలు లభించవచ్చు. గతంలో రావాల్సిన బకాయిలు తిరిగి చేతికి అందే అవకాశం ఉండటంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశముంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rashifal2-4.jpg</image:loc><image:caption><![CDATA[ కన్యా రాశి.. ఈ రాశి వారికి ఈ యోగం పోటీ పరిస్థితుల్లో విజయాన్ని అందించవచ్చని జ్యోతిష్య విశ్లేషణలు సూచిస్తున్నాయి. మీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు క్రమంగా అనుకూలంగా మారే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నిస్తున్న వారికి అవకాశాలు లభించవచ్చు.  కార్యాలయంలో మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. న్యాయపరమైన వ్యవహారాల్లో కూడా అనుకూల పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఆర్థికంగా కూడా కొత్త అవకాశాలు తలుపుతట్టవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rashifal3-4.jpg</image:loc><image:caption><![CDATA[ తులా రాశి.. ఈ రాశి వారికి వృత్తి, వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు కనిపించవచ్చు. ముఖ్యంగా భూములు, నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో ఉన్నవారు లాభాలను పొందే అవకాశముంది. సమాజంలో మీ అభిప్రాయాలకు విలువ పెరుగుతుంది. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న   వారికి శుభ సమాచారం అందవచ్చు. వివాహ యత్నాలు చేస్తున్న వారికి కూడా అనుకూల సమయం కావచ్చని భావిస్తున్నారు. ఉద్యోగాల్లో పదోన్నతులు లేదా బాధ్యతలు పెరగడం వంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rashifal4-4.jpg</image:loc><image:caption><![CDATA[ ధనస్సు రాశి.. ఈ రాశి వారికి ఈ యోగం ఆర్థిక, కుటుంబ పరంగా శుభ ఫలితాలను అందించవచ్చని చెబుతున్నారు. కుటుంబ ఆస్తులకు సంబంధించిన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. సొంత ఇంటి కలను నిజం చేసుకునే దిశగా అడుగులు పడవచ్చు. గతంలో మీరు చేసిన సహాయానికి ప్రతిఫలంగా కొందరి నుంచి మద్దతు లభించే అవకాశం ఉంది. ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి, అవి భవిష్యత్తులో ఉపయోగపడవచ్చు. వ్యాపారం లేదా ఉద్యోగంలో ఆదాయం పెరగడంతో ఆర్థిక స్థిరత్వం మరింత బలపడే సూచనలు ఉన్నాయి.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/mrigashira-karthi-2026-big-opportunities-for-taurus-and-leo-zodiac-signs-1836226.html</loc><lastmod>2026-06-07T16:23:42+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/sun-transist.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sun Transist ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/astro-5.jpg</image:loc><image:caption><![CDATA[ మృగశిర కార్తె గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఈ ఏడాది జూన్ 8 న మృగశిర కార్తెను జరుపుకోనున్నారు. ఈ సమయంలో చేపలు తినడం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తుంది. జ్యోతిష్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం రెండు రాశుల వారికి బాగా కలిసి రానుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/mrugashira.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ సమయంలో సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు దీనినే  మృగశిర కార్తె అని పిలుస్తారు. ఇంకా జ్యోతిష్య, రాశిఫలాల ప్రకారం.. సూర్య సంచారం వలన ముఖ్యంగా మకర, వృషభ రాశుల సానుకూలంగా ఉంటుంది. వీరికి ఎదురు ఉండదు నిజం చెప్పాలంటే వీరు కూడా ఊహించని విధంగా గుర్తింపు కొత్తగా చేస్తున్న వ్యాపారాల్లో అధిక లాభాలు వస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/simha-rasi-2.jpg</image:loc><image:caption><![CDATA[ సింహ రాశి : మృగశిర కార్తె  రోజు నుంచి వీరి జీవితాల్లోకి కొత్త వెలుగులు వస్తాయి. ఆర్థికంగా లాభ పడతారు. ప్రభుత్వ ఉద్యోగం కూడా వస్తుంది. ఇంకా డబ్బు సంపాదించడానికి మార్గాలు వెతుకుతారు.  వ్యాపారంగాల్లో ఉన్నవారు అనేక రకాలుగా డబ్బు సంపాదిస్తారు. 
కోర్టు సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు ఇంకా ఒక్కసారిగా మొత్తం మారుతుంది ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/vrushaba.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభ రాశి : మృగశిర కార్తె  రోజు నుంచి వీరి జీవితంలో కొత్త మార్పులు రాబోతున్నాయి ఏది పట్టుకుంటే అదివీరి సొంతమవుతుంది ఇంకా  వీరికి అనుకూలంగా ఉంటుంది. అంతక ముందు ఉన్న భూములకు రేట్లు పెరుగుతాయి మీరు కొత్తగా పెట్టుబడులు పెట్టిన దగ్గర 
లాభాలు వస్తాయి. ఇంకా అనుకున్న పనులు అవ్వడంతో సంతోషంతో ఎగిరి గంతేస్తారు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/astrology-6.jpg</image:loc><image:caption><![CDATA[ (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/chanakya-niti-mistakes-men-should-avoid-while-trying-to-impress-women-1836138.html</loc><lastmod>2026-06-07T14:26:23+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chanakya-niti-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Chanakya Niti 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chanakya-niti-1.jpg</image:loc><image:caption><![CDATA[ చాణక్య నీతి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.  నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . ఆయన తన నీతి శాస్త్రంలో ఎన్నో ముఖ్య విషయాల గురించి తెలిపాడు. యువత నుంచి పెద్ద వాళ్ళ వరకు నేటికీ కూడా ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chanakya-niti-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ అబ్బాయిల్లో కొందరు అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి  అనేక కష్టాలు పడుతుంటారు. అయితే, అమ్మాయిలను ఆకట్టుకోవడానికి కొందరు తెలీకుండానే తెలియకుండానే తప్పులు చేస్తుంటారు. అయితే, ఈ తప్పులే చివరకు గౌరవం, ప్రతిష్ట వారి  ఇమేజ్‌ను దెబ్బతీస్తాయని చాణక్యుడు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chanakya-niti-5.jpg</image:loc><image:caption><![CDATA[ మర్యాదలేని మాటలు : కొందరు అమ్మాయిల మీద అర్ధం లేని జోకులు వేస్తారు అయితే ఇలాంటి మాటలు అనడం మంచిది కాదని చెబుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు. అయితే, చాణక్య నీతి ప్రకారం.. ఎవరితోనైనా మర్యాదగా మాట్లాడాలి లేదంటే వారి వ్యక్తిత్వం పైనే తీసుకోలేని మచ్చ పడుతుంది. ఇంకా వారి ప్రతిష్టను కూడా  దెబ్బతీస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chanakya-niti-6.jpg</image:loc><image:caption><![CDATA[ కోపం : చాణక్యుడి నీతి ప్రకారం.. ఇంకా అమ్మాయిల ముందు గట్టి గట్టిగా అరవడం, ఇంకా గట్టిగా మాట్లాడటం వంటి వాటిని చెయ్యకూడదు ఇవి వీరి బలహీనతను బయటపెడుతుంది. కాబట్టి, శాంతంగా అమ్మాయిల దగ్గర శాంతంగా మాట్లాడాలి  అప్పుడే వారి న గౌరవం కూడా పెరుగుతుంది. అమ్మాయిలను ఆకట్టుకోవాలంటే అహంకారం అస్సలు ఉండకూడదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chanakya-niti-7.jpg</image:loc><image:caption><![CDATA[ ఆర్థిక విషయాలు చెప్పడం: అమ్మాయిలను ఆకట్టుకోవడానికి కొందరు ఆర్థిక విషయాలు చెబుతారు. ఇవి అస్సలు వారి ముందు అస్సలు చెప్పకూడదు. చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం.. అబ్బాయిలు, అమ్మాయిల అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు కోపం తగ్గించుకుని మాట్లాడాలి. లేదంటే, పరువు పోతోంది. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/roasted-brinjal-curd-chutney-recipe-a-smoky-and-creamy-andhra-style-pachadi-everyone-will-love-1836065.html</loc><lastmod>2026-06-07T14:00:08+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/perugu-pachadi-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Perugu Pachadi ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/perugu-pachadi.jpg</image:loc><image:caption><![CDATA[ వంకాయ , పెరుగుతో చేసే ఆరోగ్యకరమైన రెసీపీ వంటకం. ఈ పెరుగు పచ్చడిని కొందరు అన్ని కాలాల్లో తింటారు అలాగే, ఇది శరీరానికి కూడా చలువ చేస్తుంది. ఇంకా ఇది అన్నంలోకి కూడా అదిరిపోతోంది. దీని కోసం ఎక్కువ సమయం పెట్టుకోకుండా కొద్దీ నిమిషాల్లోనే దీనిని చాలా ఈజీగా చేసేయొచ్చు. ఇంకా ఈ పెరుగు పచ్చడిలో అల్లం, పచ్చిమిర్చిని కూడా వేస్తే రుచిని ఇస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/perugu-pachadi-1.jpg</image:loc><image:caption><![CDATA[ వంకాయ పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్దాలు : రెండు కప్పులు పెరుగు, రుచికి తగినంత ఉప్పు,  అర టేబుల్ స్పూన్ పసుపు,  ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, తాలింపులోకి ఆవాలు, అర కప్పు  నూనె, అర టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం,  ఇంకా నాలుగు కరివేపాకు ఆకులు , కొత్తిమీరను కూడా వేసి తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/perugu-pachadi-2.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా వంకాయలను తీసుకుని వాటిని  బాగా కాల్చుకోవాలి.  అ తర్వాత ఈ మిశ్రమాన్ని తీసుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. అలాగే, మంచి  పెరుగును కూడా తీసుకుని దానిలో కట్ చేసిన కూరగాయల ముక్కలు కట్ చేసుకుని దీనిలో వేసుకోవాలి.. ఇక ఇప్పుడు ఒక పాత్రలో పెరుగును తీసుకుని దానిలో సరిపడా నీళ్ళు పోసి  ఇంకా వీటిని మజ్జిగ కవ్వంతో తిప్పుకుని తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/perugu-pachadi-3.jpg</image:loc><image:caption><![CDATA[ వంకాయలను ఉడికించుకోవాలి : గ్యాస్ పొయ్యి లేదా  వెలిగించి దాని మీద ఒక పాత్ర పెట్టి దానిలో వంకాయలతో పాటు కూరగాయల ముక్కలు, అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా  ఉడికించాలి.  ఇవి మెత్తగా అయిన తర్వాత  కొద్దిగా మజ్జిగను పోసి మీడియం  మంటపై ఉడికించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/perugu-pachadi-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు పోపు పెట్టడానికి మళ్ళీ పాన్ తీసుకుని దానిలో నూనె వేసి, ఇంకా అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర,  నాలుగు కరివేపాకు ఆకులు , కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసి ఉడికించాలి. సమ్మర్లో  ఈ వంకాయ పెరుగు పచ్చడి తింటే  ఒంట్లో ఉన్న వేడి కూడా పోతోంది. ఇంకా రుచిగా కావాలంటే దీనిలో దీనిలో  కొత్తిమీర కూడా వేస్తే రుచిగా  ఉంటుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/country-chicken-cooking-secrets-how-our-grandparents-made-natu-kodi-soft-juicy-and-flavorful-1835994.html</loc><lastmod>2026-06-07T12:10:24+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/natukodi-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Natukodi 3 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/natukodi-5.jpg</image:loc><image:caption><![CDATA[ చికెన్ అంటే కొద్దీ నిముషాల్లోనే ఉడుకుతుంది కానీ నాటు కోడి అలా కాదు. దీని కోసం ప్రత్యేకంగా పొయ్యి దగ్గరే కూర్చొని మంట పెడుతూ ఉండాలి లేదంటే ఈ  కోడి మాంసం త్వరగా ఉడకదు. ఇది త్వరగా, మెత్తగా ఉడకాలంటే తాతల కాలంలో ఈ చిన్న పద్ధతులు పాటించేవాళ్లు అయితే వీటిని కూర మధ్యలో వేస్తె చాలు..  రెడీ అవుతుంది. మరి, లేట్ చేయకుండా అవేంటో ఇక్కడ చూద్దాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/natukodi-1.jpg</image:loc><image:caption><![CDATA[ పాత కాలంలో నాటుకోడి ముక్కలు బాగా గట్టిగా ఉండటం వలన వాటిని మెత్తగా ఉడికించడానికి మట్టి కుండలను వాడే వాళ్లు. ఎందుకంటే, కుండలు ఎంత వేడి అయినా తట్టుకుంటాయి. పొయ్యి మంట పై  కుండపై పెట్టి ఉడికించి వాళ్లు. మట్టి వాసన కూడా యాడ్ అవ్వడంతో కూర రుచి అదిరిపోయేది. అందుకే మన తాతలు ఇప్పటికి బలంగా ఉన్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/natukodi-2.jpg</image:loc><image:caption><![CDATA[ పొయ్యి మంటను పెంచుతూ తగ్గిస్తూ ఇలా ఎక్కువ సమయం సన్నని మంటపైనే మెత్తగా ఉడికించేవాళ్ళు . ఇంకా ఈ నాటు కోడి 
