<urlset xmlns:xsi="http://www.w3.org/2001/XMLSchema-instance" xmlns:image="http://www.google.com/schemas/sitemap-image/1.1" xsi:schemaLocation="http://www.sitemaps.org/schemas/sitemap/0.9 http://www.sitemaps.org/schemas/sitemap/0.9/sitemap.xsd http://www.google.com/schemas/sitemap-image/1.1 http://www.google.com/schemas/sitemap-image/1.1/sitemap-image.xsd" xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9"><url><loc>https://tv9telugu.com/photo-gallery/curry-leaf-plant-care-tips-homemade-organic-spray-for-black-spots-and-bushy-growth-in-telugu-1907571.html</loc><lastmod>2026-09-09T18:10:56+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/curry-leaf-plant-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Curry Leaf Plant (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/curry-leaf-plant-1.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రతి భారతీయ వంటింట్లో తాలింపుకు అత్యంత ముఖ్యమైనది కరివేపాకు. మార్కెట్ నుంచి తెచ్చుకునే బదులు ఇంటి పెరట్లో లేదా బాల్కనీ కుండీల్లో కరివేపాకు మొక్కను పెంచుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. అయితే వర్షాకాలం మరియు చలికాలం వచ్చేసరికి వాతావరణ మార్పుల వల్ల కరివేపాకు ఆకులపై నల్ల మచ్చలు ఏర్పడటం, తెల్లటి బూజు లేదా పచ్చ పురుగులు చేరి ఆకులను కొరికేయడం, మొక్క ఎదుగుదల పూర్తిగా మందగించడం జరుగుతుంది.  ఎలాంటి రసాయనాలు వాడకుండా, ఇంట్లోనే లభించే సహజ పదార్థాలతో ఈ సమస్యలను దూరం చేసి కరివేపాకు చెట్టును పచ్చగా, గుబురుగా మార్చుకునే విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/curry-leaf-plant-2.jpg</image:loc><image:caption><![CDATA[ కరివేపాకు ఆకులపై మచ్చలు రావడానికి ప్రధాన కారణాలు: మొదటిది సెప్టెంబర్ నుండి శీతాకాలం వరకు గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఫంగస్ సోకి ఆకులపై నల్ల మచ్చలు ఏర్పడతాయి. రెండవది  ఆకుల వెనుక భాగంలో తెల్లటి బూజు, పిండి పురుగులు లేదా చిన్న పచ్చ పురుగులు చేరి ఆకులను తింటూ రసాన్ని పీలుస్తాయి. దీనివల్ల ఆకులు ముడుచుకుపోయి వంకర్లు తిరుగుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/curry-leaf-plant-3.jpg</image:loc><image:caption><![CDATA[ మూడవది కరివేపాకు మొక్కకు ఎండ చాలా ముఖ్యం. తగినంత ఎండ తగలని నీడ ప్రదేశాల్లో ఉంచితే మొక్క గిడసబారిపోతుంది. రోజుకు కనీసం 3 నుండి 4 గంటల ఎండ తగిలే చోటుకు మార్చాలి. నాలుగవది మట్టిలో సరైన నత్రజని మరియు సూక్ష్మ పోషకాలు లేకపోవడం వల్ల కూడా ఎదుగుదల ఆగిపోతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/curry-leaf-plant-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంట్లోనే తయారుచేసుకునే ఆర్గానిక్ స్ప్రే  ఎరువు:  బాగా పులిసిన మజ్జిగను సమాన నిష్పత్తిలో నీటితో కలిపి, అందులో చిటికెడు ఇంగువ లేదా పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో పోసి ఆకుల ముందు, వెనుక భాగంలో పూర్తిగా తడిసేలా స్ప్రే చేయాలి. పుల్లటి మజ్జిగలోని మంచి బ్యాక్టీరియా మరియు ఆమ్లత్వం ఫంగస్‌ను, మచ్చలను అద్భుతంగా నివారిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/curry-leaf-plant-5.jpg</image:loc><image:caption><![CDATA[ స్ప్రే చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఈ లిక్విడ్ స్ప్రేను లేదా ఎరువులను ఎల్లప్పుడూ సాయంత్రం వేళల్లో ఎండ తగ్గిన తర్వాత మాత్రమే మొక్కపై పిచికారీ చేయాలి. ఉదయం లేదా మధ్యాహ్నం ఎండలో స్ప్రే చేయకూడదు. మజ్జిగ స్ప్రే చేసిన మరుసటి రోజు లేదా మూడో రోజున సాధారణ మంచి నీటితో ఆకులపై ఉన్న మజ్జిగ అవశేషాలు పోయేలా స్ప్రే చేసి కడగాలి. సమస్య తీవ్రంగా ఉంటే వారానికి ఒకసారి, సాధారణ నివారణ కోసం నెలకు ఒకసారి ఈ స్ప్రేని ఉపయోగిస్తే కరివేపాకు మొక్క ఎటువంటి తెగుళ్లు లేకుండా నిగనిగలాడుతూ గుబురుగా పెరుగుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/craft-your-own-eco-friendly-clay-ganesha-in-10-minutes-for-vinayaka-chavithi-1907543.html</loc><lastmod>2026-09-09T17:36:36+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/vinayakudu-5-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Vinayakudu 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/vinayakudu-7.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా, బంకమట్టిని తీసుకోవాలి. దీనిని నీటితో కలిపి బాగా మెత్తగా ముద్దలా చేసుకోవాలి. ఆ తర్వాత, వివిధ పరిమాణాలలో పది గుండ్రటి ఉండలను తయారు చేసుకోవాలి. ఇందులో ఒక పెద్ద ఉండ బొజ్జకు, రెండు మధ్యస్థ ఉండలు బేస్, తల భాగానికి, ఇంకా చిన్నవి రెండు కాళ్ళకు, రెండు చేతులకు, చెవులకు, చివరిది తొండానికి కేటాయించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/vinayakudu-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానంలోకి వెళితే, ముందుగా బేస్ కోసం తీసుకున్న ఉండను తీసుకొని, దానిని చదునుగా చేసుకోవాలి. తర్వాత పెద్ద ఉండను, బొజ్జ కోసం తయారు చేసిన దానిని తీసుకొని, బేస్ పై గట్టిగా అలంకరించాలి. తర్వాత చిన్ని చిన్న ఉండలు తీసుకొని వాటిని కాళ్లు చేతుల ఆకారం చేసి, బొజ్జ ఉండకు అంటించాలి. తర్వాత తొండం కోసం ఒక ఉండను తీసుకొని దానిని సరైన ఆకారంలో చేసి బొజ్జకు అంటించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/vinayakudu-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు తల కోసం తీసుకున్న బంకమట్టి ఉండను తీసుకొని దానిని తల భాగంలో పైన అంటించాలి. బొజ్జ భాగం, తల భాగ సరిగ్గా కలిసేలా చూసుకోవాలి. తర్వాత చెవులు ఏర్పాటు చేయాలి. రెండు చిన్న ఉండలను తీసుకొని చెవుల మాదిరి తయారు చేసి, తలకు రెండు వైపులా అంటించాలి. ఆ తర్వాత, గణపతి దంతాలను చిన్న మట్టి ముక్కలతో అమర్చాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/vinayakudu-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు గణపతికి కళ్లను అమర్చాలి, తర్వాత చిన్న పుల్ల సహాయంతో నామాలు వత్తాలి. ఆతర్వాత కిరీటం మట్టి సహాయంతో తయారు చేసి అమర్చిన తర్వాత, చిన్న దారంతో జంధ్యం వేయాలి. ఆ తర్వాత చిన్న మట్టి ఉండను లడ్డూ ఆకారంలో చేసి గణపతి చేతిలో పెట్టాలి. అంతే మహా మట్టి గణపతి రెడీ.ఈ విధంగా తయారు చేసుకున్న మట్టి గణపతిని పూజించడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని నమ్మకం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/vinayakudu-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ ప్రక్రియ కేవలం పర్యావరణ హితమైనదే కాకుండా, భక్తి భావనను పెంచుతుంది. ఇంట్లో స్వయంగా గణపతిని తయారు చేసి పూజించడం ద్వారా భోగభాగ్యాలు, సకల ఐశ్వర్యాలు కలుగుతాయని, ఆ వినాయకుడు ఆశీర్వదిస్తాడని చెబుతారు. అంతేకాకుండా, నిమజ్జనం చేసే సమయంలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల కలిగే కాలుష్యం లేకుండా, మట్టి విగ్రహాలు నీటిలో సులభంగా కరిగిపోతాయి. ఈ పద్ధతిని అనుసరించి పండుగను పర్యావరణ హితంగా జరుపుకోండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/healthy-oil-free-chicken-recipe-cook-delicious-chicken-without-a-drop-of-oil-1907509.html</loc><lastmod>2026-09-09T17:05:42+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chiken.jpg</image:loc>
					<image:title><![CDATA[ Chiken ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chiken-4.jpg</image:loc><image:caption><![CDATA[ కావాల్సిన పదార్థాలు : చికెన్ లెగ్ పీస్‌లు 4, లవంగాలు నాలుగు, జాజికాయ , గస గసాలు, యాలకులు, మిరయాల పొడి, జీలకర్ర, సోంపు, చిన్న ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ, టీ స్పూన్ కారం, పసుపు, రుచికి సరిపడ ఉప్పు, కొబ్బరి పాలు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chiken-1.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీలోకి వెళితే.. పైన చెప్పిన అన్ని పదార్థాలను మిక్సీ జార్‌లో వేసి మంచిగా రుబ్బుకోవాలి. తర్వాత ఒక బౌల్‌లోకి ఆ పౌడర్ తీసుకోవాలి. అందులో కారం, పసుపు వేసి , నిమ్మరసం కూడా పోసి మంచిగా కలుపుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chiken-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు చికెన్ లెగ్ పీస్‌లను తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి, చాక్ తో గీతలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ లెగ్ పీస్‌లను తీసుకొని, మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ మాసాల పేస్ట్‌లో వేసి, మంచిగా వాటికి పట్టించాలి. ఇలా మొత్తం చికెన్‌కు గ్యాప్ లేకుండా పట్టించిన తర్వాత దీనిని ఫ్రిజ్‌లో పెట్టాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chiken-3.jpg</image:loc><image:caption><![CDATA[ మరసటి రోజు ఉదయం కొబ్బరి పాలు తీసుకోవాలి.  తర్వాత ఒక పాన్ తీసుకోవాలి. దానిని స్టవ్ పై పెట్టాలి. అందులో కొబ్బరి పాలు పోసి మరగ బెట్టాలి. అవి  బాగా మరిగిన తర్వాత మంట తక్కువ పెట్టి, మనం ముందుగా తీసుకున్న చికెన్ పీస్‌లను తీసుకొని కొబ్బరి పాలలో వేసి వాటిలో మంచిగా ఉడికించుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chiken-5.jpg</image:loc><image:caption><![CDATA[ అవి కాస్త బాగా ఉడికాయి అనిపించిన తర్వాత చికెన్ మూత తీసి వాటిని అటు ఇటు తిప్పి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే నూనెలోని చికెన్ లెగ్ పీస్‌లు రెడీ, తినడానికి కూడా ఇవి చాలా రుచికరంగా అద్భుతంగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/money-plant-for-prosperity-vastu-tips-for-correct-direction-and-day-to-attract-wealth-1907434.html</loc><lastmod>2026-09-09T15:41:14+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/money-plant-5-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Money Plant 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/money-plant-10.jpg</image:loc><image:caption><![CDATA[ మనీ ప్లాంట్ లేని ఇల్లే లేదు. చాలా మంది తమ ఇంటిలో మనీ ప్లాంట్ మొక్కను నాటుకుంటున్నారు. ఇది వాస్తు ప్రకారం కలిసి వస్తుంది అంతే కాకుండా, ఎవరి ఇంటిలో అయితే మనీ ప్లాంట్ మొక్క ఉంటుందో వారికి ఆర్థిక సమస్యలు ఉండవు అని అంటారు. అందుకే చాలా మంది తమ ఇంటి ముందు మనీ ప్లాంట్ మొక్కను నాటుకుంటున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/money-plant-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే మనీ ప్లాంట్ మొక్క నాటడం మంచిదే అయినప్పటికీ, దానిని నాటే సమయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. చాలా మంది రోజుతో సంబంధం లేకుండా మనీ ప్లాంట్ మొక్కను నాటుతుంటారు. అందువలన ఎప్పుడూ కూడా శుక్రవారం రోజున మనీ ప్లాంట్ మొక్కను నాటాలంట. దీని వలన అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/money-plant-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ అంతే కాకుండా, మనీ ప్లాంట్ నాటే సమయంలో కూడా తప్పకుండా సరైన దిశలో మాత్రమే నాటాలి. ఎప్పుడు కూడా మనీ ప్లాంట్‌ను మీ ఇంటిలో ఆగ్నేయ దిశలో ఉంచడం చాలా మంచిది. దీని వలన ఇంటిలో ఉన్న ప్రతి కూల శక్తి తొలిగిపోతుంది. సంపద పెరుగుతుంది. అన్ని విధాలుగా మీకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/money-plant-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ కొంత మంది తెలిసి తెలియక మనీ ప్లాంట్ మొక్కను ఈశాన్యం దిశలో నాటుతుంటారు. కానీ ఇలా ఈశాన్యంలో మనీ ప్లాంట్ మొక్కను నాటడం అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు పండితులు. దీని వలన ఆర్థిక, అప్పుల బాధలు ఎక్కువ అవుతాయంట. అంతే కాకుండా చాలా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందంట. అందువలన వీలైనంత వరకు ఈశాన్యంలో మనీ ప్లాంట్ మొక్క నాటకూడదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/money-plant-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/amavasya-2026-sept-11-visha-yoga-to-bring-financial-troubles-for-leo-libra-aquarius-1907442.html</loc><lastmod>2026-09-09T15:40:07+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/amavasya-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Amavasya ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/amavasya-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ సెప్టెంబర్ 11 అమావాస్య, ఈ రోజున చంద్రుడు సింహ రాశి నుంచి కన్యా రాశిలోకి సంచారం చేస్తుంటాడు. అయితే ఇదే సమయంలో శని విష యోగాన్ని ఏర్పరుస్తుంది. దీని వలన పన్నెండు రాశుల్లో మూడు రాశుల వారికి ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. అంతే కాకుండా అనేక రకాలుగా కష్టాలను ఎదుర్కుంటారు. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే? ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/amavasya-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ సింహ రాశి : సింహ రాశి వారు అమావాస్య నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు అనేక ఇబ్బందులు ఎదుర్కునే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. చాలా రోజుల నుంచి మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా నిరాశే ఎదురవుతుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అప్పుల బాధలు అధికం అవుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/amavasya-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ తుల రాశి : తుల రాశి వారికి కూడా ఆర్థిక పరమైన కష్టాలు అధికం అవుతాయి. చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఆదాయం తగ్గుతుంది. బంధువుల నుంచి మాట పట్టింపులు ఎదురు అయ్యే ఛాన్స్ ఉంది. అందువలన ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పని చేసినా, ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయడం ఉత్తమం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/amavasya-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ కుంభ రాశి : కుంభ రాశి వారు మానసికంగా కుంగిపోతుంటారు. