<urlset xmlns:xsi="http://www.w3.org/2001/XMLSchema-instance" xmlns:image="http://www.google.com/schemas/sitemap-image/1.1" xsi:schemaLocation="http://www.sitemaps.org/schemas/sitemap/0.9 http://www.sitemaps.org/schemas/sitemap/0.9/sitemap.xsd http://www.google.com/schemas/sitemap-image/1.1 http://www.google.com/schemas/sitemap-image/1.1/sitemap-image.xsd" xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9"><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/gold-rate-gold-prices-down-slightly-in-telugu-states-on-april-30-2026-1804686.html</loc><lastmod>2026-04-30T07:03:39+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-5-23.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-29.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో చాలా మార్పులు వస్తున్నాయి. అందువలన ప్రతి ఒక్కరూ రోజు రోజుకు బంగారం ధరలు ఎలా ఉన్నాయి? తగ్గుతున్నాయా? పెరుగుతున్నాయో తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇక పెళ్లీ సీజన్ కూడా కావడంతో బంగారం ధర కాస్త తగ్గినా సరే, వెంటనే వెళ్లి కొనుగోలు చేయడానికి రెడీ అయ్యారు. కాగా, ఈ రోజు మనం అసలు మార్కెట్‌లో ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-1-25.jpg</image:loc><image:caption><![CDATA[ బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ముఖ్యంగా మహిళలకు అమితమైన దానిలో బంగారమే ముందుంటుంది. చాలా మంది మహిళలు ఎక్కువగా బంగారం కొనుగోలు చేయాలి అనుకుంటారు. అంతే కాకుండా ఇంటిలో ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే బంగారం కొనడానికే ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. అయితే గత కొన్ని రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు నేడు కాస్త తగ్గాయి. కాగా, అంతర్జాతీయ మార్కెట్‌ల ప్రకారం, గురువారం ధర ఎలా ఉదో ఇప్పుడు తెలుసుకుందాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-2-24.jpg</image:loc><image:caption><![CDATA[ బంగారం ధరల విషయంలోకి వెళితే, 30 ఏప్రిల్ 2026 గురు వారం రోజున 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 150,430గా ఉంది. అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,37,890 గా ఉంది. అదే విధంగా 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,12,820 గా ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-3-32.jpg</image:loc><image:caption><![CDATA[ ఏప్రిల్ 29, బుధవారం రోజున 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,50,440 ఉండగా, నేడు రూ. 10 తగ్గడంతో రూ.150,430గా ఉంది.  అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న, బుధ వారం రూ. 137, 900 గా ఉండగా, నేడు రూ.10 తగ్గడంతో1,37,890గా ఉంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధవారం 1,12,830 ఉండగా, నేడు రూ.10 తగ్గడంతో 1,12,820 గా ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-4-25.jpg</image:loc><image:caption><![CDATA[ 30 ఏప్రిల్ 2026 గురు వారం రోజున హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 150,430గా ఉంది. అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,37,890 గా ఉంది. అదే విధంగా 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,12,820 గా ఉంది. విజయవాడ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 150,430గా ఉంది. అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,37,890 గా ఉంది. అదే విధంగా 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,12,820 గా ఉంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cricket-photos/mumbai-indians-fastest-ipl-centuries-ryan-rickelton-breaks-record-1804578.html</loc><lastmod>2026-04-29T21:24:09+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ryan-rickelton.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ryan Rickelton ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mi-vs-srh-ryan-rickelton-3.jpg</image:loc><image:caption><![CDATA[ ముంబై ఇండియన్స్ హిట్టర్ల విధ్వంసానికి వాంఖడే స్టేడియం మరోసారి వేదికైంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రియాన్ రికెల్టన్ కేవలం 44 బంతుల్లోనే శతకం బాది, ముంబై జట్టు తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. పాత రికార్డులన్నీ ఈ ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mi-vs-srh-ryan-rickelton-2.jpg</image:loc><image:caption><![CDATA[ ముంబై ఇండియన్స్ అంటేనే భారీ హిట్టర్లకు నిలయం. అయితే, గత 18 ఏళ్లుగా శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య పేరిట ఉన్న రికార్డును తాజాగా రియాన్ రికెల్టన్ తిరగరాశాడు. 2008లో జయసూర్య 45 బంతుల్లో సాధించిన ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును, రికెల్టన్ 44 బంతుల్లోనే అధిగమించాడు. హైదరాబాద్ బౌలర్లను ఉతికేస్తూ మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించిన రికెల్టన్, ముంబై అభిమానులను ఉర్రూతలూగించాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mi-vs-srh-ryan-rickelton-1.jpg</image:loc><image:caption><![CDATA[ కేవలం రికెల్టన్ మాత్రమే కాదు, ఇదే సీజన్‌లో తెలుగు తేజం తిలక్ వర్మ కూడా తన బ్యాటింగ్‌తో ప్రకంపనలు సృష్టించాడు. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన పోరులో తిలక్ 45 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా జయసూర్య రికార్డును సమం చేయడమే కాకుండా, ముంబై జట్టులో అత్యంత నమ్మకమైన ఆటగాడిగా మరోసారి నిరూపించుకున్నాడు. యువ రక్తం ఉరకలేస్తున్న ముంబై జట్టులో తిలక్ ప్రదర్శన జట్టు భవిష్యత్తుపై ధీమాను పెంచుతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mi-vs-srh-ryan-rickelton.jpg</image:loc><image:caption><![CDATA[ ముంబై జట్టు తరపున తక్కువ బంతుల్లో సెంచరీలు సాధించిన టాప్ 5 వీరుల జాబితాను ఓసారి చూద్దాం.. 1. రియాన్ రికెల్టన్: 44 బంతులు (సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై, 2026), 2. సనత్ జయసూర్య: 45 బంతులు (చెన్నై సూపర్ కింగ్స్‌పై, 2008), 3. తిలక్ వర్మ: 45 బంతులు (గుజరాత్ టైటాన్స్‌పై, 2026), 4. కామెరాన్ గ్రీన్: 47 బంతులు (సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై, 2023), 5. సూర్యకుమార్ యాదవ్: 49 బంతులు (గుజరాత్ టైటాన్స్‌పై, 2023). ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ryan-rickelton-1.jpg</image:loc><image:caption><![CDATA[ గతంలో కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లు 50 లోపు బంతుల్లో సెంచరీలు చేసినప్పటికీ, 2026 సీజన్ ముంబై ఇండియన్స్‌కు రికార్డుల పంట పండించింది. రికెల్టన్, తిలక్ వర్మ వంటి ఆటగాళ్ల అటాకింగ్ గేమ్ ముంబై ఇండియన్స్‌ను పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ అద్భుత ఇన్నింగ్స్‌లు ఐపీఎల్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/andhra-pradesh-unseasonal-rains-lightning-lead-to-3-deaths-and-massive-crop-damage-1804545.html</loc><lastmod>2026-04-29T20:18:40+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rain-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Rain 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rain.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నాయి. కొంత మంది సూర్యుడి భగ భగలకు ఇంటి నుంచి బయట కాలు పెట్టడానికి వణికిపోతున్నారు. కానీ ఇటు ఎండలు కొడుతుంటే ఒక జిల్లాలో  మాత్రం అకాల వర్షం రైతులను ఆగం చేసింది. భారీ వర్షానికి చేతి కొచ్చిన పంట నీటి పాలైంది. మార్కాపురం జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. పిడుగులు పడి ముగ్గురు మహిళలు మృతి చెందారు. అరటి, బొప్పాయి పంటలకు అపార నష్టం వాటిల్లింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rain-1.jpg</image:loc><image:caption><![CDATA[ మార్కాపురం జిల్లాలో అకాల వర్షం దంచికొట్టింది. కురిసింది కొద్దిసేపే అయినా భారీ ఈదురు గాలులు, వడగండ్ల వాన ధాటికి జనం బెంబేలెత్తారు. బేస్తవారి పేట మండలం గంటా పురం గ్రామంలో పిడుగుపాటుకు రైతు కూలీ గంట శోభరాణి (40) మృతి చెందింది. పొలంలో పనిచేస్తుండగా పిడుగుపాటుకు గురై శోభ రాణి అక్కడికక్కడే చనిపోయింది. మార్కాపురం మండలం బోడపాడులో పిడుగుపాటుకు ఒంటేరు పుల్లమ్మ (47) మృతి చెందింది. బోడపాడులో కోళ్ల ఫారం దగ్గర పిడుగుపాటుకు షెడ్డుఎగిరి పడి చింతకుంట్ల కుమారి (50) చనిపోయింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rain-2.jpg</image:loc><image:caption><![CDATA[ పంటలకు అపార నష్టం. మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలంలో అకాల వర్షాలు అరటి రైతులను నిండా ముంచాయి. బురుజుపల్లి, ఉప్పలపాడు ముండ్లపాడు, క్రిష్టంశెట్టి పల్లి, కంభం మండలం పోరుమామిళ్ల పల్లి గ్రామాలలో 130 ఎకరాలలో అరటి పంట వేసిన రైతులు నష్టపోయారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rain-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఎకరాకు లక్షల వరకు పెట్టుబడి పెట్టి పంట సాగు చేశామని తీరా పంట చేతికి వచ్చే సమయానికి  వర్షం తమ ఆశలపై నీళ్లు చల్లిందని రైతులు వాపోయారు. గత నాలుగు సంవత్సరాలుగా తమకు ఇదే పరిస్థితి ఏర్పడిందని గతంలో కూడా ప్రభుత్వం తమని ఆదుకున్న దాఖలు లేవని తెలిపారు. ఈ సంవత్సరమైనా అరటి రైతులను ఆదుకొని నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rain-4.jpg</image:loc><image:caption><![CDATA[ మార్కాపురం, బేస్తవార పేట, దోర్నాల, అర్ధవీడు, గిద్దలూరు, కంభం, పెదచెర్లోపల్లి, పామూరు మండలాల్లో కోత దశలో ఉన్న అరటి, బొప్పాయి తోటలు వర్షం దెబ్బకు నేల కూలాయి. కల్లాలో ఉన్న మిరప, ఇతర పంట ఉత్పత్తులు తడిచిపోయి పనికి రాకుండా పోయాయి. పంట నష్టం అంచనా వేసేందుకు వ్యవసాయశాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/how-much-calcium-is-in-100g-makhana-the-answer-may-surprise-you-1804457.html</loc><lastmod>2026-04-29T20:04:43+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/calcium-in-makhana-1-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Calcium In Makhana ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/calcium-in-makhana-2.jpg</image:loc><image:caption><![CDATA[ 100 గ్రాముల మఖానాలో సుమారు 60 mg కాల్షియం ఉంటుంది. ఇది పళ్ళు, ఎముకల పటుత్వానికి ఎంతో అవసరం. పెరుగుతున్న పిల్లలకు, వయసు పైబడిన వారికి ఇది శక్తినిస్తుంది. పాలు, మఖానా కలిపి తినటం వల్ల రెట్టింపు లాభం. పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుందని మనకు తెలుసు, అయితే మఖానాలో కూడా కాల్షియం అధికంగా ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి తీసుకున్నప్పుడు శరీరానికి అందే కాల్షియం శాతం పెరుగుతుంది. ఇది ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల వ్యాధుల నుండి రక్షణ ఇస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/calcium-in-makhana-1-2.jpg</image:loc><image:caption><![CDATA[ మఖానాలో ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వల్ల కండరాల పెరుగుదలకు తోడ్పడుతుంది. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. ఇది జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది. తక్కువ కేలరీలు ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి స్నాక్. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/calcium-in-makhana-5.jpg</image:loc><image:caption><![CDATA[ గుండె పనితీరును మెరుగుపరచడానికి, రక్తపోటును (Blood Pressure) అదుపులో ఉంచడానికి ఈ ఖనిజాలు సహాయపడతాయి. ఇందులో సోడియం చాలా తక్కువగా ఉండటం వల్ల బీపీ రోగులకు ఇది సురక్షితమైన ఆహారం.  మఖానాలో మెగ్నీషియం ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. పాలతో కలిపి తీసుకోవటం వల్ల పాలలో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/calcium-in-makhana-3.jpg</image:loc><image:caption><![CDATA[ మఖానాలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు కూడా దీనిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. మందుల మీద ఆధారపడకుండా సహజ సిద్ధంగా కాల్షియం స్థాయిలను పెంచుకోవడానికి మఖానా ఒక అద్భుతమైన మార్గం. ప్రతిరోజూ ఒక గుప్పెడు మఖానాను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. శారీరక నీరసం, అలసట ఎక్కువగా ఉన్నవారు క్రమం తప్పకుండా పాలు-మఖానా తీసుకోవడం వల్ల త్వరగా కోలుకుంటారు. ఇది ప్రకృతి సిద్ధంగా లభించే ఒక సంపూర్ణ పౌష్టికాహారం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/calcium-in-makhana-6.jpg</image:loc><image:caption><![CDATA[ మఖానాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి వృద్ధాప్య ఛాయలు రాకుండా చేస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంపై ముడతలు రాకుండా నిరోధిస్తాయి. చర్మం కాంతివంతంగా, యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. మఖానాను కొద్దిగా నెయ్యిలో వేయించి, పైన ఉప్పు, మిరియాల పొడి చల్లుకుని స్నాక్‌గా తీసుకోవచ్చు. పాలలో ఉడికించి ఖీర్ లాగా కూడా తినవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/lakshmi-narayana-rajayogam-4-zodiac-signs-to-experience-massive-fortune-1804525.html</loc><lastmod>2026-04-29T20:02:43+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/laxmi-naraya-rajayogam.jpg</image:loc>
					<image:title><![CDATA[ Laxmi Naraya Rajayogam ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/laxmi-naraya-rajayogam-5.jpg</image:loc><image:caption><![CDATA[ మేష రాశి : మేష రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. మే నెల  మొత్తం ఊహించని విధంగా ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే పెట్టుబడులు పెట్టడానికి ఆశగా ఎదురు చూస్తున్నారో వారి కోర్కెలు కూడా నెరవేరతాయి. చాలా ఆనందంగా గడుపుతారు. మే నెల మొత్తం వీరికి సంతోషకరంగా ఉంటుంది.5 ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/laxmi-naraya-rajayogam-2.jpg</image:loc><image:caption><![CDATA[ తుల రాశి : తుల రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. చాలా రోజుల నుంచి ఎవరికి అయితే అప్పులు ఇచ్చినా ఆ డబ్బు తిరిగి రావడం లేదో వారికి ఇప్పుడు డబ్బు తిరిగి వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఈ రాశి వారు ఇంటిలో శుభకార్యాలు నిర్వహించుకుంటారు. వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. ఆనందకర జీవితం గడుపుతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/laxmi-naraya-rajayogam-3.jpg</image:loc><image:caption><![CDATA[ వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి త్వరగా బయటపడతారు. ఎవరు అయితే చాలా రోజుల నుంచి నూతనవాహనం కొనుగోలు చేయాలి అని చూస్తున్నారో వారి కోర్కె నెరవేరుతుంది. ఆదాయం డబుల్ అవుతుంది. ఉద్యోగస్థులకు ప్రమోషన్ , జీతం పెరగడం వంటిది జరుగుతుంది. దీంతో వీరు చాలా ఆనందంగా ఉంటారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/laxmi-naraya-rajayogam-4.jpg</image:loc><image:caption><![CDATA[ కన్యారాశి : కన్యా రాశి వారికి పట్టింది బంగారమే అవుతుంది. ఈ రాశి వారికి సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఇంటిలో ఆనందకర వాతావరణం నెలకుంటుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటారో వారి కోర్కె నెరవేరుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/laxmi-naraya-rajayogam-1.jpg</image:loc><image:caption><![CDATA[ నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/top-5-low-glycemic-index-fruits-for-diabetes-manage-blood-sugar-naturally-1804517.html</loc><lastmod>2026-04-29T19:45:42+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/fruits-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Fruits (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/fruits-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ నిమ్మకాయ - ఆరోగ్యానికి శ్రీరామరక్ష: నిమ్మకాయను మనం కేవలం రుచి కోసం ఉపయోగిస్తాం కానీ, దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి ఇది ఒక వరం లాంటిది. నిమ్మరసంలో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని అద్భుతంగా పెంచుతుంది. మీరు తీసుకునే ఆహారంలో కొద్దిగా నిమ్మరసం చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరగవు. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కేవలం 20 ఉండటం వల్ల ఇది డయాబెటిక్ డైట్‌లో అత్యంత సురక్షితమైనది. రోజువారీ అలసటను తగ్గించి, శరీరాన్ని ఉత్సాహంగా ఉంచడానికి నిమ్మరసం ఎంతో సహాయపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/fruits-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఆపిల్ - మధుమేహులకు మంచి నేస్తం: ఆపిల్ పండు చూడటానికి ఎర్రగా, తీయ్యగా ఉన్నా.. ఇది మధుమేహులకు చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ రక్త ప్రవాహంలో గ్లూకోజ్ నెమ్మదిగా కలిసేలా చేస్తుంది. ఆపిల్ తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉండటమే కాకుండా గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. చాలా మంది ఆపిల్ తొక్క తీసి తింటారు, కానీ తొక్కలోనే ఎక్కువ ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి శుభ్రంగా కడిగి తొక్కతో సహా తినడం వల్ల పూర్తి పోషకాలు అందుతాయి. షుగర్ ఉన్నవారు స్నాక్ సమయంలో ఒక చిన్న ఆపిల్ తినడం ఉత్తమమైన పద్ధతి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/fruits-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఆరెంజ్ - సహజసిద్ధమైన శక్తి : సిట్రస్ పండ్లలో ఆరెంజ్ ఒక సూపర్ ఫుడ్ లాంటిది. ఇందులో ఉండే ఫైబర్, విటమిన్ సి మరియు పొటాషియం రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి. నారింజ పండ్లలో ఉండే ఫ్లేవనాయిడ్స్ ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయి. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఆరెంజ్ జ్యూస్ కంటే పండును నేరుగా తినడమే మంచిది. ఎందుకంటే జ్యూస్ తీసినప్పుడు ఫైబర్ తగ్గిపోయి షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే పండును తొనల రూపంలో తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ పెరగకుండా చూసుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/fruits-4.jpg</image:loc><image:caption><![CDATA[ బొప్పాయి - జీర్ణక్రియ మరియు షుగర్ నియంత్రణ: బొప్పాయిలో విటమిన్ ఏ మరియు సీ పుష్కలంగా ఉంటాయి. ఇది కేవలం కంటికి మాత్రమే కాకుండా మధుమేహ నియంత్రణకు కూడా చక్కగా పనిచేస్తుంది. బొప్పాయిలో ఉండే ఎంజైమ్స్ జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. డయాబెటిస్ వల్ల చాలా మందికి చర్మ సమస్యలు లేదా గాయాలు త్వరగా మానకపోవడం వంటివి జరుగుతుంటాయి, బొప్పాయిలోని పోషకాలు ఈ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ-మధ్యస్థ స్థాయిలో ఉంటుంది కాబట్టి రోజుకు ఒక చిన్న కప్పు బొప్పాయి ముక్కలు తీసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/fruits-5.jpg</image:loc><image:caption><![CDATA[ జామకాయ - సామాన్యుడి ఆపిల్: ధర తక్కువైనా ప్రయోజనాల్లో జామకాయే రారాజు. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉండటంతో పాటు, ఇందులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెరను గ్రహించి మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. జామకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. అంతేకాకుండా ఇందులోని పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. మధుమేహ రోగులు మధ్యలో ఆకలి వేసినప్పుడు జామకాయను చిరుతిండిగా తీసుకోవడం వల్ల పొట్ట నిండిన అనుభూతి కలుగుతుంది మరియు అనారోగ్యకరమైన ఆహారం వైపు మనసు పోదు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/sri-anjaneyam-rama-rama-jayarama-20-years-of-unwavering-whatsapp-status-popularity-1804507.html</loc><lastmod>2026-04-29T19:44:26+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sri-anjaneyam-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sri Anjaneyam 6 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sri-anjaneyam.jpg</image:loc><image:caption><![CDATA[ చాలా మందికి భక్తిపాటలు స్టేటస్ పెట్టుకోవడం ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా కొందరు నిత్యం తమకు ఇష్టమైన భక్తి పాటను స్టేటస్‌గా పెట్టుకుంటారు. ఇక మంగళ వారం రోజు మాత్రం తప్పకుండా శ్రీ ఆంజనేయం సినిమాలోని రామ రామ జయరామ అనే పాట మాత్రం స్టేటస్‌లలో మార్మోగిపోతుంది. అంతే కాకుండా ఈ పాట వినగానే మనసుకు హాయిగా అనిపిస్తుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sri-anjaneyam-2.jpg</image:loc><image:caption><![CDATA[ శ్రీ ఆంజనేయం సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికీ ఇది చాలా మంది ఫేవరెట్ మూవీ. ఈ మూవీ 2004 జూలై 24న సోషియో ఫాంటసీ విధంగా విడుదలైంది. కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నితిన్, చార్మి కౌర్ హీరో, హీరోయిన్లుగా నటించారు. అంతే కాకుండా ఈ సినిమాలో చాలా మంది సీనియర్ స్టార్ నటీనటులు నటించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sri-anjaneyam-1.jpg</image:loc><image:caption><![CDATA[ ముఖ్యంగా హీరో అర్జున్ సర్జా, స్టార్ సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఇక ఈ సినిమాకు సంగీతం మణిశర్మ అందించారు, కృష్ణ వంశీనే ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. రామాపురం అనే గ్రామంలో, సీతమ్మ తల్లి చెక్ డ్యాం ఆనకట్ట నిర్మించే క్రమంలో ప్రకాశ్ రాజ్, రమ్య కృష్ణ మరణిస్తారు. వీరి కుమారుడు నితిన్ హీరో, ఆంజనేయ స్వామి భక్తుడు. నిత్యం ఆంజనేయ స్వామి జంప చేస్తూ ఉంటాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sri-anjaneyam-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక ఈ మూవీలో ప్రతి సాంగ్ మంచి హిట్ అయ్యాయి. ముఖ్యంగా రామ రామ రఘురామ అనే సాంగ్ ఇప్పటికీ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఇకఈ పాట మల్లికార్జున్ పాడగా, సిరివెన్నెల సీతారామ శాస్త్రీ రాశారు, ఈ పాట మొత్తం హనుమంతుడి భక్తిని, రామడి భక్తిని తెలియజేస్తుంది. ఈ పాటకు మణి శర్మ సంగీతం అందించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sri-anjaneyam-4.jpg</image:loc><image:caption><![CDATA[ రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా.. అంత భక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా ఈ పాట చాలా మందికి ఇప్పటికీ ఫేవరెట్. ముఖ్యంగా మంగళ వారం వస్తే చాలు హనుమంతుడి భక్తులు ఎక్కువగా ఈ పాటను స్టేటస్ రూపంలో పెట్టుకొని, తమ భక్తిని చాటుకుంటారు. అంతే కాకుండా ఇప్పటికీ ఎక్కడ చూసినా, ఈ పాట వినిపిస్తూనే ఉంటుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/unveiling-the-5-secret-principles-of-rich-individuals-1804494.html</loc><lastmod>2026-04-29T19:21:03+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/principles-of-rich-individuals-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Principles Of Rich Individuals (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/principles-of-rich-individuals-1.jpg</image:loc><image:caption><![CDATA[ మొదటి రహస్యం: ధనవంతులు ఎప్పుడూ తాము పని చేయడం కంటే, తమ డబ్బు తమ కోసం పని చేసేలా చూసుకుంటారు. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ లేదా ఒక సొంత వ్యాపార వ్యవస్థ ఇలా ఏదైనా కావచ్చు, అది మీరు లేకపోయినా నడవాలి. మీరు అనారోగ్యంతో ఉన్నా, లేదా విహారయాత్రలో ఉన్నా మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతూనే ఉండాలి. అందుకే ఈ రోజు నుండే మీ సొంత పైప్‌లైన్ గురించి ఆలోచించండి. కేవలం కష్టపడటం గొప్ప కాదు, తెలివిగా కష్టపడటమే అసలైన విజయం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/principles-of-rich-individuals-2.jpg</image:loc><image:caption><![CDATA[ రెండవ రహస్యం: గడియారం ముల్లు ఆగదు, అలాగే మన జీవితంలో గడిచిన సెకను కూడా తిరిగి రాదు. సామాన్యులు వంద రూపాయలు మిగిలించడానికి రెండు గంటల సమయాన్ని బస్సుల కోసం లేదా బేరాల కోసం వృథా చేస్తారు. కానీ ఒక ధనవంతుడు ఆ రెండు గంటల్లో లక్ష రూపాయలు ఎలా సంపాదించాలో ఆలోచిస్తాడు. అందుకే వారు డ్రైవర్లను, పనివారిని నియమించుకుంటారు. అది విలాసం కోసం కాదు, తమ సమయాన్ని ఆదా చేసుకోవడం కోసం. సమయాన్ని ఒక పెట్టుబడిగా చూడండి. మీరు రోజులో చేసే పనులు మిమ్మల్ని లక్ష్యం వైపు తీసుకెళ్తున్నాయా లేదా కేవలం కాలక్షేపంగా మారుతున్నాయా అనేది గమనించాలి. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, కానీ సమయం వృథా అయితే మీ జీవితంలో ఒక భాగాన్ని కోల్పోయినట్టే. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/principles-of-rich-individuals-3.jpg</image:loc><image:caption><![CDATA[ మూడవ రహస్యం: చాలా మంది తమ పొరుగువారిని చూసో లేదా సోషల్ మీడియాలో గొప్పల కోసమో తమ దగ్గర లేని డబ్బును ఖర్చు చేసి ఖరీదైన వస్తువులు కొంటారు. దీనివల్ల వారు ఈఎంఐల ఊబిలో కూరుకుపోతారు. చాణక్య నీతి ప్రకారం, మీ ఆదాయం కంటే మీ ఖర్చు తక్కువగా ఉండాలి. ధనవంతులు ముందుగా &#039;అసెట్స్&#039; (డబ్బును తెచ్చేవి) కొంటారు, ఆ తర్వాతే ఆ ఆదాయంతో &#039;లగ్జరీస్&#039; కొంటారు. ఉదాహరణకు, ఒక ఇల్లు కొని దాన్ని అద్దెకు ఇవ్వడం ఆస్తి, అదే ఇల్లు కొని అందులో ఉంటూ ప్రతి నెలా మెయింటెనెన్స్ కట్టడం బాధ్యత (Liability). మీ జేబులోకి డబ్బు తెచ్చే వాటిపై పెట్టుబడి పెట్టండి, మీ జేబులోంచి డబ్బు తీసే వాటిని వాయిదా వేయండి. ఇదే ఆర్థిక రహస్యం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/principles-of-rich-individuals-4.jpg</image:loc><image:caption><![CDATA[ నాల్గవ రహస్యం: మనం ఒక గొప్ప పని చేయాలనుకున్నప్పుడు దాన్ని అందరికీ చెప్పాలనిపిస్తుంది. మన ప్లాన్స్ బయటకు చెప్పినప్పుడు మన మెదడులో &#039;డోపమిన్&#039; అనే రసాయనం విడుదలవుతుంది, దీనివల్ల పని పూర్తి కాకముందే మనం ఏదో సాధించినట్టు తప్పుడు సంతృప్తి కలుగుతుంది. ఫలితంగా ఆ పని మీద శ్రద్ధ తగ్గుతుంది. అలాగే, మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వారు మీ దారిలో అడ్డంకులు సృష్టించవచ్చు. అందుకే మీ విజయం శబ్దం చేయాలి తప్ప, మీ మాటలు కాదు. నిశ్శబ్దంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. చాణక్యుడు చెప్పినట్టు, సిద్ధమయ్యే వరకు మీ ఆలోచనను గుప్తంగా ఉంచడమే ఉత్తమమైన వ్యూహం. మీ గెలుపు ప్రపంచానికి తెలిసేలా చేయండి, మీ ప్రయత్నాన్ని కాదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/principles-of-rich-individuals-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఐదవ రహస్యం: వ్యాపారం లేదా ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు భావోద్వేగాలకు తావుండకూడదు. చాలా మంది &#039;మంచితనం&#039; అనే ముసుగులో తప్పుడు నిర్ణయాలు తీసుకుని నష్టపోతుంటారు. ఎవరికైనా అప్పు ఇచ్చి తిరిగి అడగలేకపోవడం, బంధువుల కోసం వ్యాపారంలో రాజీ పడటం వంటివి మిమ్మల్ని పేదరికంలోనే ఉంచుతాయి. ఇక్కడ క్రూరంగా ఉండమని అర్థం కాదు, ప్రొఫెషనల్ గా ఉండమని అర్థం. యుద్ధ భూమిలో కనికరం చూపిస్తే ఓటమి తప్పదు, మార్కెట్ కూడా ఒక యుద్ధ భూమి లాంటిదే. మీ విలువను మీరు గుర్తించండి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఆశించడంలో తప్పు లేదు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని, వాస్తవాల ఆధారంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడే మీరు ఒక సామ్రాజ్యాన్ని నిర్మించగలరు. మీ బలహీనతలే ఇతరులకు పెట్టుబడిగా మారకుండా చూసుకోండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/telangana-sarvapindi-recipe-authentic-green-chili-snack-1804471.html</loc><lastmod>2026-04-29T19:13:00+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sarva-pindi.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sarva Pindi ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sarva-pindi-5.jpg</image:loc><image:caption><![CDATA[ సర్వపిండికి కావాల్సిన పదార్థాలు : బియ్యం పిండి, పచ్చి మిర్చి, వెల్లుల్లి రెబ్బలు, పల్లీలు, నువ్వులు, జీలకర్ర, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లి కాడలు, పచ్చి శనగపప్పు, రుచికి సరిపడ నూనె, కరివేపాకు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sarva-pindi-1.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానం : ముందుగా బియ్యం పిండి తీసుకోవాలి. దానిని జల్లెడ పట్టి పక్కన పెట్టుకోవాలి. సర్వపిండి పెట్టడానికి రెండు గంటల మందు శనగపప్పు నానబెట్టుకోవాలి. అలాగే పచ్చి మర్చి, ఆనియన్, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలి. అలాగే పల్లీలు, నువ్వు లైటుగా వేయించి పక్కన పెట్టుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, ఇవన్నీ సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sarva-pindi-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మూడు కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు అందులో నానబెట్టిన వేరుశనగలు, పల్లీలు, నువ్వులు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లి కాడలు తరిగినవి, అన్నీ వేయాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చి మిర్చి పేస్ట్ వేయాలి. ఇప్పుడు అందులోకి తగినంత సాల్ట్ వేసి, కొన్ని కొన్ని నీళ్ళు పోస్తూ మంచిగా కలుపుకోవాలి. మరీ మెత్తగా మరీ గట్టిగా కాకుండా నార్మల్‌గా కలుపుకోవాలి. చివరలో కొంచెం నూనె పోసి మంచిగా పిండి కలుపుకోవాలి. దీనిని 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sarva-pindi-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు సర్వపిండి బౌల్స్ తీసుకోవాలి. అందులో వన్ టీ స్పూన్ నూనె పోసి, మనం కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఆ బౌల్స్ ఆకారం, సర్వపిండి ఆకారంలో చేతులతో మంచిగా ఒత్తుకోవాలి. ఇలా చేతి వేళ్లతో పల్చగా స్ప్రెడ్ చేసుకోవడం వలన సర్వపిండి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మూడు లేదా నాలుగు బౌల్స్‌కు సర్వపిండి మంచిగా పెట్టి పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sarva-pindi-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, మనం సర్వపిండి ఆకారంలో ఒత్తుకున్న బౌల్స్ , స్టవ్ పై పెట్టాలి. సన్నని మంటపై సర్వ పిండి మొత్తం కాలే విధంగా చూసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత సర్వ పిండి పై మూత తీసి, దానిని చుట్టూ తిప్పుతూ మొత్తం కాల్చుకోవాలి. ఇలా కాల్చుకోవడం వలన అంచుల వైపు ఉన్న పిండి మొత్తం మంచిగా కాలుతుంది. అలాగే తీసే ముందు కూడా చాలా సులభంగా వస్తుంది. ఇప్పుడు పూర్తిగా కాలిన తర్వాత దీనిని ఒక ప్లేట్‌లో వేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ పచ్చి మిర్చి కారం సర్వపిండి రెడీ. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cloves-with-milk-benefits-of-drinking-clove-milk-for-men-and-natural-energy-boost-1804477.html</loc><lastmod>2026-04-29T19:11:07+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/cloves-7.jpg</image:loc>
					<image:title><![CDATA[ Cloves (7) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/cloves-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ వంటింట్లో లవంగాల విశిష్టత లవంగం అంటే మనకు మొదట గుర్తొచ్చేది బిర్యానీ లేదా ఘాటైన మసాలా వంటలు. కానీ దీని వెనుక వేల సంవత్సరాల ఆయుర్వేద చరిత్ర ఉంది. లవంగం అనేది కేవలం ఒక సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు, అదొక గొప్ప యాంటీ-సెప్టిక్ మరియు యాంటీ-బ్యాక్టీరియల్ కారకం. మన పూర్వీకులు పంటి నొప్పి వచ్చినా, జలుబు చేసినా లవంగాన్ని వాడేవారు. దీనిలో ఉండే &#039;యూజినాల్&#039; అనే సమ్మేళనం శరీరంలోని మలినాలను బయటకు పంపడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/cloves-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ రోజువారీ ఆహారంలో లవంగాలను చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా మగవారిలో రక్త ప్రసరణ మెరుగుపడటానికి ఇది ఒక సహజ ప్రేరకంగా పనిచేస్తుంది. అందుకే వంటింట్లో ఉండే ఈ చిన్న లవంగం, మన ఆరోగ్యానికి ఒక పెద్ద రక్షక కవచం లాంటిది. దీనిని సరైన పద్ధతిలో ఉపయోగిస్తే వైద్యుల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం చాలా వరకు తగ్గుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/cloves-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ పాలను &#039;సంపూర్ణ ఆహారం&#039; అంటాం, మరి అలాంటి పాలకు లవంగం తోడైతే దాని శక్తి రెట్టింపు అవుతుంది. రాత్రి పూట పాలు తాగడం వల్ల నిద్ర బాగా పడుతుందని మనందరికీ తెలుసు, కానీ ఆ పాలలో రెండు లవంగాలు కలిపితే అది ఒక &#039;ఎనర్జీ డ్రింక్&#039;లా మారుతుంది. ఈ మిశ్రమం నేరుగా హార్మోన్ల వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/cloves-4.jpg</image:loc><image:caption><![CDATA[ పురుషుల లైంగిక ఆరోగ్యం మెరుగుపడటానికి అవసరమైన జింక్, మెగ్నీషియం వంటి మూలకాలను శరీరం గ్రహించేలా లవంగం చేస్తుంది. కేవలం శారీరక శక్తే కాదు, మానసిక ప్రశాంతతను కూడా ఇది అందిస్తుంది. రోజంతా ఒత్తిడితో ఇంటికి వచ్చిన వారికి ఈ లవంగం పాలు ఒక గొప్ప రిలాక్సేషన్ థెరపీలా పనిచేస్తాయి. అందుకే కృత్రిమ ప్రోటీన్ పౌడర్ల కంటే ఈ సహజ సిద్ధమైన పానీయం ఎంతో ఉత్తమమైనది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/cloves-5.jpg</image:loc><image:caption><![CDATA[ పురుషుల ఆరోగ్యంపై లవంగం ప్రభావం చాలా మంది పురుషులు బయటకు చెప్పుకోలేని అనేక శారీరక సమస్యలతో సతమతమవుతుంటారు. వయసు పెరిగే కొద్దీ లేదా పని ఒత్తిడి వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడటం సహజం. ఇలాంటి సమయంలో లవంగం ఒక దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇది టెస్టోస్టెరాన్ అనే హార్మోన్‌ను సహజంగా పెంచుతుంది. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తూనే, కండరాలకు శక్తిని చేకూరుస్తుంది. లవంగంలోని పోషకాలు రక్త నాళాలను వ్యాకోచింపజేసి, శరీరంలోని ప్రతి భాగానికి రక్తం సజావుగా అందేలా చూస్తాయి. దీనివల్ల చురుకుదనం పెరుగుతుంది. దాంపత్య జీవితంలో ఇబ్బందులు పడేవారికి ఇది ఒక సురక్షితమైన హోమ్ రెమెడీ. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజంగా శక్తిని పొందేందుకు లవంగం కంటే మించినది లేదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/cloves-6.jpg</image:loc><image:caption><![CDATA[  సాయంత్రం అయ్యేసరికి శక్తి మొత్తం హరించుకుపోయినట్లు అనిపిస్తుంది. అటువంటి సమయంలో 2-3 లవంగాలను నీటిలో మరిగించి, కొంచెం అల్లం, తేనె కలిపి &#039;లవంగం టీ&#039;లా తీసుకుంటే తక్షణమే శక్తి వస్తుంది. ఇది మెదడును చురుగ్గా ఉంచి, ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే, శారీరకంగా ఎక్కువగా కష్టపడే వారు లవంగం నూనెను వాడటం చాలా మంచిది. కండరాల నొప్పులు ఉన్న చోట లవంగం నూనెతో సున్నితంగా మసాజ్ చేస్తే, ఆ భాగంలో రక్త ప్రసరణ పెరిగి నొప్పి తగ్గుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/adding-lemon-peels-to-tulsi-plant-these-5-amazing-benefits-will-surprise-you-1804416.html</loc><lastmod>2026-04-29T18:21:59+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/lemon-peels-for-plants.jpg</image:loc>
					<image:title><![CDATA[ Lemon Peels For Plants ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/lemon-peels-for-plants-1.jpg</image:loc><image:caption><![CDATA[ తులసి మొక్కను హిందూ ధర్మంలో అత్యంత పవిత్రంగా భావిస్తారు. అయితే, వాతావరణ మార్పుల వల్ల లేదా కీటకాల వల్ల ఈ మొక్క త్వరగా ఎండిపోతుంటుంది. తులసి మొక్కను ఆరోగ్యంగా, పచ్చగా ఉంచడానికి నిమ్మకాయ తొక్కలు అద్భుతమైన ఎరువుగా పనిచేస్తాయి. తులసి మొక్క పెరగడానికి కొంచెం ఆమ్ల గుణం (Acidic) ఉన్న మట్టి అవసరం. నిమ్మ తొక్కల్లో ఉండే సిట్రిక్ యాసిడ్ మట్టిలోని pH స్థాయిని సరిచేసి, మొక్క ఎదుగుదలకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/lemon-4.jpg</image:loc><image:caption><![CDATA[ నిమ్మ తొక్కల్లో ఉండే సిట్రిక్ యాసిడ్ మట్టిలోని pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. ఇది మొక్క వేర్లకు పోషణను అందించి, ఎదుగుదలను వేగవంతం చేస్తుంది. అంతేకాకుండా, నిమ్మ తొక్కల్లో ఉండే సుగంధ తైలాలు, ఘాటైన వాసన వల్ల తులసి మొక్కను ఆశించే ఫంగస్, చీమలు, ఇతర కీటకాలు దరిచేరవు. ఇది ఒక నేచురల్ పెస్టిసైడ్‌లా పనిచేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/lemon-peels-for-plants2.jpg</image:loc><image:caption><![CDATA[ నిమ్మ తొక్కల ఘాటైన వాసన వల్ల మొక్క దరిదాపుల్లోకి చీడపీడలు, చీమలు రావు. ఎండిన నిమ్మ తొక్కలను పొడి చేసి మట్టిలో కలపడం లేదా నీటిలో నానబెట్టి ఆ నీటిని పోయడం వల్ల తులసి మొక్క తాజాగా ఉంటుంది. ఇది తులసికి ఒక రక్షణ కవచంలా పనిచేసి, మొక్కను ఎండిపోకుండా కాపాడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/lemon-peels-for-plants-3.jpg</image:loc><image:caption><![CDATA[ నిమ్మ తొక్కల్లో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మట్టిలో కలిసినప్పుడు తులసి వేర్లకు బలాన్ని ఇచ్చి, ఆకులు పచ్చగా ఉండేలా చేస్తాయి. మట్టిలో పోషక లోపం వల్ల తులసి ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతుంటాయి. నిమ్మ తొక్కల పొడిని మట్టిలో చేర్చడం ద్వారా ఆకులు తాజాగా, నిగనిగలాడుతూ ఉంటాయి. శీతాకాలంలో లేదా అధిక ఎండలో తులసి ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. నిమ్మ తొక్కల వాడకం వల్ల మొక్కలో రోగనిరోధక శక్తి పెరిగి, వాతావరణ మార్పులను తట్టుకుంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/lemon-peels-for-plants1.jpg</image:loc><image:caption><![CDATA[ ఎలా ఉపయోగించాలి?: నిమ్మ తొక్కలను నేరుగా కుండీలో వేయకుండా, వాటిని ఎండబెట్టి పొడి చేసి మట్టిలో కలపాలి. లేదా నిమ్మ తొక్కలను రెండు రోజులు నీటిలో నానబెట్టి, ఆ నీటిని వడకట్టి తులసి మొక్కకు పోయాలి. ఇలా నెలకు రెండుసార్లు చేయడం వల్ల మీ ఇంట్లోని తులసి కోట ఎప్పుడూ పచ్చని ఆకులతో కళకళలాడుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/amaryllis-belladonna-why-these-beautiful-pink-lilies-enchant-nature-lovers-1804380.html</loc><lastmod>2026-04-29T17:50:14+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/flowers-2-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Flowers 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/flowers-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రకృతిలో విభిన్న రకాల పూలు, పండ్ల, ఔషధ మొక్కలు చెట్లు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో వేటికవే ప్రాధాన్యత సంతరించుకుంటూ ఉంటాయి. కొన్ని మనకు తెలిసినవే అయితే.. మరికొన్ని తెలియనివి. పూల మొక్కలకు పూసిన పూలను ఎక్కువగా అలంకారానికే వినియోగిస్తారు. వాటిలో ఒకటి బెల్లడోనా లిల్లీ. వాటినే అమరిల్లిస్ బెల్లడోనా అని కూడా అంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/flowers-5.jpg</image:loc><image:caption><![CDATA[ బెల్లడోనా లిల్లీ.. గులాబీ రంగులో సువాసన గల పూలను వసంతకాలంలో పూచే మొక్క. తెలుపు, ముదురు గులాబీ రంగుల్లో జాతులు ఉన్నప్పటికీ లేత గులాబీ రంగు పూల అందమే వేరు. ప్రకాశవంతమైన ఆకర్షణీయమైన పూలతో ఇది అందరి చూపులను తన వైపు తిప్పుకుంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/flowers-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇలా ఈ పూలు ఇప్పుడు అల్లూరి మన్యం లో కను విందు చేస్తున్నాయి. కొన్నిచోట్ల పొలాల్లో మరి కొన్నిచోట్ల ఇంటి పెరట్లో విరబూసి తమ వైపు ఆకర్షిస్తున్నాయి. సువాసన వెదజల్లుతూ, ఆకర్షణీయమైన రంగుతో ఆకట్టుకుంటున్నాయి. జీకే వీధి మండలం  దుచ్చరిపాలెం గ్రామంలో ఓ గిరిజనుడు ఇంటి పెరట్లో  ఈ పూలు వికసించి తన గొప్పతనాన్ని చాటుతున్నాయి. ప్రకాశవంతమైన రంగులతో మెరిసే ఈ పుష్పాలు పరిసరాలకు మరింత వన్నె తెచ్చాయి. ఏజెన్సీలో అనుకూల వాతావరణం ఉండడంతో పుష్పాలు విరబూస్తున్నాయి. ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/flowers-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ అందుకే ఆ పేరు.. బెల్లడోనా లిల్లీ కి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇది దుంప జాతి మొక్క. మొక్కకు ఆకులు రాలిన తర్వాత.. పొడవాటి కాండం కాండంపై ఈ పూలు పూస్తాయి. అందుకే దీనికి &#039;నేకెడ్ లేడీ&#039; అని కూడా పిలుస్తారు. వసంతకాలంలో విరబూసి,శరదృతువు వరకు దీని సీజన్. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/flowers-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ &#039; ఇది ఒక అలంకార పూల మొక్క.. వేసవికాలంలోనే ఈ పుష్పాలు వికసిస్తాయి. మన్యంలో అనుకూల వాతావరణం ఉండడంతో  పుష్పిస్తున్నాయి.&#039; అని అన్నారు చింతపల్లి ఉద్యాన శాస్త్రవేత్త రమణ. అయితే ఈ మొక్క కొన్ని పెంపుడు జంతువులకు అస్వస్థకు గురి చేసే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/storing-coconut-water-in-the-fridge-heres-when-it-goes-bad-1804296.html</loc><lastmod>2026-04-29T17:48:40+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/coconut-water-storage.jpg</image:loc>
					<image:title><![CDATA[ Coconut Water Storage ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/coconut-water-2-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఎండ వేడి నుండి ఉపశమనం పొందడానికి లేదా తక్షణ శక్తి కోసం మనం కొబ్బరి నీళ్లను తాగుతుంటాం. అయితే చాలా మంది బొండాం నుండి నీళ్లను తీసి బాటిళ్లలో నింపి ఫ్రిజ్‌లో నిల్వ చేస్తుంటారు. అసలు కొబ్బరి నీళ్లను ఎంతకాలం నిల్వ చేయవచ్చు? అవి పాడయ్యాయని ఎలా గుర్తించాలి? అన్న విషయాలపై ఆరోగ్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/coconut-water-7.jpg</image:loc><image:caption><![CDATA[ కొబ్బరి బొండాం పైన ఉన్న సహజ కవచం దానికి రక్షణగా ఉంటుంది. ఒక్కసారి బొండాం కొట్టిన తర్వాత గాలిలోని ఆక్సిజన్‌తో నీళ్లు చర్య జరుపుతాయి. దీనివల్ల నీటిలోని ఎంజైమ్‌లు యాక్టివేట్ అయ్యి రుచి మారుతుంది. ఒకవేళ మీరు నీటిని నిల్వ చేయాలనుకుంటే, వాటిని స్టీల్ లేదా ప్లాస్టిక్ బాటిళ్ల కంటే గాజు సీసాలో పోసి ఫ్రిజ్‌లో ఉంచడం మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/coconut-water-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఎంత కాలం తాజాగా ఉంటాయి?: సాధారణ ఉష్ణోగ్రత వద్ద బయట ఉంచితే కొబ్బరి నీళ్లు 3 నుండి 4 గంటల్లోనే పాడవ్వడం మొదలవుతుంది. ఫ్రిజ్‌లో ఉంచితే 24 గంటల వరకు రుచి బాగుంటుంది. గరిష్టంగా 48 గంటల తర్వాత వీటిని తాగడం ఆరోగ్యకరం కాదు. నీళ్లు కాస్త తెల్లగా (Cloudy) మారినా, పుల్లటి వాసన వచ్చినా లేదా రుచిలో తేడా ఉన్నా అవి ఎక్స్‌పైర్ అయినట్లు అర్థం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/coconut-water-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ జాగ్రత్తలు: ప్యాక్ చేసిన కొబ్బరి నీళ్లలో ప్రిజర్వేటివ్స్ (Preservatives) ఉంటాయి. కాబట్టి, అవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. కానీ, బొండాం నుండి నేరుగా వచ్చే నీళ్లలో ఎటువంటి రసాయనాలు ఉండవు. అందుకే వాటిని అప్పటికప్పుడు తాగడమే మేలు. నిల్వ ఉన్న నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ సమస్యలు, వాంతులు లేదా అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా గర్భిణీలు, చిన్న పిల్లలు తాజా కొబ్బరి నీళ్లనే తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/coconut-water-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, వాటిని సరైన పద్ధతిలో తీసుకోకపోతే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ. ప్రకృతి సిద్ధంగా లభించే ఈ నీళ్లను కొబ్బరి బొండాం నుండి తీసిన వెంటనే తాగడం ఉత్తమం. గాలి తగిలితే ఇవి త్వరగా ఆక్సీకరణం (Oxidation) చెంది రంగు, రుచి మారిపోతాయి. ఒకవేళ నిల్వ చేయాలనుకుంటే, వీటిని గాజు సీసాలో పోసి ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. ఫ్రిజ్‌లో ఉంచిన కొబ్బరి నీళ్లు గరిష్టంగా 24 నుండి 48 గంటల వరకు మాత్రమే తాజాగా ఉంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/coconut-water-6-1.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రకృతి సిద్ధంగా లభించే ఈ నీళ్లను కొబ్బరి బొండాం నుండి తీసిన వెంటనే తాగడం ఉత్తమం. ఆరోగ్యం కోసం తాగే కొబ్బరి నీళ్లు, నిల్వ చేయడం వల్ల విషతుల్యం కాకుండా చూసుకోవడం మన బాధ్యత. ప్యాక్ చేసిన కొబ్బరి నీళ్ల కంటే స్వచ్ఛమైన బొండాం నీళ్లు తాగడమే ఆరోగ్యానికి శ్రేయస్కరం. నేరుగా బొండాం నుండి స్ట్రా వేసుకుని తాగడమే అత్యుత్తమ పద్ధతి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/fake-rs-500-bundles-found-in-pond-turn-out-to-be-toy-notes-police-suspect-mischief-1804313.html</loc><lastmod>2026-04-29T17:05:16+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/currency-3-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Currency Notes ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/currency-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఆకతాయిల ఆగడాలను అరికట్టే పోలీసులనే కొందరు ఆటపట్టిస్తున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. దమ్మపేట పోలీసులతో పాటు గ్రామస్తులకు కూడా ఈ వింత అనుభవం ఎదురైంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/currency-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇటీవల దొంగనోట్ల సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు నిందితుల కోసం అశ్వారావుపేట పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసులో దమ్మపేట మండలం లచ్చపురం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు నిందితులుగా ఉన్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/currency-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ నేపథ్యంలో, అదే గ్రామంలోని చెరువులో 500 రూపాయల నోట్లు కట్టలుగా, కొన్ని చింపివేసిన నోట్లు కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గ్రామ పరువు దెబ్బతింటుందని, ఇంకా గ్రామంలో దొంగనోట్ల ముఠా ఉండొచ్చని అనుమానంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/currency-2.jpg</image:loc><image:caption><![CDATA[ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని నోట్లను పరిశీలించారు. అయితే అవి అసలు నోట్లు కాకుండా చిన్నపిల్లలు ఆడుకునే చెక్లెట్ కాగితాలుగా గుర్తించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/currency-5.jpg</image:loc><image:caption><![CDATA[ దీంతో గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు. ఇదంతా ఆకతాయిల పనేనని పోలీసులు భావిస్తూ, వారిని త్వరలోనే గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/mercury-brings-bags-of-wealth-is-your-zodiac-sign-on-the-lucky-list-1804228.html</loc><lastmod>2026-04-29T16:07:23+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rashifal-10.jpg</image:loc>
					<image:title><![CDATA[ Mercury Brings Bags of Wealth ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rashifal-11.jpg</image:loc><image:caption><![CDATA[ Budha Gochar 2026: జ్యోతిష్య శాస్త్రంలో బుధుడు ఎంతో ముఖ్యమైన గ్రహంగా పరిగణించబడుతుంది. దీనిని సౌర వ్యవస్థలో ‘రాకుమారుడు’గా కూడా పిలుస్తారు. మిథునం, కన్యా రాశులకు అధిపతిగా ఉన్న బుధుడు ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తూ, ఏప్రిల్ 30న మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ బుధ సంచారం అన్ని రాశుల వారిపై ప్రభావం చూపినప్పటికీ, ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఇది అత్యంత శుభఫలితాలను అందించనుంది. ఆ రాశులు, వాటిపై పడే ప్రభావం ఇలా ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rashifal1.jpg</image:loc><image:caption><![CDATA[ మేషరాశి.. 