మాంసం సులువుగా ఉడకబెట్టడానికి కొన్ని పద్ధతులు పాటించే వాళ్ళు. ఇంకా ఇది రాతి ఉప్పు, పసుపును ఈ నాటు కోడి ముక్కలకు బాగా పట్టించి కొద్దీ సేపు  పక్కన పెట్టేవాళ్ళు. ఇలా చేయడం వలన ముక్కల్లోని నీరు  బయటకు వచ్చే వరకు వేయించే వాళ్ళు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/natukodi-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇలా చేస్తే మాంసం చాలా తక్కువ సమయంలోనే మెత్తబడుతుంది. ఇది ఇంకా త్వరగా ఉడకడానికి, కూర ఉడికేటప్పుడు కొద్దిగా  చింతపండు ఇంకా రెండు టేబుల్ స్పూన్స్  నిమ్మరసం, కొద్దిగా పెరుగు కూడా  కలిపి దీనిని ఉడికించేవారు. అలాగే, రోటిలో దంచిన అల్లం, వెల్లుల్లిని కూడా వేసే వాళ్ళు . వీటి వలన కూర రుచి సూపర్ ఉండేది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/natukodi-6.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంకా దీనిలో వేయించిన మసాలా దినుసులు పొడి వేసేవాళ్ళు వాటిలో కొద్దిగా ధనియాలు, నాలుగు లవంగాలు, ఒక దాల్చిన చెక్క  వాడేవారు. ఇంకా దీనిలో ఎండుమిర్చి కూడా వేసే వాళ్ళు. ఇంకా  పచ్చిమిర్చిని కూడా వేసే వాళ్ళు.  దీని వలన కలర్ కూడా వచ్చేది. వీటిని మన తాతలు మంటపై కాల్చి నూరి కూరలో వేసే వాళ్ళు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/auto-news-bumper-offers-on-maruti-suzuki-cars-discounts-of-up-to-rs-2-15-lakh-available-in-june-month-1835297.html</loc><lastmod>2026-06-07T11:47:31+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/maruti-suzuki.jpg</image:loc>
					<image:title><![CDATA[ Maruti Suzuki ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/maruti-cars5-1.jpg</image:loc><image:caption><![CDATA[ Auto News: మీరు మారుతి సుజుకి కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే కొనుగోలు చేయడానికి జూన్ మంచి సమయం కావచ్చు. ఈ నెలలో ఈ కార్ల తయారీ సంస్థ తన నెక్సా శ్రేణిపై రూ.2.15 లక్షల వరకు తగ్గింపులను అందిస్తోంది. ఈ ఆఫర్లు ఇన్విక్టో MPV, గ్రాండ్ విటారా SUV, బాలెనో హ్యాచ్‌బ్యాక్, ఫ్రాంక్స్ SUV, XL6 MPV, జిమ్నీ SUV, ఇగ్నిస్ హ్యాచ్‌బ్యాక్ వంటి మోడళ్లపై అందుబాటులో ఉన్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/maruti-cars1.jpg</image:loc><image:caption><![CDATA[ మారుతి సుజుకి ఇన్విక్టో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఈ ప్రీమియం MPVపై మొత్తం రూ.2.15 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. దీంతో ఇది ఈ నెలలో అత్యధిక తగ్గింపు పొందుతున్న నెక్సా మోడల్‌గా నిలిచింది. ఈ ఆఫర్ ప్యాకేజీలో వినియోగదారుల ప్రయోజనాలు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ బోనస్‌లు, అప్‌గ్రేడ్ లాయల్టీ బోనస్‌లు, కార్పొరేట్ డిస్కౌంట్లు ఉన్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/maruti-cars2.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ నెలలో గ్రాండ్ విటారా రెండవ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. దీని ఎంట్రీ-లెవల్ సిగ్మా పెట్రోల్ వేరియంట్‌పై రూ.1.35 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తుండగా, డెల్టా పెట్రోల్ (మాన్యువల్, ఆటోమేటిక్) వేరియంట్లు రూ.1.25 లక్షల వరకు ఆఫర్లతో అందుబాటులో ఉన్నాయి. జీటా, ఆల్ఫా, AWD వేరియంట్లను కొనుగోలు చేసే కస్టమర్లు రూ.85,000 వరకు ప్రయోజనాలను, కాంప్లిమెంటరీ 5 సంవత్సరాల పొడిగించిన వారంటీని కూడా పొందవచ్చు. గ్రాండ్ విటారా లైనప్‌లో అతిపెద్ద ఆఫర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్లపై ఉంది. ఈ వేరియంట్లలో ఢిల్లీలో రూ.1.85 లక్షల వరకు జీరో రోడ్ టాక్స్, రూ.90,000 వరకు అదనపు ప్రయోజనాలు, ఉచిత ఐదేళ్ల పొడిగించిన వారంటీ లభిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/maruti-cars3.jpg</image:loc><image:caption><![CDATA[ మారుతి సుజుకి హ్యాచ్‌బ్యాక్‌లలో ఇగ్నిస్ AGS వేరియంట్‌పై రూ.45,000 వరకు ప్రయోజనాలు లభిస్తుండగా, మాన్యువల్ వేరియంట్ రూ.40,000 వరకు తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఇగ్నిస్ ఉత్పత్తి ఇప్పుడు నిలిచిపోయింది. ఈ ఆఫర్ డీలర్ల వద్ద మిగిలి ఉన్న స్టాక్‌పై మాత్రమే అందుబాటులో ఉంది. బాలెనో పెట్రోల్, AGS వేరియంట్లు కూడా రూ.40,000 వరకు తగ్గింపులతో అందుబాటులో ఉండగా, CNG వేరియంట్ రూ.35,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/maruti-cars4.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ నెలలో ఫ్రాంక్స్‌పై తక్కువ తగ్గింపులు లభిస్తున్నాయి. టర్బో-పెట్రోల్ వేరియంట్‌పై రూ.25,000 వరకు తగ్గింపులు లభిస్తుండగా, నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, ఏజీఎస్, సీఎన్‌జీ వేరియంట్లపై రూ.15,000 వరకు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. అదనంగా వినియోగదారులు పెట్రోల్ లేదా CNG వెర్షన్‌ను ఎంచుకున్నా, మారుతి సుజుకి XL6 పై రూ.45,000 వరకు తగ్గింపులను అందిస్తోంది. జిమ్నీ లైఫ్‌స్టైల్ ఎస్‌యూవీ అన్ని వేరియంట్లపై రూ.45,000 వరకు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్‌లు జూన్ 2026 వరకు చెల్లుబాటులో ఉంటాయి. ప్రాంతం, వేరియంట్ లభ్యత, డీలర్‌షిప్ ప్లాన్‌లను బట్టి మారవచ్చు. వర్తించే చోట కొనుగోలుదారులు ఎక్స్ఛేంజ్, స్క్రాపేజ్, కార్పొరేట్ ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/traditional-badam-miriyala-milk-drink-for-rainy-season-health-almond-energy-booster-1835951.html</loc><lastmod>2026-06-07T11:10:13+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/badam-milk-drink-2-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Badam Milk Drink 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/badam-milk-drink-5.jpg</image:loc><image:caption><![CDATA[ వర్షాకాలం మొదలైంది గత మూడు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో వాన పడుతూనే ఉంది ఈ సమయంలో  కొందరికి శరీర నొప్పులు, అలసట, నీరసం, జలుబు సమస్యలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఇలాంటి టైం లోనే  మన తాతలు తాగిన బాదం-మిరియాల పాల డ్రింక్ తాగితే శరీరానికి వేడి, శక్తి అందుతుంది దీనితో వీళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/badam-milk-drink.jpg</image:loc><image:caption><![CDATA[ బాదం, మిరియాల మిల్క్ కు కావలసిన పదార్థాలు: 10 బాదంపప్పులు, నాలుగు నుంచి 10 మిరియాలు, రెండు గ్లాసులు పాలు, 