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.  ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చులు కూడా అదే రీతిలో ఉంటాయి. దీంతో ఈ రాశి వారు ఆర్థికంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగం లభించదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/amavasya-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/know-this-7-episodes-emraan-hashmi-series-still-trending-in-ott-last-8-months-that-is-taskaree-the-smuggler-1907387.html</loc><lastmod>2026-09-09T14:03:50+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/taskaree-the-smuggler-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Taskaree The Smuggler ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/taskaree-the-smuggler.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ రోజుల్లో ఓటీటీలో రకరకాల కంటెంట్ చిత్రాలు ఎప్పటికప్పుడు విడుదలవుతూనే ఉంటాయి. ఒక సిరీస్ ఎక్కువ కాలం నిలదొక్కుకోవడం కష్టంగా మారింది. కానీ ఒక సిరీస్ మాత్రం గత ఎనిమిది నెలలుగా టాప్ 10లో కొనసాగుతోంది. ఈ 7-ఎపిసోడ్‌ల సిరీస్, ఓటీటీలో అత్యధికంగా వీక్షించబడిన భారతీయ సిరీస్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ విజయం చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే ప్రేక్షకులకు వేలాది ఎంపికలు అందుబాటులో ఉండే ఓటీటీ వంటి వేగవంతమైన మాధ్యమంలో, ఒక సిరీస్ ఎక్కువ కాలం నిలదొక్కుకోవడం చిన్న విషయం కాదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/taskaree-the-smuggler-new.jpg</image:loc><image:caption><![CDATA[ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో సంచలనం సృష్టిస్తున్న &#039;టస్కారి: ది స్మగ్లర్స్&#039; సిరీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ సిరీస్‌లో ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్ర పోషించారు. ఒకప్పుడు బాలీవుడ్ సీరియల్ కిస్సర్‌గా పేరుగాంచిన ఇమ్రాన్ హష్మీ నటించిన ఈ సిరీస్ జనవరి 14న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. జనవరి నుంచి ఇప్పుడు సెప్టెంబర్ వరకు ఈ సిరీస్ ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ సిరీస్ విడుదలైన సమయంలో నంబర్ వన్ స్థానంలో ఉండేది. ఇప్పుడు నంబర్ వన్‌లో లేనప్పటికీ, ఇది స్థిరంగా టాప్-10లో కొనసాగుతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/taskaree-the-smuggler-ne.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రజలు ఈ సిరీస్‌ను చూడటానికి ఇష్టపడతారు, ఈ కారణాల వల్లే ఇది ఇప్పుడు 10వ స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది, కానీ టాప్ 10 నుండి బయటకు వెళ్లలేకపోతోంది. ఈ సిరీస్‌కు IMDbలో 7.1 రేటింగ్ లభించింది. ఇప్పటివరకు నెట్‌ఫ్లిక్స్‌లో చాలా సిరీస్‌లు వచ్చాయి, కానీ ఏదీ &#039;టస్కరీ&#039; ఆకర్షణను అందుకోలేకపోయింది. ఈ సిరీస్ కథ విషయానికి వస్తే, ఇది ముంబై విమానాశ్రయంలో జరిగే స్మగ్లింగ్ చుట్టూ తిరుగుతుంది. ఒక అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాకు వ్యతిరేకంగా పోరాడే కస్టమ్స్ శాఖ సిబ్బంది బృందం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/taskaree-the-smuggler-ott.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ ఉత్కంఠభరితమైన కథ థ్రిల్ ,సస్పెన్స్‌తో నిండి ఉంటుంది. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో ఇమ్రాన్ హష్మీతో పాటు జోయా అఫ్రోజ్, అనురాగ్ సిన్హా, అమృత ఖాన్విల్కర్, నందిష్ సంధు , శరద్ కేల్కర్ ప్రధాన పాత్రల్లో నటించారు. మీరు &#039;టాస్కారి: ది స్మగ్లర్స్&#039; సిరీస్ చూడాలనుకుంటే, దానిని నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/taskaree-the-smuggler-telug.jpg</image:loc><image:caption><![CDATA[ ఇమ్రాన్ హాష్మీ (కస్టమ్స్ ఆఫీసర్ అర్జున్ మీనా పాత్రలో), శరద్ కేల్కర్ (స్మగ్లింగ్ సిండికేట్ హెడ్ బడా చౌదరిగా), నందీష్ సంధు, అమృతా ఖాన్విల్కర్, జోయా అఫ్రోజ్ , అనురాగ్ సిన్హా కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. దీనిని ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండే రూపొందించారు. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్  లో అందుబాటులో ఉంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/1-kg-mutton-thick-gravy-curry-recipe-perfect-with-chapati-biryani-and-rice-1907385.html</loc><lastmod>2026-09-09T13:58:57+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/mutton-9.jpg</image:loc>
					<image:title><![CDATA[ Mutton ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/mutton-1.jpg</image:loc><image:caption><![CDATA[ కేజీ మటన్‌తో నిండుగా, చిక్కటి గ్రేవీతో కూడిన ఈ కర్రీ అన్నం, చపాతీ, బిర్యానీ, పులావ్ వంటి వాటితో దేనితోనైనా అత్యంత రుచికరమైన కాంబినేషన్‌గా ఉంటుంది. మటన్ ఇష్టం లేని వారు కూడా ఈ వంటకాన్ని రుచి చూసిన తర్వాత దీనికి పక్కా ఫ్యాన్స్ అవుతారు. రుచికరమైన మటన్ కర్రీని ఇంట్లోనే సులభంగా, రుచిగా తయారు చేసుకునే విధానాన్ని ఇక్కడ తెలుసుకుందాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/mutton.jpg</image:loc><image:caption><![CDATA[ కావాల్సిన పదార్థాలు: ఒక కిలో మటన్,  2 టేబుల్ స్పూన్లు కారం, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు,  అర టేబుల్ స్పూన్ పసుపు,  1 టేబుల్ స్పూన్ నూనె,  ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం,  ఒక పెద్ద  అల్లం ముక్క, 10 వెల్లుల్లి, రెండు టమాటాలు,  ఒక ఉల్లిపాయ, 
కరివేపాకు 2 రెమ్మలు,  కొత్తిమీర తరుగు పావు కప్పు, నువ్వులు 1 టేబుల్ స్పూన్,  ఎండు కొబ్బరి పొడి  1 టేబుల్ స్పూన్,  
రెండు టేబుల్ స్పూన్స్ గసగసాలు: 2 టీస్పూన్లు,  పచ్చిమిరపకాయలు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, యాలక్కాయలు, చిన్న బిర్యానీ ఆకు, మిరియాలు, జీలకర్రను తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/mutton-1-4.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా, కేజీ మటన్‌ను మీడియం సైజు ముక్కలుగా కోసి, నాలుగైదు సార్లు శుభ్రంగా కడగాలి. చివరిసారిగా, కొద్దిగా ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలిపి కడిగి, నీళ్లన్నీ వాడ్చి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల నీచు వాసన పూర్తిగా పోతుంది. ఇప్పుడు మటన్ ముక్కల్లో 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అర టీస్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి ముక్కలకు బాగా పట్టించి, ఒక గంట పాటు మ్యారినేట్ చేయాలి. వీలైతే, ముందురోజు రాత్రే ఫ్రిజ్‌లో ఉంచితే మటన్ మరింత మృదువుగా అవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/mutton-2.jpg</image:loc><image:caption><![CDATA[ స్టవ్ మీద ఒక గిన్నె లేదా కుక్కర్ పెట్టి, 1 టేబుల్ స్పూన్ నూనె వేయాలి. నూనె వేడెక్కాక, 2 అంగుళాల అల్లం ముక్కలు, 10-15 వెల్లుల్లి రెబ్బలు, పెద్ద ముక్కలుగా కోసిన 2 టమాటాలు, 1 పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిసేపు మగ్గించాలి. టమాటా, ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత, 2 రెమ్మల కరివేపాకు, పావు కప్పు కొత్తిమీర తరుగు వేసి కలపాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి (లేదా ముక్కలు), 2 టీస్పూన్ల గసగసాలు వేసి రెండు-మూడు నిమిషాల పాటు చిన్న మంటపై వేయించి, స్టవ్ ఆపి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్‌లోకి తీసుకుని, కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/mutton-4.jpg</image:loc><image:caption><![CDATA[ అదే ప్రెషర్ కుక్కర్‌ను తిరిగి స్టవ్ మీద పెట్టి, 3 టేబుల్ స్పూన్ల నూనె, 1 టేబుల్ స్పూన్ బటర్  వేయాలి. బటర్ కరిగి నూనె వేడెక్కాక, సన్నగా పొడుగ్గా కట్ చేసిన 3-4 పచ్చిమిరపకాయలు,  గరం మసాలా వేసి లైట్‌గా వేయించాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న మటన్ ముక్కలు వేసి, పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించాలి. నీళ్లు అస్సలు కలపకుండా, కుక్కర్ మూత పెట్టి, మటన్ ముదిరిన దాన్ని బట్టి నాలుగు-ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ప్రెషర్ పూర్తిగా తగ్గిన తర్వాత మూత తీసి చూడండి, మటన్ ముక్కలు మెత్తగా ఉడికి ఉండాలి.మళ్ళీ స్టవ్ ఆన్ చేసి, ఉడికించిన మటన్‌లోకి మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్‌ను వేయాలి. గ్రేవీ చిక్కదనాన్ని బట్టి నీళ్లు పోసి బాగా కలపాలి. రుచి చూసి, అవసరమైతే ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్‌లో గ్రేవీ ఉడుకుతున్నప్పుడు, 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసి అంతా బాగా కలపాలి. తిరిగి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి, ఒకే ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించి, స్టవ్ ఆపివేయాలి. ప్రెషర్ పూర్తిగా తగ్గిన తర్వాత మూత తీసి, సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయాలి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/diabetes-breakfast-sprouts-coconut-peanuts-and-rajma-for-a-protein-and-fiber-rich-morning-meal-1907365.html</loc><lastmod>2026-09-09T13:45:58+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/coconut-7.jpg</image:loc>
					<image:title><![CDATA[ Coconut 7 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/coconut-6.jpg</image:loc><image:caption><![CDATA[ మధుమేహం నేడు ఒక మహమ్మారిలా విస్తరిస్తోంది. మన తెలుగు రాష్ట్రాలలో ప్రతి 100 మందిలో 30 మందికి మధుమేహం ఉన్నట్లు గత కొన్ని సంవత్సరాల గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితి నుంచి బయట పడటం  డాక్టర్ల చేతిలో కాదు, మీ చేతుల్లోనే ఉందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.  సరైన ఆహార నియమాలు పాటిస్తే షుగర్ రాకుండా చేసుకోవచ్చని, వచ్చిన వారు కూడా దీనిని నియంత్రించవచ్చని అంటున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/coconut.jpg</image:loc><image:caption><![CDATA[ మధుమేహానికి ప్రధాన కారణం రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం. ఈ చక్కెర స్థాయిలను పెంచేవి పిండి పదార్థాలు .మనం ఎంత ఎక్కువ పిండి పదార్థాలు తింటే, అంత ఎక్కువ చక్కెర రక్తంలో తయారవుతుంది. ఈ చక్కెరను పని రూపంలో ఖర్చు చేయకపోతే, అది రక్తంలో పేరుకుపోయి షుగర్ వ్యాధికి దారితీస్తుంది. ప్రోటీన్లు, కొవ్వుల విషయంలో కాకుండా, పిండి పదార్థాల విషయంలోనే మొదట ఆలోచించి తీసుకోవాలని అంటున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/coconut-1.jpg</image:loc><image:caption><![CDATA[ మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి సూర్యుడి గమనంపై ఆధారపడి ఉంటుందని డాక్టర్ మంతెన వివరించారు. ఉదయం 8-9 గంటల నుండి ఇన్సులిన్ ఉత్పత్తి ప్రారంభమై, మధ్యాహ్నం 11 గంటల నుండి 1 గంట వరకు గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఆ తర్వాత, ఇన్సులిన్ ఉత్పత్తి క్రమంగా తగ్గుతూ వస్తుంది. కాబట్టి, ఇన్సులిన్ అధికంగా ఉత్పత్తి అయ్యే సమయంలో ఆహారం తీసుకుంటే, అది రక్తంలోని చక్కెరను సమర్థవంతంగా కణాల్లోకి చేర్చి శక్తిగా మారుస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/coconut-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఉదయం బ్రేక్ ఫాస్ట్ గట్టిగా తినాలి. వారంలో కనీసం ఐదు నుండి ఆరు రోజులు ఇడ్లీ, దోశ, ఉప్మా, పెసరట్ల వంటి వాటికి బదులుగా మొలకలు, కొబ్బరి ముక్కలు, పల్లీలు, ఫ్రూట్స్ (రేక్కాయలు, జామకాయ, దానిమ్మ గింజలు, నేరేడు, పైనాపిల్ ముక్కలు) వంటివి తీసుకోవాలి. ఇవి రక్తంలో చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తాయి ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉంటాయి. శని, ఆదివారాల్లో టిఫిన్లు తినాలనుకుంటే, మైదా కాకుండా మిల్లెట్స్ తో చేసినవి, ప్రోటీన్ అధికంగా ఉండే గారెలు, వడలు, పెసరట్లు, మినప ఆవిరి కుడుములను తినాలని చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/coconut-5.jpg</image:loc><image:caption><![CDATA[ డిన్నర్ మానేసిన వాళ్లు మధ్యాహ్న భోజనాన్ని  మూడు గంటలకు పుష్టిగా తినాలని అంటున్నారు. ఈ భోజనంలో పుల్కాలు, జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు, మల్టీగ్రెయిన్ పిండితో చేసిన రొట్టెలు రెండు తీసుకోవచ్చు. ఆకుకూరలో పప్పు వేసి వండుకోవచ్చు. వెజిటేబుల్ కర్రీలో శనగలు, బఠానీలు, బొబ్బర్లు, రాజ్మా వంటి గింజలు వేయించుకొని తీసుకోవడం వల్ల ప్రోటీన్,  ఫైబర్ అధికంగా అందుతాయి. కావాలనుకుంటే, మిల్లెట్స్ అన్నం కొద్దిగా పెట్టుకొని పెరుగుతో తినవచ్చు. ఇన్సులిన్ అధికంగా ఉన్న మధ్యాహ్నం సమయంలో భోజనం చేయడం వల్ల చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/6-zodiac-signs-likely-to-overcome-health-problems-by-the-end-of-october-1907340.html</loc><lastmod>2026-09-09T13:07:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/health-astrology.jpg</image:loc>