బుధుడు మేషరాశి లగ్నంలో ప్రవేశించడం వల్ల ఆర్థికంగా మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. మీరు తీసుకున్న బాధ్యతలను సమయానికి పూర్తి చేసి, ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rashifal2-10.jpg</image:loc><image:caption><![CDATA[ సింహరాశి.. 
ఈ సంచారం సింహరాశి వారికి శుభవార్తలు తీసుకురానుంది. మీరు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఫలితాలు ఇప్పుడు అందుతాయి. కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంటాయి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ముగిసే అవకాశముంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. యువతకు ఇంటర్వ్యూలలో విజయం సాధించే సూచనలు ఉన్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rashifal3-9.jpg</image:loc><image:caption><![CDATA[ తులారాశి.. 
ఇటీవలి కాలంలో ఒత్తిడిని ఎదుర్కొంటున్న తులారాశి వారికి ఉపశమనం లభిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. కుటుంబంతో కలిసి సంతోషకరమైన సమయాన్ని గడిపే అవకాశం ఉంటుంది. స్నేహితులతో సమయం గడపడం ద్వారా మనసుకు ప్రశాంతత లభిస్తుంది. అత్తమామల నుంచి ఆర్థిక సహాయం పొందే సూచనలు  ఉన్నాయి. ఆలస్యమైన పనులు పూర్తి అవుతాయి. ప్రేమ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rashifal4-9.jpg</image:loc><image:caption><![CDATA[ కుంభరాశి.. 
కుంభరాశి వారికి ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ అవకాశాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆస్తి   సంబంధిత విషయాల్లో విజయం సాధిస్తారు. ఆదాయం పెరిగి, బ్యాంకు బ్యాలెన్స్ మెరుగుపడుతుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. పాత పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి. ప్రభుత్వ పథకాల ద్వారా కూడా లాభాలు పొందే అవకాశముంది. 
ఈ విధంగా బుధ సంచారం కొన్ని రాశుల వారికి కొత్త అవకాశాలు, పురోగతి, ఆనందాన్ని తీసుకురానుంది.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/this-movie-disaster-in-theater-now-trending-in-amazon-prime-ott-that-is-oromeo-1804238.html</loc><lastmod>2026-04-29T16:02:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/oromeo.jpg</image:loc>
					<image:title><![CDATA[ O&#039;romeo ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/o-romeo-ott.jpg</image:loc><image:caption><![CDATA[ 2026లో విడుదలైన ఒక సినిమా ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సంచలనం సృష్టిస్తోంది. రూ.130 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం, థియేటర్లలో విడుదలైనప్పుడు భారీ విజయం సాధించి, ప్రేక్షకులను మరో సినిమా కోసం ఆశపడేలా చేసింది. అయితే, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైనప్పటి నుండి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ చిత్రం అతి త్వరగా టాప్ 10 జాబితాలో స్థానం సంపాదించుకుంది. మనం మాట్లాడుకుంటున్న ఆ సినిమా పేరు ఓ రోమియో. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/o-romeo-film.jpg</image:loc><image:caption><![CDATA[ షాహీద్ కపూర్ తన పాత్రలతో ప్రయోగాలు చేసే నటుడిగా పేరు సంపాదించుకున్నాడు. అతని చిత్రం &#039;ఓ రోమియో&#039; ప్రకటించినప్పుడు, అభిమానులలో విపరీతమైన ఉత్సాహం నెలకొంది. దీనిని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రంలోని సినిమాటోగ్రఫీ, యాక్షన్, షాహీద్ నటన ప్రశంసలు అందుకున్నప్పటికీ, కథ మాత్రం ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడంలో విఫలమైంది. షాహిద్ కపూర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైంది, కానీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై దాని అసలు గతి ఇంకా తేలాల్సి ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/o-romeo-2.jpg</image:loc><image:caption><![CDATA[ &#039;ఓ రోమియో&#039; ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారం అయిన వెంటనే, ప్రేక్షకుల అభిప్రాయాలు పూర్తిగా మారిపోయాయి. ఈ చిత్రం లోతైన కథ, రోమియోగా షాహిద్ కపూర్ నటన ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. షాహిద్ కపూర్ నటించిన &#039;ఓ రోమియో&#039; చిత్రం. తన విలక్షణమైన కథాంశంతో అందరి దృష్టిని ఆకర్షించిన ఒక హై-వోల్టేజ్ యాక్షన్-రొమాంటిక్ థ్రిల్లర్. ఈ కథ ఉస్త్ర (షాహిద్ కపూర్) అనే ఒక ప్రమాదకరమైన గ్యాంగ్‌స్టర్ చుట్టూ తిరుగుతుంది. తన సొంత మనుషులు, మాఫియా చేసిన ద్రోహాల వలయంలో ఉస్త్ర ఎలా చిక్కుకుంటాడో ఈ చిత్రం చూపిస్తుంది. ఈ కథలో ఊహించని అనేక మలుపులు ఉన్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/o-romeo-movie.jpg</image:loc><image:caption><![CDATA[ &#039;ఓ రోమియో&#039; ఏప్రిల్ 10న ప్రైమ్ వీడియోలో విడుదలై, కేవలం 24 గంటల్లోనే ఆ ప్లాట్‌ఫామ్ టాప్ 10 జాబితాలోకి ప్రవేశించింది. ముఖ్యంగా, షాహిద్ కపూర్ చిత్రం ఇప్పుడు భారతదేశంలోని ఓటీటీ ట్రెండింగ్ జాబితాలో నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ఈ చిత్రంలోని సంభాషణలు, షాహిద్ తీవ్రమైన పాత్ర సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ చిత్రాన్ని సుమారు రూ.130 కోట్ల (దాదాపు $1.3 బిలియన్లు) వ్యయంతో నిర్మించారు. ముఖ్యంగా, షాహిద్ కపూర్ తన పారితోషికంగా చిత్ర నిర్మాతల నుండి రూ.45 కోట్లు (దాదాపు $1.5 బిలియన్లు) వసూలు చేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/o-romeo-news.jpg</image:loc><image:caption><![CDATA[ బాలీవుడ్ హంగామా ప్రకారం, ఈ చిత్రం భారతదేశంలో రూ.59 కోట్లు (దాదాపు $1.5 బిలియన్లు) వసూలు చేసింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా దీని మొత్తం వసూళ్లు కేవలం రూ.92 కోట్లు (దాదాపు $1.9 బిలియన్లు) మాత్రమే. ఓ రోమియో ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో నెం. 1 స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. మీరు ఈ సస్పెన్స్-యాక్షన్ థ్రిల్లర్‌ను ప్రైమ్ వీడియోలో ఎప్పుడైనా చూడొచ్చు. షాహిద్ కపూర్ నటించిన &#039;ఓ రోమియో&#039; చిత్రానికి విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించారు. ఇందులో నానా పటేకర్, ఫరీదా జలాల్, త్రిప్తి దిమ్రి, అవినాష్ తివారీ ప్రధాన పాత్రల్లో నటించారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/may-2026-horoscope-sudden-gains-income-and-authority-for-6-zodiac-signs-details-in-telugu-1804226.html</loc><lastmod>2026-04-29T15:56:17+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/may-2026-horoscope-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ May 2026 Horoscope ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/may-2026-horoscope.jpg</image:loc><image:caption><![CDATA[ మే నెలలో నాలుగు ప్రధాన గ్రహాలు రాశులు మారడం జరుగుతోంది. కుజ, బుధ, రవి, శుక్రులు రాశులు మారుతున్నందువల్ల కొన్ని రాశుల వారికి ఈ నెలలో జీవితంలో ఆకస్మిక సానుకూల మార్పులతో పాటు, సంచలనాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. బుధుడు మే 1న, కుజుడు 12న మేష రాశిలో ప్రవేశం, శుక్రుడు 14న మిథునంలోకి, రవి 16న వృషభం లోకి ప్రవేశించడం జరుగుతోంది. వీటి వల్ల మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, మకర రాశివారి జీవితాల్లో ఆదాయానికి, అధికారానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/1-mesha-rashi-19.jpg</image:loc><image:caption><![CDATA[ మేషం: రాశినాథుడు కుజుడు ఈ రాశిలో సంచారం చేయడంతో పాటు ధన స్థానం బాగా బలపడుతున్నందువల్ల మే నెలంతా ఈ రాశివారికి జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఊహించని స్థాయిలో గౌరవమర్యాదలు, రాజపూజ్యాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా విజయాలు సాధిస్తాయి. ఉన్నతస్థాయి వారితో పరిచయాలు పెరుగుతాయి. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. ఆస్తులు సమకూరుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/2-vrushaba-rasi-21.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభం: ఈ రాశిలోనూచ ధన స్థానంలోను గ్రహాల రాశి మార్పు జరుగుతున్నందువల్ల అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగం లోనే కాక, వృత్తి, వ్యాపారాల్లో కూడా ఆదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో హోదా పెరిగే అవ కాశం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగంలో జీతాలు, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. జీవనశైలి మెరుగుపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/3-mithuna-rashi-15.jpg</image:loc><image:caption><![CDATA[ మిథునం: ఈ రాశికి లాభ స్థానంలో రాశ్యధిపతి బుధుడితో పాటు కుజ సంచారం కూడా జరుగుతున్నందు వల్ల జీవితంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొన్ని సంచలన మార్పులు సంభవిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. గృహ, వాహన సౌకర్యాలు అమరుతాయి. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడి లాభాల బాటపడతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/4-karkataka-rashi-19.jpg</image:loc><image:caption><![CDATA[ కర్కాటకం: ఈ రాశికి దశమ, లాభ స్థానాల్లో శుభ గ్రహాలు సంచారం చేయడం వల్ల కలలో కూడా ఊహించని స్థాయిలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. విదేశీయానాలకు అవకాశం ఉంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో జీతభత్యాలతో పాటు రాబడి కూడా బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. శత్రు, రోగ, రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/5-simha-rashi-14.jpg</image:loc><image:caption><![CDATA[ సింహం: ఈ రాశికి భాగ్య, దశమ స్థానాల్లో గ్రహాల సంచారం పెరుగుతున్నందువల్ల అనేక విధాలుగా రాబడి వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో భారీ జీతభత్యాలతో పాటు ఉన్నత స్థానాలకు వెళ్లే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో పట్టిందల్లా బంగారమవుతుంది. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఒక ప్రముఖుడుగా చెలామణీ కావడం జరుగుతుంది. అనారోగ్యాల నుంచి కోలుకుంటారు. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. రాజపూజ్యాలు కలుగుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/10-makara-rashi-22.jpg</image:loc><image:caption><![CDATA[ మకరం: ఈ రాశికి చతుర్థ, పంచమ స్థానాల్లో శుభ గ్రహాల సంచారం పెరుగుతున్నందువల్ల ఈ రాశివారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీలో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. విదేశాల్లో మంచి ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది. సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. సాధారణ వ్యక్తి సైతం సంపన్నుడుగా మారే అవకాశం ఉంటుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/no-fuel-price-hike-from-may-1-says-centre-amid-panic-buying-over-shortage-rumours-1804209.html</loc><lastmod>2026-04-29T15:31:47+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/petrol-diesel-prices.jpg</image:loc>
					<image:title><![CDATA[ Petrol, Diesel Prices ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/petrol-1-5.jpg</image:loc><image:caption><![CDATA[ దేశంలో పెట్రోల్ కొరత ఏర్పడనుందనే వార్తల క్రమంలో బంక్‌లు వద్ద వాహనదారులు కిలోమీటర్ల మేర క్యూ కడుతున్నారు. దీంతో బంక్‌ల వద్ద రద్దీ పెరగ్గా.. ముందుగానే పెట్రోల్, డీజిల్ నింపుకునేందుకు వాహనదారులు బారులు తీస్తున్నారు. దీంతో కొన్ని అవుట్‌లెట్ల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారుల్లో ఆందోళన నెలకొంది. ఈ కారణంతో మే 1 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే ప్రచారం నడుస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/petrol-2-5.jpg</image:loc><image:caption><![CDATA[ హర్ముజ్ జలసంధి వద్ద అనిశ్చితి, అస్దిర పరిస్థితుల క్రమంలో మే 1 నుంచి ఇంధన ధరలు పెరుగుతాయనే చర్చ తెరపైకి వచ్చింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా ముగియడంతో వచ్చే నెల 1 నుంచి ధరలను కేంద్ర ప్రభుత్వం వచ్చే అవకాశముందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రూ.25 నుంచి రూ.28 వరకు ధరలు పెరగొచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై కేంద్రం స్పందించి క్లారిటీ ఇచ్చింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/petrol-3-5.jpg</image:loc><image:caption><![CDATA[ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ప్రసక్తే లేదని, ప్రస్తుతం అలాంటి ప్రతిపాదన తమ వద్ద లేదని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వశాఖ తెలిపింది. ఇంధన ధరల పెంపుపై తక్షణ ప్రణాళికుల ఏమీ లేవని, పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేసింది. దీని వల్ల వాహనదారులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, సరఫరా వ్యవస్థ స్దిరంగా ఉందని పేర్కొంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/petrol-4-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక దేశీయ ఎల్పీజీ, పీఎన్‌జీ, సీఎన్‌జీ రవాణా సరఫరా కూడా 100 శాతం జరుగుతుందని, కమర్షియల్ గ్యాస్ సరఫరా కూడా 70 శాతం వరకు పునరుద్దరించబడిందని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. హాస్పిటల్స్, విద్యాసంస్థలు, ఫార్మా, ఉక్కు, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యత ప్రాతిపదికన ఎల్పీజీ సరఫరా జరుగుతుందని క్లారిటీ ఇచ్చింది. 5 కేజీల సిలిండర్ వల్ల వలస కార్మికులకు ప్రయోజనం జరుగుతుందని పేర్కొంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/petrol-5-4.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం మొదలైనప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే ప్రచారం జరుగుతోంది. అయితే ఏప్రిల్ 23వ తేదీన కేంద్రం స్పందిస్తూ.. ఆ వార్తలను కొట్టిపారేసింది. తాజాగా మరోసారి ఖండించగా.. కానీ హర్ముజ్ జలసంధి వద్ద సరుకు రవాణా నిలిచిపోడం, ముడి చమురు ధరలు పెరగడంతో.. దేశంలో ఇంధన ధరలు పెరగొచ్చనే ప్రచారం నడుస్తోంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/mars-saturn-conjunction-in-pisces-authority-and-career-growth-for-6-zodiac-signs-1804198.html</loc><lastmod>2026-04-29T15:28:31+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/raja-yoga-4.jpg</image:loc>
					<image:title><![CDATA[ Raja Yoga ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/raja-yoga-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ నెల(ఏప్రిల్) 30వ తేదీ నుంచి మే 14 వరకు మీన రాశిలో కుజ, శనులు మాత్రమే సంచారం చేయడం జరుగుతోంది. సాధారణంగా ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు రాజయోగాలు ఎక్కువగా కలుగుతాయి. ఈ రెండు పాప గ్రహాలు కలవడం వల్ల ఉద్యోగాల్లో ఉన్నవారికి తప్పకుండా అధికార యోగం పడుతుంది. వృషభం, మిథునం, కర్కాటకం, వృశ్చికం, మకరం, మీన రాశులవారి జీవితాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విదేశీ అవకాశాలు బాగా వృద్ధి చెందుతాయి. రాజకీయాలు, ప్రభుత్వం, మిలిటరీ, పోలీస్, రియల్ ఎస్టేట్, లిక్కర్ రంగాల్లో ఉన్నవారికి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/2-vrushaba-rasi-20.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో శని, కుజుల యుతి జరగడం వల్ల ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నా అందలాలు ఎక్కడం జరుగుతుంది. ముఖ్యంగా శీఘ్ర పురోగతికి అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు తప్పకుండా అధికార యోగం పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఘన విజయాలు సాధిస్తారు. రియల్ ఎస్టేట్, లిక్కర్ వ్యాపారాల్లో ఉన్నవారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/3-mithuna-rashi-14.jpg</image:loc><image:caption><![CDATA[ మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో శని, కుజుల కలయిక జరగడం వల్ల ఉద్యోగంలో అధికార యోగం పట్టడానికి అవకాశం ఉంది. ఈ రాశివారు మిలిటరీ, పోలీస్, ప్రభుత్వ రంగాల్లో ఉన్న పక్షంలో తమ సమర్థతను నిరూపించుకోవడం జరుగుతుంది. వీరికి మరో రెండు నెలల పాటు ఇటువంటి రంగాలలో ఉద్యోగాలు లభించే అవకాశం కూడా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కొత్త పుంతలు తొక్కుతారు. ఉద్యోగులు, నిరుద్యోగులకు అనేక ఉద్యోగ ఆఫర్లు, అవకాశాలు లభిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/4-karkataka-rashi-18.jpg</image:loc><image:caption><![CDATA[ కర్కాటకం: ఈ రాశికి భాగ్యస్థానంలో శని, కుజుల కలయిక జరగడం వల్ల ఉద్యోగంలో అధికార యోగం పట్టడానికి బాగా అవకాశం ఉంది. అధికారం చేపట్టడానికి అవకాశం ఉన్న ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో విదేశీ ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశీ పర్యటనలు చేయవలసి వస్తుంది. భూ సంబంధమైన వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. మిలిటరీ, పోలీస్ శాఖల్లో ఉన్నవారికి ఆశించిన గుర్తింపుతో పాటు హోదాలు లభిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/8-vrushchika-rashi-14.jpg</image:loc><image:caption><![CDATA[ వృశ్చికం: పంచమ స్థానంలో ఉన్న రాశ్యధిపతి కుజుడితో శని కలవడం వల్ల ఈ రాశివారు ఉన్నత పదవులు పొందడానికి బాగా అవకాశం ఉంది. ఉద్యోగాల్లో గరిష్ఠ స్థాయిలో అధికారం చెలాయించడం జరుగుతుంది. మిలిటరీ, పోలీస్, రియల్ ఎస్టేట్ రంగాలవారు తమ రంగాల్లో బాగా రాణించడం, పదోన్నతులు పొందడం వంటివి జరుగుతాయి. ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా అరుదైన ఆఫర్లు, అవకాశాలు అందుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/10-makara-rashi-21.jpg</image:loc><image:caption><![CDATA[ మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో ఉన్న శని, కుజులు కలవడం వల్ల ఈ రాశివారు ఉన్నతోద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధించడం జరుగుతుంది. నిరుద్యోగులకు తప్పకుండా విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. మిలిటరీ, పోలీస్, లిక్కర్ వంటి రంగాల్లో బాగా రాణించడానికి అవకాశం ఉంది. షేర్ల ద్వారా బాగా లాభాలు గడించడం జరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/12-meena-rasi-8.jpg</image:loc><image:caption><![CDATA[ మీనం: ఈ రాశిలో ఉన్న శనితో కుజుడు కలిసి ఉండడం వల్ల రియల్ ఎస్టేట్, లిక్కర్ వంటి వ్యాపారాల్లో ఈ రాశివారు అపారమైన ధన లాభం పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు, పోలీస్ శాఖ వారు గుర్తింపు పొందడంతో పాటు పదోన్నతులు పొందే అవకాశం కూడా ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ముఖ్యమైన ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. భూలాభం కలుగుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/vajravalli-bone-setter-plant-benefits-for-bones-cough-phlegm-chutney-recipe-1804169.html</loc><lastmod>2026-04-29T15:18:13+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vajravalli-chutney-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Vajravalli Chutney ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vajravalli-1.jpg</image:loc><image:caption><![CDATA[ వజ్రవల్లి, నల్లేరు, బోన్ సెట్టర్ ప్లాంట్, లేదా అస్థి సంహార అని వివిధ పేర్లతో పిలువబడే ఈ మొక్క ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. దీనిని ఎముకల ఆరోగ్యం, శ్వాసకోశ సమస్యల నివారణకు ఒక ఔషధంగా ఉపయోగిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vajravalli-2.jpg</image:loc><image:caption><![CDATA[ వయసు పెరగడం వల్ల వచ్చే నడుము నొప్పి, కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందడంలో నల్లేరు సహాయపడుతుంది. ఏదైనా ప్రమాదం వల్ల ఎముకలు విరిగినప్పుడు అవి త్వరగా అతుక్కోవడానికి కూడా ఇది తోడ్పడుతుంది. అలాగే, దీర్ఘకాలిక దగ్గు, అధిక కఫం, ఇతర శ్వాస సంబంధిత సమస్యలను తగ్గించడంలోనూ నల్లేరు ప్రభావవంతంగా పనిచేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vajravalli-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ నల్లేరు తీగలాగా పెరుగుతుంది మరియు ఇంట్లోనే సులభంగా పెంచుకోవచ్చు. దీని కాడలు మరియు లేత ఆకులను పచ్చడి తయారీలో ఉపయోగించవచ్చు. నల్లేరు కాడలను శుభ్రపరిచేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేత కాడలను ఎంచుకొని, వాటి పైన ఉండే పీచును తొలగించాలి. నల్లేరు రసం చర్మానికి తగిలితే దురద వచ్చే అవకాశం ఉన్నందున, కాడలను కట్ చేసే ముందు చేతులకు నూనె లేదా తడిచేసుకొని ఉప్పు రాసుకోవడం మంచిది. ముదిరిన కాడలను చాకుతో కట్ చేయాలి, అయితే లేతవి సులభంగా విరిగిపోతాయి. కట్ చేసుకున్న కాడలను నీళ్లలో బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vajravalli-chutney.jpg</image:loc><image:caption><![CDATA[ నల్లేరు పచ్చడి తయారీకి, ముందుగా కడాయిలో ఒక స్పూన్ నూనె వేడి చేసి, 10 మెంతు గింజలు, ఒక స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర, రెండు స్పూన్ల నువ్వులు వేసి తక్కువ మంటపై నెమ్మదిగా వేయించాలి. అవి మాడిపోకుండా చక్కగా వేగిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే కడాయిలో మరో స్పూన్ నూనె వేసి, 10-12 పచ్చిమిర్చి ముక్కలు, శుభ్రం చేసుకున్న నల్లేరు కాడలు వేసి తక్కువ మంటపై లోపల వరకు వేగేలా నెమ్మదిగా కలుపుతూ వేయించాలి. నల్లేరుకు దురద పుట్టించే స్వభావం ఉన్నందున, అది లోపల వరకు వేగేలా తక్కువ మంటపై వేగనివ్వాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vajravalli-5.jpg</image:loc><image:caption><![CDATA[ తర్వాత, అదే కడాయిలో మరొక స్పూన్ నూనె వేసి, సన్నగా తరిగిన నాలుగు టమాటా ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, చిన్న ఉసిరికాయ సైజు చింతపండు, పావు స్పూన్ పసుపు వేసి బాగా కలిపి ఉడికించాలి. ఇవి చక్కగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు రోలు లేదా మిక్సీ తీసుకుని, ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులను మెత్తగా దంచుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, నల్లేరు ముక్కలను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vajravalli-4.jpg</image:loc><image:caption><![CDATA[ చివరగా, నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు, ఉడికించిన టమాటా ముక్కలు వేసి మెత్తగా దంచుకోవాలి. ఈ దశలో ఉప్పు సరిచూసుకొని అవసరమైతే కలుపుకోవచ్చు. మంచి ఫ్లేవర్ కోసం సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా కలిపి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. చివరిగా, తాలింపు కోసం ఒక స్పూన్ నూనెలో అర స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు, ఒక ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి వేగిన తర్వాత పచ్చడికి జోడించాలి. ఈ ఔషధ గుణాలున్న నల్లేరు పచ్చడి ఎముకల ఆరోగ్యానికి, శ్వాసకోశ ఉపశమనానికి దోహదపడుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/business/upi-payments-get-easier-no-pin-required-for-transactions-up-to-5000-with-biometric-authentication-1804170.html</loc><lastmod>2026-04-29T15:07:40+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/upi-payments.jpg</image:loc>
					<image:title><![CDATA[ Upi Payments ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/upi-payments-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ యూపీఐ చెల్లింపులు చేసేవారికి బిగ్ రిలీఫ్ దక్కింది. ఇప్పటివరకు యూపీఐ ట్రాన్సాక్షన్లను చేయాలంటే పిన్ అవసరం పడేది. యూపీఐ యాప్స్ ద్వారా డబ్బులు బదిలీ చేయాలన్నా, బ్యాలెన్స్ చెక్ చేయాలన్నా నాలుగు లేదా ఆరు అంకెల పిన్ ఎంటర్ చేయాల్సి వచ్చేది. కానీ ఇక నుంచి తక్కువ మొత్తంలో చేసే లావాదేవీలకు యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం మీ బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా పేమెంట్స్ చేయవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/upi-payments-2.jpg</image:loc><image:caption><![CDATA[ మీ ఫోన్‌లో మీరు సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ రికగ్నిషన్ సెట్ చేసుకుంటారు. వాటి  ఆధారంగా మీరు పేమెంట్స్ చేయవచ్చు. రూ.5 వేల వరకు చేసే లావాదేవీలకు ఇది వర్తిస్తుంది. ఇప్పటివరకు రిసీవర్ బ్యాంక్ అకౌంట్, యూపీఐ నెంబర్ లేదా యూపీఐ ఐడీ సెలక్ట్ చేసుకున్నా అమౌంట్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత పిన్ నెంబర్ నమోదు చేస్తే పేమెంట్ కంప్లీట్ అయ్యేది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/upi-payments-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక నుంచి పిన్ నెంబర్ స్థానంలో మీ ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ రికగ్నిషన్ ధృవీకరించాల్సి ఉంటుంది. అనంతరం పేమెంట్ పూర్తవుతుంది. దీని వల్ల ట్రాన్సాక్షన్లు వేగంగా పూర్తవ్వడంతో పాటు సురక్షితంగా చేసుకోవచ్చు. యూపీఐ పిన్ వేరేవారికి తెలిసే ఛాన్స్ ఉంటుంది. దీని వల్ల  మోసాలు జరగవచ్చు. అయితే మీ బయోమెట్రిక్స్‌ను ట్యాపరింగ్ చేయడం కష్టం. దీని వల్ల డిజిటల్ లావాదేవీలకు భద్రత ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/upi-payments-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు అన్ని యూపీఐ యాప్స్‌, బ్యాంకింగ్ యూప్స్‌లో ఈ సౌకర్యం అందుబాటులో వచ్చింది. మీరు యూపీఐ యాప్స్‌లోకి వెళ్లి మీ బ్యాంక్ అకౌంట్‌ను సెలక్ట్ చేసుకున్నాక బయోమెట్రిక్ వివరాల ఆధారంగా పేమెంట్స్ చేసే ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి. ప్రతీ బ్యాంక్ అకౌంట్‌కు ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోవాలి. దీని వల్ల మీరు యూపీఐ విధానంలో పేమెంట్ చేసే సమయంలో మీ ఫింగర్ ప్రింట్ లేదా ముఖం చూపిస్తే సరిపోతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/upi-payments-5.jpg</image:loc><image:caption><![CDATA[ వ్యక్తిగత బదిలీలతో పాటు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేయడం, ఆన్ లైన్ చెక్ అవుట్‌లతో పాటు అన్ని రకరాల యూపీఐ లావాదేవీలు చేయవచ్చు. రూ.5 వేల కంటే ఎక్కువ మొత్తంలో చెల్లించాలంటే యూపీఐ పిన్ అవసరమవుతుంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడించే బీమ్ యాప్‌తో పాటు బ్యాంకింగ్, ఇతర అన్ని యూపీఐ ఫ్లాట్‌ఫామ్స్‌లో ఈ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/ac-vs-air-cooler-which-one-should-you-choose-this-summer-cooling-speed-cost-and-efficiency-compared-1804106.html</loc><lastmod>2026-04-29T13:43:50+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ac-vs-air-cooler5-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ac Vs Air Cooler ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ac-vs-air-cooler5.jpg</image:loc><image:caption><![CDATA[ AC vs Air Cooler: Which One Should You Choose This Summer? Cooling Speed, Cost, and Efficiency Compared. AC vs Air Cooler: వేసవి ఎండలు మండిపోతున్న తరుణంలో చాలామందిని వేధించే ప్రశ్న ఏసీ (AC) కొనాలా? లేక ఎయిర్ కూలర్ (Air Cooler) తీసుకోవాలా? అని. ఈ రెండింటిలో ఏది వేగంగా చల్లబరుస్తుంది? ఖర్చు ఎక్కడ తక్కువ అవుతుంది? భారతీయ వాతావరణానికి ఏది ఉత్తమం? అనే అంశాలపై పూర్తి వివరాలు తెలుసుకుందాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ac-vs-air-cooler1.jpg</image:loc><image:caption><![CDATA[ ఏసీ, కూలర్ మధ్య ప్రధాన వ్యత్యాసాలు: ఎయిర్ కూలర్: ఇది &#039;బాష్పీభవనం&#039; (Evaporative Cooling) ప్రక్రియపై పనిచేస్తుంది. అంటే వేడి గాలిని పీల్చుకుని, నీటి ద్వారా చల్లబరిచి బయటకు పంపుతుంది. దీనికి తాజా గాలి నిరంతరం అవసరం. ఏసీ: ఇది గదిలోని వేడి గాలిని పీల్చుకుని, రిఫ్రిజిరెంట్ గ్యాస్ సహాయంతో చల్లబరుస్తుంది. ఇది గదిలోని తేమను (Humidity) కూడా తగ్గిస్తుంది. దీనికి గది పూర్తిగా మూసి ఉండాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ac-vs-air-cooler2.jpg</image:loc><image:caption><![CDATA[ ఖర్చు విషయానికొస్తే కూలర్..ధర చాలా తక్కువే. రూ.5,000 - రూ.15,000 వరకు ఉంటుంది. దీని నిర్వహణ ఖర్చు కూడా తక్కువే. కేవలం నీరు నింపడం, అప్పుడప్పుడు ప్యాడ్స్ మార్చడం సరిపోతుంది. అదే ఏసీ అయితే కొనుగోలు ధర రూ.30,000 - రూ.60,000 మధ్య ఉంటుంది. ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు, ప్రతి ఏడాది సర్వీసింగ్ వంటి ఖర్చులు ఉంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ac-vs-air-cooler3.jpg</image:loc><image:caption><![CDATA[ విద్యుత్ వినియోగం విషయానికొస్తే.. కూలర్ చాలా తక్కువ విద్యుత్తును వాడుకుంటుంది (దాదాపు ఫ్యాన్ కంటే కొంచెం ఎక్కువ). దీనివల్ల కరెంటు బిల్లు భారంగా అనిపించదు. అదే ఏసీ అయితే ఇది ఎక్కువ విద్యుత్తును తీసుకుంటుంది. ఇన్వర్టర్ ఏసీలు కొంత వరకు కరెంటును ఆదా చేసినప్పటికీ, కూలర్‌తో పోలిస్తే బిల్లు ఎక్కువే వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ac-vs-air-cooler4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక వాతావరణంలో కూలర్: ఇది పొడి వాతావరణం (Dry Heat) ఉన్న ప్రాంతాల్లో అద్భుతంగా పనిచేస్తుంది. కానీ ఉక్కపోత ఎక్కువగా ఉన్న తీర ప్రాంతాల్లో అంత ప్రభావవంతంగా ఉండదు. అదే ఏసీ అయితే ఇది ఎలాంటి వాతావరణంలోనైనా పనిచేస్తుంది. ముఖ్యంగా ఉక్కపోత ఎక్కువగా ఉన్నప్పుడు ఏసీ మాత్రమే సౌకర్యాన్ని ఇవ్వగలదు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/maruti-suzuki-invicto-gets-discounts-up-to-rs-2-15-lakh-check-offers-on-baleno-and-grand-vitara-1804082.html</loc><lastmod>2026-04-29T13:17:42+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/maruti-car-offer2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Maruti Car Offer ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/maruti-car-offer2-1.jpg</image:loc><image:caption><![CDATA[ Maruti Suzuki Invicto: మారుతీ సుజుకి కార్లపై ఏకంగా రూ.2.15 లక్షల వరకు ఆఫర్లు లభిస్తున్నాయి. ఇంతకీ ఈ ఆఫర్ బాలెనో లేదా గ్రాండ్ విటారా పైనా? అంటే... కాదు, ఇది మారుతీ సుజుకి అత్యంత ఖరీదైన మోడల్ &#039;ఇన్విక్టో&#039; (Invicto) పై లభిస్తోంది. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకి, తన ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన ఇన్విక్టో ఎంపీవీపై ఏప్రిల్ 2026 నెలలో ఈ భారీ తగ్గింపును ప్రకటించింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/maruti-car-offer1.jpg</image:loc><image:caption><![CDATA[ మొత్తం తగ్గింపు: రూ.2.15 లక్షల వరకు అందిస్తోంది. ఇందులో కన్స్యూమర్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బోనస్, లాయల్టీ అప్‌గ్రేడ్, కార్పొరేట్ డిస్కౌంట్లు కలిసి ఉన్నాయి. దీని ధర విషయానికొస్తే.. మారుతీ ఇన్విక్టో ధర రూ.24.97 లక్షల నుండి రూ.28.60 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/maruti-car-offer3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇన్విక్టో ప్రత్యేకతలను పరిశీలిస్తే.. హైబ్రిడ్ ఇంజన్: ఇందులో 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో కూడిన స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్ ఉంది. ఇది 184hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇక మైలేజీ: ఏఆర్ఏఐ (ARAI) ప్రకారం, ఈ కారు లీటరుకు 23.24 కి.మీ మైలేజీని ఇస్తుంది. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ టెయిల్‌గేట్ వంటి లగ్జరీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/maruti-car-offer4.jpg</image:loc><image:caption><![CDATA[ భారత్ NCAP (Bharat NCAP) క్రాష్ టెస్ట్‌లో ఈ కారు 5-స్టార్ రేటింగ్ సాధించింది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటివి ప్రామాణికంగా వస్తాయి. ఇతర మారుతీ నెక్సా (Nexa) కార్లపై ఆఫర్లు ఉన్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/maruti-car-offer5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇన్విక్టోతో పాటు ఇతర మోడల్స్‌పై కూడా మారుతీ సుజుకి ఆకర్షణీయమైన ప్రయోజనాలను అందిస్తోంది. గ్రాండ్ విటారా (Grand Vitara): రూ.1.07 లక్షల వరకు ఉండగా, ఫ్రాంక్స్ (Fronx): రూ.55,000 వరకు ఉంది. అలాగే  జిమ్నీ (Jimny): రూ.50,000 వరకు, ఇగ్నిస్ (Ignis): రూ.50,000 వరకు,  అలాగే XL6: రూ.50,000 వరకు,  బాలెనో (Baleno): రూ.40,000 వరకు డిస్కౌంట్‌ అందిస్తోంది. ముఖ్య గమనిక: ఈ ఆఫర్లు కేవలం ఏప్రిల్ 2026 నెలకు మాత్రమే పరిమితం. డీలర్‌షిప్, ప్రాంతాన్ని బట్టి ఈ తగ్గింపు ధరల్లో మార్పులు ఉండవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/chaganti-pravachanam-how-devotion-manifests-divine-mothers-presence-1803937.html</loc><lastmod>2026-04-29T10:49:22+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/anklet-sounds-spirituality.jpg</image:loc>
					<image:title><![CDATA[ Anklet Sounds Spirituality ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/anklet-sounds-spirituality-1.jpg</image:loc><image:caption><![CDATA[ ధ్యానంలో బాగా పట్టు సాధించిన భక్తులకు అమ్మవారు వారిని వదిలి ఉండలేక నిరంతరం అనుసరిస్తూ ఉంటారు. అటువంటి మహాత్ములు నివసించే చోట ఇంట్లో గజ్జెల చప్పుళ్లు వినిపిస్తూ ఉంటాయని ప్రవచనంలో వివరించబడింది. ఇది కేవలం ధ్యాన స్థితిలో మాత్రమే కాకుండా, భక్తుల సాధారణ జీవితంలోనూ అమ్మవారి దివ్యమైన, ప్రత్యక్షమైన సాయాన్ని తెలియజేస్తుంది. ఈ అద్భుతమైన స్థితిని రామకృష్ణ పరమహంస సతీమణి శారదాదేవి జీవిత సంఘటనల ద్వారా చాగంటి ప్రవచనంలో ప్రస్తావించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/anklet-sounds-spirituality2.jpg</image:loc><image:caption><![CDATA[ శారదాదేవి తన భర్త రామకృష్ణ పరమహంస వద్దకు కలకత్తాకు వెళ్ళే మార్గమధ్యంలో తీవ్ర జ్వరానికి గురయ్యారు. ఆమె స్పృహ కోల్పోయి, తండ్రి పక్కన అచ్చాదన మండపంలో పడుకుని ఉన్నారు. ఈ స్థితిలో ఆమెకు గజ్జెల చప్పుళ్లు వినిపించాయి. కళ్ళు తెరిచి చూడగా, నల్లని వర్ణంలో ఉన్న ఒక దివ్య స్త్రీ ఆమె వద్దకు వస్తూ కనిపించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/anklet-sounds-spirituality3.jpg</image:loc><image:caption><![CDATA[ శారదాదేవి తన జీవిత చరిత్రలో రాసుకున్న ప్రకారం, అంత అందగత్తెను తన జన్మాంతరంలో చూడలేదని పేర్కొన్నారు. ఆ స్త్రీ పార్వతి, కాళికా రూపమే. ఆవిడ శారదాదేవి పక్కన కూర్చుని, ఆమె బెంగను తెలుసుకుని, జ్వరం తగ్గిపోతుందని ఆశీర్వదించారు. ఆ మర్నాటికే శారదాదేవి జ్వరం తగ్గిపోయి, రామకృష్ణ పరమహంస వద్దకు చేరుకున్నారు. ఇది అమ్మవారి ఉపాసన వల్ల కాకుండా, శారదాదేవి సహజసిద్ధమైన భక్తి వల్ల లభించిన దర్శనం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/anklet-sounds-spirituality4.jpg</image:loc><image:caption><![CDATA[ మరొక సంఘటనలో, శారదాదేవికి 13 సంవత్సరాల వయస్సులో రామకృష్ణ పరమహంస గ్రామం కామార్పుకూర్‌లో జరిగింది. తెల్లవారుజామున హలధర పుష్కరిణి అనే చెరువులో స్నానం చేయడానికి వెళ్ళమని పెద్దలు చెప్పారు. చీకట్లో, తెలియని ఊరిలో ఒంటరిగా వెళ్ళడానికి బెంగ పడుతున్న శారదాదేవి గడ్డం మీద చేయి వేసుకుని ఆలోచిస్తుండగా, ఆమె ముందు నలుగురు, వెనక నలుగురు గొప్ప స్త్రీలు కనిపించారు. వారు తాము కూడా హలధర పుష్కరిణికి స్నానానికి వెళ్తున్నామని చెప్పి, శారదాదేవిని వారితో పాటు తీసుకువెళ్లారు. వారి పాద మంజీర ధ్వనులను వింటూ శారదాదేవి స్నానానికి వెళ్లారు. స్నానం ముగించుకొని తిరిగి వస్తుండగా, ఆ ఎనమండుగురు స్త్రీలు ఆమెను ఇంటి ముందు దిగబెట్టి వెళ్లిపోయారు. ఆ ఎనమండుగురు అష్టలక్ష్ములే. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/anklet-sounds-spirituality5.jpg</image:loc><image:caption><![CDATA[ అమ్మవారిని నమ్ముకున్న భక్తులకు, వారికి చిన్న బెంగ కలిగినా, అమ్మవారు ధ్యానంలో మాత్రమే కాకుండా, ఏదో ఒక రూపంలో వచ్చి వారిని అనుసరించి, ఆదుకుంటుందని ఈ సంఘటనలు స్పష్టం చేస్తాయి. అటువంటి భక్తులు అమ్మవారి పాద మంజీరముల ధ్వనులను వింటూ ఉంటారు. ధ్యానంలో అమ్మవారి దర్శనం పొంది, ఆమె కదలికలను చూసినవాడే జీవితంలో అదృష్టవంతుడు, విజయాలను చేరుకోగలడు.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/modi-performs-special-pujas-at-kashi-vishwanath-temple-significance-of-sarvartha-siddhi-yoga-and-trayodashi-tithi-1803900.html</loc><lastmod>2026-04-29T09:59:33+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pm-modi-puja-in-kashi-vishwanath-temple.jpg</image:loc>
					<image:title><![CDATA[ Pm Modi Puja In Kashi Vishwanath Temple ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kashi-vishwanath-pm-modi2.jpg</image:loc><image:caption><![CDATA[ పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు కొన్ని రోజుల ముందు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కాశీ విశ్వనాథుని ఆశీస్సులు పొందారు. ఏప్రిల్ 29న సర్వార్థ సిద్ధి యోగం, త్రయోదశి తిథి కలిసిన శుభసంధర్భంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పవిత్ర సమయాన్ని దృష్టిలో ఉంచుకుని, షోడశోపచార విధానంలో సుమారు 30 నిమిషాల పాటు బాబా విశ్వనాథునికి పూజ చేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kashi-vishwanath-pm-modi3.jpg</image:loc><image:caption><![CDATA[ సర్వార్థ సిద్ధి యోగం అంటే ఏమిటి?.. 

హిందూ జ్యోతిషశాస్త్రంలో సర్వార్థ సిద్ధి యోగాన్ని అత్యంత శుభప్రదమైన యోగాలలో ఒకటిగా పరిగణిస్తారు. “సర్వార్థ” అంటే అన్ని రకాల లక్ష్యాలు, “సిద్ధి” అంటే వాటి సాధన లేదా విజయము. అందువల్ల, ఈ యోగాన్ని ఏ ప్రయత్నమైనా విజయవంతమయ్యే సమయంగా భావిస్తారు. కొత్త పనులు ప్రారంభించడం, ముఖ్య నిర్ణయాలు తీసుకోవడం, వ్యాపారాలు మొదలుపెట్టడం లేదా పూజా కార్యక్రమాలు నిర్వహించడం వంటి వాటికి ఇది అత్యంత అనుకూల సమయంగా పరిగణించబడుతుంది. ఈ యోగం వారంలోని రోజు, నక్షత్రం మధ్య ఏర్పడే ప్రత్యేక జ్యోతిష్య సమన్వయంతో ఏర్పడుతుంది. అనుకూలమైన గ్రహ స్థితులు, నక్షత్రాల కలయిక ఉన్నప్పుడు మాత్రమే ఇది ఏర్పడుతుంది. సాధారణంగా ఇది రోజంతా ఉండదు; నిర్దిష్ట నక్షత్ర సమయాల ఆధారంగా కొన్ని గంటల పాటు మాత్రమే ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kashi-vishwanath-pm-modi4.jpg</image:loc><image:caption><![CDATA[ త్రయోదశి తిథి ప్రాముఖ్యత.. 

ఏప్రిల్ 29న త్రయోదశి తిథి ఉండడం శివారాధనకు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున శివుని ఆరాధిస్తే శుభఫలితాలు, ఆనందం, శ్రేయస్సు లభిస్తాయని నమ్మకం ఉంది. సర్వార్థ సిద్ధి యోగంతో కలిసిన త్రయోదశి ఈ రోజును మరింత విశిష్టంగా చేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kashi-vishwanath-pm-modi5.jpg</image:loc><image:caption><![CDATA[ షోడశోపచార పూజ విధానం

ఈ సందర్భంలో షోడశోపచార పద్ధతిలో ప్రధాని మోడీ పూజ నిర్వహించారు. ఇది దేవతకు సంపూర్ణ గౌరవం, ఆతిథ్యం అందించే సంప్రదాయ హిందూ పూజా విధానం. ఈ పూజలో 16 విధాల సేవలు ఉంటాయి. మొదట ఆహ్వానం, ఆసనం సమర్పణతో పూజ ప్రారంభమవుతుంది. తరువాత ప్రధానంగా అభిషేకం జరుగుతుంది. ఇందులో పాలు, పెరుగు, నెయ్యి, తేనె,  పంచామృతంతో శివుని అభిషేకం చేసి, అనంతరం శుభ్రమైన నీటితో స్నానం చేయిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kashi-vishwanath-pm-modi-pu.jpg</image:loc><image:caption><![CDATA[ తదుపరి వస్త్రాలు, జంధ్యం, చందనం సమర్పిస్తారు. ఆ తర్వాత బిల్వపత్రాలు, పుష్పాలు వంటి శివునికి ప్రియమైన పదార్థాలను అర్పిస్తారు. చివరగా నైవేద్యం, తాంబూలం సమర్పించి, హారతి మరియు మంత్రోచ్ఛారణలతో పూజను ముగిస్తారు.