ఇంకా కొద్దిగా బెల్లం పొడి , రెండు టేబుల్ స్పూన్స్ తేనే, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి , ఇంకా కొద్దిగా కుంకుమపువ్వును తీసుకోవాలి. వీటిని సరైన కొలతలతో చేస్తే రుచి అదిరిపోతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/badam-milk-drink-1.jpg</image:loc><image:caption><![CDATA[ బాదం, మిరియాల మిల్క్ కు తయారీ విధానం: ముందుగా బాదంపప్పును తీసుకుని వాటిని కనీసం 5  గంటల పాటు నీటిలో నానబెట్టాలి. ఆ తరవాత బాదం తొక్కలు తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి ఇప్పుడు మిరియాలను తీసుకుని వాటిని పొడిలాగా చేసి పెట్టుకోవాలి. వాటిని  మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అలాగే, ఇంకా దీనిని ఒక పాత్రలో పాలు పోసి బాగా మరిగించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/badam-milk-drink-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక ఇప్పుడు ఈ పాలు మరిగిన తర్వాత బాదం-మిరియాల పేస్ట్ కూడా బాగా కలుపుకోవాలి.  ఇంకా వీటిని తక్కువ మంటపై కనీసం 10 నిమిషాల పాటు వీటిని బాగా  ఉడికించాలి. అలాగే, ఇప్పుడు దీనిలో కొద్దిగా బెల్లం పొడి, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా  వేసి ఇంకో 5 నిమిషాల పాటు  మరిగించాలి. అంతే, వేడివేడిగా గ్లాసులో పోసి తాగాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/badam-milk-drink-6.jpg</image:loc><image:caption><![CDATA[ బాదం-మిరియాల డ్రింక్ వలన కలిగే లాభాలు ఇవే: ఈ డ్రింక్  వర్షాకాలంలో శరీరానికి వేడిగా ఉంచుతుంది. ఇంకా అలసట, నీరసాన్ని కూడా తగ్గిస్తుంది. ఇంకా శక్తిని పెంచే పోషకాలు కూడా ఇది  అందిస్తుంది. జలుబు, గొంతు సమస్యలతో బాధ పడేవాళ్ళు ఈ  సమయంలో తాగితే మంచిగా అనిపిస్తుంది. రాత్రిపూట తాగితే ఇంకా చాలా మంచిది ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/vastu-tips-for-aquarium-placement-bring-prosperity-and-positive-energy-into-your-home-1835934.html</loc><lastmod>2026-06-07T10:42:55+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/fish-tank-in-home.jpg</image:loc>
					<image:title><![CDATA[ Fish Tank In Home ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/fish-tank.jpg</image:loc><image:caption><![CDATA[ ఇటీవలి కాలంలో ఇంటి అందాన్ని పెంచడంతో పాటు ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించేందుకు చాలా మంది ఫిష్ అక్వేరియంలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం అక్వేరియం కేవలం అలంకరణ వస్తువు మాత్రమే కాదు, ఇంట్లో సానుకూల శక్తి, సంపద, ఆనందాన్ని తీసుకువచ్చే శక్తివంతమైన అంశంగా కూడా పరిగణించబడుతుంది. సరైన దిశలో, సరైన పద్ధతిలో అక్వేరియంను ఏర్పాటు చేస్తే కుటుంబానికి శుభఫలితాలు కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/fish-tank-1.jpg</image:loc><image:caption><![CDATA[ వాస్తు, ఇంటీరియర్ కన్సల్టెంట్ ఆర్నా జై మదన్ తెలిపిన వివరాల ప్రకారం.. అక్వేరియంలో ప్రవహించే నీరు ఇంట్లో సానుకూల శక్తిని పెంచి ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది. చేపలు ప్రతికూల శక్తులను తొలగించి ప్రశాంతతను కలిగిస్తాయని నమ్మకం. ముఖ్యంగా అక్వేరియంను తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశల్లో ఉంచడం శ్రేయస్కరంగా భావిస్తారు. లివింగ్ రూమ్‌లో ఆగ్నేయ దిశలో ఉంచడం కూడా అనుకూల ఫలితాలను ఇస్తుందని వాస్తు సూచిస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/fish-tank-2.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే అక్వేరియం ఏర్పాటు చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. వంటగదిలో చేపల తొట్టిని ఉంచకూడదు. వంటగది అగ్ని తత్వానికి, అక్వేరియం జల తత్వానికి సంకేతం కావడంతో ఈ రెండు తత్వాల మధ్య ఘర్షణ ఏర్పడి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే ఇంటి మధ్యభాగం, దక్షిణ దిశ, మెట్ల కింద లేదా నేరుగా ఎండ తగిలే కిటికీల దగ్గర కూడా అక్వేరియం ఏర్పాటు చేయకూడదని సూచిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/fish-tank-3.jpg</image:loc><image:caption><![CDATA[ కార్యాలయాల్లో కూడా అక్వేరియాన్ని ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉన్న రిసెప్షన్ ప్రాంతంలో ఉంచడం మంచిదని వాస్తు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఉద్యోగుల్లో ఏకాగ్రతను పెంచడంతో పాటు సృజనాత్మకతను ప్రోత్సహిస్తుందని చెబుతున్నారు. అక్వేరియం నిర్వహణ కూడా అంతే ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి ఒకటి లేదా రెండు వారాలకు నీటిలో 15 నుంచి 25 శాతం వరకు మార్చడం, ట్యాంక్‌లో మొక్కలను పెంచడం, ఫిల్టర్లు, పంపులు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో పరిశీలించడం అవసరం. అదనపు ఆహారాన్ని తొలగించడం ద్వారా నీరు కలుషితం కాకుండా చూడాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/fish-tank-4.jpg</image:loc><image:caption><![CDATA[ వాస్తు శాస్త్రం ప్రకారం గురువారం రోజున చేపలను కొనుగోలు చేసి అక్వేరియంలో ప్రవేశపెట్టడం శుభప్రదంగా భావిస్తారు. సరైన స్థలంలో, సరైన సంరక్షణతో చేపల అక్వేరియం ఏర్పాటు చేస్తే ఇంట్లో సానుకూల వాతావరణం, ప్రశాంతత, శ్రేయస్సు పెరుగుతాయని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఇవన్నీ సాంప్రదాయ వాస్తు విశ్వాసాలపై ఆధారపడిన సూచనలేనని, వాటికి శాస్త్రీయ ఆధారాలు పరిమితంగా ఉన్నాయని గుర్తుంచుకోవాలి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/village-style-polam-dondakaya-pachadi-recipe-a-simple-and-delicious-ivy-gourd-chutney-ready-in-minutes-1835919.html</loc><lastmod>2026-06-07T10:28:51+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/dondakya-pachadi-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Dondakya Pachadi 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/dondakya-pachadi.jpg</image:loc><image:caption><![CDATA[ పల్లెటూర్లలో జనాలు ఉదయం లేవగానే అన్నం, కూర వండుకుని బాక్స్ లో కట్టుకుని వెళ్తారు. ఇంకొందరు పొలం పచ్చడిని చేసుకుని ఎంచక్కా చెట్ల కింద కూర్చొని తింటారు. అయితే, ఈ పేదోళ్ళ పొలం పచ్చడి తింటే అమృతమే. దీని కోసం ఎక్కువ సమయం కూడా అవసరం లేదు. దీనిని అప్పటికప్పుడు చేసేయోచ్చు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/dondakya-pachadi-3.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు : పావు కిలో దొండకాయలు, 100 గ్రాములు పచ్చిమిర్చి,  6 వెల్లుల్లి రెబ్బలు,  ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 