					<image:title><![CDATA[ Health Astrology ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/1-mesha-rashi-31.jpg</image:loc><image:caption><![CDATA[ మేషం: ఈ రాశివారికి లాభ స్థానంలో రాహువు సంచారం వల్ల డిసెంబర్ 5 లోగా ఎటువంటి అనారోగ్యాల నుంచైనా కోలుకోవడానికి అవకాశం ఉంది. సుఖ స్థానమైన చతుర్థ స్థానంలో గురువు కూడాఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల అనారోగ్యం కలగడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. దీర్ఘకాలిక అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నవారికి సరైన వైద్యం లభించే అవ కాశం ఉంది. శస్త్ర చికిత్సలకు అవకాశం ఉండకపోవచ్చు. ఇతరుల మీద ఆధారపడడం జరగదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/2-vrushaba-rasi-41-4.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభం: ఈ రాశివారికి రాశ్యధిపతి శుక్రుడి అనుకూలతతో పాటు, లాభ స్థానంలో శనీశ్వరుడి స్థితి వల్ల అనారోగ్యాల నుంచి చాలావరకు కోలుకునే అవకాశం ఉంది. అనారోగ్యాలు లేనివారికి ఆరోగ్య భంగం జరిగే అవకాశం లేదు. దీర్ఘకాలిక అనారోగ్యాలతో అవస్థలు పడుతున్నవారికి చాలా వరకు విముక్తి లభించే అవకాశం ఉంది. వైద్య ఖర్చులు బాగా తగ్గుముఖం పడతాయి. శస్త్ర చికిత్సలకు ఆస్కారం లేదు. సరైన వైద్యుడు, చికిత్స అందుబాటులో ఉంటాయి. ప్రమాదాలకు అవకాశంలేదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/6-kanya-rashi-31.jpg</image:loc><image:caption><![CDATA[ కన్య: ఈ రాశికి లాభ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్నందువల్ల అక్టోబర్ 31 లోగా ఈ రాశివారు  ఎటువంటి అనారోగ్యం నుంచి అయినా కోలుకునే అవకాశం ఉంది. అనారోగ్యాలు దగ్గ రకు వచ్చే అవకాశం లేదు. దీర్ఘకాలిక అనారోగ్యాలు, మొండి వ్యాధుల నుంచి కూడా చాలావరకు ఉపశమనం లభిస్తుంది. సరైన వైద్యం, సరైన చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. వైద్య ఖర్చులు బాగా తగ్గుతాయి. అయితే, ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/7-tula-rashi-41-3.jpg</image:loc><image:caption><![CDATA[ తుల: ఈ రాశికి లాభ స్థానంలో లాభాధిపతి రవి, కేతువుల సంచారం వల్ల ఈ రాశివారికి డిసెంబర్ 5 లోగా అనారోగ్యాల నుంచి పూర్తిగా విముక్తి లభించే అవకాశం ఉంది. అనారోగ్యాలు ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం లేదు. ఆరోగ్యం బాగా మెరుగ్గా సాగిపోతుంది.  చిన్న అనారోగ్యం చేసినా అతి త్వరగా, అతి వేగంగా తగ్గిపోయే అవకాశం ఉంది. సరైన వైద్యుడు దొరకడం, సరైన చికిత్స లభ్యం కావడం జరుగుతుంది. శస్త్రచికిత్సలకు అవకాశం లేదు. వైద్య ఖర్చులు బాగా తగ్గుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/8-vrushchika-rashi-21-2.jpg</image:loc><image:caption><![CDATA[ వృశ్చికం: ఈ రాశివారికి లాభ స్థానంలో ఈ నెల 23 వరకు బుధుడు, ఆ తర్వాత అక్టోబర్ 16 వరకు రవి  సంచారం వల్ల దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. సాధారణంగా అనారో గ్యంతో అవస్థపడడం జరగకపోవచ్చు. సరైన వైద్యుడు అందుబాటులోకి రావడం జరుగుతుంది. ప్రస్తుతానికి స్వల్ప అనారోగ్యం కూడా దగ్గరికి వచ్చే అవకాశం లేదు. వైద్య ఖర్చులు బాగా తగ్గు తాయి. దీర్ఘకాలిక అనారోగ్యాలు, మొండి వ్యాధులు కూడా తప్పకుండా తగ్గుముఖం పడతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/9-dhanusu-rashi-11-2.jpg</image:loc><image:caption><![CDATA[ ధనుస్సు: ఈ రాశికి లాభ స్థానంలో జనవరి 2 వరకు శుక్రుడి స్వస్థాన సంచారం వల్ల ఎటువంటి అనారోగ్యం నుంచైనా క్రమంగా కోలుకోవడం జరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం లభి స్తుంది. స్వల్పకాలిక అనారోగ్యాలకు కూడా అవకాశం ఉండదు. అనుకోకుండా సరైన చికిత్స లభించి దీర్ఘకాలిక అనారోగ్యాలు, మొండి వ్యాధుల నుంచి పూర్తిగా కోలుకోవడం జరుగుతుంది.  అయితే,ఆహార, విహారాల్లో జాగ్రత్త అవసరం. వైద్య ఖర్చులు తగ్గడమే తప్ప పెరిగే అవకాశం లేదు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/soft-and-delicious-ragi-boorelu-recipe-easy-tips-to-make-perfectly-fluffy-ragi-boorelu-at-home-1907332.html</loc><lastmod>2026-09-09T13:02:25+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ragi-burelu.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ragi Burelu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ragi-burelu-1.jpg</image:loc><image:caption><![CDATA[ రాగి బూరెలు మన సంప్రదాయ వంటకాల్లో ఒకటి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి, కానీ చాలామందికి వీటిని మెత్తగా, పొంగేలా చేయడం కష్టంగా అనిపిస్తుంది. సరైన పద్ధతిలో, కొన్ని చిట్కాలు పాటిస్తే ప్రతిసారీ అద్భుతమైన రాగి బూరెలను తయారుచేసుకోవచ్చు. ఇక్కడ  మెత్తటి, పొంగే రాగి బూరెలు ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ragi-burelu-2.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీకి కావలసిన పదార్థాలు: ఒక కప్పు రాగిపిండి,  ఒక కప్పు గోధుమ పిండి , కొద్దిగా ఉప్పు,  పావు కప్పు ఎండు కొబ్బరి తురుము, 
రెండు టీ స్పూన్స్ నువ్వులు , ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఒక టేబుల్ స్పూన్ చక్కెర పొడి,  ఒక కప్పు బెల్లం తురుము, 
పావు నీళ్లు  కప్పు బెల్లం కరిగించడానికి అవసరమైనంత తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ragi-burelu-4.jpg</image:loc><image:caption><![CDATA[ పిండి మిశ్రమం సిద్ధం చేయడం :  ముందుగా, ఒక బౌల్‌లో ఒక కప్పు రాగిపిండి, ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. ఈ రెండు పిండిలను కలిపి వేయడం వల్ల బూరెలు మెత్తగా వస్తాయి. దీనిలో చిటికెడు ఉప్పు, 1/4 కప్పు ఎండు కొబ్బరి తురుము (లేదా పచ్చి కొబ్బరి), 2 టీస్పూన్ల నువ్వులు (వేయించనివి), 1 టీస్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలపాలి. నువ్వులు ఇష్టం లేకపోతే వాటిని వేయడం మానేయవచ్చు. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి.స్టవ్ మీద పాన్ పెట్టి, ఒక కప్పు బెల్లం తురుము, 1/4 కప్పు నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్‌లో బెల్లం కరిగే వరకు ఉంచాలి. పాకం రానవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా బెల్లం కలుపుకోవచ్చు, తక్కువ తినేవారు తగ్గించుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ragi-burelu-5.jpg</image:loc><image:caption><![CDATA[ బెల్లం పూర్తిగా కరిగాక స్టవ్ ఆఫ్ చేయాలి.కరిగిన బెల్లం నీళ్లను పిండి మిశ్రమంలో వడగట్టాలి. ఇలా చేయడం వల్ల బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే తొలగిపోతాయి. బెల్లం నీళ్లు వేడిగా ఉంటాయి కాబట్టి ముందుగా స్పూన్‌తో బాగా కలిపి, తర్వాత చేత్తో ప్రెస్ చేస్తూ కలపాలి. అవసరమైతే కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తటి ముద్దలా కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కలపకూడదు. పిండి కొద్దిగా లూజ్‌గా, చేతికి అంటుకునేలా ఉండాలి. గట్టిగా కలిపితే బూరెలు పొంగవు, చెక్కల్లాగా ఉంటాయి. పిండిని ఎంత మెత్తగా కలిపితే బూరెలు అంత బాగా పొంగుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ragi-burelu-6.jpg</image:loc><image:caption><![CDATA[ పిండిని కలిపిన తర్వాత, చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని, పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఏదైనా ప్లాస్టిక్ కవర్ పైన ఈ ఉండలను పెట్టి, బూరెల్లాగా ఒత్తుకోవాలి. బూరెలు మరీ పల్చగా కాకుండా, కొద్దిగా మందంగా ఒత్తుకోవాలి. పలుచగా ఒత్తినా పొంగకుండా చెక్కల్లాగా అవుతాయి. స్టవ్ మీద డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె పెట్టి, బాగా వేడెక్కనివ్వాలి. నూనె చాలా వేడిగా ఉండాలి. నూనె వేడైన తర్వాత, ఒత్తుకున్న బూరెలను ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. బూరెను నూనెలో వేసిన వెంటనే గరిటెతో బూరెపై నూనెను వేస్తూ ఉండాలి. ఇలా చేస్తే బూరెలు బాగా పొంగుతాయి. ఒక బూరె పొంగి పైకి తేలాక, ఇంకొక బూరెను వేసుకోవచ్చు. రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించి, నూనె నుండి తీసి ప్లేట్‌లో వేసుకోవాలి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/6-zodiac-signs-set-for-financial-growth-as-wealth-planet-brings-new-opportunities-1907303.html</loc><lastmod>2026-09-09T12:49:39+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/money-astrology-2026.jpg</image:loc>
					<image:title><![CDATA[ Money Astrology 2026 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/1-mesha-rashi1-2.jpg</image:loc><image:caption><![CDATA[ మేషం: ఈ రాశికి ధన స్థానాధిపతి శుక్రుడు స్వస్థానంలో సంచారం చేస్తున్నందువల్ల  వీరికి జనవరి 2 వరకు ఆదాయం వృద్ధి చెందడమే తప్ప తగ్గడం జరగకపోవచ్చు. ఆదాయ ప్రయత్నాల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. ప్రయాణాల వల్ల బాగా లాభాలు కలుగుతాయి. ప్రముఖు లతో పరిచయాలు విస్తరించి, ఆదాయ వృద్ధికి అవకాశాలు లభిస్తాయి. ఈ నెల 23 తర్వాత వీరికి అనేక పర్యాయాలు ధనయోగాలు  కలుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/2-vrushaba-rasi1-2.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభం: ఈ రాశికి ధన స్థానాధిపతి బుధుడు పంచమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల ఈ రాశివారికి కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. షేర్ల వ్యాపారం బాగా లాభిస్తుంది. నెలాఖరులోగా ఆస్తి సమస్యలు, ఆర్థిక సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఆస్తి, ఆర్థిక ఒప్పందాలు కుదురుతాయి. భాగస్వామ్య వ్యాపా రాల వల్ల బాగా లబ్ధి పొందుతారు. అరుదైన విదేశీ ఆఫర్లు అందుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/3-mithuna-rashi1-2.jpg</image:loc><image:caption><![CDATA[ మిథునం: ఈ రాశికి ధన స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం వల్ల అక్టోబర్ 31 లోపల ఈ రాశికి అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆదాయ వృద్దికి కొత్త అవకాశాలు లభిస్తాయి. తల్లి తండ్రుల నుంచి సంపద లభించే అవకాశం ఉంది. ప్రభుత్వమూలక ధన లాభం, గుర్తింపు కలు గుతాయి. రాజీమార్గంలో ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు పరిష్కారమై విలువైన ఆస్తిపాస్తులు లభి స్తాయి. కొద్ది ప్రయత్నంతో ఉద్యోగంలో పదోన్నతులు, జీతభత్యాల  పెరుగుదలకు అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/5-simha-rashi1-2.jpg</image:loc><image:caption><![CDATA[ సింహం: ఈ రాశికి ధన స్థానంలో బుధుడి ఉచ్ఛ స్థితి వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. శ్రమ తక్కువ లాభం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లోనే కాక, ఉద్యోగ మార్పు ప్రయత్నాల్లో కూడా విజయం సాధిస్తారు. శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశీ సంపాదన యోగం కలుగుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో సంపన్న కుటుంబంతో సంబంధం కుదిరే అవకాశం ఉంది. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమై ఆశించిన భూలాభం కలుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/6-kanya-rashi1-2.jpg</image:loc><image:caption><![CDATA[ కన్య: ఈ రాశికి ధన స్థానంలో ధనాధిపతి శుక్రుడి సంచారం వల్ల ఈ ఏడాదంతా ఈ రాశివారు ఆదాయ వృద్ధికి, శుభ కార్యాలకు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. కొద్ది ప్రయత్నంతో తప్పకుండా విదేశీ అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఏ అవకాశాన్నీ జారవిడుచుకోవద్దు.. ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/10-makara-rashi1-2.jpg</image:loc><image:caption><![CDATA[ మకరం: ఈ రాశికి ధన స్థానాధిపతి అయిన శనీశ్వరుడు తృతీయ స్థానంలో సంచారం వల్ల కొద్ది ప్రయ త్నంతో ఆర్థిక పరిస్థితి ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో అదనపు ఆదాయం వృద్ధి చెందుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. కొద్ది ప్రయత్నంతో ఆస్తి లాభం కలుగుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/creative-ways-to-repurpose-your-old-tv-remote-for-diy-and-home-use-1907269.html</loc><lastmod>2026-09-09T12:30:18+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/recycle-old-remotes.jpg</image:loc>
					<image:title><![CDATA[ Recycle Old Remotes ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/old-remote-repurpose-5.jpg</image:loc><image:caption><![CDATA[ కంప్యూటర్ రిమోట్ : ఒక వేళ మీకు ఎలక్ట్రానిక్స్‌పై ఆసక్తి ఉంటే ఈ పాత రిమోట్‌లోని సర్క్యూట్ బోర్డ్, ఇన్‌ఫ్రారెడ్ ఎల్ఈడీ వంటి భాగాలను గమనించి బేసిక్ ఎలక్ట్రానిక్స్ నేర్చుకోవచ్చు. అలాగే సరైన IR రిసీవర్, కరెక్ట్ సాఫ్ట్‌వేర్ ఉంటే ఈ పాత రిమోట్‌తోనే కంప్యూటర్‌లో మీడియా ప్లేయర్‌ను ఆపరేట్ చేయొచ్చు. ఇది మీకు చాలా వరకు ఖర్చును తగ్గిస్తుంది. అలాగే ఎలక్ట్రానిక్స్‌పై మీ నాలెడ్జ్‌ను పెంచుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/old-remote-repurpose-3.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యువెలరీ ఆర్గనైజర్: ఈ పాత రిమోట్లను టీవీలకే కాకుడా ఇంట్లోని సెక్యూరిటీ కెమెరాలు, సెట్-టాప్ బాక్స్‌లు లేదా మీడియా పరికరాలు కూడా వాడుకోచ్చు. ఎలా అంటే టీవీ రిమోట్లు ఈ ఉపకరణాల IR రిమోట్లను సపోర్ట్ చేసేలా ఉంటాయి. కాబట్టి మీ పాత రిమోట్ వీటికి సరిపోలితే, మెయిన్ రిమోట్ పాడైనప్పుడు వీటిని ఆల్‌టర్నేట్‌గా వాడుకోవచ్చు. అంతేకాదు రిమోట్‌లోని బటన్స్‌ను తీసేసి మీరు దాన్ని జ్యువెలరీ ఆర్గనైజర్‌గా కూడా వాడుకోవచ్చు. బటన్స్ తొలగించిన ప్లాస్టిక్ పౌచ్‌ను ఓ పలకకు అమర్చీ కమ్మలు, ఉంగరాలు, గొలుసులు భద్రపరుచుకునే స్టాండ్‌గా మార్చుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/old-remote-repurpose-4.jpg</image:loc><image:caption><![CDATA[ పిల్లల క్రాఫ్ట్స్, బొమ్మలు: రబ్బరు బటన్లు, ప్లాస్టిక్ భాగాలతో చిన్న రోబోట్లు, రాకెట్లు, కార్లును కూడా తయారుచేయవచ్చు. వీటికి పదునైన అంచులు ఉంటాయి కాబట్టి పిల్లలకు ఇచ్చేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు రిమోట్‌లోని బటన్స్ క్లీన్ చేసి బ్యాటరీ లేకుండానే కంట్రోల్ ప్యానెల్‌గా తయారు చేయవచ్చు. ఇంది పిల్లలు ఆడుకోవడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/old-remote-repurpose-1.jpg</image:loc><image:caption><![CDATA[ అలాగే రిమోట్ పైభాగాన్ని శుభ్రం చేసి రంగు కాగితాలు లేదా స్టిక్కర్లతో అలంకరించి వాటిపై పెన్నులు, పెన్సిళ్లు పెట్టుకునే చిన్న డెస్క్ ఆర్గనైజర్‌గా వాడుకోవచ్చు. అలాగే దాన్ని ఓ జ్ఞాపకంగా కూడా వాడొచ్చు. మీ ఇంట్లో ఏళ్ల తరబడి వాడిన పాత టీవీకి సంబంధిచిన రిమోట్‌ను క్లీన్ చేసి ఒక బాక్స్‌లో ఉంచి భద్రపరుచుకోవచ్చు. అంతేకాదు రిమోట్‌కు ఉన్న బటన్స్‌ను కార్ట్‌ బోర్డుకు అతికించి అక్షరాలు, రోబోట్‌లను తయారు చేయొచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/old-remote-repurpose.jpg</image:loc><image:caption><![CDATA[ ఒక వేల మీ పాత రిమోట్ మీకు అసలు ఎలాంటి పనికి రాదు అనుకుంటే దాన్ని నార్మల్‌గా చెత్తలో పడేయకుండా..ఈ-వ్యర్థాల సేకరణ కేంద్రానికి ఇచ్చేయండి. అలాగే రిమోట్‌లోని బ్యాటరీలను బయటకు తీసి వాటిని ప్రత్యేక బ్యాటరీ డిస్పోజల్ కేంద్రాలకు ఇచ్చేయండి. కాబట్టి ఈ సారి మీ రిమోట్ పాడైతే అనవసరంగా పాడేయకుండా ఇలా ప్రయత్నంచండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/ukadiche-modak-recipe-make-soft-steamed-modaks-with-coconut-jaggery-filling-for-ganesh-chaturthi-1907216.html</loc><lastmod>2026-09-09T13:43:26+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/modakalu-4.jpg</image:loc>