ఈ విధంగా, పవిత్రమైన సర్వార్థ సిద్ధి యోగం, త్రయోదశి తిథి కలయికలో జరిగే ఈ పూజా కార్యక్రమం విశేష ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/tanikella-bharani-reveals-chiranjeevi-technical-mastery-directional-skills-1803864.html</loc><lastmod>2026-04-29T09:28:35+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tanikella-bharani-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Tanikella Bharani ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tanikella-bharani-news.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి, మెగాస్టార్ చిరంజీవి గారితో తన సినీ ప్రయాణంలోని ప్రత్యేక అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో వివరించారు. భరణి చిరంజీవిని ఎటర్నల్ ఎనర్జీ అని అభివర్ణిస్తూ, ఆయన పేరులోనే ఒక మ్యాజిక్, ఒక మ్యూజిక్ ఉన్నాయని పేర్కొన్నారు. చిరంజీవి తన పేరు వెనుక ఉన్న కథను భరణికి ఒక షూటింగ్ సందర్భంలో వివరించారట. చిరంజీవి అసలు పేరు శివశంకర ప్రసాద్ అని, ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చినప్పుడు పేరు మార్పు గురించి ఆలోచిస్తున్న తరుణంలో ఒక కల వచ్చిందని ఆయన చెప్పారట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chiranjeevi-looks.jpg</image:loc><image:caption><![CDATA[ ఆ కలలో ఎవరో తనను చిరంజీవి అని పిలిచినట్టుగా అనిపించిందని, తాను ఆంజనేయస్వామి భక్తుడిని కాబట్టి, చిరంజీవుల జాబితాలో ఆంజనేయస్వామి కూడా ఉంటారని, ఈ పేరు బాగుందని తన తల్లికి చెప్పగా ఆమె కూడా సమ్మతించారని భరణి గుర్తుచేసుకున్నారు. చిరంజీవి అంటే శాశ్వతత్వం అని, అందుకే ఆ పేరు పట్ల తనకు ఎంతో ఇష్టమని చిరంజీవి చెప్పినట్టు భరణి తెలిపారు. చిరంజీవితో తనికెళ్ళ భరణికి మొదటిసారిగా తెరను పంచుకున్న అనుభవం జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రంలో. ఈ చిత్రంలోని ఒక ఫైట్ సీన్‌లో చిరంజీవిని హాకీ స్టిక్‌తో కొట్టాల్సిన సన్నివేశం ఉందని భరణి వివరించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chiranjeevi-movies.jpg</image:loc><image:caption><![CDATA[ రిహార్సల్ సమయంలో డమ్మీ హాకీ స్టిక్ విరిగిపోవడంతో, టేక్ సమయంలో చిత్ర బృందం అసలైన హాకీ స్టిక్‌ను ఇచ్చిందని భరణి ఆసక్తికరంగా చెప్పారు. ఆ సమయంలో తనకు ఎంతో టెన్షన్ కలిగిందని, ఒక చిన్న పొరపాటు జరిగినా చిరంజీవికి దెబ్బ తగిలి, షెడ్యూల్ మొత్తం దెబ్బతింటుందని ఆందోళన చెందానని ఆయన అన్నారు. అయితే, చిరంజీవి తన అద్భుతమైన టైమింగ్‌తో, తల వంచి, దెబ్బ తగలకుండా తప్పించుకున్నారని భరణి వివరించారు. ఈ సంఘటన చిరంజీవికి నటనలోని సాంకేతిక అంశాలపై ఉన్న అవగాహనను, గొప్పతనాని స్పష్టం చేసిందని భరణి కొనియాడారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chiranjeevi-news.jpg</image:loc><image:caption><![CDATA[ ఆంధ్రదేశంలో భారీ తుఫానులు, వరదలు ఉన్నప్పటికీ ఈ చిత్రం అద్భుత విజయం సాధించిందని, హైదరాబాద్‌లో ఘనంగా 100 రోజుల వేడుకను నిర్వహించారని ఆయన గుర్తుచేసుకున్నారు.తర్వాత, బిగ్ బాస్ చిత్రంలో చిరంజీవి దర్శకత్వంలో తాను నటించిన అనుభవాన్ని భరణి పంచుకున్నారు. ఈ చిత్రంలో భరణి ఒక క్రూరమైన ఎస్సై పాత్ర (యాదగిరి) పోషించారు. ఒక కీలక సన్నివేశంలో చిరంజీవి అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు, ఆయనను రెచ్చగొట్టడానికి భరణి పాత్ర ఒక మేకపిల్లను కొట్టడం, కుంటి తమ్ముడిని తన్నడం, తల్లిని తోసేయడం వంటివి చేస్తుంది. ఈ సన్నివేశం చిత్రీకరణ జరుగుతున్న సమయంలో నిర్మాత బాపినీడు గారికి దగ్గరైన ఒక మ స్నేహితుడికి గుండె సమస్య రావడంతో, చిరంజీవి డేట్స్ విషయంలో సమస్య తలెత్తింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chiranjeevi-dating.jpg</image:loc><image:caption><![CDATA[ షూటింగ్‌ను ఆపలేని పరిస్థితిలో, చిరంజీవి స్వయంగా దర్శకత్వ బాధ్యతలు స్వీకరించి, మూడు రోజుల పాటు ఫైట్ సీక్వెన్స్‌ను రూపొందించారు. భరణిని చితకబాదే ఈ సన్నివేశం ఒక హాలీవుడ్ చిత్ర స్థాయిలో ఉందని, సాంకేతిక పరిజ్ఞానంతో చిరంజీవి దీన్ని అద్భుతంగా చిత్రీకరించారని భరణి ప్రశంసించారు. ఆర్టిస్టులు కేవలం వచ్చి వేషం వేసి వెళ్లిపోతారని, కానీ నిరంతరం ప్రతీ షాట్‌ను, యాంగిల్స్‌ను గమనించినవారు మాత్రమే ఇలాంటి అద్భుతాలు చేయగలరని భరణి అన్నారు. ఈ అనుభవాల ద్వారా, చిరంజీవి అద్భుతమైన నటుడు మాత్రమే కాదు, గొప్ప దర్శకుడు కూడా అని తనికెళ్ళ భరణి పేర్కొన్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/truth-about-indian-train-engine-mileage-electric-vs-diesel-locomotive-efficiency-1803880.html</loc><lastmod>2026-04-29T09:40:23+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/train-3-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Train 3 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/train-1-2.jpg</image:loc><image:caption><![CDATA[ భారతీయ రైల్వే ఇంజిన్లు దేశానికి వెన్నెముక లాంటివి. కానీ వీటి నిర్వహణ వెనుక భారీ ఖర్చు దాగి ఉంది. ఒక కిలోమీటర్ దూరం ప్రయాణించడానికి ఒక వైపు ఎలక్ట్రిక్ ఇంజిన్ రూ. 130 ఖర్చు చేస్తే, మరోవైపు డీజిల్ ఇంజిన్ ఏకంగా రూ. 380 ఖర్చు చేస్తుంది. ఈ వ్యత్యాసాన్ని గమనించిన రైల్వే శాఖ, ఆర్థికంగా భారమైన డీజిల్ ఇంజిన్ల వినియోగాన్ని క్రమంగా తగ్గిస్తోంది. మనం రైలు ఎక్కినప్పుడు చూసే ఆ ఇంజిన్ వెనుక ఇంతటి ఇంధన గణాంకాలు ఉంటాయని చాలామందికి తెలియదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/train-2-2.jpg</image:loc><image:caption><![CDATA[ రైలు మైలేజీని నిర్ణయించే ప్రధాన అంశాల్లో అది మోసే లోడ్ ఒకటి. 24 ప్యాసింజర్ కోచ్‌లతో వెళ్లే రైలుకు ఒక రకమైన ఖర్చు అయితే, కిలోమీటర్ల పొడవు ఉండే గూడ్స్ రైళ్లకు అయ్యే ఖర్చు మరికొంత ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ రైలు కిలోమీటరుకు 20 యూనిట్ల విద్యుత్‌ను తీసుకుంటుంది. అదే గూడ్స్ విషయానికి వస్తే ఈ విద్యుత్ వినియోగం డబుల్ అవుతుంది. బరువు పెరిగే కొద్దీ ఇంజిన్ మీద ఒత్తిడి పెరిగి మైలేజీ తగ్గుతుంది. అందుకే రైళ్ల వేగం, లోడ్ మధ్య సమతుల్యత పాటించడం లోకో పైలట్లకు ఒక పెద్ద సవాలు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/train-6.jpg</image:loc><image:caption><![CDATA[ డీజిల్ ఇంజిన్ చూడటానికి శక్తివంతంగా ఉన్నా, ఇంధన పరంగా ఇది చాలా ఖరీదైనది. ఒక కిలోమీటర్ నడవడానికి 4 నుంచి 6 లీటర్ల డీజిల్ తాగేస్తుందంటే దీని సామర్థ్యం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు ప్రతిచోటా డీజిల్ ఇంజిన్లే రాజ్యమేలేవి, కానీ ఇప్పుడు కొన్ని ఎలక్ట్రిఫికేషన్ జరగని రూట్లకు మాత్రమే వీటిని పరిమితం చేశారు. డీజిల్ లోకోల వల్ల కేవలం ఖర్చు మాత్రమే కాదు, వాతావరణ కాలుష్యం కూడా పెరుగుతుంది. పాత కాలపు ఈ ఇంజిన్లు త్వరలోనే మనకు కేవలం మ్యూజియాల్లో మాత్రమే కనిపించే అవకాశం ఉంది. వీటి నిర్వహణ వ్యయం తగ్గించుకోవడమే భారతీయ రైల్వే ప్రధాన లక్ష్యం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/train-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఆధునిక భారతీయ రైల్వేల ఆశాదీపం ఈ ఎలక్ట్రిక్ ఇంజిన్లు. ఇంజిన్ ఒక కిలోమీటర్ ప్రయాణానికి కేవలం రూ. 130 మాత్రమే ఖర్చు చేస్తుంది, ఇది డీజిల్ ఇంజిన్‌తో పోలిస్తే ఎంతో తక్కువ. డీజిల్ లోకో పైలట్లకు ఇంధనం ఆదా చేస్తే రివార్డులు కూడా ఇచ్చేవారట, అంతగా ఇంధనం ప్రాముఖ్యత పొందింది. ఎలక్ట్రిక్ లోకోలు రావడంతో ఆ ఖర్చు ఆదా అవ్వడమే కాకుండా, ప్రయాణం కూడా నిశ్శబ్దంగా, వేగంగా సాగుతోంది. రైల్వే లైన్ల పైన ఈ విద్యుత్ తీగలు మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి పోస్తున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలనే రైల్వే వ్యూహానికి ఇవే కీలకం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/train-4.jpg</image:loc><image:caption><![CDATA[ చివరగా, భారతీయ రైల్వేలు సాంకేతికతను అందిపుచ్చుకుంటూ మైలేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం వెతుకుతున్నాయి. రైల్వే నెట్‌వర్క్ అంతా విద్యుత్‌తో అనుసంధానం అవుతుంటే, డీజిల్ వల్ల వచ్చే కాలుష్యం, భారీ ఖర్చు మటుమాయం అవుతాయి. మన ప్రయాణం సురక్షితంగా, చవకగా ఉండాలంటే ఈ మార్పు తప్పనిసరి. ఎలక్ట్రిక్ ఇంజిన్లు కేవలం డబ్బును మాత్రమే కాదు, పర్యావరణాన్ని కూడా కాపాడుతున్నాయి. అందుకే ఇప్పుడు మనం ప్రయాణించే రైళ్లలో ఎక్కువ భాగం ఎలక్ట్రిక్ ఇంజిన్లే కనిపిస్తున్నాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/venus-transit-in-rohini-nakshatra-these-4-zodiac-signs-may-experience-billionaire-yoga-1803867.html</loc><lastmod>2026-04-29T09:09:06+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/venus-transit-rohini-nakshatra-2026.jpg</image:loc>
					<image:title><![CDATA[ Venus Transit Rohini Nakshatra 2026 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rashifal-9.jpg</image:loc><image:caption><![CDATA[ రోహిణి నక్షత్రంలో శుక్రుని సంచారం జ్యోతిష్య శాస్త్రంలో ముఖ్యమైన పరిణామంగా భావించబడుతుంది. నవగ్రహాలలో సంపద, సౌందర్యం, సుఖసౌకర్యాలకు అధిపతిగా పరిగణించే శుక్రుడు నిర్దిష్ట కాల వ్యవధుల్లో రాశులు, నక్షత్రాలను మారుస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శుక్రుడు చంద్రుడి అధీనంలోని రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించడం శుభప్రదంగా చెప్పబడుతుంది. ఈ సంచారం మే 8 వరకు కొనసాగి, అనంతరం మృగశిర నక్షత్రంలోకి మారుతుంది. చంద్రుని ప్రభావం ఉన్న రోహిణిలో శుక్రుని సంచారం కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా అనుకూల ఫలితాలను ఇస్తుందని విశ్వసిస్తారు. ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వారికి ఈ కాలం శుభప్రదంగా ఉండే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rashifal2-9.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభ రాశి.. 
ఈ సమయంలో వృషభ రాశి వారికి ఆర్థికంగా మంచి పురోగతి కనిపిస్తుంది. స్థిరమైన ఆదాయ మార్గాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. జీవితంలో సంతోషం పెరుగుతుంది. ఇంతవరకు ఎదురైన సమస్యలు క్రమంగా తగ్గుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు చేపట్టిన పనులను పూర్తి చేసి విజయాన్ని అందుకుంటారు. సమాజంలో గౌరవం, ప్రతిష్ట పెరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rashifal3-8.jpg</image:loc><image:caption><![CDATA[ సింహ రాశి.. 
సింహరాశి వారికి ఈ సంచారం అనేక విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. పూర్వీకుల ఆస్తుల ద్వారా ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. జీవన ప్రమాణం మెరుగుపడుతుంది. అద్దె ఇళ్లలో ఉన్నవారు సొంత ఇల్లు గురించి ఆలోచించే స్థితికి చేరుకుంటారు. ఉద్యోగంలో అభివృద్ధి, కొత్త బాధ్యతలు, అసంపూర్తి పనుల పూర్తి వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో శాంతి, ఆనందం నెలకొంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rashifal4-8.jpg</image:loc><image:caption><![CDATA[ తులా రాశి.. 
తులారాశి వారికి శుక్రుడు అధిపతి కావడంతో ఈ సంచారం మరింత శుభప్రదంగా ఉంటుంది. వ్యక్తిత్వంలో ఆకర్షణ పెరుగుతుంది. విలాసవంతమైన జీవనం వైపు అడుగులు పడతాయి. ఆర్థికంగా స్థిరత్వం పెరుగుతుంది. వృత్తి పరంగా అభివృద్ధి కనిపిస్తుంది. కుటుంబంలో కలహాలు తగ్గి సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. శుభవార్తలు వినే అవకాశం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rashifal5-9.jpg</image:loc><image:caption><![CDATA[ కుంభ రాశి.. 
కుంభరాశి వారికి ఈ కాలం అవకాశాలతో నిండినదిగా ఉంటుంది. వ్యాపారం, ఉద్యోగ రంగాలలో పురోగతి కనిపిస్తుంది. పాత అప్పుల నుండి ఉపశమనం పొందే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. కొత్త అవకాశాలు, అదనపు సంపాదన మార్గాలు కనిపిస్తాయి. ప్రైవేట్ ఉద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు రావచ్చు. జీతాల పెంపు వంటి శుభవార్తలు అందుతాయి. కుటుంబ, వ్యక్తిగత జీవితంలో సంతోషం పెరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rashifal6-4.jpg</image:loc><image:caption><![CDATA[ మొత్తంగా, రోహిణి నక్షత్రంలో శుక్రుని సంచారం సుఖసంపదలు, ఆర్థికాభివృద్ధి, సంబంధాల్లో సామరస్యం తీసుకువచ్చే కాలంగా పరిగణించవచ్చు. అయితే వ్యక్తిగత జాతకంలోని గ్రహస్థితులను బట్టి ఫలితాలు మారవచ్చని గుర్తుంచుకోవాలి. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/washing-machine-hacks-clean-unexpected-items-beyond-clothes-for-a-sparkling-home-1803798.html</loc><lastmod>2026-04-29T07:31:02+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/washing-machine-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Washing Machine ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/washing-machine-4.jpg</image:loc><image:caption><![CDATA[ షవర్ కర్టెన్లు : స్నానాల గదిలోని షవర్ కర్టెన్లు రోజూ నీటితో తడిసినప్పటికీ, వాటిపై మురికి, ఫంగస్, సబ్బు మరకలు పేరుకుపోతాయి. మీ షవర్ కర్టెన్ నైలాన్ లేదా కోటెడ్ ఫ్యాబ్రిక్‌తో తయారైనట్లయితే, దానిని నిరభ్యంతరంగా వాషింగ్ మెషీన్‌లో వేయవచ్చు. వీటిని ఉతకడానికి ముందు కొద్దిగా బేకింగ్ సోడా, వెనిగర్ ఉపయోగిస్తే మురికి వదలడమే కాకుండా కర్టెన్లు తళతళలాడుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/washing-machine-3.jpg</image:loc><image:caption><![CDATA[ బ్యాక్‌ప్యాక్‌లు: స్కూల్ పిల్లల బ్యాగుల నుండి ఆఫీసు బ్యాగుల వరకు దుమ్ము, చెమట వల్ల దుర్వాసన వస్తుంటాయి. వీటిని చేత్తో ఉతకడం చాలా కష్టం. కాబట్టి వీటని కూడా మనం వాషింగ్ మిషన్‌లో వేసి ఉతకొచ్చు. ఇందుకోసం ముందుగా బ్యాగ్‌ని ఖాళీ చేసి దుమ్మును పూర్తిగా దులపండి. తర్వాత బ్యాగ్‌ను ఒక లాండ్రీ బ్యాగ్‌లో ఉంచి, వాషింగ్ మిషన్‌ను జెంటిల్ మోడ్ లో ఉంచి తక్కువ డిటర్జెంట్‌తో ఉతికితే బ్యాగ్ కొత్తదానిలా మెరుస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/washing-machine-2.jpg</image:loc><image:caption><![CDATA[ పెంపుడు జంతువుల కాలర్లు : మనం పెంచుకునే కుక్కలు లేదా పిల్లుల మెడలో వేసే కాలర్లు త్వరగా మురికిగా మారి బ్యాక్టీరియాకు నిలయమవుతాయి. అయితే ఈ ఫ్యాబ్రిక్ కాలర్లను కూడా మనం వాషింగ్ మెషీన్‌లో సులభంగా శుభ్రం చేయవచ్చు. అయితే వీటిని ఉతికేప్పుడు మెటల్ బకిల్స్ మెషీన్‌కు తగలకుండా జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/washing-machine-1.jpg</image:loc><image:caption><![CDATA[ తట్టు బ్యాగులు: ఈ మధ్య కాలంలో చాలా మంది పర్యావరణం కోసం తట్టు సంచులను వాడుతున్నారు. వీటిలోనే కూరగాయలు, నిత్యావసరాలు సరుకులను తీసుకొస్తున్నారు. అయితే వీటిని ఎక్కువగా వాడడం వల్ల బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంది. కాబట్టి వీటిని లోపలి వైపునకు తిప్పి, తేలికపాటి డిటర్జెంట్‌తో మెషీన్‌లో వేస్తే క్రిములు నశిస్తాయి. అలాగే బ్యాగ్‌లు కూడా శుభ్రంగా మారుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/washing-machine.jpg</image:loc><image:caption><![CDATA[ యోగా మ్యాట్‌లు: వ్యాయామం చేసేటప్పుడు వచ్చే చెమట వల్ల యోగా మ్యాట్‌లు త్వరగా మురికిగా మారుతాయి. మీ యోగా మ్యాట్ వాటర్-ఫ్రెండ్లీ మెటీరియల్ అయితే, దానిని చల్లటి నీటిలో జెంటిల్ సైకిల్‌లో ఉతకండి. అయితే ఉతికేప్పుడు కఠినమైన రసాయనాలు లేదా ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నర్‌లను వాడకండి, ఎందుకంటే ఇది మ్యాట్ గ్రిప్‌ను పాడు చేయవచ్చు. అయితే, ఏ వస్తువునైనా మెషీన్‌లో వేసే ముందు దానిపై ఉన్న వాష్ కేర్ లేబుల్ ను ఒకసారి తనిఖీ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. (Note : పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్ నుంచి సేకరించి సమాచారం మేరకు అందించబడినవి.. వీటిని Tv9 దృవీకరించడ లేదు) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/korean-skin-care-secret-how-to-make-rice-gel-at-home-for-glowing-skin-1803765.html</loc><lastmod>2026-04-29T07:00:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/glowing-skin.jpg</image:loc>
					<image:title><![CDATA[ Glowing Skin ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rice-water-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ సమ్మర్‌లో చాలా మంది ఎదుర్కొనే ప్రధాన సమస్య ముఖం నల్లగా మారడం. ఎండవల్ల చర్మం త్వరగా నల్లగా మారుతుంది. ఇలా ఎండ వల్ల మీరు కోల్పోయిన కాంతిని తిరిగి పొందాలన్నా, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలన్నా ఇంట్లో ఉండే రైస్ వాటర్ అద్భుతంగా పనిచేస్తుంది. రైస్ వాటర్‌లో చర్మ సౌందర్యానికి అనుకూలమైన అనేక పోషకాలు ఉంటాయి. ఇవి చర్మానికి తేమను అందించి, మచ్చలను తొలగించి, చర్మాన్ని మృదువుగా చేస్తాయి. కాబట్టి రైస్‌ వాటర్ ఫేస్‌ ప్యాక్‌ ముఖాన్ని ఎలా మెరిపించుకోవాలో చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rice-water-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ రైస్‌ వాటర్‌లో కొన్ని పదార్థాలను కలపి జల్‌లా తయారు చేసి వాడితే చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చు. ఈ ఫేస్‌ ప్యాక్‌ కోసం మనకు కావాల్సిన పదార్థాలు  ½ కప్పు పచ్చి తెల్ల బియ్యం,1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్,  గ్రీన్ టీ: 2 టేబుల్ స్పూన్లు,   తేనె: 1 టీస్పూన్,  విటమిన్ E క్యాప్సూల్: 1, గ్లిజరిన్: ½ టీస్పూన్ , ఫర్మెంటెడ్ రైస్ వాటర్: 1 టేబుల్ స్పూన్ , కీరదోస రసం: 1 టేబుల్ స్పూన్ ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rice-water-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ రైస్ జెల్ తయారీ విధానం: రైస్ వాటర్  జెల్‌ తయారు చేసుకునేందుకు ముందుగా బియ్యాన్ని రెండుసార్లు శుభ్రంగా కడగాలి. తర్వాత రెండు కప్పుల నీటిలో 15 నిమిషాల పాటు ఉడికించాలి. నీరు తెల్లగా పాల రంగులో మారే వరకు ఉడికించాలి. ఉడికిన మిశ్రమాన్ని చల్లార్చిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. ఈ పేస్ట్‌ను ఒక పలచని వస్త్రం లేదా జల్లెడ సహాయంతో వడకట్టాలి. ఆ తర్వాత వచ్చిన మిశ్రమాన్ని 30 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rice-water-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ పేస్ట్ చిక్కబడిన తర్వాత, అందులో అలోవెరా జెల్, గ్రీన్ టీ, తేనె, విటమిన్ E ఆయిల్, గ్లిజరిన్, రైస్ వాటర్, కీరదోస రసం వేసి బాగా కలపాలి. ఇలా తయారైన రైస్ జెల్‌ను ఒక శుభ్రమైన గాజు సీసాలో భద్రపరుచుకోండి. దీనిని ఫ్రిజ్‌లో ఉంచితే వారం రోజుల పాటు వాడుకోవచ్చు. అయితే ఈ జల్‌ రాసుకునేప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rice-water-7.jpg</image:loc><image:caption><![CDATA[ రైస్ వాటర్ జల్‌ ఎలా ఉపయోగించాలి?: జెల్ రాసుకునే ముందు ముఖాన్ని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. జెల్‌ను ముఖంపై రాసి, వేళ్లతో సున్నితంగా రాసుకోవాలి. ఆ తర్వాత సన్‌స్క్రీన్ లేదా నైట్ క్రీమ్ రాసుకోవచ్చు.