రుచికి సరిపడా ఉప్పు, – చిన్న నిమ్మకాయంత చింతపండు , అర కట్ట కొత్తిమీర, రెండు టేబుల్ స్పూన్స్ నూనె,  అలాగే, తాలింపు కోసం
అర టేబుల్ స్పూన్ ఆవాలు , అర టేబుల్ స్పూన్ మినప్పప్పు నాలుగు ఎండుమిర్చి, రెండు కరివేపాకు ఆకులు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/dondakya-pachadi-4.jpg</image:loc><image:caption><![CDATA[ పొలం దొండకాయ పచ్చడి తయారీ విధానం: ముందుగా దొండకాయలను తీసుకుని వాటిని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని  పెట్టుకోవాలి. ఆ తర్వాత వీటిని పాన్‌లో వేసి ఇంకా వాటితో పాటు నాలుగు పచ్చిమిర్చి, దొండకాయ ముక్కలను కూడా వేసి రంగు మారే వరకు వీటిని బాగా  వేయించాలి. ఇలా చేస్తే పచ్చడి మెత్తగా తినొచ్చు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/dondakya-pachadi-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక ఇది పూర్తిగా చల్లారిన తర్వాత కొంచం చింతపండు, నాలుగు వెల్లుల్లి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఉప్పు కూడా వేసి వీటిని 
మిక్సీలో మెత్తగా..  గరుకుగా రుబ్బుకోవాలి. ఇక ఇప్పుడు చిన్న పాన్‌లో పోపు సిద్ధం చేసి ఈ పచ్చడి మీద పోయాలి. అలాగే, చివర్లో  కొత్తిమీర కూడా చల్లి దీనిని బాగా మిక్స్ అయ్యేలా  కలపాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/dondakya-pachadi-1.jpg</image:loc><image:caption><![CDATA[ రాగి సంగటి, జొన్న రొట్టెల్లోకి సూపర్: ఇంకా దీనిని వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈ పచ్చడిని రాగి సంగటి, జొన్న రొట్టె, చపాతీలతో తింటే  చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దీ నిముషాల్లోనే ఇది తయారవుతుంది. ఇది పల్లెటూరి రుచిని కూడా అందిస్తుంది. ఇంకా దీనిలో ఉండే ఫైబర్  జీర్ణక్రియకు ఎంతగానో సహాయపడుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/healthy-alasanda-onion-tiffin-recipe-protein-rich-breakfast-that-helps-cool-the-body-naturally-1835837.html</loc><lastmod>2026-06-07T08:37:28+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/alasanda.jpg</image:loc>
					<image:title><![CDATA[ Alasanda ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/alasanda-5.jpg</image:loc><image:caption><![CDATA[ సాయంత్రం పూట చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఏదొక స్నాక్స్ తినాలని అనుకుంటారు ఆ సమయానికి నాలుక  కూడా లాగుతూ ఉంటుంది. అప్పుడు ఈ అలసందలతో చేసి తింటే రుచి అదిరిపోతోంది. దీనితో ఒకటి కాదు ఎన్నో రకాలు తయారు చేసుకుని తినొచ్చు. మరి, వీటిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/alasanda-1.jpg</image:loc><image:caption><![CDATA[ అలసందలు, ఉల్లిపాయలతో సూపర్ టిఫిన్ దీనికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు అలసందలు, రెండు ఉల్లిపాయలు, 
మూడు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర , నాలుగు కరివేపాకు ఆకులు,  రెండు టేబుల్ స్పూన్స్ బియ్యప్పిండి , అర కట్ట కొత్తిమీర ఆకులు, రుచికి తగినంత ఉప్పు, ఇంకా నూనెను తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/alasanda-2.jpg</image:loc><image:caption><![CDATA[ అలసందలు, ఉల్లిపాయల టిఫిన్ తయారీ విధానం:  ముందుగా అలసందలను తీసుకుని కనీసం  8 గంటలు పాటు వీటిని నానబెట్టి వాటి నుంచి నీరు వంపేసి పక్కన పెట్టాలి. ఆ తరవాత వీటిని తీసుకుని పచ్చిమిర్చి, కొద్దిగా అల్లంతో కూడా వేసి దానిని మెత్తగా రుబ్బుకోవాలి. ఇంకా దీనిలో ఉల్లిపాయ ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/alasanda-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంకా ఈ మిశ్రమంలో  బియ్యప్పిండిని కూడా వేసి కలపాలి. ఇంకా పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి మీరు చేతులకు కొద్దిగా నూనె రాసి 
పిండిని చిన్న ముద్దలుగా చేసి  మీడియం మంటపై కాల్చాలి. ఒక వైపు కాలిన తరవాత  ఇంకో వైపు కూడా వీటిని కాలనివ్వాలి. 
ఇలా  రెండు వైపులా క్రిస్పీగా కాలిన తర్వాత కిందకు దించేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/alasanda-6.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ అలసందలు కొందరికి పడవు తింటే కడుపునొప్పి  వచ్చే అవకాశం ఉంది అలాంటి వాళ్లు వీటిని తినకపోవడమే మంచిది (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/mango-storage-tips-how-to-store-mangoes-at-home-fridge-or-room-temperature-tips-for-fresh-mango-storage-guide-1835857.html</loc><lastmod>2026-06-07T08:26:13+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/mango-storage-tips2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Mango Storage Tips ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/mango-storage-tips2-1.jpg</image:loc><image:caption><![CDATA[ Mango Storage Tips: ఈ కాలంలో మామిడి పండ్లు అత్యంత ప్రజాదరణ పొందిన పండుగా మారతాయి. వాటి రుచి, పోషక విలువలు రెండూ ప్రజలను ఆకట్టుకుంటాయి. ఫలితంగా మార్కెట్లలో మామిడి పండ్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రజలు వాటిని పెద్ద మొత్తంలో కొని ఇంటికి తీసుకువెళ్తున్నారు. దీంతో మామిడి పండ్లను ఫ్రిజ్‌లో పెట్టాలా వద్దా అని చాలామంది ఆలోచిస్తున్నారు. సరైన పద్ధతిలో నిల్వ చేయడం వల్ల మామిడి పండ్లు చాలా కాలం పాటు తాజాగా ఉంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/mango-storage-tips1.jpg</image:loc><image:caption><![CDATA[ చాలా మంది మామిడి పండ్లను కొని నేరుగా ఫ్రిజ్‌లో పెడతారు. కానీ ఇది ఎల్లప్పుడూ సరైన పద్ధతి కాదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పచ్చి మామిడి పండ్లను ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే చల్లని ఉష్ణోగ్రతలు వాటి సహజ పక్వ ప్రక్రియను నెమ్మదింపజేస్తాయి. ముందుగా మామిడి