					<image:title><![CDATA[ Modakalu 4 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/modakalu.jpg</image:loc><image:caption><![CDATA[ మోదకాలకు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు నీరు, ఒక టీస్పూన్ నెయ్యి, చిటికెడు ఉప్పు, కొబ్బరి-బెల్లం పూరణం కోసం, ఒక కప్పు తాజాగా తురిమిన కొబ్బరి, పావు కప్పు తురిమిన పొడి చేసిన బెల్లం, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 1 టీస్పూన్ నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/modakalu-1.jpg</image:loc><image:caption><![CDATA[ మోదకాల తయారీ విధానం:  ఒక కప్పు నీటిని తీసుకుని ఒక పాత్రలో మరిగించి, దానిలో చిటికెడు ఉప్పు, ఒక  టేబుల్ స్పూన్ కూడా  నెయ్యి  కూడా దీనిలో వేయాలి. ఈ నీరు మరిగిన తర్వాత ముందుగా తీసుకున్న కప్పు బియ్యం పిండిని కొద్దికొద్దిగా పోస్తూ ఉండలు దీనిని కలపాలి. ఆ తర్వాత మంటను ఆపి మూతపెట్టి కొద్దిసేపు పక్కన పెట్టాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/modakalu-2.jpg</image:loc><image:caption><![CDATA[ కొబ్బరి-బెల్లం పూరణం: మరో పాన్ లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, తురిమిన కొబ్బరి పొడి , బెల్లం కూడా దీనిలో వేసి మీడియం మంటపై దీనిని మెల్లిగా కలుపుతూ మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికించాలి. బెల్లం కరిగిన తరవాత ఒక యాలకుల పొడి, ఇంకా మీరు  కావాలంటే  పంచదార పొడి, డ్రైఫ్రూట్స్ వేసి దీనిని మంచిగా కలిపి చల్లారనివ్వాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/modakalu-3.jpg</image:loc><image:caption><![CDATA[ మోదక్ పిండి తయారీ: ఇప్పుడు బియ్యం పిండిని తీసుకుని కొద్దిగా వేడి మీద  ఉన్నప్పుడే మీరు చేతులకు నెయ్యి రాసుకుని దీనిని  మెత్తగా పిండిలా కలపాలి. పిండి మరి పొడిగా మీకు అనిపిస్తే కొద్దిగా వేడి నీరు చల్లి గట్టిగా చేసుకోవాలి. మోదక్‌ల ను తీసుకోవాలి. ఈ  పిండిని చిన్న ఉండలుగా చేసుకుని చేతితో పలుచగా చేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/modakalu-5.jpg</image:loc><image:caption><![CDATA[ మధ్యలో కొబ్బరి-బెల్లం పూరణం పెట్టి, చుట్టూ అంచులను మడతలుగా చేస్తూ వాటిని మెల్లిగా మోదక్ ఆకారం ఇవ్వాలి. ఇంకా వీటిని  ఆవిరితోనే ఉడికించుకోవాలి. ఇడ్లీ పాత్రను తీసుకుని దానిలో నీరు మరిగించి, ఆ మోదక్‌లను నెయ్యి రాసిన ప్లేట్‌పై పెట్టి 15 నిమిషాలు ఆవిరితోనే ఉడికించాలి. బయట మెత్తగా, మోదక్‌లు సెట్ అయిన తర్వాత తీసి వేడిగా ప్రసాదంగా పెట్టండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/invest-in-copper-record-high-prices-driven-by-ai-and-ev-demand-1907225.html</loc><lastmod>2026-09-09T12:25:19+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/copper.jpg</image:loc>
					<image:title><![CDATA[ Copper ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/copper-1.jpg</image:loc><image:caption><![CDATA[ బంగారం, వెండి ధరలు గత రెండేళ్ల కాలంలో రెట్టింపు స్థాయిలో పెరగ్గా.. రాగి కూడా అదే బాటలో నడుస్తోంది. బంగారం, వెండి ధరలు రికార్డ్ స్థాయిలో ఉండటంతో.. చాలామంది రాగిలో పెట్టుబడులు పెడుతున్నారు. ధరలు పెరగడానికి ఇదొక కారణంగా నిలుస్తోంది. దీంతో పాటు పారిశ్రామిక అవసరాల్లో రాగి వినియోగం విపరీతంగా పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ప్రపంచవ్యా్ప్తంగా డేటా సెంటర్లను డిమాండ్ పెరిగింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/copper-2.jpg</image:loc><image:caption><![CDATA[ కంపెనీలన్నీ కొత్తగా డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. డేటా సెంటర్ల నిర్మాణంలో రాగిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీంతో పాటు ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీలో కూడా రాగిని వాడటం ఎక్కువగా జరుగుతుంది. ఈ అంశాలతో ఈ రెడ్ మెటల్‌ మార్కెట్లో హాట్ కేకులా మారిపోయిందని నిపుణులు చెబుతున్నారు. తాజాగా కాపర్ ధరలు ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరుకుని పెట్టుబడిదారులను ఆశ్చర్యపర్చాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/copper-3.jpg</image:loc><image:caption><![CDATA[ లండన్ మెటల్ ఎక్సేంజ్‌లో ఏకంగా టన్నుకు 14,533 డాలర్లకు చేరుకుని రాగి సరికొత్త రికార్డు నమోదు చేసింది. పారిశ్రామికంగా దీని డిమాండ్ పెరగడం, ఉత్పత్తి కూడా తక్కువగా ఉండటంతో రానున్న రోజుల్లో కాపర్ అత్యంత ఖరీదైన లోహంగా మారే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో రాగిలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు పొందే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/copper-4.jpg</image:loc><image:caption><![CDATA[ రాగిని ఉత్పత్తి చేసే కంపెనీల్లో భారతీయులు స్టాక్ మార్కెట్ ద్వారా పెట్టుబడులు పెట్టవచ్చు. హిందూస్థాన్ కాపర్, హిందాల్కో వంటి స్టాక్ట్స్ కొనుగోలు చేయవచ్చు. అలాగే వేదాంతలో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇక మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ ద్వారా రాగి ప్యూచర్లలో ట్రేడింగ్ చేసే అవకాశముంది. అయితే రిస్క్ మేనేజ్‌మెంట్ తెలియకుండా వీటిల్లోకి అడుగుపెట్టడం సరికాదని నిపుణులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/copper-5.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే భారత్‌లో కాపర్ ఈటీఎఫ్‌లు అందుబాటులో లేవు. కానీ హెచ్‌డీఎఫ్‌సీ, మిరే అసెట్ నిఫ్టీ మెటల్ ఈటీఎఫ్‌ల ద్వారా పరోక్షంగా పెట్టుబడులు పెట్టవచ్చు. విదేశీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయాలంటే ఎల్‌ఆర్ఎస్ ద్వారా పెట్టవచ్చు. పవర్ గ్రిడ్లలో కూడా రాగిని ఉపయోగిస్తున్న తరుణంలో రానున్న రోజుల్లో మరింత డిమాండ్ ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/teej-festival-2026-the-grand-banjara-tribal-celebration-of-nature-tradition-and-womens-pride-1907186.html</loc><lastmod>2026-09-09T11:02:44+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/teej-festival-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Teej Festival 6 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/teej-festival-1.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రకృతి ఆరాధన, సకల ప్రాణికోటి సంక్షేమం, ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బంజారా (లంబాడా) సమాజపు అతిపెద్ద గిరిజన వేడుక ‘తీజ్ పండుగ’ తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరభారత దేశమంతటా వైభవంగా కొనసాగుతోంది. శ్రావణ మాసంలో ఆరంభమయ్యే ఈ సంబురాలు బంజారాల విశిష్ట సంప్రదాయాలకు, వారి జీవనశైలికి నిదర్శనం. ముఖ్యంగా కన్నెపిల్లల ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే శాస్త్రీయ వ్యవసాయ పండుగగా ప్రసిద్ధి చెందిన తీజ్ మహోత్సవాన్ని ‘జాతీయ పండుగ’గా గుర్తించాలనే డిమాండ్ గిరిజన సంఘాల నుంచి బలంగా వినిపిస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/teej-festival-2.jpg</image:loc><image:caption><![CDATA[ పశ్చిమ గోదావరి జిల్లా టి.నరసాపురం మండల పరిధిలోని కృష్ణాపురం గ్రామంలో బంజారా భజరంగీ భేరీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిది రోజుల తీజ్ దీక్షోత్సవాలు సోమవారం నాడు అత్యంత ఘనంగా ముగిశాయి. కఠిన నిష్టతో దీక్షను విజయవంతంగా పూర్తి చేసిన 25 మంది బంజారా కన్యలకు సంఘం ప్రతినిధులు నూతన వస్త్రాలను బహుకరించి సత్కరించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/teej-festival-3.jpg</image:loc><image:caption><![CDATA[ అనంతరం సాంప్రదాయ వస్త్రధారణ, అద్దాల లంగా-ఓణీలు, వెండి ఆభరణాలతో ముస్తాబైన గిరిజన యువతులు మంగళ వాయిద్యాలు, జానపద నృత్యాల నడుమ తలపై గోధుమ మొలకల బుట్టలను ఎత్తుకుని తీజ్ ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా బంజారా భజరంగీ భేరీ సంఘం జిల్లా నాయకుడు భూక్యా నాగరాజు మాట్లాడుతూ.. ప్రకృతితో ముడిపడి ఉన్న ఈ శాస్త్రీయ గిరిజన పండుగ ప్రాధాన్యతను గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీజ్ ను అధికారిక జాతీయ పండుగగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/teej-festival-4.jpg</image:loc><image:caption><![CDATA[ తీజ్ పండుగలో అత్యంత కీలకమైన ఘట్టం గోధుమ మొలకల పెంపకం. పండుగ ఆరంభ దినాన తండా పెద్దల సమక్షంలో కన్నెపిల్లలు వెదురు బుట్టలను సిద్ధం చేసి, స్థానిక వాగుల నుంచి తెచ్చిన ఒండ్రు మట్టి, సహజ ఎరువును అందులో నింపుతారు. ఆపై గోధుమ విత్తనాలు నాటి, తండాలోని చలువ పందిరి లేదా ప్రత్యేక వేదిక వద్ద భద్రపరుస్తారు. తొమ్మిది రోజుల పాటు నిష్టగా ఉంటూ నిత్యం నీరు పోసి ఆ బుట్టలను సంరక్షిస్తారు. ఆరాధ్య దైవాలైన సీత్లా భవాని, మేరమ్మ దేవతలకు పూజలు నిర్వహించి, తమకు మంచి గుణవంతుడైన భర్త దక్కాలని, కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, గ్రామంలో పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని వేడుకుంటారు. తొమ్మిదో రోజు నాటికి బుట్టల్లో గోధుమ నారు ఏపుగా, పచ్చగా పెరిగి &#039;డూంగ్రో&#039;గా మారుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/teej-festival-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ మొలకల ఎదుగుదల, పచ్చదనాన్ని పరిశీలించి ఆ ఏడాది వ్యవసాయ దిగుబడులు ఎలా ఉంటాయో పెద్దలు అంచనా వేస్తారు. అనంతరం సమీపంలోని జలాశయాలు లేదా వాగుల వద్దకు చేరుకుని పూజల అనంతరం బుట్టలను నిమజ్జనం చేస్తారు. ఆ గోధుమ మొలకలను &#039;తీజ్ ప్రసాదం&#039;గా తమ అన్నదమ్ములు, పెద్దల తలపాగాలలో లేదా జేబులలో ఉంచి ఆడబిడ్డలు ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ వేడుకలో అన్నదమ్ములు తమ తోబుట్టువులకు కానుకలు సమర్పించి ప్రేమానురాగాలను చాటుకుంటారు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/methi-and-amaranth-leaves-for-stronger-bones-add-these-nutrient-rich-greens-to-your-daily-diet-1907091.html</loc><lastmod>2026-09-09T10:35:10+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/menti-kura-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Menti Kura 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/menti-kura.jpg</image:loc><image:caption><![CDATA[ శరీరానికి తగినంత ఎండ తగలని వారు విటమిన్ డి సప్లిమెంట్లను  తీసుకోవాలి. ఎముకల బలానికి కాల్షియం అత్యవసరం. రోజువారీ కాల్షియం వయస్సును బట్టి మారుతాయి. పాలు కాకుండా, ఆకుకూరలు, నువ్వులు వంటి వాటిలో అధిక కాల్షియం ఉంటుంది. తోటకూర, మెంతికూర, పొన్నగంటి కూర, మునగాకు వంటి ఆకుకూరలు పాల కంటే 4-5 రెట్లు ఎక్కువ కాల్షియంను అందిస్తాయి. నువ్వుల్లో పాల కంటే 13 రెట్లు అధిక కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ ఉంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/menti-kura-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఉప్పు ఎముకలకు హానికరం కాబట్టి, ఉప్పు వినియోగాన్ని తగ్గించడం, పండ్లు, మొలకలు వంటి సహజ ఆహారాలను తీసుకోవడం ద్వారా ఎముకలను బలంగా చేసుకోవచ్చు. ఈ జీవనశైలి మార్పులతో ఆరు నెలల నుంచి ఒక సంవత్సరంలో ఎముకలు మళ్లీ ఉక్కులా మారతాయని అంటున్నారు. ఈ పరిస్థితిలో ఎముకలు కాల్షియంను కోల్పోయి, రంధ్రాలు ఏర్పడి, పెళుసుబారి సులువుగా విరిగిపోతాయి. ఆయన ఈ స్థితిని చీమలు పట్టిన మైసూరుపాకంతో పోల్చారు, అక్కడ గట్టితనం తగ్గిపోయి ముక్కలు సులభంగా విరిగిపోతాయి. ఎముకల గుల్లబారడానికి ప్రధాన కారణం విటమిన్ డి లోపమేనని అంటున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/menti-kura-3.jpg</image:loc><image:caption><![CDATA[ నల్లని చర్మం గల వారికి విటమిన్ డి ఉత్పత్తికి ఎక్కువ సమయం (40-50 నిమిషాలు) పడుతుంది, ఎందుకంటే, మెలనిన్ సూర్యకిరణాలను నిరోధిస్తుంది. సూర్యరశ్మికి దూరంగా ఉండేవారు లేదా తగినంత ఎండ తగలని వారు తప్పనిసరిగా విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవాలని చెబుతున్నారు. మందులు వాడకూడదనే విధానం ఉన్నా, విటమిన్ డి లోపం తీవ్రంగా ఉన్నప్పుడు సప్లిమెంట్లు అవసరం అని అంటున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/menti-kura-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఆకుకూరలు, నువ్వులు కాల్షియంకు అద్భుతమైన, తక్కువ ఖర్చుతో కూడిన వనరులు.