రాత్రి పడుకునే ముందు ఈ జెల్ రాసుకోవడం చాలా మంచిది. ఇది రాత్రంతా చర్మం లోపలి పొరల్లోకి వెళ్లి పనిచేస్తుంది. దీనిని ప్రతిరోజూ రాత్రి పూట వాడవచ్చు. మీ చర్మం మరీ పొడిగా ఉంటే రోజుకు రెండుసార్లు కూడా ఉపయోగించవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/jeera-water-vs-fennel-water-for-diabetes-which-one-lowers-blood-sugar-faster-1803773.html</loc><lastmod>2026-04-29T06:46:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/cumin-vs-fennel-water-for-diabetes-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Cumin Vs Fennel Water For Diabetes ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/cumin-vs-fennel-water-for-diabetes-1.jpg</image:loc><image:caption><![CDATA[ జీలకర్ర కేవలం రుచి కోసమే కాదు, అది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. జీలకర్రలోని థైమోక్వినోన్, క్యూమినాల్డిహైడ్ అనే సమ్మేళనాలు క్లోమాన్ని ఉత్తేజపరిచి, సహజంగా ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగేలా చేస్తాయి. మూడు నెలల సగటు చక్కెర స్థాయిని తగ్గించడంలో జీలకర్ర నీరు తిరుగులేని ఫలితాలను ఇస్తుందని ప్రయోగశాల పరీక్షల్లో తేలింది. ఇది మనం తిన్న ఆహారం నుంచి చక్కెర అకస్మాత్తుగా రక్తంలో కలవకుండా నియంత్రిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/cumin-vs-fennel-water-for-diabetes-3.jpg</image:loc><image:caption><![CDATA[ మరోవైపు సోంపు నేరుగా కాకుండా పరోక్షంగా రక్తంలోని చక్కెర స్థాయిలపై ప్రభావం చూపుతుంది. శరీరంలోని అంతర్గత మంట వల్ల ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. సోంపులోని అనెథోల్ ఈ మంటను తగ్గించి కణాలు ఇన్సులిన్‌ను గ్రహించేలా చేస్తుంది. సోంపు నీరు తాగడం వల్ల మాటిమాటికీ ఆకలి వేయడం, తీపి పదార్థాల మీద కోరిక కలగడం తగ్గుతుంది. దీనివల్ల బరువు అదుపులో ఉండి మధుమేహం నియంత్రణ సులభమవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/cumin-vs-fennel-water-for-diabetes-2.jpg</image:loc><image:caption><![CDATA[ శాస్త్రీయంగా చూస్తే.. రక్తంలోని చక్కెర స్థాయిలను నేరుగా తగ్గించడంలో జీలకర్ర నీరు సోంపు కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది. ఇది నేరుగా జీవక్రియ మార్గంపై ప్రభావం చూపి, గ్లూకోజ్ స్థాయిలను అదుపు చేస్తుంది. అయితే ఎసిడిటీ సమస్యలు ఉన్నవారికి సోంపు నీరు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది కడుపును చల్లబరచడమే కాకుండా శరీరం నుండి విష పదార్థాలను తొలగించడంలో సహాయపడి పరోక్షంగా చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/cumin-vs-fennel-water-for-diabetes-7.jpg</image:loc><image:caption><![CDATA[ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ రెండింటి మధ్య సమతుల్యత పాటించడం మంచిది. జీవక్రియను పెంచుకోవడానికి ఉదయాన్నే పరగడుపున జీలకర్ర నీరు తాగడం ప్రయోజనకరం. అలాగే రోజంతా అలసట నుండి ఉపశమనం పొందడానికి లేదా భారీ భోజనం తర్వాత చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నివారించడానికి సోంపు నీటిని కొద్దికొద్దిగా సేవించడం మంచి ఫలితాలను ఇస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/cumin-vs-fennel-water-for-diabetes-4.jpg</image:loc><image:caption><![CDATA[ సీజన్స్ బట్టి కూడా వీటి వినియోగంలో మార్పులు చేసుకోవాలి. ఎండాకాలంలో శరీరాన్ని చల్లబరిచే గుణం ఉన్న సోంపు నీరు ఉత్తమమైన ఎంపిక, ఇది ఎసిడిటీని కూడా తగ్గిస్తుంది. వర్షాకాలం లేదా చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే జీలకర్ర నీరు శరీరాన్ని వెచ్చగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. మధుమేహం నియంత్రణలో ఇవి కీలక పాత్ర పోషించినప్పటికీ, ఏదైనా కొత్త అలవాటును ప్రారంభించే ముందు మీ శరీర తత్వాన్ని బట్టి వైద్యుడిని సంప్రదించడం మర్చిపోవద్దు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/do-not-waste-the-peel-5-brilliant-ways-to-use-fruit-and-vegetable-skins-for-health-1803718.html</loc><lastmod>2026-04-28T21:36:11+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/fruit-peel-nutrition-and-benefits-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Fruit Peel Nutrition And Benefits ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/fruit-peel-nutrition-and-benefits.jpg</image:loc><image:caption><![CDATA[ నారింజ తొక్కలతోమిఠాయిలు: నారింజ తొక్కలను పారేయకుండా వాటితో అద్భుతమైన డెజర్ట్స్ తయారు చేసుకోవచ్చు. నారింజ తొక్కలు, నిమ్మరసం, పంచదార కలిపి ఉడికిస్తే రుచికరమైన మార్మలేడ్ సిద్ధమవుతుంది. తొక్కలను చిన్న ముక్కలుగా కోసి పంచదార ద్రావణంలో ఉడికిస్తే క్యాండీడ్ ఆరెంజ్ పీల్ అనే మిఠాయి రెడీ అవుతుంది. ఈ ప్రక్రియలో లభించే ఆరెంజ్ సిరప్‌ను డ్రింక్స్‌లో ఫ్లేవర్‌గా వాడుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/fruit-peel-nutrition-and-benefits-1.jpg</image:loc><image:caption><![CDATA[ పైనాపిల్ తొక్కతో మెక్సికన్ డ్రింక్ టెపాచే: పైనాపిల్ బయటి భాగం గరుకుగా ఉండి తినడానికి వీలుండదు. కానీ దానితో ఒక అద్భుతమైన పానీయం తయారు చేయవచ్చు. పైనాపిల్ తొక్కను, లోపలి కాండాన్ని నీరు, చక్కెర కలిపి 24-36 గంటల పాటు పులియబెట్టాలి. ఇలా తయారైన పానీయంలో ప్రోబయోటిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/fruit-peel-nutrition-and-benefits-2.jpg</image:loc><image:caption><![CDATA[ అల్లం తొక్కతో ఔషధ గుణాలు: చాలామంది అల్లాన్ని పూర్తిగా గీకి వాడుతుంటారు. కానీ అల్లం పొట్టులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అల్లం తొక్కలను సూప్‌లలో వేయవచ్చు లేదా నీటిలో మరిగించి రసంలా తీసుకోవచ్చు. తొక్కలను ఎండబెట్టి, పొడి చేసి టీ పొడిలో కలిపి వాడుకుంటే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/fruit-peel-nutrition-and-benefits-3.jpg</image:loc><image:caption><![CDATA[ గుమ్మడి తొక్కలతో కరకరలాడే చిప్స్: గుమ్మడికాయ తొక్కలు, విత్తనాలు అత్యంత పోషక విలువలు కలిగినవి. కేరళలో వీటిని ఎండబెట్టి నిల్వ చేయడం ఒక ప్రాచీన సంప్రదాయం. గుమ్మడి తొక్కలను ఉప్పు, కారం, మసాలాలు కలిపి నూనెలో వేయించినా లేదా ఎయిర్ ఫ్రైయర్‌లో బేక్ చేసినా రుచికరమైన చిప్స్ తయారవుతాయి. వీటిని సూప్‌ల పైన గార్నిష్‌గా కూడా వాడవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/fruit-peel-nutrition-and-benefits-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఉల్లిపొట్టుతో బట్టలకు సహజ రంగులు: వంటలో వాడే ఉల్లిపాయ పొట్టుతో బట్టలకు రంగు వేయవచ్చని మీకు తెలుసా? ఉల్లిపొట్టును నీటిలో వేసి బాగా మరిగిస్తే ముదురు నారింజ రంగు ద్రావణం వస్తుంది. ఇందులో పత్తి బట్టలను నానబెట్టడం వల్ల వాటికి అందమైన రంగు వస్తుంది. ఉల్లిపొట్టులో ఉండే టానిన్ రంగు బట్టలకు గట్టిగా అంటుకోవడానికి సహాయపడుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/epfo-simplifies-kyc-update-basic-details-on-uan-portal-to-avoid-pf-claim-rejection-1803675.html</loc><lastmod>2026-04-28T20:31:13+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/epfo-2-9.jpg</image:loc>
					<image:title><![CDATA[ Epfo 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/epfo-1-8.jpg</image:loc><image:caption><![CDATA[ ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకున్న EPFO, KYC వివరాలు, ఇతర ప్రాథమిక సమాచారాన్ని అప్‌డేట్ చేసే ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ఈ కొత్త డిజిటల్ విధానం ద్వారా, సభ్యులు ఇప్పుడు UAN పోర్టల్‌లోనే తమ వివరాలను సరిచేసుకోవచ్చు. ఈ మార్పుల ప్రధాన ఉద్దేశ్యం PF క్లెయిమ్ తిరస్కరణలను తగ్గించడం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/health-insurance-claim.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పటివరకు ఆధార్ డేటా, EPF రికార్డుల మధ్య చిన్నపాటి తేడాల కారణంగా అనేక దరఖాస్తులు తిరస్కరించబడుతున్నాయి. పేరు, పుట్టిన తేదీ లేదా లింగంలో చిన్న తప్పులు ఉన్నా, సిస్టమ్ ఆటోమేటిక్‌గా క్లెయిమ్‌ను తిరస్కరించే పరిస్థితి ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/epfo-2-10.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు ఈ సమస్యలకు చెక్ పెట్టేలా EPFO డిజిటల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. సభ్యులు కేవలం కొన్ని దశల్లోనే తమ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. ముందుగా UAN పోర్టల్‌లో లాగిన్ అయి, ‘Manage’ సెక్షన్‌లో ‘Modify/Change Basic Details’ ఎంపికను ఎంచుకోవాలి. తర్వాత ఆధార్‌కు సరిపోయే విధంగా వివరాలను నమోదు చేసి, అప్‌డేట్ చేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/epfo-4-10.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ సమాచారం UIDAI ద్వారా ధృవీకరించబడుతుంది. అయితే ఈ మార్పులకు యజమాని ఆమోదం అవసరం ఉంటుంది. యజమాని ఆన్‌లైన్‌లో ఆమోదించిన వెంటనే, నవీకరించిన వివరాలు EPF ఖాతాలో కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో బ్యాంక్ ఖాతా వివరాలు, IFSC అప్‌డేట్‌లను యజమాని అనుమతి లేకుండానే సవరించుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/epfo-5-7.jpg</image:loc><image:caption><![CDATA[ నిపుణుల సూచన ప్రకారం పూర్తి KYC అప్‌డేట్ చాలా ముఖ్యమైనది. ఆధార్‌ను PANతో లింక్ చేయడం, బ్యాంక్ వివరాలను సరిగ్గా నమోదు చేయడం వంటి అంశాలు PF ఉపసంహరణను సులభతరం చేస్తాయి. మొత్తానికి EPFO తీసుకొచ్చిన ఈ డిజిటల్ మార్పులు ఉద్యోగులకు పెద్ద ఊరటగా మారనున్నాయి. వేగవంతమైన ప్రాసెసింగ్, తక్కువ తిరస్కరణలు, సులభమైన క్లెయిమ్ ప్రక్రియతో PF సేవలు మరింత పారదర్శకంగా మారుతున్నాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/roja-selvamani-daughter-anshumalika-completed-graduation-from-america-indiana-university-see-photos-1803625.html</loc><lastmod>2026-04-28T20:11:04+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/roja-daughter.jpg</image:loc>
					<image:title><![CDATA[ Roja Daughter ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/roja-daughter-1.jpg</image:loc><image:caption><![CDATA[ సీనియర్ నటి, మాజీ మంత్రి రోజా సెల్వమణి కుమార్తె అన్షు మాలిక గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.  చిన్నప్పటి నుంచే చదువులో చురుకుగా ఉంటోన్న ఈ స్టార్ కిడ్ ఇప్పుడు తన కెరీర్ లో మరో ముందడుగు వేసింది. కంప్యూటర్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/roja-daughter-2.jpg</image:loc><image:caption><![CDATA[ అమెరికాలోని ప్రతిష్టాత్మక ఇండియానా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంది అన్షు. అంతేకాదు ఆ యూనివర్సిటీ నుంచి ఏటా ఒక స్టూడెంట్ కు  మాత్రమే అందించే ‘హెర్మన్ బి వెల్స్’ (2026) అవార్డు కూడా అందుకుంది. అంతేకాదు యూనివర్సిటీ నుంచి పలు అవార్డులు, స్కాలర్‌ షిప్స్ కూడా అందుకుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/roja-daughter-3.jpg</image:loc><image:caption><![CDATA[ కాగా అన్షు మాలిక గ్రాడ్యుయేషన్ సెర్మనీలో రోజా, సెల్వమణి కూడా పాల్గొన్నారు. ఈ మేరకు యూనివర్సిటీ చివరి రోజులు అంటూ తన ప్రొఫెసర్స్, ఫ్రెండ్స్ తో దిగిన పలు ఫోటోలను అన్షు మాలిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/roja-daughter-4.jpg</image:loc><image:caption><![CDATA[ వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు రోజా కూతురికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ఇండిచాపా యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు  కోడింగ్, వెబ్ డెవలప్‌మెంట్ వంటి అంశాలతో పాటు &#039;ఆర్ట్ ఫర్ ఎ కాజ్&#039; ద్వారా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంది రోజా కూతురు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/roja-daughter-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ క్రమంలోనే ప్రతిష్ఠాత్మక హెర్మన్ బి వెల్స్ అవార్డుకు ఎంపికైంది అన్షు. ఈ అవార్డు అందుకున్న వారి పేర్లఇండియానా మెమోరియల్ యూనియన్‌లో శాశ్వతంగా ప్రదర్శించబడుతుంది. యూనివర్సిటీ తరఫున ఏటా ఒక విద్యార్థిని మాత్రమే ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/roja-daughter-6.jpg</image:loc><image:caption><![CDATA[ కాగా అన్షు రైటర్ గా కూడా సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఆమె ఇప్పటికే పలు పుస్తకాలు కూడా రాసింది. అలాగే అంతర్జాతీయ వేదికలపై ర్యాంప్ వాక్ లు కూడా చేసింది.  కాగా కంప్యూటర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అన్షు గొప్ప శాస్త్రవేత్త కావాలని కలలు కంటోంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/watermelon-safety-alert-why-sun-exposed-watermelons-can-be-toxic-this-summer-1803621.html</loc><lastmod>2026-04-28T20:01:27+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/how-to-identify-a-rotten-watermelon-2-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ How To Identify A Rotten Watermelon ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/how-to-identify-a-rotten-watermelon-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఎండలో ఉంచిన పుచ్చకాయ ఎందుకు విషంగా మారుతుంది: పుచ్చకాయలో సహజంగానే చక్కెరలు, నీరు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల వేడికి ఇది త్వరగా స్పందిస్తుంది. బయట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటినప్పుడు, పండు లోపల కూడా వేడి పెరుగుతుంది. ఈ వేడికి లోపల ఉండే చక్కెరలు పులియడం ప్రారంభిస్తాయి. దీనివల్ల పండు లోపల వాయువులువిడుదలవుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/how-to-identify-a-rotten-watermelon-3.jpg</image:loc><image:caption><![CDATA[ లోపల నురుగు: మీరు పుచ్చకాయను కట్ చేసినప్పుడు లోపల నురుగు రావడం లేదా సబ్బు నీళ్లలా అనిపించడం గమనించారా? అంటే ఆ పండు లోపల తీవ్రమైన ఫర్మెంటేషన్ జరిగిందని అర్థం. ఇది పాడైపోయిన పండుకు సంకేతం. పండు కట్ చేయగానే పుల్లటి లేదా ఘాటైన వాసన వస్తే అది పూర్తిగా విషతుల్యమైనట్లు భావించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/how-to-identify-a-rotten-watermelon-4.jpg</image:loc><image:caption><![CDATA[ బ్యాక్టీరియా ముప్పు: పుచ్చకాయలు నేలపై పెరిగే పాదుల ద్వారా వస్తాయి. వీటి తొక్కపై సాధారణంగానే సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియాలు ఉంటాయి. ఎండలో ఎక్కువసేపు ఉండటం వల్ల పండు పైతొక్క బలహీనపడి, చిన్నపాటి చీలికలు ఏర్పడతాయి.  ఈ కంటికి కనిపించని రంధ్రాల ద్వారా బ్యాక్టీరియా లోపలికి ప్రవేశించి రసాన్ని కలుషితం చేస్తుంది. ఫలితంగా ఫుడ్ పాయిజనింగ్ జరిగి తీవ్రమైన వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, డీహైడ్రేషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. కొన్నిసార్లు ఇది ప్రాణాపాయానికి కూడా దారితీయవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/how-to-identify-a-rotten-watermelon-2.jpg</image:loc><image:caption><![CDATA[ మంచి పుచ్చకాయను ఎలా గుర్తుపట్టాలి: మీరు మార్కెట్‌లో పుచ్చకాయ కొనేటప్పుడు కొన్ని టిప్స్ పాటించండి. పండు ఒకవైపు పసుపు లేదా క్రీమ్ రంగులో మచ్చ ఉండాలి. అది నేల మీద ఉండి బాగా పండిందని అర్థం. తెల్లగా ఉంటే అది పచ్చిదని, రుచి ఉండదని గుర్తు. పండును తట్టినప్పుడు డబ్ డబ్ అని ఖాళీగా ఉన్నట్లు శబ్దం రావాలి. ఒకవేళ మొద్దుబారినట్లు శబ్దం వస్తే అది లోపల మెత్తబడి పాడైపోయిందని అర్థం. పుచ్చకాయ తొడిమ ఎండిపోయి ఉంటే అది సహజంగా పండినట్లు. పచ్చగా ఉంటే దాన్ని ముందే కోసేశారని అర్థం. చిన్నగా ఉన్నా బరువు ఎక్కువగా ఉన్న పండును ఎంచుకోండి. అందులో రసం ఎక్కువగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/how-to-identify-a-rotten-watermelon.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంట్లో పాటించాల్సిన జాగ్రత్తలు: తప్పనిసరిగా కడగాలి: మార్కెట్ నుంచి తెచ్చిన పుచ్చకాయను కట్ చేసే ముందు ఉప్పు నీటితో లేదా పంపు కింద బాగా కడగాలి. దీనివల్ల తొక్కపై ఉండే బ్యాక్టీరియా లోపలికి వెళ్లదు. కట్ చేసిన ముక్కలను గది ఉష్ణోగ్రత వద్ద రెండు గంటల కంటే ఎక్కువ ఉంచకూడదు. ఫ్రిజ్‌లో పెడితే గాలి చొరబడని డబ్బాలో ఉంచి 24 గంటల్లోపు తినేయాలి. పుచ్చకాయ తిన్న వెంటనే గ్లాసుల కొద్దీ నీరు తాగితే జీర్ణ ప్రక్రియ దెబ్బతింటుంది. కొద్దిసేపు ఆగి తాగడం మేలు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cricket-photos/vaibhav-sooryavanshi-t20-cricket-world-record-ipl-2026-performance-1803585.html</loc><lastmod>2026-04-28T19:38:44+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gt-vs-rr-vaibhav-sooryavanshi.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gt Vs Rr Vaibhav Sooryavanshi ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vaibhav-suryavanshi-records-4.jpg</image:loc><image:caption><![CDATA[ భారత క్రికెట్ ఆకాశంలో మరో ధ్రువతార ఉదయించింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే బీహార్ యువ కెరటం వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభతో ప్రపంచ క్రికెట్‌ను తనవైపు తిప్పుకున్నాడు. అంతర్జాతీయ దిగ్గజాలకు సైతం సాధ్యం కాని రీతిలో, అతిచిన్న వయసులోనే టీ20 క్రికెట్‌లో కనీవినీ ఎరుగని రికార్డులను తిరగరాస్తూ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్‌గా గుర్తింపు పొందాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vaibhav-suryavanshi-records-3.jpg</image:loc><image:caption><![CDATA[ టీ20 క్రికెట్ చరిత్రలో టీనేజర్‌గా అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రహ్మానుల్లా గుర్బాజ్ పేరిట ఉండేది. గుర్బాజ్ 52 ఇన్నింగ్స్‌లలో 90 సిక్సర్లు కొట్టగా, వైభవ్ కేవలం 26 ఇన్నింగ్స్‌లలోనే 94 సిక్సర్లతో ఆ రికార్డును అధిగమించాడు. 200కు పైగా స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ ఈ ఘనత సాధించడం విశేషం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vaibhav-suryavanshi-records-2.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న వైభవ్ తన బ్యాట్‌తో విరుచుకుపడుతున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 36 బంతుల్లోనే శతకం బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఆయన 12 భారీ సిక్సర్లు బాదాడు. తద్వారా ఒక ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారతీయుడిగా మురళీ విజయ్ రికార్డును చెరిపివేశాడు. 40 బంతుల కంటే తక్కువ వ్యవధిలో రెండు సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా ఆయన నిలిచాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vaibhav-suryavanshi-records-1.jpg</image:loc><image:caption><![CDATA[ సిక్సర్లతోనే కాకుండా, పరుగుల వేటలోనూ వైభవ్ సరికొత్త మైలురాయిని అందుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన ప్రపంచ బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. కేవలం 473 బంతుల్లోనే ఆయన ఈ ఘనతను సాధించాడు. గతంలో ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ ఓవెన్ 533 బంతుల్లో చేసిన రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. బీహార్‌కు చెందిన ఈ చిన్నారి ఆటగాడు తన విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించడమే కాకుండా, భవిష్యత్తులో భారత జట్టుకు వెన్నెముకగా మారతారని విశ్లేషకులు భావిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vaibhav-suryavanshi-records.jpg</image:loc><image:caption><![CDATA[ వైభవ్ సూర్యవంశీ సాధించిన ఈ విజయాలు కేవలం రికార్డులు మాత్రమే కావు, ఆయనలోని అంకితభావానికి నిదర్శనం. అతిచిన్న వయసులోనే ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొంటూ, అసాధ్యమైన రికార్డులను సుసాధ్యం చేస్తున్న వైభవ్ ప్రయాణం యువ క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తిదాయకం. రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని శిఖరాలను అధిరోహించడం ఖాయంగా కనిపిస్తోంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/hanuman-chalisa-unveiling-the-divine-power-and-scientific-wisdom-of-goswami-tulsidass-hymn-1803591.html</loc><lastmod>2026-04-28T19:13:39+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/hanuman-9.jpg</image:loc>
					<image:title><![CDATA[ Hanuman (9) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/hanuman-1.jpg</image:loc><image:caption><![CDATA[ గోస్వామి తులసీదాస్ ఉత్తరప్రదేశ్‌లోని రాజాపూర్ గ్రామంలో ఆత్మారాం దూబే, హుల్సీ దంపతులకు జన్మించారు. జన్మించగానే రామ నామం ఉచ్చరించడంతో ఆయనకు రాంబోలా అనే పేరు వచ్చింది. అశుభ సమయంలో పుట్టాడని భావించి తల్లిదండ్రులు వదిలేయడంతో చిన్నతనంలోనే అనాథగా మారారు. నరహరిదాస్ అనే గురువు ఆ బాలుడిని చేరదీసి రామ మంత్రాన్ని ఉపదేశించి విద్యాబుద్ధులు నేర్పారు. కాలక్రమేణా ఆ రాంబోలానే తులసీదాసుగా మారి కాశీ క్షేత్రంలో గొప్ప విద్వాంసుడిగా పేరు తెచ్చుకున్నారు. తులసీదాస్ జీవితంలో అతి పెద్ద మలుపు, ఆయన భార్య రత్నావళి మాటలు. భార్యపై ఉన్న విపరీతమైన ప్రేమతో అర్ధరాత్రి నదిని దాటి పుట్టింటికి వెళ్ళిన ఆమెను కలవడానికి వెళ్లగా, రత్నావళి ఈ రక్తమాంసాలతో కూడిన నా శరీరంపై మీకు ఉన్న ప్రేమే శ్రీరాముడిపై ఉంటే మోక్షం లభించేది అని పలికింది. ఆ మాట తులసీదాస్‌ను మేల్కొలిపి, సంసార వ్యామోహాలను వదిలి రామభక్తిలో మునిగిపోయేలా చేసింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/hanuman-2.jpg</image:loc><image:caption><![CDATA[ రామ దర్శనం, సాహిత్య కృషి: తులసీదాస్ నిత్యం హనుమంతుడిని ప్రార్థించేవారు. వారణాసిలో రామాయణ ప్రవచనం జరుగుతున్నప్పుడు హనుమంతుడిని గుర్తించి, ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థించగా, చిత్రకూట పర్వతంపై రామ దర్శనం లభిస్తుందని వరం పొందారు. తులసీదాస్ చిత్రకూటంలో చందనం తీస్తున్నప్పుడు బాలరాముడు స్వయంగా వచ్చి ఆ చందనాన్ని నుదుటన తిలకంగా దిద్దుకున్నారని చెబుతారు. హనుమంతుడి అనుగ్రహం ఉంటేనే రామ దర్శనం సాధ్యమని దీని ద్వారా తెలుస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/hanuman-3.jpg</image:loc><image:caption><![CDATA[ భగవంతుడి నామం పండితులకే కాక పామరులకు కూడా చేరాలనే సంకల్పంతో, సంస్కృతానికి బదులు అత్యంత మధురమైన అవధీ భాషలో రామచరితమానస్ను, హనుమాన్ చాలీసాను రచించారు. ప్రజల భాషలో ఉండటంతో రామచరితమానస్ ఉత్తర భారతదేశంలో భగవద్గీత కంటే ఎక్కువ ప్రాచుర్యం పొందింది. ఇందులోని చౌపాయేలు (నాలుగు పాదాల పద్యాలు) ఇప్పటికీ వివాహాల్లో, శుభకార్యాల్లో వినిపిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/hanuman-4.jpg</image:loc><image:caption><![CDATA[ హనుమాన్ చాలీసా కేవలం ఆధ్యాత్మిక స్తోత్రం కాదు, ఆధునిక శాస్త్రం ఆశ్చర్యపోయే ఖగోళ సత్యాలను కలిగి ఉంది. యుగ సహస్ర యోజన పర భాను, లీల్యో తాహి మధుర ఫల జాను అనే పంక్తిలో, టెలిస్కోపులు లేని కాలంలోనే తులసీదాస్ సూర్యుడి దూరాన్ని అత్యంత కచ్చితంగా లెక్కించారు, ఇది నేటి నాసా శాస్త్రవేత్తలు లెక్కించిన దూరానికి సమానం. ఇది హనుమాన్ చాలీసాలోని ఆధ్యాత్మిక మేధస్సును ప్రతిబింబిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/hanuman-5.jpg</image:loc><image:caption><![CDATA[ హనుమాన్ చాలీసా భక్తుల చుట్టూ ఒక అజేయమైన పాజిటివ్ ఎనర్జీ వలయాన్ని ఏర్పరిచే రక్షా కవచంగా పనిచేస్తుంది. ఇది భయాన్ని దూరం చేసి, మానసిక ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. భూత పిశాచ నికట నహి ఆవై, మహావీర జబ నామ సునావై అనే పంక్తి గుండెల్లో ధైర్యాన్ని నింపుతుంది. నెగిటివ్ ఆలోచనలు, ఫోబియాలు ఉన్నవారికి ఇది ఒక గొప్ప సైకలాజికల్ మెడిసిన్‌గా పనిచేస్తుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం శని దోషాలు, నవగ్రహ బాధలతో సతమతమయ్యేవారు హనుమంతుడిని కొలిస్తే ఆ పీడలు తొలగిపోతాయని ప్రగాఢమైన విశ్వాసం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/hanuman-6.jpg</image:loc><image:caption><![CDATA[ తులసీదాస్ జీవితంలో మరో అద్భుత ఘట్టం హనుమాన్ బాహుక్. వయసు పైబడినప్పుడు భుజానికి తీవ్రమైన గాయమై, భరించలేని నొప్పితో బాధపడుతున్నప్పుడు, ఆయన హనుమంతుడికి విన్నవిస్తూ ఆశువుగా 44 పద్యాలు చెప్పారు. ఈ పద్యాల పారాయణం పూర్తికాగానే ఆయన వ్యాధి నయమైందని చెబుతారు. ఈరోజుకూ శారీరక క్లేశాలు, కీళ్ళనొప్పులు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడేవారు ఈ స్తోత్రాన్ని మహా ఔషధంగా నమ్ముతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/hanuman-7.jpg</image:loc><image:caption><![CDATA[ అష్టసిద్ధి నవనిధి కే దాతా, అసబర దీనహి జానకీ మాతా అనే పంక్తి సీతమ్మ తల్లి ఇచ్చిన వరం ప్రకారం హనుమంతుడు ఎనిమిది రకాల సిద్ధులను, తొమ్మిది రకాల నిధులను ప్రసాదించగలడని తెలుపుతుంది. యోగ శాస్త్రం ప్రకారం అష్టసిద్ధులు మనసును నియంత్రించుకోవడానికి సంకేతాలు. హనుమాన్ చాలీసా పారాయణం వల్ల ఏకాగ్రత పెరిగి, సుప్త చేతనావస్థలో ఉన్న శక్తులు మేల్కొంటాయని యోగులు చెబుతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/hanuman-8.jpg</image:loc><image:caption><![CDATA[ తులసీదాస్ స్వయంగా చెప్పినట్లు, హనుమాన్ చాలీసాను 100 సార్లు సంకల్పంతో పఠిస్తే, కష్టాల నుండి, మానసిక ఒత్తిళ్ల నుండి విముక్తి కలిగి పరమ సుఖం లభిస్తుంది. హనుమాన్ చాలీసా కేవలం ఒక స్తోత్రం కాదు, భక్త తులసీదాస్ మనకిచ్చిన ఒక డిజిటల్ పాస్‌వర్డ్ లాంటిది, ఇది విశ్వ శక్తితో అనుసంధానం చేసి కవచంలా కాపాడుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/love-mangoes-heres-who-should-avoid-them-this-summer-telugu-lifestyle-news-1803475.html</loc><lastmod>2026-04-28T19:00:41+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mango-1-12.jpg</image:loc>