పండును గది ఉష్ణోగ్రత వద్ద పండనివ్వండి. పూర్తిగా పండిన తర్వాత దానిని ఫ్రిజ్‌లో పెట్టవచ్చు. అయితే అత్యంత చల్లని ఉష్ణోగ్రతలు మామిడి పండు రుచిని, తీపిని తగ్గిస్తాయని గమనించడం ముఖ్యం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/mango-storage-tips3.jpg</image:loc><image:caption><![CDATA[ మామిడి పండ్లను ఫ్రిజ్‌లో నిల్వ చేయాలా వద్దా అనేది వాటి పక్వతపై ఆధారపడి ఉంటుంది. పచ్చిగా లేదా సగం పండిన మామిడి పండ్లను ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదు. ఎందుకంటే చల్లని ఉష్ణోగ్రతలు వాటి సహజ పక్వ ప్రక్రియను నెమ్మదింపజేస్తాయి. మీరు పచ్చి మామిడి పండ్లను కొనుగోలు చేసినట్లయితే, వాటిని వార్తాపత్రికలో చుట్టి లేదా గాలి చొరబడని బుట్టలో పెట్టి గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. ఇది అవి నెమ్మదిగా, సహజంగా పక్వానికి రావడానికి వీలు కల్పిస్తుంది. అలాగే, పచ్చి మామిడి పండ్లను నీటిలో కడిగిన వెంటనే ఎప్పుడూ నిల్వ చేయవద్దు. దీనివల్ల అవి త్వరగా పాడైపోతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/mango-storage-tips4.jpg</image:loc><image:caption><![CDATA[ మామిడి పండ్లను ఎల్లప్పుడూ ప్రత్యక్ష సూర్యరశ్మి తగలకుండా, మంచి గాలి ప్రసరణ ఉండే ప్రదేశంలో నిల్వ చేయాలి. తీవ్రమైన సూర్యరశ్మి, అధిక వేడి పండ్లు త్వరగా పక్వానికి వచ్చి, త్వరగా పాడైపోతాయి. మామిడి పండ్లను గది ఉష్ణోగ్రత వద్ద చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయడం వల్ల వాటి తాజాదనం, రుచి ఎక్కువ కాలం నిలిచి ఉంటాయి. అంతేకాకుండా, గాలి ప్రసరించే వాతావరణం తేమను తగ్గిస్తుంది. దీనివల్ల బూజు పట్టడం లేదా కుళ్ళిపోయే అవకాశం తగ్గుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/mango-storage-tips5.jpg</image:loc><image:caption><![CDATA[ మామిడి పండ్లను కోసిన తర్వాత ఏవైనా మిగిలిపోతే వాటిని గాలికి వదిలేయకండి. అలా గాలికి వదిలేయడం వల్ల అవి త్వరగా ఎండిపోయి. బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు పెరిగే ప్రమాదం పెరుగుతుంది. కోసిన మామిడి పండ్లను ఎల్లప్పుడూ ఫ్రిజ్‌లో శుభ్రమైన, గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయండి. ఇలా చేయడం వల్ల వాటిలోని తేమ, తీపి, తాజాదనం పాడవకుండా ఉంటాయి. అలాగే వాటి రుచి కూడా ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది. వాటి నాణ్యతను ఉత్తమంగా ఉంచుకోవాలంటే, కోసిన మామిడి పండ్లను 1-2 రోజుల్లోపు తినాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/mango-storage-tips6.jpg</image:loc><image:caption><![CDATA[ బాగా పండిన మామిడి పండ్లను ఫ్రిజ్‌లో 4 నుండి 5 రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. అయితే వాటిని ప్లాస్టిక్ సంచిలో లేదా గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల వాటిలోని తేమ నిలిచి, రుచి పాడవకుండా ఉంటుంది. ఫ్రిజ్‌లో పెట్టిన తర్వాత తినే ముందు మామిడి పండ్లను గది ఉష్ణోగ్రతకు చల్లారనివ్వండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/mrigasira-karthi-starts-on-june-8-why-is-eating-fish-considered-important-on-this-day-1835812.html</loc><lastmod>2026-06-07T08:29:33+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/why-eat-fish-on-mrigasira-karthi.jpg</image:loc>
					<image:title><![CDATA[ Why Eat Fish On Mrigasira Karthi ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/fish-fry.jpg</image:loc><image:caption><![CDATA[ మృగశిర కార్తె అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది చేపల వంటకాలు. ఈ రోజున ప్రతి ఇంట్లోనూ చేపల కూర లేదా చేపల ఫ్రై వండుకోవడం ఒక ఆచారంగా వస్తోంది. ఈ రోజు చేపలు తినడం వెనుక కేవలం సంప్రదాయమే కాదు, బలమైన శాస్త్రీయ, ఆరోగ్య కారణాలు కూడా దాగి ఉన్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/fish-eating-tradition.jpg</image:loc><image:caption><![CDATA[ ఎండకాలం నుండి వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారినప్పుడు, మానవ శరీరంలో ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పడిపోతుంది. ఈ శీతోష్ణస్థితి మార్పుల వల్ల జ్వరం, జలుబు, దగ్గు వంటి వైరల్ ఇన్‌ఫెక్షన్లు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు (ఆస్తమా) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/omega-3-benefits.jpg</image:loc><image:caption><![CDATA[ చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు,  ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని (Immunity) పెంపొందించి, బాక్టీరియా, వైరస్‌లతో పోరాడే శక్తినందిస్తాయి. అంతేకాకుండా, ఈ సీజన్‌లో చేపలు తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా మారి, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/fish-prasadam.jpg</image:loc><image:caption><![CDATA[ హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన బత్తిన సోదరుల చేప ప్రసాదం పంపిణీ కూడా ఈ మృగశిర కార్తె రోజే ప్రారంభమవుతుంది. దేశం నలుమూలల నుండి ఆస్తమా, శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు ఈ చేప ప్రసాదాన్ని తీసుకోవడానికి తరలివస్తారు. 2026 పంచాంగం ప్రకారం జూన్ 8వ తేదీ రాత్రి వేళ కార్తె ప్రవేశిస్తున్నందున, అదే సమయం నుండి ఆస్తమా రోగులకు ఈ ప్రసాద పంపిణీ జరగనుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/fish-and-immunity.jpg</image:loc><image:caption><![CDATA[ శాకాహారులు ఈ రోజున చేపలకు ప్రత్యామ్నాయంగా బెల్లం, ఇంగువ కలిపిన మిశ్రమాన్ని లేదా చింతచిగురు వంటకాలను తింటారు. మొత్తానికి, మారే కాలానికి అనుగుణంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పెద్దలు ప్రవేశపెట్టిన ఒక అద్భుతమైన జీవనశైలి విధానమే ఈ మృగశిర కార్తె వేడుక. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/money-plant-care-tips-secret-formula-for-green-and-bushy-leaves-in-telugu-1835799.html</loc><lastmod>2026-06-07T07:55:11+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/money-plant-7.jpg</image:loc>