ఆకుకూరలు: 100 గ్రాముల తోటకూరలో 397 మిల్లీగ్రాములు, మెంతికూరలో 390 మిల్లీగ్రాములు, పొన్నగంటి కూరలో 510 మిల్లీగ్రాములు, మునగాకులో 444 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఇవి పాల కంటే 4-5 రెట్లు ఎక్కువ కాల్షియంను అందిస్తాయి. కేవలం కొన్ని రూపాయల విలువైన ఆకుకూరలు రోజు మొత్తానికి అవసరమైన కాల్షియంను అందిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/menti-kura-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఉప్పు వినియోగం, జీవనశైలి మార్పులు : ఉప్పు ఎముకలకు హానికరమని  చెబుతున్నారు. ఎముకల నాశనానికి,  గుల్లబారడానికి ఉప్పు ఒక ముఖ్య కారణం. అందువల్ల, ఉప్పు వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. ముఖ్యంగా, మధ్యాహ్న భోజనంలో ఉప్పు లేకుండా లేదా తక్కువ ఉప్పుతో కూడిన కూరగాయలను తీసుకోవడం మంచిది. ఉదయం, సాయంత్రం పండ్లు, మొలకలు వంటి సహజ ఆహారాలు తీసుకోవడం వల్ల ఉప్పు తీసుకోవాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/gold-price-drops-drastically-today-big-news-for-buyers-ahead-of-festivals-and-weddings-1907147.html</loc><lastmod>2026-09-09T09:54:43+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-rates-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold Rates ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-1-3.jpg</image:loc><image:caption><![CDATA[ బంగారం కొనుగోలు చేసేవారికి అదిరిపోయే శుభవార్త అందింది. గోల్డ్ రేట్లు ఒక్కసారిగా పడిపోయాయి. గంటల వ్యవధిలోనే ధరలు భారీగా పతనాన్ని నమోదు చేస్తాయి. త్వరలో పండుగలు రానున్న  క్రమంలో బంగారం కొనేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ధరలు తగ్గడంతో కొనుగోలుదారులు ఎగిరి గంతేస్తున్నారు. సెప్టెంబర్ 9వ తేదీన దేశంలోని వివిధ సిటీలలో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-2-3.jpg</image:loc><image:caption><![CDATA[ హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం రూ.1,54,310 వద్ద కొనసాగుతోండగా.. బుధవారం ఒక్కరోజే రూ.1040 మేర క్రాష్ అయ్యాయి. 22 క్యారెట్ల రేటు రూ.1,41,450గా ఉండగా.. నేడు రూ.950 తగ్గిందని చెప్పవచ్చు. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-3-3.jpg</image:loc><image:caption><![CDATA[ బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,310, 22 క్యారెట్ల రేటు రూ.1,41,150 వద్ద కొనసాగుతున్నాయి. నిన్నటితో పోల్చుకుంటే రూ.వెయ్యి మేర డౌన్ అయ్యి ఊరట కల్పించాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,680 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,710 వద్ద ట్రేడవుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-4-3.jpg</image:loc><image:caption><![CDATA[ డిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,55,510 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,560గా ఉంది. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,49,900గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ.2,54,900గా ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-5-2.jpg</image:loc><image:caption><![CDATA[ పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో ధరలు తగ్గడం ఉపశమనంగా చెప్పవచ్చు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. అలాగే ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలుపై చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ధరలు తగ్గుతూ వస్తోన్నాయని నిపుణులు చెబుతున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/black-sesame-seeds-for-eye-health-can-eating-two-handfuls-improve-eyesight-and-reduce-eye-strain-1907119.html</loc><lastmod>2026-09-09T09:50:03+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/black-nuvulu.jpg</image:loc>
					<image:title><![CDATA[ Black Nuvulu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/black-nuvulu-3.jpg</image:loc><image:caption><![CDATA[ నల్ల నువ్వులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. మనకి రెండు రకాల నువ్వులు అందుబాటులో ఉన్నాయి. ఇవి కూరల్లో కూడా వేస్తారు. ఇవి తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఈ నల్ల నువ్వుల్లో ఐరన్, క్యాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. రెండు గుప్పెళ్ళు తింటే మనకి ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇక్కడ చూద్దాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/black-nuvulu-1.jpg</image:loc><image:caption><![CDATA[ నల్ల నువ్వులు కంటికి  ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలో ఉండే పోషక విలువల వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.  ఇవి తింటే  కంటి పొడిబారడం, అలసిపోయిన కళ్ల సమస్యలను కూడా ఇవి తగ్గిస్తాయి. ఈ నల్ల నువ్వులలో విటమిన్ E , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల కంటి కణాలను ఇవి కాపాడతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/black-nuvulu-2.jpg</image:loc><image:caption><![CDATA[ రోగనిరోధక శక్తి పెరుగుతుంది: ఈ నల్ల నువ్వుల్లో ఉండే పోషకాలు, విటమిన్లు ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇంకా ఇవి శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. ఎక్కువ కూడా అవసరం లేదు. కొద్దిగా తీసుకున్నా అవసరం లేదు. ఉదయం లేదా రాత్రి ఇలా ఎప్పుడైనా వీటిని తీసుకోవచ్చు అప్పుడే మంచి ఫలితం ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/black-nuvulu-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఎముకలు బలంగా ఉంటాయి: ఈ నువ్వుల్లో జింక్, క్యాల్షియం కూడా ఉంటాయి. ఇంకా ఇవి ఎముకలను బలంగా మార్చడంలో ఎంతగానసహాయపడతాయి. ఇంకా వీటిని మీరు రెండు గుప్పెళ్ళు తింటే అసలు నీరసం అనేది ఉండదు. అయితే, మీరు నువ్వులతో పాటు బెల్లం తింటే.. ఎముకలు మొత్తం బలంగా మారతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/black-nuvulu-5.jpg</image:loc><image:caption><![CDATA[ వీటిని మీరు రోజులో ఎప్పుడైనా తీసుకోవచ్చు మంచి ఫలితం ఉంటుంది. (నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/andhra-style-ullikaram-recipe-spicy-onion-chilli-chutney-that-tastes-perfect-with-roti-1907102.html</loc><lastmod>2026-09-09T08:30:33+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ullipaya-karam.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ullipaya Karam ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ullipaya-karam-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఉల్లి కారం ఆంధ్రాలో ఎంతో ఫేమస్. ఈ రెసిపీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ, పచ్చి కారంతో చేస్తారు. ఇది   ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి దీనిని చాలామంది రోటిల్లోకి తింటారు. అసలు లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారి విధానం గురించి  ఇక్కడ చదివి తెలుసుకుందాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ullipaya-karam-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఉల్లి కారానికి కావాల్సిన పదార్దాలు :  3 వెల్లుల్లి రెబ్బలు, రెండు పెద్ద ఉల్లిపాయలు, పచ్చి కారానికి 15 ఎండు మిర్చి, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ మినప్పప్పు , ఒక టేబుల్ స్పూన్ కారం , ఒక టీ స్పూన్ ఆవాలు ,  5 కరివేపాకు ఆకులు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టీ  స్పూన్ ఆయిల్ ను తీసుకోవాలి. అయితే, కొంచం ఎక్కువ కారంతో చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ullipaya-karam-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఉల్లి కారం తయారి విధానం : ముందుగా గ్యాస్ వెలిగించి దాని మీద పాన్ పెట్టి, దానిలో నూనె వేసి కొద్దిగా పచ్చిపప్పు, అర టీ స్పూన్  మినప్పప్పును కూడా వేసి బంగారు కలర్లోకి  వచ్చే దాకా వీటిని  బాగా వేయించుకోవాలి.  దీనిని సరైన విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ullipaya-karam-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఉల్లి కారం తయారి విధానం స్టెప్ 1 :  ఇక ఇప్పుడు దీనిలో ఒక టీ స్పూన్  ధనియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, 10 ఎండు మిర్చి కూడా వేసి దీనిని మీడియం మంటపై  వేయించుకోవాలి. అలాగే, దీనిలో మూడు కరివేపాకు ఆకులు కూడా వేసి కరకరలాడే వరకు వీటిని బాగా వేయించుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ullipaya-karam-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఉల్లి కారం తయారి విధానం స్టెప్ 2 : ఇవి కొంచం చల్లారిన తర్వాత మిక్సీ జార్‌ తీసుకుని వేసి క పొడిలాగా చేసుకోవాలి చేసుకోండి. ఇక ఇప్పుడు  మూడు ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినంత ఉప్పు వేసి మరి మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఇలాగే దంచితే అప్పుడే రుచిగా ఉంటుంది. చివర్లో దీనిని తాలింపు పెట్టుకుని తినడమే. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/chia-seeds-benefits-can-one-spoon-daily-support-memory-nerve-health-and-reduce-inflammation-1907080.html</loc><lastmod>2026-09-09T07:11:26+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chia-seeds-1-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Chia Seeds 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chia-seeds-4.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రతిరోజు అరగంట పాటు సూర్యరశ్మిలో గడపడం వల్ల మతిమరుపు వచ్చే ప్రమాదాన్ని 40% పైగా తగ్గించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచి, మెదడు కణాల మరమ్మత్తు, శుభ్రపరచడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chia-seeds-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ వయసు పెరిగే కొద్దీ లేదా వంశపారంపర్యంగా వచ్చే మతిమరుపు చాలామందిని వేధించే సమస్య. అయితే, దీనిని నివారించడానికి ఒక సులువైన మార్గాన్ని చైనా పరిశోధకులు కనుగొన్నారు. 89 వేల మందిపై ఎనిమిదేళ్ల పాటు జరిపిన అధ్యయనంలో ఆశ్చర్యకరమైన విషయం వెల్లడైంది. ప్రతిరోజు కనీసం అరగంట పాటు పగటిపూట వెలుతురులో గడిపిన వారికి మతిమరుపు వచ్చే ప్రమాదం 40% నుంచి 50% వరకు తగ్గిందని రుజువైంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chia-seeds-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ నేటి జీవనశైలిలో చాలామంది ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఇండోర్ వాతావరణంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇంట్లోనే ఉండటం, కారులో లేదా బస్సులో కార్యాలయానికి వెళ్లడం, కార్యాలయంలో కూర్చోవడం, తిరిగి ఇంటికి రావడం వంటి పనుల్లో ఎండ, గాలి, ప్రకృతి సిద్ధమైన వెలుతురు శరీరానికి తగలడం లేదు. దీనివల్ల సెరటోనిన్ వంటి హార్మోన్లు తగ్గిపోవడం, కార్టిజాల్ హార్మోన్ పెరగడం జరుగుతుంది. అయితే, సూర్యరశ్మికి గురైనప్పుడు సెరటోనిన్ పెరిగి, కార్టిజాల్ తగ్గుతుందని  తెలిపారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chia-seeds-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ సూర్యరశ్మి, మెదడు ఆరోగ్యానికి మధ్య ఉన్న అసలు సంబంధం మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిలో ఉంది. పగటిపూట వెలుతురులో గడిపిన వారికి రాత్రిపూట మెలటోనిన్ హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతుంది. మెలటోనిన్ అనేది నిద్ర పుచ్చే హార్మోన్ అని అందరికీ తెలుసు. అయితే, ఇది కేవలం నిద్రకు మాత్రమే కాకుండా, మెదడు కణాల ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యమైనది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chia-seeds-7.jpg</image:loc><image:caption><![CDATA[ మెదడు కణాలు రాత్రిపూట శుభ్రపరచుకోవడానికి మెలటోనిన్‌తో పాటు కొన్ని పోషకాలు కూడా అవసరం. విటమిన్ ఇ, విటమిన్ ఎ, విటమిన్ సి వంటివి మెదడుకు చాలా ముఖ్యం. రాత్రి భోజనంలో బాదం పప్పులు, పొద్దుతిరుగుడు పప్పు వంటివి తీసుకోవాలి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే చియా సీడ్స్‌ను నానబెట్టుకుని తినాలి. అలాగే, విటమిన్ సి, విటమిన్ ఎ అధికంగా ఉండే జామకాయను డిన్నర్‌లో చేర్చుకోవడం మంచిది. ఈ పోషకాలు మెదడు కణాల శుభ్రపరచే ప్రక్రియను వేగవంతం చేస్తాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/jupiter-transit-2026-powerful-jupiter-vishnu-yoga-brings-royal-fortune-to-these-2-zodiac-signs-1907063.html</loc><lastmod>2026-09-09T06:50:45+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/money-4.jpg</image:loc>
					<image:title><![CDATA[ Money ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/astro-9.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు బాధాకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/astro-1-5.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు రాజైన బృహస్పతి తన రాశిని మార్చుకోనున్నాడు ఆ సమయంలో &#039;సామ్రాజ్య యోగం&#039; ఏర్పడుతుంది. వీరికి సమాజంలో అధికారం, ఉద్యోగంలో మంచి పదవులు, ఇంకా ఊహించని ధన లాభాలు కూడా ఉంటాయి. ఈ ప్రభావం రెండు రాశుల మీద పడనుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చదివి చూద్దాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/dhanusu-rashi.jpg</image:loc><image:caption><![CDATA[ ధనుస్సు రాశి: ఈ రాశి వాళ్ళు ఇంట్లో ఏం చేసినా కూడా  చెల్లుతుంది. ఇంకా చెప్పాలంటే శుభ ఫలితాలు పొందుతారు. అలాగే, వీరి  ఆత్మవిశ్వాసం కూడా డబుల్ అవుతుంది.  కోర్టు సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అదే విధంగా ఈ సమయంలో ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది.  పెట్టుబడులు పెట్టిన వారికి మంచిగా లాభాలు వస్తాయి ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/mesha-rsahi.jpg</image:loc><image:caption><![CDATA[ మేష రాశి : ఈ రాశి వారికి మొత్తం  అనుకూలంగా ఉంటుంది. ఏది పట్టుకున్నా కూడా అది బంగారమే అవుతుంది. ఇంకా వీరి ఉద్యోగం కల కూడా త్వరాలోనే నేరువేరుతుంది.అలాగే, ఆర్థిక సమస్యలు కూడా మొత్తం పోతాయి. ఇంకా ఆకస్మిక లాభాలు వస్తాయి.  మీకు ఇష్టమైన వారితో సమయం గడుపుతారు. కొత్త పరిచయాలతో వ్యాపారాలు మొదలు పెడతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/astro-3-2.jpg</image:loc><image:caption><![CDATA[ Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/heart-attack-symptoms-in-women-these-warning-signs-should-never-be-ignored-1906795.html</loc><lastmod>2026-09-08T17:32:23+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/heart-attack-warning-signs.jpg</image:loc>