					<image:title><![CDATA[ Mango ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mango-malayalam-tv9.jpg</image:loc><image:caption><![CDATA[ వేసవి కాలం అంటేనే మామిడి పండ్ల సీజన్. తీయని రుచితో పాటు విటమిన్ ఏ, సి, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండే మామిడిని అందరూ ఇష్టంగా తింటారు. అయితే, ఈ తీపి పండు అందరికీ ఆరోగ్యకరం కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మధుమేహం (Diabetes) ఉన్నవారు మామిడి పండ్లను తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mango-tv9-marathi-news.jpg</image:loc><image:caption><![CDATA[ మధుమేహ వ్యాధిగ్రస్తులు (Diabetes): మామిడి పండులో సహజంగానే చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తిన్నప్పుడు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు వైద్యుని సలహా మేరకు మాత్రమే పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. మామిడి పండ్లను తినే ముందు కనీసం గంట సేపు నీటిలో నానబెట్టడం వల్ల వాటి వేడి చేసే గుణం తగ్గుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mango-tv9-assam.jpg</image:loc><image:caption><![CDATA[ బరువు పెరగడం (Obesity): మామిడిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలని ప్రయత్నించే వారు లేదా ఇప్పటికే అధిక బరువు ఉన్నవారు మామిడి పండ్లను ఎక్కువగా తింటే బరువు మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్ల వినియోగాన్ని పరిమితం చేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mango-19.jpg</image:loc><image:caption><![CDATA[ జీర్ణ సంబంధిత సమస్యలు: గ్యాస్, ఎసిడిటీ లేదా అజీర్తితో బాధపడేవారు మామిడి పండ్లను తినేటప్పుడు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవడం వల్ల కొందరిలో పొట్టలో అసౌకర్యం కలగవచ్చు.  జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు, అలర్జీలు ఉన్నవారు మామిడి పండ్లను ఎంత తక్కువగా తింటే అంత మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mango-tv9-gujarati-news.jpg</image:loc><image:caption><![CDATA[ అలర్జీలు: కొందరికి మామిడి పండ్ల వల్ల అలర్జీ రావచ్చు. దీనిని తిన్న తర్వాత నోటి చుట్టూ దురద, గొంతులో మంట లేదా చర్మంపై దద్దుర్లు కనిపిస్తే వెంటనే మామిడి పండ్లను తినడం ఆపేయాలి. అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లుగా, ఏదైనా పరిమితికి మించి తీసుకుంటే అది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. మామిడి పండ్ల విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mango-tv9-bangla-news.jpg</image:loc><image:caption><![CDATA[ మామిడి పండ్లను ఎలా తినాలి?: మామిడి పండ్లను తినడానికి సరైన పద్ధతి ఒకటి ఉంది. వీటిని తినడానికి ముందు కనీసం 1 నుండి 2 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల మామిడిలోని ఉష్ణ తత్వం (వేడి చేసే గుణం) తగ్గుతుంది. ఇది శరీరానికి మేలు చేస్తుంది. రుచి బాగుందని అతిగా తినకుండా, మీ ఆరోగ్య స్థితిని బట్టి తగిన మోతాదులో తీసుకుంటే సీజన్ పండు ఆనందాన్ని పొందవచ్చు. ఏదైనా సందేహం ఉంటే మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/viral-photos/mikami-shrine-japan-the-unique-temple-where-people-pray-for-hair-growth-1803558.html</loc><lastmod>2026-04-28T18:44:13+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mikami-shrine-japan-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Mikami Shrine Japan (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mikami-shrine-japan-1.jpg</image:loc><image:caption><![CDATA[ జపాన్ లోని క్యోటోలోని పచ్చని ప్రకృతి ఒడిలో వెలసిన మికామి ఆలయం ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంది. జపాన్ సంప్రదాయ నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ అడుగు పెట్టగానే మనకు కనిపించేది భక్తుల నమ్మకం. ప్రపంచవ్యాప్తంగా జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారు ఇక్కడికి వస్తుంటారు. ముఖ్యంగా జపాన్ ప్రజలు తమ కేశ సంపదను కాపాడుకోవడానికి ఈ ఆలయానికి ప్రాధాన్యత ఇస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mikami-shrine-japan-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ ఆలయ ముఖద్వారం వద్ద నిలబడితే, ఎన్నో ఏళ్ల నాటి చరిత్ర మనకు స్వాగతం పలుకుతున్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ భక్తులు ప్రార్థనలు చేయడమే కాకుండా, తమ జుట్టు పెరగాలని కోరుకుంటూ చిన్న చిన్న చెక్క పలకల (Ema) మీద సందేశాలు రాసి వేలాడదీస్తారు. ఒక చిన్న వెంట్రుక కూడా ఒక మనిషి అందాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో, దాని కోసం ప్రజలు ఎంతగా తపిస్తారో ఈ ఆలయ వాతావరణం చూస్తే అర్థమవుతుంది. ఇది కేవలం ఒక కట్టడం కాదు, వేలాది మంది ఆశలకు ప్రతిరూపం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mikami-shrine-japan-3.jpg</image:loc><image:caption><![CDATA[ మికామి ఆలయంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం భక్తుల జుట్టును దేవుడికి అర్పించడం. పూజారి చాలా జాగ్రత్తగా భక్తుడి తల నుంచి కొన్ని వెంట్రుకలను సేకరిస్తారు. మన దేశంలో తలనీలాలు సమర్పించడం అంటే పూర్తిగా గుండు గీయించుకోవడం, కానీ ఇక్కడ అలా కాదు. కేవలం కొన్ని వెంట్రుకలను మాత్రమే కత్తిరించి, వాటిని ఒక పవిత్రమైన కవరులో ఉంచుతారు. ఈ ప్రక్రియ వెనుక ఒక లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. మన శరీరంలోని ప్రతి భాగం దైవ ప్రసాదమని, దానిని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యతని వారు నమ్ముతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mikami-shrine-japan-4.jpg</image:loc><image:caption><![CDATA[ జుట్టు రాలడం అనేది కేవలం శారీరక సమస్యే కాదు, అది మానసిక ఒత్తిడికి కూడా సంకేతం. అందుకే ఇక్కడ పూజారులు మంత్రోచ్ఛారణల మధ్య భక్తుల జుట్టు సమస్యలు తొలగిపోవాలని ప్రార్థిస్తారు. జపాన్ ఆలయాల్లో ఇదొక సాధారణ దృశ్యం అయినప్పటికీ, మికామి ఆలయంలో ఉండే పలకలు మాత్రం ప్రత్యేకం. వీటి మీద రాసే కోరికలన్నీ జుట్టుకు సంబంధించినవే ఉండటం విశేషం. నా జుట్టు ఒత్తుగా పెరగాలి, నా భర్తకు బట్టతల రాకూడదు, నాకు మంచి హెయిర్ స్టైలిస్ట్ కావాలి వంటి చిత్రవిచిత్రమైన కోరికలను భక్తులు ఇక్కడ రాస్తుంటారు. కేవలం సామాన్య ప్రజలే కాదు, జపాన్‌లోని ప్రముఖ హెయిర్ సెలూన్ యజమానులు, బార్బర్లు కూడా తమ వృత్తిలో రాణించాలని ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mikami-shrine-japan-5.jpg</image:loc><image:caption><![CDATA[ మికామి ఆలయానికి మూలపురుషుడు అయిన ఫుజివారా ఉనెమెనోసుకే మసాయుకి స్మారకార్థం ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని సూచిస్తుంది. ఆయన జపాన్ చరిత్రలో మొట్టమొదటి క్షురకుడిగా పేరు పొందారు. ఆయన కాలంలో చక్రవర్తులకు, ఉన్నతాధికారులకు జుట్టు కత్తిరించడం ఒక గొప్ప కళగా భావించేవారు. మసాయుకి కేవలం జుట్టు కత్తిరించడమే కాకుండా, కేశాల ఆరోగ్యం కోసం ఎన్నో చిట్కాలను కూడా పాటించేవారట. ఆయన మరణించిన తర్వాత, ఆయన కేశాలను కూడా ఇక్కడే సమాధి చేశారని చెబుతుంటారు. అందుకే ఈ ప్రాంతాన్ని ‘జుట్టు సమాధి’ అని కూడా పిలుస్తారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/central-government-makes-key-announcement-on-petrol-and-diesel-prices-1803507.html</loc><lastmod>2026-04-28T17:43:06+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/petrol-prices-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Petrol Prices ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/petrol-1-4.jpg</image:loc><image:caption><![CDATA[ పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక ప్రకటన చేసింది. ధరలను ఇప్పట్లో పెంచేది లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మంగళవారం కీలక ప్రకటన చేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియనుండటంతో త్వరలో ధరలను పెంచుతారనే ఊహాగానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దీంతో కేంద్రం ఈ వార్తలకు చెక్ పెడుతూ మరోసారి ప్రకటన విడుదల చేసింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/petrol-2-4.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం దగ్గర లేదని సుజాత శర్మ వెల్లడించారు. వినియోగదారులకు ఉపశమనం కల్పించడంపైనే తాము దృష్టి సారించామని, ప్రస్తుతానికి ధరలను పెంచే ప్రణాళికలు లేవని అన్నారు.  హర్ముజ్ జలసంధి దగ్గర ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ముడి సరుకు రవాణాకు అంతరాయం కలుగుతోంది. దీంతో ముడి చమురు ధరలు పెరిగిపోతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/petrol-3-4.jpg</image:loc><image:caption><![CDATA[ ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరుకుంది. హర్ము్జ్ జలసంధి వద్ద నౌకలపై దాడులు పెరుగుతున్న క్రమంలో ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. దీంతో దేశంలో ఇంధన ధరలు పెరుగుతాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం పెంచేది లేదని చెప్పినప్పటికీ.. భవిష్యత్తులో అంతర్జాతీయ పరిణామాలను బట్టి పరిస్థితులు మారొచ్చని అంటున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/petrol-4-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్దం ప్రారంభమైన దగ్గర నుంచి హర్ముజ్ జలసంధి ద్వారా నౌక రవాణా భారీగా తగ్గింది. యుద్దం కంటే ముందు సుమారు రోజు 138  ఓడలు ప్రయాణించేవి. కానీ ఇప్పుడు 67కి తగ్గిపోయింది. దీంతో అంతర్జాతీయ సరుకు రవాణాపై దీని ప్రభావం పడుతుంది. సముద్ర రవాణాలో గణనీయమైన తగ్గింపును ఇది సూచిస్తోంది. ముడి చమురు సరుకు రవాణాపై ఇది ప్రభావం చూపిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/petrol-5-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక భారత నౌకలు కూడా గత కొద్ది రోజులుగా హర్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణించడం లేదు. భద్రతా కారణాల వల్ల నౌకలు ఈ మార్గానికి దూరంగా ఉంటున్నాయి. ప్రస్తుతం భారత నావికులు సురక్షితంగా ఉన్నారు. ఇప్పటివరకు ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక విదేశీ నౌకలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వద్ద ఎలాంటి సమాచారం లేదు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/saturn-impact-alert-libra-aquarius-facing-tough-times-be-extra-careful-1803491.html</loc><lastmod>2026-04-28T17:26:43+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/02/shani.jpg</image:loc>
					<image:title><![CDATA[ Shani ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/02/shani-sanchar.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే గ్రహాలు, రాశులు వాటి  స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు పాజిటివ్ గా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/01/shani-effect.jpg</image:loc><image:caption><![CDATA[ శని గ్రహాన్ని అశుభంగా చెబుతారు గ్రహంగా చెబుతారు. అయితే, వచ్చే నెలలో రెండు రాశుల వారికి కష్టాలు ఎక్కువనున్నాయి. శని గ్రహం వేరే రాశిలోకి తన స్థానాన్ని మార్చుకోనున్నాడు. దీని వలన సమస్యలు ఎక్కువైతాయి. ఇంకా మొదలు పెట్టిన పనిలో ఆటంకాలు వస్తాయి. అందరూ వీరిని వెనక్కి లాగే  ప్రయత్నం చేస్తారు. ఇంక ఏది  అనుకూలంగా ఉండదు.  ఆ రాశు లేంటో ఇక్కడ చూద్దాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tula-1.jpg</image:loc><image:caption><![CDATA[ తులా రాశి : తులా రాశి వారి పనులన్నీ మధ్యలోనే ఆగిపోతాయి. ఏ పనులు కూడా ముందుకు పోవు. ఆలాగే, డబ్బు సమస్యలు కూడా వస్తాయి. ఇంకా వీరి నెత్తిన పెద్ద భారాలు పడతాయి వాటితోనే సతమవుతారు. ఇంకా  వీరు  ఈ సమయంలో వ్యాపారాలు చెయ్యకపోవడమే మంచిది. ఒక వేళ చేస్తే చాలా నష్ట పొతారు.  ఇంకా అనేక రకాలుగా ఇబ్బందులు పడతారు. భార్య భర్తల మధ్య గొడవలు మొదలవుతాయి.  జాగ్రత్తగా ఉండకపోతే మోసం జరిగే అవకాశం ఉంది. 40 రోజల పాటు దరిద్రం మీ వెంటే ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kumbha-1.jpg</image:loc><image:caption><![CDATA[ కుంభ రాశి:  కుంభ రాశి వారికి ఉన్న  కష్టాలు సరిపోనట్లు మళ్ళీ కొత్తవి కూడా మొదలవుతాయి. ఇంకా ఉద్యోగం చేసే ప్రదేశంలో కూడా జాగ్రత్త అవసరం గొడవలకు వెళ్ళకండి ఇది మీ గౌరవాన్ని దెబ్బ తీస్తుంది ఇంకా  ప్రభుత్వ ఉద్యోగం అవకాశం మధ్యలోనే ఆగిపోతోంది. ఇంకా వీరి జీవితం కూడా మారుతుంది. అప్పులు ఎక్కువవుతాయి.  పెట్టుబడులు అస్సలు పెట్టకండి ఉన్న డబ్బును దాచుకోండి.  మీ వైవాహిక జీవితంలో ప్రశాంతత ఉండదు. ఇంకా లెక్కలు కూడా మారతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/astro-2-3.jpg</image:loc><image:caption><![CDATA[ (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/technology-photos/whatsapp-to-stop-working-on-old-android-phones-from-september-8-1803479.html</loc><lastmod>2026-04-28T17:11:06+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/whatsapp-features.jpg</image:loc>
					<image:title><![CDATA[ Whatsapp Features ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/whatsapp-1-2.jpg</image:loc><image:caption><![CDATA[ పాత ఆండ్రాయిన్ ఫోన్లు వాడుతున్నారా..? అయితే మీకు బిగ్ అలర్ట్. మీ ఫోన్లలో వాట్సప్ బంద్ కానుంది. పాత స్మార్ట్‌ఫోన్లలో కొత్త ఫీచర్లను అందించడం వాట్సప్‌కు కష్టమవుతోంది. దీంతో పాత ఫోన్లలో వాట్సప్ పనిచేయకుండా సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఏయే ఫోన్లలో వాట్సప్ బంద్ కానుంది..? అసలు కారణాలేంటి? ఎప్పటినుంచి నిలిచిపోనుంది..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/whatsapp-2-2.jpg</image:loc><image:caption><![CDATA[ పాత ఫోన్లు వాడుతున్నవారికి వాట్సప్ హెచ్చరికలు జారీ చేసింది. ఆండ్రాయిస్ 5.0 లేదా అంతకంటే తక్కువ వెర్షన్ గల ఆండ్రాయిడ్ పాత ఫోన్లను వాట్సప్ సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 8 నుంచి ఆ ఫోన్లలో వాట్సప్ పనిచేయదని తెలిపింది. ఆ రోజు నుంచి ఆండ్రాయిడ్ 5.0. 5.1 వెర్షన్లలోపు కూడిన ఫోన్లలో వాట్సప్ సర్వీసులు ఆగిపోతాయి. ఆండ్రాయిడ్ 6.0పైన వెర్షన్లు గత ఫోన్లు వాడేవారికి మాత్రమే వాట్సప్ అందుబాటులో ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/whatsapp-3-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పటికే యూజర్లను అలర్ట్ చేస్తూ వాట్సప్ మెస్సేజ్‌లు పంపుతోంది. వాట్సప్ బిజినెస్ అకౌంట్ వాడుతుంటే అది కూడా నిలిచిపోతుంది. ఆండ్రాయిడ్ ఫోన్లకు మాత్రమే ఈ మార్పు వర్తిస్తుందని తెలిపింది. ఐఓఎస్ వెర్షనకు  ఇది వర్తించదని స్పష్టం చేసింది. ఐఓఎస్ వెర్షన్లకు సంబంధించి 15.1 లేదా ఆపై వెర్షన్ వాడేవారికి వాట్సప్ ఎప్పటిలాగే పనిచేస్తుందని వాట్సప్ పేర్కొంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/whatsapp-4-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఎవరెవరి ఫోన్లలో అయితే వాట్సప్ సెప్టెంబర్ 8 నుంచి నిలిచిపోనుందో వారికి వాట్సప్ సందేశాలు పంపుతోంది. చాట్ హిస్టరీని గూగుల్ డ్రైవ్ లేదా ఇతర ఫ్లాట్‌ఫామ్స్‌లో సేవ్ చేసుకోవాలని సూచిస్తోంది. చాట్ హిస్టరీ బ్యాకప్ పెట్టుకోవాలని చెబుతోంది. దీంతో పాత స్మార్ట్‌ఫోన్లను వాడేవారు ఒకసారి మీ ఫోన్ చెక్ చేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/whatsapp-5-2.jpg</image:loc><image:caption><![CDATA[ కాగా వాట్సప్ ఎప్పటికప్పుడు యూజర్ల భద్రతకు ప్రాధాన్యత ఇస్తోంది. అందులో భాగంగా భద్రతా కారణాల వల్ల పాత ఆండ్రాయిడ్ వెర్షన్లలో వాట్సప్ సేవలను నిలిపివేస్తోంది. గతంలో పలు ఆండ్రాయిడ్ వెర్షన్లలో సర్వీసులను నిలిచిపోగా.. ఇప్పుడు మరికొన్ని ఫోన్లలోనూ ఆగిపోతున్నాయి. దీంతో యూజర్లు గమనించాలని వాట్సప్ తెలిపింది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/6-plants-that-repel-snakes-and-protect-your-home-naturally-news-in-telugu-1803436.html</loc><lastmod>2026-04-28T16:48:17+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/snake-repellent-plants.jpg</image:loc>
					<image:title><![CDATA[ Snake Repellent Plants ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sarpagandha.jpg</image:loc><image:caption><![CDATA[ సర్వగంధ (Sarpagandha): పాములను తరిమికొట్టడంలో ఇది అత్యంత ప్రసిద్ధమైన మొక్క. దీని వేర్ల నుండి వచ్చే ఘటైన వాసన పాములను విసిగిస్తుంది. అందుకే దీనిని &#039;స్నేక్ రూట్&#039; అని కూడా పిలుస్తారు. ఇంటి చుట్టూ ఈ మొక్కను నాటడం వల్ల పాములు రాకుండా అడ్డుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/lemongrass.jpg</image:loc><image:caption><![CDATA[ లెమన్ గ్రాస్ (Lemongrass): దీని నుండి వచ్చే నిమ్మకాయ వంటి వాసన మనకు ఇష్టంగా ఉన్నా, పాములకు మాత్రం అస్సలు పడదు. ఇందులో ఉండే సిట్రోనెల్లా అనే పదార్థం పాములను ఆ ప్రాంతం నుండి దూరంగా వెళ్ళిపోయేలా చేస్తుంది. ఇది దోమలను కూడా తరిమికొడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/marigold.jpg</image:loc><image:caption><![CDATA[ బంతి పూలు (Marigold): బంతి పూలు కేవలం అందానికి మాత్రమే కాదు, పాములను, పురుగులను దూరం చేయడానికి కూడా ఉపయోగపడతాయి. ఈ పూల నుండి వచ్చే ఒక రకమైన తీక్షణమైన వాసన పాములకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/garlic-plant.jpg</image:loc><image:caption><![CDATA[ వెల్లుల్లి మొక్క (Garlic Plant): వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ వాసన పాములకు పెద్ద అవరోధం. వెల్లుల్లి మొక్కలను తోటలో పెంచడం వల్ల లేదా వెల్లుల్లి రెబ్బల మిశ్రమాన్ని చల్లడం వల్ల పాములు ఆ దారిలో రావు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/snake-plant-9.jpg</image:loc><image:caption><![CDATA[ స్నేక్ ప్లాంట్ (Snake Plant): దీని ఆకులు పదునుగా, పొడవుగా ఉండి పాము చర్మం వలె కనిపిస్తాయి. దీని రూపం, ఆకుల ఆకృతిని చూసి పాములు భయపడతాయని నమ్ముతారు. పైగా ఇది రాత్రిపూట కూడా ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/no-need-to-carry-aadhaar-card-use-it-on-your-phone-via-google-wallet-1803441.html</loc><lastmod>2026-04-28T16:27:36+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/aadhaar-card-7.jpg</image:loc>