					<image:title><![CDATA[ Money Plant ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/money-plant-6.jpg</image:loc><image:caption><![CDATA[ Money Plant Care Tips: ఇంట్లో పెంచుకునే మనీ ప్లాంట్ ఎదుగుదల లేక, ఆకులు పచ్చబడిపోతూ కళావిహీనంగా మారిందా? అయితే నయా పైసా ఖర్చు లేకుండా మీ మొక్కను మళ్లీ దట్టంగా, నిగనిగలాడేలా మార్చడానికి ఓ తోటమాలి చెప్పిన అద్భుతమైన రహస్యాలు, చిట్కాలను ఓసారి చూద్దాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/money-plant-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ మనీ ప్లాంట్ ఎందుకు వాడిపోతుంది? అసలు కారణాలు ఇవే: చాలామంది ఇళ్లలో మనీ ప్లాంట్ పెంచుకుంటారు. లక్ష్మీదేవి స్వరూపంగా, ఇంట్లోకి సానుకూల శక్తిని (పాజిటివ్ ఎనర్జీ) తీసుకొచ్చే మొక్కగా దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే, సరైన సంరక్షణ లేకపోతే ఈ మొక్క ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతుంటాయి. దీని వెనుక ఉన్న ప్రధాన కారణాలను తెలుసుకుంటే, సమస్యను పరిష్కరించడం ఎంతో సులభం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/money-plant-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ 1. మోతాదుకు మించి నీళ్లు పోయడం (Overwatering): మనీ ప్లాంట్ ఆకులు పసుపు రంగులోకి మారడానికి అత్యంత ముఖ్యమైన కారణం అవసరానికి మించి నీరు పెట్టడం. మొక్కకు నీరు అవసరమే, కానీ కుండీలో నీరు నిలిచిపోతే వేర్లు కుళ్ళిపోతాయి. వేర్లకు ఆక్సిజన్ అందకపోవడం వల్ల కాండం బలహీనపడి, ఆకులు జీవం కోల్పోయి పసుపు రంగులోకి మారుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/money-plant-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ 2. ఎండ తీవ్రత – నీడ ప్రభావం: మనీ ప్లాంట్‌కు నేరుగా తగిలే ఎండ అస్సలు పడదు. మధ్యాహ్నం వేళ వచ్చే తీవ్రమైన ఎండలో ఈ మొక్కను ఉంచితే, ఆకులు మాడిపోయి పసుపు రంగు మచ్చలు పడతాయి. అలాగని పూర్తిగా చీకటి గదిలో ఉంచినా ప్రమాదమే. వెలుతురు లేకపోతే మొక్క కిరణజన్య సంయోగ క్రియ (Photosynthesis) జరుపుకోలేదు. ఫలితంగా ఆకులు పచ్చదనాన్ని కోల్పోతాయి. కాబట్టి, పరోక్షంగా (Indirect Sunlight) మంచి వెలుతురు వచ్చే కిటికీల దగ్గర దీనిని ఉంచడం ఎంతో శ్రేయస్కరం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/money-plant-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ 3. కుండీ చిన్నదైపోవడం (Root Bound): మొక్క బాగా పెరిగిన తర్వాత కూడా చిన్న కుండీలోనే ఉంచేస్తే, దాని వేర్లు ఒకదానికొకటి అల్లుకుపోయి ఊపిరాడకుండా మారిపోతాయి. దీనిని &#039;రూట్ బౌండ్&#039; అంటారు. ఇలా జరగడం వల్ల మట్టిలోని పోషకాలను, నీటిని వేర్లు సరిగ్గా గ్రహించలేవు. ఈ పరిస్థితిలో మొక్కను కాస్త పెద్ద కుండీలోకి, కొత్త మట్టిని ఉపయోగించి మార్చడం (Repotting) చాలా అవసరం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/surprising-benefits-of-money-plant-1.jpg</image:loc><image:caption><![CDATA[ 4. పోషకాల లోపం, ఉష్ణోగ్రత మార్పులు: మొక్కలోని పాత ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయంటే దానికి నైట్రోజన్ వంటి పోషకాలు అందడం లేదని అర్థం. అలాగే, ఇంట్లోని ఉష్ణోగ్రత అకస్మాత్తుగా మారినా ఈ మొక్క తట్టుకోలేదు. ఏసీ నుంచి వచ్చే చల్లటి గాలి నేరుగా మొక్కపై పడితే అది ఒత్తిడికి లోనవుతుంది. సాధారణంగా 18 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మనీ ప్లాంట్ ఎదుగుదలకు అత్యంత అనుకూలం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/surprising-benefits-of-money-plant-2.jpg</image:loc><image:caption><![CDATA[ రూపాయి ఖర్చు లేని సీక్రెట్ ఫార్ములా.. మొక్కను దట్టంగా మార్చండిలా: అనుభవజ్ఞులైన తోటమాలి ప్రకారం, మనీ ప్లాంట్‌ను మళ్లీ అందంగా మార్చడానికి మార్కెట్లో దొరికే ఖరీదైన రసాయన ఎరువులు అస్సలు అవసరం లేదు. మన ఇంట్లో దొరికే వస్తువులతోనే దీనిని సాధించవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/surprising-benefits-of-money-plant-3.jpg</image:loc><image:caption><![CDATA[ సహజసిద్ధమైన ఎరువులు: ఇంట్లో వాడేసిన టీ పొడిని బాగా కడిగి, ఎండబెట్టి మొక్క మొదట్లో వేయడం వల్ల నైట్రోజన్ పుష్కలంగా అందుతుంది. అలాగే బియ్యం కడిగిన నీరు, పప్పులు కడిగిన నీటిని పారబోయకుండా మొక్కకు పోస్తే అద్భుతమైన పోషకాలు లభిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/surprising-benefits-of-money-plant-4.jpg</image:loc><image:caption><![CDATA[ కత్తిరింపులు (Pruning): మొక్కపై ఉన్న ఎండిపోయిన, పసుపు రంగులోకి మారిన ఆకులను ఎప్పటికప్పుడు కత్తిరించాలి. దీనివల్ల మొక్క వృథాగా శక్తిని కోల్పోకుండా, కొత్త చిగుళ్లు రావడానికి దోహదపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/surprising-benefits-of-money-plant.jpg</image:loc><image:caption><![CDATA[ సాధారణ మార్పులు: కొన్నిసార్లు కింద ఉన్న ఒకటి రెండు ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోవడం సహజమైన ప్రక్రియ. పాత ఆకులు రాలిపోయి, కొత్త ఆకులు రావడానికి ఇది సంకేతం. కాబట్టి ఆ విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/vastu-tips-for-money-plant.jpg</image:loc><image:caption><![CDATA[ మనీ ప్లాంట్ కేవలం ఒక మొక్క మాత్రమే కాదు, అది మన ఇంటి అందాన్ని రెట్టింపు చేసే ఒక సజీవ ఆభరణం. తోటమాలి చెప్పిన ఈ చిన్నపాటి చిట్కాలను పాటిస్తూ.. సరైన మోతాదులో నీరు, పరోక్ష ఎండ, ఇంట్లోనే లభించే సహజ పోషకాలను అందిస్తే చాలు. రూపాయి ఖర్చు లేకుండా మీ మనీ ప్లాంట్ నిగనిగలాడుతూ, దట్టమైన ఆకులతో మీ ఇంటిని పచ్చదనంతో నింపేస్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/rice-infested-with-weevils-try-these-simple-kitchen-hacks-to-keep-it-pest-free-1835784.html</loc><lastmod>2026-06-07T07:44:03+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rice-pest-control.jpg</image:loc>