					<image:title><![CDATA[ Heart Attack Warning Signs ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/heart-attack-warning-signs-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఎటువంటి కష్టమైన పని చేయకపోయినా లేదా తగినంత విశ్రాంతి తీసుకున్నా కూడా అకస్మాత్తుగా తీవ్రమైన నిస్సత్తువ, అలసట ఆవహిస్తే అది గుండెపోటుకు ముందస్తు హెచ్చరిక కావచ్చు. ఛాతీలో ఎలాంటి నొప్పి లేకపోయినా ఊపిరి ఆడకపోవడం, పరుగెత్తినట్లు లేదా ఆయాసంగా అనిపించడం మహిళల్లో గుండె సమస్యకు ప్రధాన సంకేతం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/heart-disease-in-women.jpg</image:loc><image:caption><![CDATA[ గుండెపోటు నొప్పి కేవలం ఛాతీకే పరిమితం కాకుండా దవడలు, గొంతు, మెడ, వెనుక భాగం లేదా భుజాలకు పాకే అవకాశం ఉంది. కడుపులో తిప్పడం, వాంతులు రావడం, తీవ్రమైన అజీర్తి లేదా కడుపులో మంట వంటి లక్షణాలను చాలామంది సాధారణ గ్యాస్ట్రిక్ సమస్యగా భావించి పొరబడతారు. కానీ, ఇవి కూడా హార్ట్ ఎటాక్ సూచనలే. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/heart-attack-risk-factors.jpg</image:loc><image:caption><![CDATA[ వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ అకస్మాత్తుగా చల్లని చెమటలు పట్టడం, కళ్లు తిరగడం లేదా స్పృహ తప్పిపోతున్నట్లు అనిపించడం ప్రమాదకరమైన సంకేతం. ఈ లక్షణాలను సాధారణ ఆరోగ్య సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేయడం ప్రాణాలకే ప్రమాదకరం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/heart-attack-signs.jpg</image:loc><image:caption><![CDATA[ ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదు?: మహిళలు తరచుగా తమ ఆరోగ్యం కంటే కుటుంబ సభ్యుల సంక్షేమానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. చిన్నపాటి నొప్పులు లేదా అసౌకర్యం కలిగినప్పుడు ఏమీ కాదులే అని సర్దుకుపోతుంటారు. కానీ, గుండెపోటు విషయంలో ప్రతీ నిమిషం చాలా విలువైనది. సరైన సమయానికి వైద్య సహాయం అందకపోతే గుండె కండరాలు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/heart-attack-symptoms.jpg</image:loc><image:caption><![CDATA[ తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మధుమేహం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, అధిక బరువు ఉన్న మహిళలు మరింత అప్రమత్తంగా ఉండాలి. నలభై ఏళ్లు దాటిన మహిళలు క్రమం తప్పకుండా గుండె పరీక్షలు  చేయించుకోవడం మంచిది. పైన పేర్కొన్న లక్షణాలలో ఏవైనా అకస్మాత్తుగా కనిపిస్తే వెంటనే అత్యవసర వైద్య సహాయం లేదా సమీపంలోని ఆసుపత్రిని సంప్రదించడం శ్రేయస్కరం. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/naturally-increase-hemoglobin-essential-iron-rich-foods-for-anemia-prevention-1906815.html</loc><lastmod>2026-09-08T17:26:36+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sunnudalu.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sunnudalu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sunnudalu-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ మధ్యకాలంలో చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. అయితే దాని నుంచి బయటపడాలని చాలా మంది డైట్ పాటించడం, రక్తం ఎక్కువగా ఉండే ఎరుపు రంగు ఆహారాలు తినడం చేస్తుంటారు. కానీ ఎరుపు రంగు పండ్లు కూరగాయలు మాత్రమే కాదు, ఈ ఒక్క లడ్డూ ప్రతి రోజూ తిన్నా చాలు రక్తహీనత దూరం అవుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కాగా, ఇప్పుడు మనం దాని గురించి తెలుసకుందాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sunnudalu-2.jpg</image:loc><image:caption><![CDATA[ రక్తహీనత శరీరంలో ఆక్సిజన్‌ను మోసుకెళ్లే హిమోగ్లోబిన్‌ను తగ్గిస్తుంది. స్త్రీలలో 12-14 గ్రాములు, పురుషులలో 14-16 గ్రాముల హిమోగ్లోబిన్ అవసరం. అయితే చాలా మంది కేవలం బీట్ రూట్, క్యారెట్, ధానిమ్మ పండ్లు తింటేనే రక్తహీనత తగ్గుతంది అనుకుంటారు. కానీ డాక్టర్ మంతెన ప్రకారం, గోధుమ గడ్డి రసం, తాటి బెల్లం, తోటకూర వంటివి ఐరన్‌ను పుష్కలంగా అందిస్తాయి. రక్తహీనత  సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sunnudalu-3.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే కేవలం ఎరుపు రంగు ఆహారాలు తింటే రక్తం ఎక్కువగా పట్టదు, ఒక్క అంజీర్ పండు తింటే చాలు ఇది రక్తహీనతను పూర్తిగా నయం చేయదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం కలగాలి అంటే తప్పకుండా ఐరన్ ఎక్కువగా ఉండే గోధుమ గడ్డి రసం తాగడం చాలా మంచిదంట. ఇది రక్తహీనతను త్వరగా నయం చేస్తుందంట. అలాగే తోటకూర, అవిసె గింజలు, తాటి బెల్లంలో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుందంట. ముఖ్యంగా తాటి బెల్లంలో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుందంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sunnudalu-4.jpg</image:loc><image:caption><![CDATA[ అందువలన ఎవరు అయితే రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారో, వారు తప్పకుండా ప్రతి రోజూ తాటి బెల్లం మినపప్పు లేదా నువ్వులతో తయారు చేసిన సున్నుండలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదంట. ప్రతి రోజూ ఇది ఒక్క లడ్డూ తింటే చాలు, ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు వారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sunnudalu-5.jpg</image:loc><image:caption><![CDATA[ తాటి బెల్లంలో ఐరన్ అత్యధికంగా 100గ్రాములకు 250 మి.గ్రాముల ఐరన్ ఉంటుందంట. అందువులన చాలా మంది సున్నుండలు ఎక్కువగా తయారు చేసుకొని తింటుంటారు. అయితే అలాంటి వారు తాటి  బెల్లంతో తయారు చేసిన సున్నుండలు తినడం లేదా చిన్న పిల్లలకు కూడా ప్రతి రోజూ ఒకటి ఇవ్వడం వలన అది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను చాలా త్వరగా పెంచి, శరీరానికి చాలా మేలు చేస్తుందంట. ముఖ్యంగా రక్తహీనత సమస్య నుంచి కాపాడుతుందంట. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/amavasya-wealth-rituals-perform-these-midnight-poojas-to-attract-lakshmi-1906814.html</loc><lastmod>2026-09-08T17:05:59+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/amavasya-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Amavasya 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/amavasya-4.jpg</image:loc><image:caption><![CDATA[ సెప్టెంబర్ 11న పొలాల అమావాస్య. ఇది అమావాస్య తిథి ప్రారంభం, సెప్టెంబర్ 10,2026 గురు వారం ఉదయం 10.33 గంటలకు మొదలు అయ్యి, సెప్టెంబర్ 11,2026  శుక్రవారం ఉదయం 8.56 గంటలకు ముగుస్తుంది. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. అయితే ఈ అమావాస్య రోజు అర్ధరాత్రి కొన్ని పనులు చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి, కోటీశ్వరులు అవుతారని చెబుతున్నారు పండితులు. అవి ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/amavasya.jpg</image:loc><image:caption><![CDATA[ అమావాస్య రోజున లక్ష్మీ పూజ, పితృ తర్పణాల వంటివి చేయడం చాలా శుభప్రదం అని చెప్తుంటారు పండితులు. దీని వలన ఇంటిలో ఉన్న ప్రతి కూలతలు తొలిగిపోయి, ఇంటిలో సానుకూలత పెరుగుతుందంట. అంతే కాకుండా ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారని చెబుతున్నారు పండితులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/amavasya-5.jpg</image:loc><image:caption><![CDATA[ అలాగే ఈ పొలల అమావాస్య అర్థరాత్రి సమయంలో, 12 గంటలకు ఇంటి ప్రధాన ద్వారం ముందు నువ్వుల నూనె దీపం పెట్టడం వలన లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందంట. ఎవరు అయితే నరదిష్టితో బాధపడుతున్నారో, అలాగే ఎవరు అయితే ఆర్థిక సమస్యలతో సతమతం అవున్నారో, వారు వాటి నుంచి బయటపడి, అన్ని విధాలుగా కలిసి వస్తుందని చెబుతున్నారు పండితులు. అందుకే ఈ సమయంలో దీపం పెట్టడం చాలా మంచిదంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/amavasya-2.jpg</image:loc><image:caption><![CDATA[ అదే విధంగా అమావాస్య అర్థరాత్రి సమయంలో, లక్ష్మీదేవి అష్టోత్తరం, కనకధారా స్తోత్రం చదవడం, పేదవారికి అన్నదానం చేయడం ,అంతే కాకుండా నల్ల నువ్వులు దానం  చేయడం, నల్లటి వస్త్రాలు దానం చేయడం వలన అద్భుతంగా కలిసి వస్తుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. అయితే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో అర్థరాత్రి సమయంలో బటయకు వెళ్లకూడదంట. ఎందుకంటే? ఈ రోజు ప్రతికూల శక్తుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఇది అనేక రకాలుగా సమస్యలకు కారణం అయ్యే ఛాన్స్ ఉన్నదంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/amavasya-3.jpg</image:loc><image:caption><![CDATA[ నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/dimple-astrology-unlocking-the-secrets-of-cheek-dimples-and-fortune-1906813.html</loc><lastmod>2026-09-08T17:06:35+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/bugga-sotta.jpg</image:loc>
					<image:title><![CDATA[ Bugga Sotta ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/bugga-sotta-4.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య శాస్త్రంలో సాముద్రిక శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దీని ప్రకారం చాలా మంది ఒక వ్యక్తి శరీరాకృతి బుగ్గపై ఉండే సొట్ట ఆధారంగా వారి వ్యక్తిత్వం మాత్రమే కాకుండా వారి అదృష్టాన్ని కూడా తెలియజేస్తుందని చెప్పుకొస్తుంటారు. కాగా, ఇప్పుడు మనం బుగ్గపై సొట్ట ఉండటం అదృష్టమా? దురదృష్టమా తెలుసుకుందాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/bugga-sotta-1.jpg</image:loc><image:caption><![CDATA[ సాముద్రిక శాస్త్రం ప్రకారం బుగ్గపై సొట్ట ఉండటం చాలా అదృష్టం అని చెబుతున్నారు పండితులు. నవ్వినప్పుడు బుగ్గపై సొట్ట పడటం చాలా ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకున్నదంట. ఇది అందాన్ని పెంచడమే కాకుండా వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. అలాగే వారికి  వ్యక్తిత్వాన్ని కూడా తెలియజేస్తుందంట. ఇలాంటి వారు చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, ఎక్కడ ఉన్నా, తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/bugga-sotta-2.jpg</image:loc><image:caption><![CDATA[ అలాగే బుగ్గపై సొట్టపడే వ్యక్తులు చాలా సున్నితమైన, సౌమ్యమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అందరితో చాలా అద్భుంతంగా మాట్లాడటమే కాకుండా, ప్రతి ఒక్కరినీ తమ మాటలు, నవ్వు, అందంతో ఆకట్టుకుంటారు. వీరు ఏది కోరకుంటారో, దానిని సాధించే వరకు నిష్క్రమించకుండా పోరాడి దానిని గెలుస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/bugga-sotta-3.jpg</image:loc><image:caption><![CDATA[ సాముద్రిక శాస్త్రం ప్రకారం, చెంపలపై గుంటలు ఉండే వ్యక్తులు చాలా అదృష్టవంతులు, ఇది వారి అదృష్టానికి సంకేతం. ఒక శుభ సూచకం అంట. ఇలాంటి వ్యక్తులకు జీవితంలో అనేక మంచి అవకాశాలు లభించడమే కాకుండా, జీవితంలో మంచి పురోగతి సాధిస్తారంట, అన్ని రకాలుగా వీరికి లక్కు అనేది కలిసి వస్తుందని చెబుతున్నారు నిపుణులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/bugga-sotta-5.jpg</image:loc><image:caption><![CDATA[ నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/samrajya-yoga-2026-jupiter-transit-brings-immense-wealth-to-these-zodiac-signs-1906812.html</loc><lastmod>2026-09-08T17:04:28+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/guru-sanchar.jpg</image:loc>
					<image:title><![CDATA[ Guru Sanchar ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/guru-sanchar-1.jpg</image:loc><image:caption><![CDATA[ సామ్రాజ్య యోగం వలన అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతే కాకుండా, గురుడి అనుగ్రహం ఉండటం వలన అధికారం కోల్పోయిన వారు మళ్లీ అధికారం చేపట్టడం, మంచి జాబ్ లో జాయిన్ అవ్వడం వంటిది జరిగే ఛాన్స్ ఉన్నదంట. అందువలన గురు సంచారం మూడు రాశుల జీవితంలో వెలుగులు తీసుకొస్తుంది. వారు కూర్చున్న చోటికే కోట్ల రూపాయలు వస్తాయని చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/guru-sanchar-2.jpg</image:loc><image:caption><![CDATA[ కుంభ రాశి : కుంభ రాశి వారికి గురు గ్రహం సంచారం వలన అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే దూర ప్రయాణాలు చేయాలి అనుకుంటున్నారో, వారికి ఇది చాలా మంచి సమయం. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆర్థికంగా కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా ఈ సమయంలో వీరు ఎక్కువ మొత్తంలో డబ్బును పొదుపు చేసుకుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/guru-sanchar-3.jpg</image:loc><image:caption><![CDATA[ కన్యా రాశి : కన్యా రాశి వారికి పట్టింది బంగారమే అవుతుంది. వీరికి కూర్చున్న చోటుకే కోట్ల రూపాయలు వస్తుంటాయి. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులకు ఇది చాలా అనుకూలమైన సమయం. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/guru-sanchar-4.jpg</image:loc><image:caption><![CDATA[ తుల రాశి : తుల రాశి వారికి ఇది చాలా మంచి సమయం. గురు సంచారం వలన వీరికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే  ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారు త్వరలో జాబ్‌లో జాయిన్ అవుతారు. అంతే కాకుండా ధనలాబం కలుగుతుంది. సంపద వృద్ధి చెందుతుంది. అన్ని విధాలుగా వీరికి ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/guru-sanchar-5.jpg</image:loc><image:caption><![CDATA[ నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/want-to-lose-weight-without-spending-more-try-this-traditional-jowar-flour-dosa-for-a-healthy-filling-meal-1906775.html</loc><lastmod>2026-09-08T15:49:30+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/dosa.jpg</image:loc>