					<image:title><![CDATA[ Aadhaar Card ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/aadhaar-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఆధార్ కార్డు ఉన్నవారికి మరో ఊరట. ఈ డాక్యుమెంట్ ఎక్కడ, ఎప్పుడు అవసరం పడుతుందో తెలియదు. దీంతో ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాల్సి వస్తుంది.  హోటల్ చెకింగ్, గేటెడ్ కమ్యూనిటీలో యాక్సెస్, ప్రయాణ సమయంలో ధృవీకరణతో పాటు అనేక సేవలకు నిత్యం మనకు అవసరం పడుతుంది. అయితే కొన్నిసార్లు ఆధార్ మన వెంట తీసుకెళ్లడం మర్చిపోతుంటాం. ఇలాంటి సమయంలో ఆధార్ అత్యవసరంగా అసరమైతే ఇబ్బంది పడాల్సిన పనే లేదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/aadhaar-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఫిజికల్ ఆధార్ అవసరం లేకుండా ఫోన్‌లోనే ఆధార్‌ అవసరమైన చోట ధృవీకరణ కోసం ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం యూఐడీఏఐతో గూగుల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా గూగుల్ వ్యాలెట్‌లో మీరు ఆధార్ సేవ్ చేసుకోవచ్చు. ఆధార్ డిజిటల్ వెర్షన్‌ను మీరు వ్యాలెట్‌లో పెట్టుకోవచ్చు. దీని వల్ల ఎక్కడైనా ఆధార్ అవసరమైతే వెంటనే చూపించవచ్చు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ధృవీకరణ కోసం దీనిని ఉపయోగించుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/aadhaar-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ భారతదేశంలోని వినియోగదారులు అందరూ గూగుల్ వ్యాలెట్ ద్వారా ఆధార్ సేవ్ చేసుకోవచ్చని గూగుల్ ప్రతినిధులు తెలిపారు. రోజువారీ సేవలకు గుర్తింపు తనిఖీలను సులభతరం చేయడమే దీని లక్ష్యమని తెలిపారు. ఇందులో సెలక్టివ్ డిస్క్లోజర్ అనే ఫీచర్ ఉంటుంది. దీని వల్ల అవసరమైన వివరాలను మాత్రమే పంచుకోవచ్చు. వయస్సు ధృవీకరణ అవసరమైన చోట కేవలం దానిని మాత్రమే పంచుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/aadhaar-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ సినిమాలకు వయస్సు ధృవీకరణ, రివార్డుల సమయంలో వ్యాలెట్ ఆధార్‌ను ఉపయోగించవచ్చు. ఇక  భారత్ మ్యాట్రిమోనీలో ప్రైమ్ ప్రొఫైల్‌కు ధృవీకరణకు, అంతర్జాతీయ వీసా అప్లికేషన్ల కోసం ఒకే ట్యాప్‌తో సమాచారం ఆటో ఫిల్ చేసేందుకు, డెలివరీ, సర్వీస్ సిబ్బంది ధృవీకరణకు వాడుకోవచ్చు. ఇక మైగేట్, స్నాబిట్‌లో కూడా త్వరలో ఇలాంటి సౌకర్యం అందుబాటులోకి రానుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/aadhaar-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ గూగుల్  వ్యాలెట్‌లో ఆధార్‌ను సేవ్ చేసుకోవాలంటే.. ముందుగా వ్యాలెట్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత +అనే ఆప్షన్ ఎంచుకుని మోనూలో ఐడీ పాస్ లేదా ఆధార్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆధార్‌తో లింక్ అయిన మొబైల్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేయాలి. ఆధార్ యాప్‌లో షేర్ ఐడీ ఫీచర్ ద్వారా గూగుల్ వ్యాలెట్‌లో ఆధార్ వివరాలు సేవ్ చేసుకోవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/lifestyle/5-common-pressure-cooker-mistakes-that-can-lead-to-explosions-1803408.html</loc><lastmod>2026-04-28T16:52:05+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pressure-cooker-mistakes.jpg</image:loc>
					<image:title><![CDATA[ Pressure Cooker Mistakes ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pressure-cooker-mistakes-t1.jpg</image:loc><image:caption><![CDATA[ కుక్కర్‌ను పూర్తిగా నింపవద్దు: వంటింట్లో ప్రెషర్ కుక్కర్ వాడకం అనేది సమయాన్ని, గ్యాస్‌ను ఆదా చేసే గొప్ప పద్ధతి. అయితే, దీనిని అజాగ్రత్తగా వాడితే అది ప్రాణాంతకమైన ప్రమాదాలకు దారితీయవచ్చు. చాలామంది త్వరగా వంట అయిపోవాలని కుకర్ నిండా ఆహార పదార్థాలను వేస్తుంటారు. కానీ, కుక్కర్ సామర్థ్యంలో 2/3 వంతుకు మించి ఎప్పుడూ నింపకూడదు. ముఖ్యంగా పప్పులు, బియ్యం వంటివి ఉడికేటప్పుడు పొంగుతాయి. కాబట్టి, వాటిని సగం వరకు మాత్రమే నింపడం సురక్షితం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pressure-cooker-mistakes-t.jpg</image:loc><image:caption><![CDATA[ గ్యాస్కెట్ (రబ్బరు) నాణ్యత: కుక్కర్ మూతకు ఉండే రబ్బరు వదులుగా ఉన్నా లేదా పగుళ్లు ఉన్నా వెంటనే మార్చాలి. సరిగ్గా లేని గ్యాస్కెట్ వల్ల ఆవిరి పక్కల నుండి లీక్ అయ్యి లోపల తగినంత ఒత్తిడి ఏర్పడదు లేదా ప్రమాదకరంగా మారుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pressure-cooker-mistakes-t2.jpg</image:loc><image:caption><![CDATA[ నీటి పరిమాణం: కుక్కర్‌లో తగినంత నీరు లేకుండా వంట చేయడం చాలా ప్రమాదకరం. నీరు లేకపోతే కుకర్ అడుగుభాగం అతిగా వేడెక్కి సేఫ్టీ వాల్వ్ పేలిపోవడానికి కారణమవుతుంది. కాబట్టి వండే పదార్థాన్ని బట్టి సరైన మోతాదులో నీటిని పోయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pressure-cooker-mistakes-t5.jpg</image:loc><image:caption><![CDATA[ వెంట్ పైపు శుభ్రత: ప్రెషర్ కుక్కర్ మూతపై ఉండే వెంట్ పైపు (విజిల్ కింద ఉండే రంధ్రం) ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. అందులో ఆహార కణాలు ఇరుక్కుపోతే లోపల ఏర్పడిన ఆవిరి బయటకు వెళ్లదు. దీనివల్ల లోపల విపరీతమైన ఒత్తిడి పెరిగి కుక్కర్ పేలిపోయే ప్రమాదం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pressure-cooker-mistakes-t3.jpg</image:loc><image:caption><![CDATA[ బలవంతంగా మూత తీయకండి:  అలాగే, కుక్కర్‌ ప్రెషర్ పూర్తిగా తగ్గకముందే మూతను బలవంతంగా తీయడానికి ప్రయత్నించకూడదు. వంట పూర్తయిన వెంటనే మూత తీయడానికి ప్రయత్నించకూడదు. విజిల్ తీసివేసినా లోపల ఇంకా ఆవిరి మిగిలి ఉండవచ్చు. ప్రెషర్ పూర్తిగా తగ్గినట్లు నిర్ధారించుకున్న తర్వాతే మూత తీయాలి. ఈ ఐదు జాగ్రత్తలు పాటించడం ద్వారా మీ వంట గదిని సురక్షితంగా ఉంచుకోవచ్చు. మీ కుక్కర్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ ఉండండి. ప్రమాదాల బారిన పడకుండా ఉండండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/how-much-lpg-gas-does-your-stove-take-if-you-do-cooking-for-an-hour-calculation-and-saving-tips-1803416.html</loc><lastmod>2026-04-28T16:03:07+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/lpg-cylinder-consumption-calculation-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Lpg Cylinder Consumption Calculation ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/lpg-cylinder-consumption-calculation-1.jpg</image:loc><image:caption><![CDATA[ గ్యాస్ వినియోగం - అసలు లెక్క: ఒక కిలో ఎల్‌పిజి గ్యాస్‌లో సుమారు 46.1 మెగాజౌల్స్ శక్తి ఉంటుంది. గ్యాస్ స్టవ్‌పై ఉండే ఒక బర్నర్ సగటున గంటకు 7 MJ శక్తిని వాడుతుంది. అంటే మీరు ఒకేసారి రెండు బర్నర్లను వెలిగిస్తే, గంటకు సుమారు 14 MJ శక్తి ఖర్చవుతుంది. బరువు లెక్కన చూస్తే.. రెండు బర్నర్లు కలిపి గంటకు సుమారు 0.30 కిలోల గ్యాస్‌ను వినియోగిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/lpg-cylinder-consumption-calculation.jpg</image:loc><image:caption><![CDATA[ సిలిండర్ ఎన్ని రోజులు వస్తుంది?: ఈ లెక్క ప్రకారం.. ఒక 14.2 కిలోల సిలిండర్‌ను ఆపకుండా నిరంతరాయంగా వాడితే అది సుమారు 46 గంటల పాటు మండుతుంది. అయితే మన ఇళ్లలో రోజుకు కొన్ని గంటలు మాత్రమే వంట చేస్తాం కాబట్టి కుటుంబ సభ్యుల సంఖ్య, వారి వంట అలవాట్లను బట్టి ఒక సిలిండర్ కొన్ని వారాల నుండి నెలల వరకు వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/lpg-cylinder-consumption-calculation-2.jpg</image:loc><image:caption><![CDATA[ పొదుపుగా వాడటం ఎలా?: గ్యాస్ ఆదా చేయడంలో వంట చేసే పద్ధతి కీలక పాత్ర పోషిస్తుంది. వంట చేసేటప్పుడు పాత్రలపై తప్పనిసరిగా మూతలు పెట్టాలి. దీనివల్ల వేడి ఆవిరైపోకుండా ఆహారం త్వరగా ఉడుకుతుంది. అలాగే పప్పులు లేదా తృణధాన్యాలను వండటానికి గంట ముందే నానబెట్టడం వల్ల వంట సమయం తగ్గి, గ్యాస్ చాలా వరకు పొదుపు అవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/lpg-cylinder-consumption-calculation-6.jpg</image:loc><image:caption><![CDATA[ బర్నర్ల ఎంపిక - నిర్వహణ: స్టవ్‌పై ఉండే పెద్ద బర్నర్ల కంటే చిన్న బర్నర్లు తక్కువ గ్యాస్‌ను వాడుతాయి. కాబట్టి రోజువారీ వంటకు చిన్న బర్నర్‌ను ఉపయోగించడం మంచిది. అలాగే బర్నర్లను తరచుగా శుభ్రం చేస్తూ ఉండాలి. బర్నర్ రంధ్రాలు మూసుకుపోతే మంట సరిగ్గా రాదు, దీనివల్ల గ్యాస్ వృధా అవ్వడమే కాకుండా వంట ఆలస్యమవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/lpg-cylinder-consumption-calculation-4.jpg</image:loc><image:caption><![CDATA[ అవగాహనతో ఇంధన ఆదా: అనవసరంగా ఎక్కువ మంట పెట్టకుండా, అవసరానికి తగినట్లుగా మంటను అడ్జస్ట్ చేసుకోవడం వల్ల ఇంధన ఖర్చులను తగ్గించుకోవచ్చు. గ్యాస్ వినియోగంపై కనీస అవగాహన పెంచుకుని, ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే మీ ఇంటి సిలిండర్ మరికొన్ని రోజులు అదనంగా రావడమే కాకుండా మీ జేబుపై భారం కూడా తగ్గుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/grand-kalyanam-of-sri-veera-venkata-satyanarayana-swamy-at-annavaram-draws-thousands-of-devotees-1803320.html</loc><lastmod>2026-04-28T14:03:51+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/annavaram.jpg</image:loc>
					<image:title><![CDATA[ Annavaram ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/annavaram-1.jpg</image:loc><image:caption><![CDATA[ వైభవంగా అన్నవరం సత్యదేవుని కళ్యాణానికి  వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారమైన అన్నవరం సత్యదేవుని దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక  అన్నవరంలో మొత్తం సందడి సందడిగా మారింది ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/annavaram-2.jpg</image:loc><image:caption><![CDATA[ కళ్యాణం కమనీయం వైశాఖ శుద్ధ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని రత్నగిరి కొండపై వార్షిక కళ్యాణ మండపం వద్ద రాత్రి 9 గంటలకు సత్యదేవుడు అనంతలక్ష్మి అమ్మవార్ల పరిణయ వేడుకను చూసి భక్తజనులు పునీతులయ్యారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/annavaram-3.jpg</image:loc><image:caption><![CDATA[ స్వామి అమ్మవార్లకు దేవస్థానం ఆలయ ఈవో చక్రధర్ రావు చైర్మన్ రోహిత్ పాలక మండలి సభ్యులు పట్టు వస్త్రాలు సమర్పించారు.. ప్రభుత్వం తరుపున స్వామి వారి కి పట్టు వస్త్రాలు జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ సమర్పించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/annavaram-4.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రభుత్వం తరుపున స్వామి వారికి  అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. 
ఆలయ వేద పండితులు అర్చకులు పురోహితులు పెద్దలు స్వామివారి కల్యాణా క్రతువుని శాస్ట్రోక్టంగా గా జరిపారు. ఈ కళ్యాణానికి సీత రాములు పెద్దలుగా వ్యవహరించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/annavaram-5.jpg</image:loc><image:caption><![CDATA[ కళ్యాణం అనంతరం కళ్యాణం తిలగించే భక్తులకు ప్రసాదాలు తలంబరాలు పంపిణీ చేశారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు రత్నగిరి కొండపై ఎలాంటి ఇబ్బందులు కలక్కుండా ప్రత్యేక ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/hibiscus-tea-benefits-what-happens-if-you-drink-hibiscus-tea-daily-1803292.html</loc><lastmod>2026-04-28T13:17:43+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mandara-tea7.jpg</image:loc>
					<image:title><![CDATA[ Mandara Tea ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mandara-tea.jpg</image:loc><image:caption><![CDATA[ చాలా మంది ఉదయం నిద్రలేచిన వెంటనే, రాత్రి పడుకునే ముందు టీ తాగడం అలవాటుగా చేసుకుంటారు. కానీ, టీని అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరంగా మారవచ్చు. ముఖ్యంగా కెఫైన్ ఎక్కువగా ఉండే సాధారణ టీని ఎక్కువగా తాగితే నిద్ర సమస్యలు, ఆమ్లత్వం, శరీరంలో నీటి లోపం వంటి సమస్యలు రావచ్చు. దీని ప్రత్యామ్నాయంగా సహజమైన హెర్బల్ డ్రింక్స్ మంచి ఎంపికగా ఉంటాయి. వాటిలో ముఖ్యంగా మందార టీ (Hibiscus Tea) ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది సహజంగా శరీరాన్ని డిటాక్స్ చేయడంలో సహాయపడుతుంది.  రక్తపోటును నియంత్రించడంలో ఉపయోగపడుతుంది.  అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహకరిస్తుంది. అంతేకాకుండా బరువు తగ్గడానికి కూడా మందార టీ ఒక సహజ సహాయకంగా పనిచేస్తుంది. మరిన్ని ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mandara-tea2.jpg</image:loc><image:caption><![CDATA[ రక్తపోటు నియంత్రణకు సహాయపడుతుంది.. 

మందార టీని నియమితంగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులోని సహజ సమ్మేళనాలు రక్తనాళాలను సడలించి రక్తప్రవాహాన్ని సమతుల్యం చేస్తాయి. రోజుకు 2–3 కప్పుల వరకు మితంగా తీసుకోవడం సాధారణంగా సురక్షితం. అయితే ఇప్పటికే మందులు వాడుతున్నవారు లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mandara-tea3.jpg</image:loc><image:caption><![CDATA[ యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.. 

మందారలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించి కణాలను రక్షిస్తాయి. దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడి, గుండె సంబంధిత సమస్యల ప్రమాదం తగ్గుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో కూడా ఇది సహాయపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mandara-tea4.jpg</image:loc><image:caption><![CDATA[ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. 

మందార టీ చర్మానికి సహజ కాంతిని ఇస్తుంది. ఇందులోని విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. ఫలితంగా చర్మం ఆరోగ్యంగా, యవ్వనంగా కనిపిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mandara-tea5.jpg</image:loc><image:caption><![CDATA[ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది..

మందార టీ తేలికగా జీర్ణమవుతుంది, కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు నియంత్రణలో ఉండాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mandara-tea6.jpg</image:loc><image:caption><![CDATA[ ఒత్తిడిని తగ్గిస్తుంది..

ఈ టీ సహజంగా శరీరాన్ని, మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ C శరీరంలోని విషపదార్థాలను తగ్గించి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. రోజువారీ అలవాటుగా తీసుకుంటే మానసిక ఆరోగ్యానికి ఉపయోగకరం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mandara-tea7-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఋతుస్రావ నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.. 

మందార టీ హార్మోన్ల సమతుల్యతను కాపాడటంలో సహాయపడుతుంది. దీనివల్ల కడుపు నొప్పి, తిమ్మిర్లు వంటి సమస్యలు కొంతవరకు తగ్గుతాయి. అలాగే మానసిక మార్పులను నియంత్రించడంలో కూడా ఇది సహాయపడుతుంది.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం  ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన  సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/crispy-jowar-flour-garelu-recipe-healthy-sorghum-vada-you-cant-stop-eating-1803255.html</loc><lastmod>2026-04-28T13:15:11+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/jonna-pindi-garelu-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Jonna Pindi Garelu 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/jonna-pindi-garelu-4.jpg</image:loc><image:caption><![CDATA[ జొన్న పిండి గారెలకు కావలసిన పదార్థాలు:  ఒక కప్పు జొన్న పిండి,  ఒక ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిర్చి , ఒక చిన్న అల్లం ముక్క 
నాలుగు కరివేపాకు, అర కట్ట కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర, ఉప్పు చాలా అవసరం.  ఇంకా పచ్చడికి సరిపడా నూనెను తీసుకోవాలి. ఇంకా ఈ పదార్థాలు అన్ని వేస్తే  గారెలకు మంచి రుచి వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/jonna-pindi-garelu-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ మిశ్రమాన్ని ఇలా తయారు చేసుకోవాలి: ఒక  గిన్నెలో జొన్న పిండిని దానిలో కట్ చేసిన ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిర్చి, అల్లం కలపాలి. నాలుగు కరివేపాకు, అరకట్ట కొత్తిమీర, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా కలపాలి. వీటికి  నీరు పోస్తూ  గట్టిగా ఉండేలా చేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/jonna-pindi-garelu.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ మిశ్రమంలో ఒక కప్పు బియ్యం పిండి కలిపితే మరింత క్రిస్పీగా వస్తాయి. అలాగే, దీనిలో మిరియాల పొడి, కారం పొడి వేసినా స్పైసీగా రుచిగా ఉంటాయి. ఇంకా ఈ ముద్దను 10 నిమిషాల పాటు అలా ఉంచితే మంచి టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఇంట్లో చేసుకునేటప్పుడు ఇలాగే తయారు చేసుకోండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/jonna-pindi-garelu-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఆ తరవాత చేతికి కొద్దిగా ఆయిల్ తీసుకుని రాసుకుని చిన్న ఉండలుగా తీసుకోవాలి. వాటిని, గారెల్లాగా చేసుకుని కాల్చడమే. ఇంకా దాని  మధ్యలో చిన్న రంధ్రం లాగా వేసుకుని నూనెలో బాగా వేయించుకోవాలి. ఇలా చేస్తే లోపల ఉడికి మంచి టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇవి మంచిగా తినడానికి రుచిగా ఉంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/jonna-pindi-garelu-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు పాన్ లో ఆయిల్ వేసి, మీడియం మంటపై గారెలు వేయాలి. ఒక్కసారిగా ఎక్కువ వేయకుండా కొద్దికొద్దిగా వేసుకుంటే సమంగా వేగుతాయి. గారెలను రెండు వైపులా బంగారు కలర్లోకి  మారే వరకు నెమ్మదిగా వేయించాలి. ఇలా చేస్తే  గారెలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/vastu-changes-at-home-for-career-growth-and-professional-success-1803262.html</loc><lastmod>2026-04-28T12:35:54+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vastu-tips.jpg</image:loc>
					<image:title><![CDATA[ Vastu Tips ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vastu-tips-1.jpg</image:loc><image:caption><![CDATA[ సాధారణంగా ఇంట్లో శాంతి, సంతోషం లేదా సంపద గురించి ఆలోచించినప్పుడు మన దృష్టి ఎక్కువగా ఉత్తరం లేదా తూర్పు దిశలపై ఉంటుంది. ఉత్తరం కుబేరుడి దిక్కు అని, అక్కడి నుంచే లక్ష్మీదేవి కృప లభిస్తుందని చాలామంది నమ్ముతారు. అయితే వాస్తు శాస్త్రంలో మరో ముఖ్యమైన కోణం కూడా ఉంది.. అదే దక్షిణ దిశ. వాస్తు ప్రకారం, ఇంటి దక్షిణ దిశను సరిగా నిర్వహిస్తే వృత్తి స్థిరపడటమే కాకుండా సంపద ప్రవాహం కూడా మెరుగవుతుందని నమ్మకం. ఒకవేళ ఆర్థికంగా నిలకడ లేకపోయినా లేదా అభివృద్ధి మందగించినట్లు అనిపించినా, దక్షిణ దిశలో ఈ క్రింది మార్పులను ప్రయత్నించవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vastu-tips2.jpg</image:loc><image:caption><![CDATA[ 1. ఫీనిక్స్ పక్షి.. 

వాస్తు శాస్త్రంలో ఫీనిక్స్ పక్షిని శక్తి, విజయం, పునర్జన్మకు చిహ్నంగా భావిస్తారు. ఇది ప్రతికూల పరిస్థితుల నుంచి తిరిగి ఎదిగే శక్తిని సూచిస్తుంది. దక్షిణ గోడపై ఫీనిక్స్ చిత్రాన్ని ఉంచితే ప్రతికూలత తొలగిపోయి విజయానికి మార్గం సుగమం అవుతుందని నమ్మకం. కీర్తి, గుర్తింపు కోరుకునేవారికి ఇది ఎంతో అనుకూలం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vastu-tips3.jpg</image:loc><image:caption><![CDATA[ 2. జేడ్ మొక్క.. 

జేడ్ మొక్కను సాధారణంగా “డబ్బు మొక్క” అని కూడా అంటారు. ఇది సంపద, శ్రేయస్సు, సానుకూల శక్తిని ఆకర్షించే మొక్కగా పరిగణించబడుతుంది. హాల్ లేదా డ్రాయింగ్ రూమ్‌లో దక్షిణ దిశలో ఉంచితే ఆర్థిక స్థిరత్వం పెరుగుతుందని వాస్తు నమ్మకం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vastu-tips4.jpg</image:loc><image:caption><![CDATA[ 3. పరుగెత్తే ఏడు గుర్రాలు..

అభివృద్ధి, వేగం, శక్తికి గుర్రాలు ప్రతీకలు. ముఖ్యంగా ఏడు గుర్రాల చిత్రాన్ని దక్షిణ గోడపై ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. గుర్రాల ముఖాలు లోపలికి చూస్తూ ఉండేలా ఉంచితే వృత్తి, వ్యాపారంలో అడ్డంకులు తొలగి వేగవంతమైన పురోగతి కలుగుతుందని నమ్మకం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vastu-tips5.jpg</image:loc><image:caption><![CDATA[ 4. బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు..

వాస్తు ప్రకారం దక్షిణ దిశ స్థిరత్వానికి సంబంధించినది. అందువల్ల బంగారం, వెండి వంటి విలువైన వస్తువులను సేఫ్‌లో దక్షిణ దిశలో భద్రపరచడం  శ్రేయస్కరం. ఇది సంపదను నిలుపుకోవడంలో సహాయపడుతుందని విశ్వాసం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vastu-tips6.jpg</image:loc><image:caption><![CDATA[ 5. చీపురు సరైన స్థానం..

చీపురును తప్పుగా ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయని ఒక వాస్తు నమ్మకం ఉంది. దాన్ని దక్షిణ దిశలో దాచిపెట్టడం మంచిదని చెబుతారు. ఇలా చేయడం ద్వారా అనవసర ఖర్చులు తగ్గి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని భావిస్తారు. వాస్తు శాస్త్రం అనేది శక్తి సమతుల్యతపై ఆధారపడిన ఒక సంప్రదాయ శాస్త్రం. సాధారణంగా దక్షిణ దిశను యముడి దిక్కుగా భావించి కొందరు భయపడుతారు, కానీ సరైన విధంగా ఉపయోగిస్తే అదే దిశ స్థిరత్వం, సంపద, గౌరవాన్ని అందించగలదని వాస్తు నిపుణులు చెబుతారు.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్యం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url></urlset>