					<image:title><![CDATA[ Rice Pest Control ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rice-storage-hacks.jpg</image:loc><image:caption><![CDATA[ సాధారణంగా ఇళ్లలో బియ్యాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచినప్పుడు వాటికి పురుగులు, ముక్క పురుగులు పట్టడం పెద్ద సమస్యగా మారుతుంది. ఈ సమస్య నుండి సులభంగా ఉపశమనం పొందేందుకు ఇంట్లో దొరికే కొన్ని సహజమైన వస్తువులు అద్భుతంగా పనిచేస్తాయి. ఎటువంటి రసాయన మందులు వాడకుండా, వంటింట్లో ఉండే ఈ సహజసిద్ధమైన పొడులు లేదా వస్తువులను ఉపయోగించి బియ్యాన్ని ఎక్కువ కాలం పురుగులు పట్టకుండా, తాజాగా నిల్వ ఉంచుకోవచ్చు. అదేలాగో ఇప్పుడు చూద్దాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/bay-leaves-for-rice-storage.jpg</image:loc><image:caption><![CDATA[ బిర్యానీ ఆకులు (Bay Leaves): బిర్యానీ ఆకులకు ఉండే ఘాటైన సువాసన పురుగులకు అస్సలు పడదు. బియ్యాన్ని నిల్వ ఉంచే డబ్బాలో అక్కడక్కడా కొన్ని బిర్యానీ ఆకులను వేసి ఉంచితే, ఆ వాసనకు బియ్యంలో ఉన్న పురుగులు బయటకు వచ్చేస్తాయి. కొత్తగా పురుగులు పట్టకుండా ఉంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/neem-leaves-for-rice.jpg</image:loc><image:caption><![CDATA[ ఎండిన వేపాకులు (Dry Neem Leaves): పూర్వ కాలం నుండి ధాన్యాలు పాడవకుండా ఉండటానికి వేపాకులను ఉపయోగించేవారు. బాగా ఎండిన వేపాకులను ఒక కాటన్ గుడ్డలో కట్టి లేదా నేరుగా బియ్యం డబ్బా అడుగున, మధ్యలో వేసి ఉంచడం వల్ల అందులోని చేదు గుణానికి, వాసనకు ఎలాంటి పురుగులు చేరవు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/cloves-for-pest-control.jpg</image:loc><image:caption><![CDATA[ లవంగాలు (Cloves): లవంగాలలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, వాటి ఘాటు వాసన పురుగులను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఒక 10 నుండి 15 లవంగాలను బియ్యం డబ్బాలో వేసి మూత గట్టిగా పెట్టడం వల్ల పురుగుల సమస్య తీరిపోతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/keep-rice-insect-free.jpg</image:loc><image:caption><![CDATA[ పసుపు, ఉప్పు పొడి (Turmeric and Salt): బియ్యం నిల్వ చేసేటప్పుడు కొద్దిగా పసుపు పొడి లేదా కల్లు ఉప్పును బియ్యానికి పట్టించి నిల్వ చేయవచ్చు. పసుపులో ఉండే క్రిమినాశక గుణాలు పురుగులను దరిచేరనివ్వవు. అయితే, వండేటప్పుడు బియ్యాన్ని బాగా కడగడం ద్వారా పసుపు రంగు సులభంగా పోతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/kitchen-storage-tips.jpg</image:loc><image:caption><![CDATA[ వెల్లుల్లి రెబ్బలు (Garlic Cloves): పొట్టు తీయని కొన్ని వెల్లుల్లి రెబ్బలను బియ్యం డబ్బాలో వేసి ఉంచడం వల్ల కూడా వెల్లుల్లి ఘాటుకు పురుగులు పట్టవు. వెల్లుల్లి ఎండిపోయిన తర్వాత వాటి స్థానంలో కొత్త వాటిని మార్చాల్సి ఉంటుంది. బియ్యంలో పురుగులు పట్టినప్పుడు వాటిని పారేయకుండా లేదా కెమికల్స్ వాడకుండా ఇలాంటి వంటింటి చిట్కాలను పాటిస్తే బియ్యం ఎక్కువ కాలం సురక్షితంగా ఉంటాయి. అలాగే, బియ్యాన్ని ఎల్లప్పుడూ తేమ లేని, పొడి ప్రదేశాలలో మరియు గాలి చొరబడని (Air-tight) డబ్బాలలో నిల్వ ఉంచడం చాలా ముఖ్యం. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/fish-benefits-for-health-why-you-should-not-skip-fish-for-heart-and-brain-health-1835790.html</loc><lastmod>2026-06-07T07:29:59+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/health-henefits-of-eating-fish-4-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Health Henefits Of Eating Fish 4 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/health-henefits-of-eating-fish.jpg</image:loc><image:caption><![CDATA[ గుండెకు శ్రీరామరక్ష: చేపలలో లభించే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఇవి రక్త ప్రసరణను సక్రమంగా ఉంచడంతో పాటు రక్తనాళాల్లో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్‌ను సమర్థవంతంగా తగ్గిస్తాయి. వారంలో కనీసం రెండు సార్లు చేపలను మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండెపోటు, ఇతర గుండె సంబంధిత సమస్యల ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/health-henefits-of-eating-fish-3.jpg</image:loc><image:caption><![CDATA[ జ్ఞాపకశక్తి డబుల్: పిల్లల నుండి పెద్దల వరకు అందరి మెదడు పనితీరును మెరుగుపరచడంలో చేపలలోని పోషకాలు అద్భుతంగా సహాయపడతాయి. ఇవి జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచడమే కాకుండా నేటి ఆధునిక కాలంలో వేధిస్తున్న మానసిక ఒత్తిడి , ఆందోళనలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మీ డైట్‌లో క్రమం తప్పకుండా చేపలను చేర్చుకుంటే వయసు పెరిగినా మెదడు చురుకుదనం తగ్గకుండా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/health-henefits-of-eating-fish-4.jpg</image:loc><image:caption><![CDATA[ హై క్వాలిటీ ప్రోటీన్: కండరాల పెరుగుదలకు, శారీరక బలానికి ప్రోటీన్ చాలా అవసరం. చేపలలో అత్యంత నాణ్యమైన ప్రోటీన్ లభిస్తుంది. ఇది శరీరంలోని దెబ్బతిన్న కణజాలాలను త్వరగా బాగుచేయడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా జిమ్‌కు వెళ్లేవారు, క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారు తమ కండరాల దృఢత్వం కోసం చికెన్, మటన్ కంటే చేపలను ఎంచుకోవడం అత్యంత ఉత్తమమైన ఆప్షన్. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/health-henefits-of-eating-fish-2.jpg</image:loc><image:caption><![CDATA[ బరువు కంట్రోల్: చేపలలో కొవ్వు శాతం చాలా తక్కువగా, పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇది బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ డైట్. అయితే నూనెలో డీప్ ఫ్రై చేసిన చేపల కంటే... చేపల పులుసు, ఉడకబెట్టిన లేదా గ్రిల్ చేసిన చేపలను తినడం వల్ల పూర్తి పోషకాలు అందుతాయి. ఇవి సులభంగా జీర్ణమవుతాయి. వీటిలో ఉండే విటమిన్ డి, కాల్షియం వంటి ఖనిజాలు ఎముకలను ఉక్కులా మార్చడంతో పాటు శరీర రోగనిరోధక శక్తిని  బూస్ట్ చేస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/health-henefits-of-eating-fish-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఆరోగ్యకరమైన జీవితానికి చేపలు ఒక గొప్ప ఆహారం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేదా అలర్జీలు ఉన్నవారు తమ ఆహారపు అలవాట్లను మార్చుకునే ముందు ఒకసారి వైద్యులను సంప్రదించడం మంచిది. అంతేకాకుండా ఏదైన మితంగా తినడమే మంచిది. ]]></image:caption></image:image></url></urlset>