					<image:title><![CDATA[ Dosa ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/dosa-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనుకునే వారికి జొన్నపిండి దోసెలు ఒక అద్భుతమైన ఎంపిక. జొన్నపిండితో ఈ రెసిపీ నిముషాల్లోనే చేసుకోవచ్చు. దీనిని టిఫిన్, డిన్నర్ ఇలా రెండింటికీ అనుకూలంగా తీసుకోవచ్చు. జొన్నపిండిలో అధిక పోషక విలువలు ఉంటాయి. ఇది ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజ లవణాలతో నిండి ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో జొన్నపిండి సహాయపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/dosa-2.jpg</image:loc><image:caption><![CDATA[ జొన్న పిండి దోస కావలసిన పదార్థాలు: ఒక కప్పు జొన్నపిండి, రెండు కప్పులు నీళ్లు, రెండు ఉల్లిపాయలు, రెండు పచ్చి మిరపకాయలు, 
ఒక చిన్న అల్లం ముక్క, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు,  నాలుగు కరివేపాకు ఆకులు, దోసెలు కాల్చడానికి నూనె, 
 కారం పొడి, రెండు టేబుల్ స్పూన్స్ క్యారెట్ తురుము,  కొత్తిమీరను తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/dosa-3.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా ఒక మిక్సి బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు జొన్నపిండిని వేయండి. తర్వాత అదే కప్పుతో ఒక కప్పు నీళ్లను చేర్చి, ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పది నిమిషాల పాటు మూతపెట్టి పక్కన ఉంచండి. ఈ విధంగా నానబెట్టడం వల్ల పిండి మెత్తబడి, దోసెలు చక్కగా వస్తాయి. పది నిమిషాల తర్వాత, పిండిని మరోసారి కలుపుకుని, ఇంకొక కప్పు నీళ్లను చేర్చండి. జొన్నపిండి దోసెల పిండి సాధారణ బియ్యం దోసెల పిండి కంటే పలుచగా ఉండాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/dosa-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలు, రెండు పచ్చిమిరపకాయలు, తురిమిన అల్లం, ఒక టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు , సన్నగా తరిగిన కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. కరివేపాకును సన్నగా తరిగి వేయడం వల్ల దోసెల రుచి మరింత పెరుగుతుంది. స్టవ్ ఆన్ చేసి దోస పెనం పెట్టి, రెండు లేదా మూడు చుక్కల నూనె వేసి టిష్యూ లేదా ఉల్లిపాయ ముక్కతో పెనం మొత్తాన్ని తుడిచేయండి. ఇది దోసెలు అతుక్కోకుండా, చక్కగా రావడానికి సహాయపడుతుంది. పిండిని వేయడానికి ముందు, అడుగు నుండి బాగా కలుపుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/dosa-5.jpg</image:loc><image:caption><![CDATA[ పెనంపై మధ్యలో పిండి వేసి స్ప్రెడ్ చేయకుండా, పెనం అంచుల నుండి పిండిని పోయాలి.  పిండి పోసిన తర్వాత దానిపై కొద్దిగా కారం పొడి చల్లి, ఒక స్పూన్ నెయ్యి వేసి సమానంగా పరచండి. ఆ తర్వాత సన్నగా తురిమిన క్యారెట్, కొత్తిమీరను చల్లాలి. గ్యాస్ మంటను తక్కువ నుండి మధ్యస్థ మంటకు సర్దుబాటు చేసి, దోసె బంగారు రంగులోకి మారే వరకు కాల్చండి. అంచులు లేతగా మారినప్పుడు, దోసెను మధ్యలోకి ఫోల్డ్ చేయాలి.రెండు వైపులా బంగారు రంగులోకి మారేవరకు కాల్చుకుని, వేడివేడిగా తినండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/should-you-stop-eating-rice-to-lose-weight-experts-reveal-the-right-way-to-eat-rice-1906752.html</loc><lastmod>2026-09-08T16:10:56+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rice-diet-for-weight-loss.jpg</image:loc>
					<image:title><![CDATA[ Rice Diet For Weight Loss ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/balanced-diet.jpg</image:loc><image:caption><![CDATA[ అన్నం పూర్తిగా మానేస్తే ఏమవుతుంది?: మన శరీరానికి అవసరమైన తక్షణ శక్తిని అందించడంలో బియ్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అన్నాన్ని ఉన్నపలంగా ఆహారం నుంచి తప్పించడం వల్ల శరీరంలో పలు మార్పులు, సమస్యలు ఎదురవుతాయి. బియ్యంలో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తినిస్తాయి. వీటిని పూర్తిగా నిలిపివేస్తే తలనొప్పి, కళ్లు తిరగడం, నిరంతరం అలసటగా అనిపించడం వంటి సంకేతాలు కనిపిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rice-and-weight-gain.jpg</image:loc><image:caption><![CDATA[ బియ్యంలో కేవలం కార్బోహైడ్రేట్లే కాకుండా బి-విటమిన్లు, మెగ్నీషియం, ఐరన్ వంటి ముఖ్యమైన సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి. అన్నం మానేయడం వల్ల ఈ పోషకాల లోపం ఏర్పడుతుంది. సంప్రదాయంగా తినే ఆహారాన్ని హఠాత్తుగా ఆపేయడం వల్ల మలబద్ధకం లేదా జీర్ణక్రియలో అసమతుల్యత ఏర్పడే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rice-and-weight-loss.jpg</image:loc><image:caption><![CDATA[ తెల్ల బియ్యానికి బదులుగా పాలిష్ పట్టని బ్రౌన్ రైస్ లేదా సింగిల్ పాలిష్ బియ్యాన్ని ఎంచుకోవడం మంచిది. వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉండి జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు వంటి చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండటమే కాకుండా బరువు కూడా సులభంగా తగ్గుతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rice-portion-control.jpg</image:loc><image:caption><![CDATA[ నిపుణులు సూచించే సరైన విధానం ఏమిటి?: బరువు తగ్గడానికి ఆహారం తినడం మానడం కాకుండా, సరైన పద్ధతిలో తినడం నేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అన్నాన్ని పూర్తిగా మానాల్సిన పనిలేదు. ప్లేట్‌లో అన్నం పరిమాణాన్ని తగ్గించి, దానికి రెట్టింపు స్థాయిలో ఆకుకూరలు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, ప్రొటీన్ కోసం గ్రుడ్లు, పన్నీర్, చికెన్ మొదలైనవి ఉండేలా చూసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/healthy-diet.jpg</image:loc><image:caption><![CDATA[ బరువు తగ్గడం అనేది ఒక రోజులో జరిగే ప్రక్రియ కాదు. ఆహారాన్ని మానేయడం తాత్కాలికంగా బరువు తగ్గించినా, తిరిగి సాధారణ ఆహారం తిన్నప్పుడు బరువు రెట్టింపు అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి సమతుల్యాహారం, రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడమే బరువు తగ్గడానికి శాశ్వత, ఆరోగ్యకరమైన మార్గం. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/foxtail-millet-vs-white-rice-powerful-benefits-for-digestion-appetite-control-and-gut-health-1906743.html</loc><lastmod>2026-09-08T15:24:20+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/korralu-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Korralu 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/korralu-4.jpg</image:loc><image:caption><![CDATA[ పాలిష్ చేసిన బియ్యం వల్ల కలిగే నష్టాలకు ప్రత్యామ్నాయంగా కొర్రలు (మిల్లెట్స్) తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇంకా   ఆకలి నియంత్రించబడుతుంది, మలబద్ధకం తగ్గుతుంది, పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. అయితే, బరువు తగ్గాలనుకునేవారు లేదా షుగర్ ఉన్నవారు కొర్రలను మితంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/korralu.jpg</image:loc><image:caption><![CDATA[ పాలిష్ చేసిన బియ్యం వినియోగం ఆధునిక జీవనశైలిలో అనేక ఆరోగ్య సమస్యలకు తెచ్చి పెడుతుందని అంటున్నారు. బియ్యంలోని పోషకాలు పాలిషింగ్ ప్రక్రియలో తొలగిపోవడమే కాకుండా, ఇది త్వరగా జీర్ణమయ్యే  కార్బోహైడ్రేట్‌గా మారి, రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే, బియ్యానికి ప్రత్యామ్నాయంగా మిల్లెట్స్, ముఖ్యంగా కొర్రలు మంచి  ఎంపిక ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/korralu-1.jpg</image:loc><image:caption><![CDATA[ కొర్రల అన్నం తక్కువ ధరలో లభించడం, సులభంగా వండుకోవడం, రుచికరంగా ఉండటం, పొడి పొడిగా రావడం వల్ల సామాన్యులకు సైతం అందుబాటులో ఉంటుంది కొర్రలు కేవలం ఆకలిని తీర్చడమే కాకుండా, శరీరానికి మూడు ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని వివరించారు: ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/korralu-3.jpg</image:loc><image:caption><![CDATA[ 100 గ్రాముల కొర్రల్లో సుమారు 9 గ్రాముల ఫైబర్ ఉంటుంది. బియ్యంలో ఉండే కార్బోహైడ్రేట్‌ల వలె కాకుండా, కొర్రల్లో  కార్బోహైడ్రేట్‌లు  అధిక ఫైబర్ ఉంటాయి. ఈ రెండూ కొర్రలు నెమ్మదిగా జీర్ణం కావడానికి సహాయపడతాయి. ఉదయం కొర్రల అన్నం తిన్న తర్వాత, ఆకలి సాయంత్రం వరకు అనిపించదు, నీరసం రాదు. ఇది తరచుగా తినాలనే కోరికను తగ్గిస్తుంది, తద్వారా ఆహార నియంత్రణకు దోహదపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/korralu-5.jpg</image:loc><image:caption><![CDATA[ మెరుగైన ప్రేగు కదలికలు : కొర్రల్లోని అధిక ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరం. ఫైబర్ మలాన్ని మృదువుగా చేసి, సుఖ విరోచనానికి సహాయపడుతుంది ఇంకా ప్రేగు కదలికలు కూడా మెరుగుపరుస్తాయి. పేగుల్లో రోగనిరోధక వ్యవస్థ అంత బలంగా ఉంటుంది. కొర్రల్లోని ఫైబర్ ఈ మంచి బ్యాక్టీరియాల వృద్ధికి బాగా ఉపయోగపడుతుందని, ఇది ప్రేగులకు ప్రోబయోటిక్‌లా పనిచేస్తుందని పరిశోధనల్లో కూడా తేలింది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/jowar-a-traditional-superfood-packed-with-powerful-health-benefits-1906681.html</loc><lastmod>2026-09-08T15:15:07+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/jowar-benefits.jpg</image:loc>
					<image:title><![CDATA[ Jowar Benefits ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/jowar-for-diabetes.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుతం చాలామంది కేవలం షుగర్ వ్యాధి వచ్చినప్పుడో, లేదా బరువు తగ్గాలనుకున్నప్పుడు మాత్రమే జొన్న రొట్టెలను తింటున్నారు. కానీ, ఆరోగ్యంగా ఉన్నవారు కూడా జొన్నలను రోజూ తీసుకోవడం ఎంతో మంచిది.
జొన్నలు పోషకాల గని. మన శరీరానికి ప్రతిరోజూ కావలసిన స్థూల, సూక్ష్మ పోషకాలు ఇందులో సమృద్ధిగా లభిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/health-benefits-of-jowar.jpg</image:loc><image:caption><![CDATA[ జొన్నల్లో పిండి పదార్థాలు, ప్రొటీన్, పీచు పదార్థం, ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మధుమేహ వ్యాధిగ్రస్తులకు చక్కెర స్థాయిలను నియంత్రించడంలో అద్భుతంగా తోడ్పడతాయి. శరీరంలో ఫ్రీరాడికల్స్‌ని అరికట్టి దీర్ఘకాలిక రోగాల నుండి రక్షిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/jowar-for-heart-health.jpg</image:loc><image:caption><![CDATA[ మన శరీర జీవక్రియలకు అవసరమైన సోడియం, జింక్, మెగ్నీషియం, పాస్ఫరస్ వంటి సూక్ష్మ పోషకాలు కూడా జొన్నల్లో పుష్కలంగా ఉంటాయి. జొన్నలు డయాబెటిస్ ఉన్నవారికి ఒక వరప్రసాదం. వీటిలో ఉండే ఎంజైములు పిండి పదార్థాలను సమర్థవంతంగా విచ్ఛిన్నం చేసి, గ్లూకోజ్ రక్తంలో నెమ్మదిగా కలిసేలా చేస్తాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా అదుపులో ఉంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/jowar-for-weight-loss.jpg</image:loc><image:caption><![CDATA[ బరువు తగ్గాలనుకునే వారికి జొన్నలు సరైన ఎంపిక. వీటిలో ఉండే అధిక పీచు, ప్రొటీన్ల కారణంగా కొద్దిగా తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది అతిగా తినే అలవాటును నివారించి బరువు పెరగకుండా చూస్తుంది. అయితే, కిడ్నీ సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా మేరకే వీటిని తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/jowar-nutrition.jpg</image:loc><image:caption><![CDATA[ గుండె ఆరోగ్యం, కొలెస్ట్రాల్: రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల గుండె జబ్బులు వస్తాయి. జొన్నల్లో ఉండే లిపిడ్‌లు, పాలీకోసనాల్‌లు, ఫైటో స్టెరాళ్లు శరీరంలో కొలెస్ట్రాల్ సంశ్లేషణకు సహకరించి, చెడు కొవ్వులను బయటకు పంపుతాయి. జొన్నల్లో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి. హానికరమైన ఫ్రీరాడికల్స్‌ను నియంత్రించడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఇవి మనల్ని కాపాడతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/jowar-recipes.jpg</image:loc><image:caption><![CDATA[ క్యాన్సర్ నిరోధకం: జొన్నల్లో ఉండే పోషకాలు శరీరంలో అనియంత్రితంగా పెరిగే క్యాన్సర్ కణాల ఎదుగుదలను అడ్డుకోవడంలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తాయి. సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రాసెస్ చేసిన ఆహారాలను పక్కన పెట్టి, జొన్నల వంటి చిరుధాన్యాలను మన దైనందిన ఆహారంలో భాగం చేసుకోవడం ఎంతో అత్యవసరం. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/coconut-water-for-gut-health-can-this-natural-drink-support-good-gut-bacteria-and-digestion-1906711.html</loc><lastmod>2026-09-08T14:59:23+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/coconut-water-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Coconut Water 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/coconut-water.jpg</image:loc><image:caption><![CDATA[ కొబ్బరినీళ్లు మీ ప్రేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇది ప్రీబయోటిక్‌ రసాయనాలను కలిగి ఉండి, మంచి బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడుతుంది. అలాగే, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, మినరల్స్‌ ఫ్రీ రాడికల్స్‌ నుండి రక్షణ కల్పిస్తాయి. జీర్ణవ్యవస్థ, రోగనిరోధక శక్తి, మానసిక ఆరోగ్యం, బరువు నియంత్రణకు కొబ్బరినీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/coconut-water-1.jpg</image:loc><image:caption><![CDATA[ మనకి వచ్చే  99% జబ్బులన్నిటికీ ప్రేగుల్లోని బ్యాక్టీరియానే కారణమని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే మన శరీర ఆరోగ్యం, అనారోగ్యం మొత్తం ప్రేగుల్లో నివసించే బ్యాక్టీరియా సమతుల్యతపైనే ఆధారపడి ఉంటుంది. మంచి బ్యాక్టీరియా అధికంగా ఉంటే ఆరోగ్యంగా, చెడ్డ బ్యాక్టీరియా పెరిగితే అనారోగ్యంతో ఉంటాము. మరి ఈ బ్యాక్టీరియా సమతుల్యత ఎందుకు దెబ్బతింటుందో ఇక్కడ చూద్దాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/coconut-water-2.jpg</image:loc><image:caption><![CDATA[ కెమికల్స్‌తో కూడిన ఆహారాలు, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్, బిస్కట్స్, ఐస్ క్రీమ్స్, ప్యాక్డ్ లేదా టిన్డ్ ఫుడ్స్ వంటివి మంచి బ్యాక్టీరియాను చంపేసి, చెడ్డ బ్యాక్టీరియాను పెంచుతాయి. అలాగే, వైట్ షుగర్, రిఫైన్డ్ ఫుడ్స్, జీరో ఫైబర్ ఫుడ్స్ కూడా ఇదే ప్రభావాన్ని చూపుతాయి. దీనివల్ల ప్రేగుల్లో చెడ్డ బ్యాక్టీరియా ఎక్కువై, శరీరంలోని అన్ని అవయవాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ప్రేగులు శరీరానికి పోలీస్ కంట్రోల్ రూమ్ లాంటివి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/coconut-water-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ పరిస్థితిని మెరుగుపరచడానికి, ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచడానికి, చెడ్డ బ్యాక్టీరియాను తగ్గించడానికి కొబ్బరినీళ్లు అద్భుతంగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరినీళ్లలో ఫ్రక్టో ఒలిగో శాకరైడ్స్ (FOS), గెలాక్టో ఒలిగో శాకరైడ్స్ (GOS) వంటి ప్రీబయోటిక్‌ రసాయనాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రసాయనాలు ప్రేగుల్లోని మంచి బ్యాక్టీరియాకు అద్భుతమైన ఆహారంగా పనిచేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మంచి బ్యాక్టీరియా అయిన బిఫిడో బ్యాక్టీరియం, లాక్టోబాసిల్లి, సెఫిలోకోకస్ వంటివి వేగంగా వృద్ధి చెంది, వాటి సంఖ్య పెరుగుతుంది. తక్కువ మంచి బ్యాక్టీరియా ఉన్నవారు కొబ్బరినీళ్లు తాగితే, అవి రెట్టింపు వేగంతో వృద్ధి చెందుతాయి ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/coconut-water-4.jpg</image:loc><image:caption><![CDATA[ కొబ్బరినీళ్లలో కైనెటిన్, ట్రాన్స్ జియాటిన్ అనే శక్తివంతమైన కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి. ఈ కాంపౌండ్స్ ప్రేగుల్లో మంట (ఇన్‌ఫ్లమేషన్) రాకుండా యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తాయి. దీనివల్ల మంచి బ్యాక్టీరియా ఇన్ఫ్లమేషన్ కారణంగా దెబ్బతినకుండా రక్షింపబడుతుంది. అంతేకాకుండా, ఈ రెండు రసాయనాలు మంచి బ్యాక్టీరియా సెల్ డివిజన్ ప్రక్రియను వేగవంతం చేస్తాయి. అంటే, మంచి బ్యాక్టీరియా తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి అవ్వడానికి ఇవి దోహదపడతాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/how-to-check-milk-purity-at-home-fssai-simple-detergent-test-1906710.html</loc><lastmod>2026-09-08T14:56:38+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/how-to-check-milk-purity-at-home-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ How To Check Milk Purity At Home ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/how-to-check-milk-purity-at-home-2.jpg</image:loc><image:caption><![CDATA[ పాల కల్తీ సమస్యను పరిష్కరించడానికి, ప్రజలను అప్రమత్తం చేయడానికి భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ ఒక సులభమైన శాస్త్రీయ పద్ధతిని సూచించింది. సంక్లిష్టమైన ప్రయోగశాల పరీక్షల అవసరం లేకుండా, వంటగదిలో లభించే వస్తువులతోనే కేవలం కొద్ది సెకన్లలో పాల స్వచ్ఛతను ఇంట్లోనే పరీక్షించవచ్చని స్పష్టం చేసింది. ఈ పద్ధతి ద్వారా సాధారణ ప్రజలు కూడా తాము తాగే పాలు అసలైనవా కాదా అనేది స్పష్టంగా గుర్తించవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/how-to-check-milk-purity-at-home-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ పరీక్ష విధానం చాలా సులభం. ముందుగా శుభ్రమైన, పారదర్శకమైన గాజు గ్లాసు లేదా టెస్ట్ ట్యూబ్‌లో 5 నుండి 10 మిల్లీలీటర్ల పాలను తీసుకోవాలి. ఆ తర్వాత దాని పైభాగాన్ని చేతితో గట్టిగా మూసి ఉంచి, కొన్ని సెకన్ల పాటు బలంగా ఊపాలి. అలా బాగా కదిలించిన వెంటనే పాల ఉపరితలంపై ఏర్పడే మార్పులను నిశితంగా గమనించడం ద్వారా కల్తీని తేలికగా పసిగట్టవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/how-to-check-milk-purity-at-home.jpg</image:loc><image:caption><![CDATA[ పాలను బలంగా ఊపిన తర్వాత ఏర్పడిన నురుగు చాలా వేగంగా మాయమైతే, ఆ పాలు స్వచ్ఛమైనవని నిర్ధారించుకోవచ్చు. సహజ పాల సాంద్రత వల్ల గాలి బుడగలు ఎక్కువసేపు నిలవలేవు. దీనికి విరుద్ధంగా, పాలను కదిలించిన తర్వాత ఉపరితలంపై నురుగు చాలాసేపు అలానే ఉండిపోతే, అందులో డిటర్జెంట్ లేదా సబ్బు కలిసిందని అర్థం చేసుకోవాలి. రసాయనాలు పాల తలతన్యతను తగ్గించడం వల్లే ఈ విధంగా ఎక్కువసేపు నురుగు స్థిరంగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/how-to-check-milk-purity-at-home-4.jpg</image:loc><image:caption><![CDATA[ డిటర్జెంట్ లేదా రసాయనాలు కలిపిన పాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతిని తీవ్రమైన కడుపు ఇన్ఫెక్షన్లు వస్తాయి. దీర్ఘకాలంలో ఇవి కాలేయం, మూత్రపిండాల పనితీరును నాశనం చేసి ప్రాణాలకే ప్రమాదం తెచ్చిపెడతాయి. రసాయనాల వల్ల పాలలోని సహజ ప్రోటీన్లు విషపూరితంగా మారతాయి కాబట్టి మార్కెట్ నుంచి తెచ్చిన పాలపై కొద్దిపాటి అనుమానం వచ్చినా వెంటనే ఈ సాధారణ పరీక్ష చేసి చూసుకోవడం ఎంతో అవసరం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/how-to-check-milk-purity-at-home-1.jpg</image:loc><image:caption><![CDATA[ కల్తీ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి విడిగా విక్రయించే పాల కంటే, విశ్వసనీయ బ్రాండ్ల సీల్డ్ ప్యాకెట్లను ఎంచుకోవడమే మంచిది. ప్యాకెట్‌పై ఆకుపచ్చ FSSAI లోగో, 14 అంకెల లైసెన్స్ నంబర్, తయారీ, గడువు తేదీలు సరిగ్గా ఉన్నాయో లేదో తప్పక పరిశీలించాలి. రవాణా సమయంలో ఎండ వేడిమి వల్ల ప్లాస్టిక్ ప్యాకెట్లలో బ్యాక్టీరియా చేరే అవకాశం ఉన్నందున, వీలైనంత వరకు ఎక్కువ రక్షణ నిచ్చే గాలి చొరబడని టెట్రా ప్యాక్ పాల ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వడం ఆరోగ్యకరం. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/phool-makhana-payasam-for-breakfast-replace-tea-or-coffee-with-this-nutritious-bowl-for-energy-and-strength-1906688.html</loc><lastmod>2026-09-08T14:42:11+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/phool-makhana-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Phool Makhana 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/phool-makhana.jpg</image:loc><image:caption><![CDATA[ టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు సత్తువనిచ్చే సగ్గుబియ్యం ఫూల్ మఖానా పాయసాన్ని గిన్నెడు తింటే చాలు. ఇది పోషకాలను అందిస్తూ, నొప్పులను దూరం చేస్తుంది. బెల్లం, పాలు, ఫూల్ మఖానా, సగ్గుబియ్యం కలయికతో తయారైన ఈ కమ్మని పాయసం ఐరన్, కాల్షియంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. డయాబెటిస్, బరువు తగ్గాలనుకునే వారికి, గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/phool-makhana-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఆరోగ్యకరమైన ఆహారం, పోషకాలతో కూడిన వంటకాలపై ఆసక్తి పెరుగుతున్న సగ్గుబియ్యం, ఫూల్ మఖానా పాయసం రెసిపీ ఎంతో మందిని ఆకర్షిస్తోంది. ప్రతిరోజూ మనం తాగే టీ, కాఫీలకు బదులుగా కేవలం ఒక కప్పు ఈ పాయసాన్ని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇది కేవలం రుచిని మాత్రమే కాకుండా, శక్తిని, సత్తువను అందించే అద్భుతమైన వంటకం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/phool-makhana-3.jpg</image:loc><image:caption><![CDATA[ సగ్గుబియ్యం నానబెట్టడం: ముందుగా అర కప్పు పెద్ద సగ్గుబియ్యాన్ని రెండు గంటల పాటు నానబెట్టాలి. ముందుగా నానబెట్టడం వల్ల పాయసం త్వరగా ఉడుకుతుంది. ఒక గిన్నెలో అర కప్పు తురిమిన బెల్లం, పావు కప్పు నీళ్లు కలిపి బెల్లం కరిగే వరకు మరిగించాలి. పూర్తిగా కరిగిన తర్వాత ఒక నిమిషం పాటు మరిగించి, బెల్లం సిరప్‌ను వడగట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పాలు విరగకుండా ఉంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/phool-makhana-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఒక టీ స్పూన్ నెయ్యిలో ఒక కప్పు ఫూల్ మఖానాను బంగారు రంగు వచ్చేవరకు, క్రిస్పీగా మారేవరకు మూడు నుండి నాలుగు నిమిషాలు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో మూడున్నర కప్పుల పాలను పొంగు వచ్చే వరకు మరిగించాలి. ఫుల్ ఫ్యాట్ పాలను ఉపయోగించడం వల్ల పాయసం రుచిగా ఉంటుంది. పాలు మరిగిన తర్వాత, నానబెట్టిన సగ్గుబియ్యం, కొద్దిగా కుంకుమపువ్వును వేసి, సగ్గుబియ్యంగా మారేవరకు ఉడికించాలి. 10-12 బాదం పప్పులు, ఒక టీ స్పూన్ పిస్తా పప్పు, నాలుగు యాలకులను మిక్సీలో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడి పాయసానికి అద్భుతమైన రుచిని ఇస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/phool-makhana-5.jpg</image:loc><image:caption><![CDATA[ సగ్గుబియ్యం ఉడికిన తర్వాత, గ్రైండ్ చేసిన బాదం పొడిని వేసి, గడ్డలు కట్టకుండా బాగా కలపాలి. రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత, సన్నగా తరిగిన బాదం ముక్కలు, వేయించిన ఫూల్ మఖానా వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. పాయసం కొద్దిగా చల్లారిన తర్వాత, వడగట్టిన బెల్లం కలిపి బాగా మిక్స్ చేయాలి. బెల్లం బదులు చక్కెరను ఉపయోగించాలనుకుంటే, బాదం పొడి వేసేటప్పుడు అర కప్పు చక్కెరను కలుపుకోవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/how-to-exchange-torn-or-mutilated-notes-received-from-atm-rbi-guidelines-1906689.html</loc><lastmod>2026-09-09T12:54:46+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/how-to-exchange-damaged-currency-with-rbi-rules.jpg</image:loc>
					<image:title><![CDATA[ How To Exchange Damaged Currency With Rbi Rules ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/damaged-atm-notes-exchange-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ డిజిటల్ యుగంలో కూడా కొందరు ఏటీఎంలకు వెళ్లి డబ్బులు తెచ్చుకుంటుంటారు. అలా వెళ్లినప్పుడు కొన్ని సార్లు చిరిగిన నోట్లు వస్తుంటాయి. కానీ అలా వచ్చిన నోట్లను ఏం చేయాలో చాలా మందికి తెలియదు. అందుకే ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారుల ప్రయోజనం కోసం కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/damaged-atm-notes-exchange-4.jpg</image:loc><image:caption><![CDATA[ చిరిగిన నోట్లు వస్తే ఏం చేయాలి?: ఒక వేళ మీరు ఏటీఎంకు వెళ్లినప్పుడు చిరిగిన నోట్లు వస్తే మీరు మొదట కంగారు పడకుండా.. వెంటనే ఆ ఏటీఎం ఏ బ్యాంకుకు చెందినదో చూసి.. దాన్ని బ్రాంచ్‌ను ఎక్కడుదో అక్కడికి వెళ్లి నేరుగా అధికారులను సంప్రదించండి. వారు మీకు ఏం చేయాలో అనే ప్రాసెస్ చెప్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/damaged-atm-notes-exchange-3.jpg</image:loc><image:caption><![CDATA[ మీ డబ్బు మీరు తిరిగి పొందాలంటే మీరు బ్యాంక్ అధికారులకు అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంక్‌లో దరఖాస్తు ఫామ్ తీసుకొని.. నగదు ఏ తేదీన, ఏ సమయంలో, ఏ ఏటీఎం నుంచి ఎంత మొత్తం విత్‌డ్రా చేశారనే వివరాలను ఆ ఫామ్‌లో ఫిల్ చేయాలి. ఆ అప్లికేషన్‌కు మీరు ఏటీఎంలో విత్‌డ్రా చేసిన ట్రాన్సాక్షన్ స్లిప్, లేదా మీ ఫోన్‌కు వచ్చిన ఎస్ఎమ్ఎస్ (SMS) సంబంధిన వివరాలను కూడా యాడ్ చేశారు. తర్వాత దాన్ని బ్యాంక్‌లో సమర్పించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/damaged-atm-notes-exchange-1.jpg</image:loc><image:caption><![CDATA[ అధికారులు మీ నుంచి తీసుకున్న దరఖాస్తును పరిశీలించి ఆర్బీఐ నిబంధనల ప్రకారం మీ దగ్గర ఏవైతే నోట్ల చిరిగిపోయినవి ఉన్నాయో వాటిని తీసుకొని మీరు కొత్త నోట్లను ఇస్తుంది. అయితే ఇక్కడ కొన్ని కండీషన్స్ కూడా ఉన్నాయి. ఒక్కో వ్యక్తికి కేవలం   20 నోట్లను మాత్రమే మార్చుకోవచ్చు. అది కూడా కేవలం రూ.5వేల వరకు మాత్రమే, అంతకంటే ఎక్కువ ఉంటే దానికి మరో ప్రాసెస్ ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/damaged-atm-notes-exchange.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ఆర్‌బీఐ రూల్స్ ప్రకారమే నోట్లు మార్చి ఇవ్వడానికి కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మీరు తెచ్చే నోటు పూర్తిగా ముక్కలైపోయినా,  బాగా కాలిపోయినా, గుర్తుపట్టలేనంతగా లేదా పరీక్షించడానికి వీలులేనంతగా పూర్తిగా దెబ్బతిన్నప్పుడు వాటిని తీసుకోరు. కాబట్టి ఏటీఎం నుంచి పాడైన నోట్లు వస్తే వాటిని జాగ్రత్తగా భద్రపరిచి, వెంటనే సంబంధిత బ్యాంకును ఆశ్రయించడం ఉత్తమం. ఈ సారి ఏటీఎంలో మీకు చిరిగిన నోట్లు వస్తే కంగారు పడకుండా ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/actress-madhuri-dixit-luxurious-mumbai-home-on-53rd-floor-photos-goes-viral-1906618.html</loc><lastmod>2026-09-09T11:45:23+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/madhuri-dixit-new-home.jpg</image:loc>
					<image:title><![CDATA[ Madhuri Dixit New Home ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/madhuri-dixit.jpg</image:loc><image:caption><![CDATA[ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఓ ఊపు ఊపేసిన హీరోయిన్లలో మాధురీ దీక్షిత్ ఒకరు. తన నటనతో పాటు, ఆమె వ్యక్తిగత జీవితం, జీవనశైలి కూడా అభిమానులకు చర్చనీయాంశంగా ఉన్నాయి. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఇప్పుడు రీఎంట్రీలో అటు సినిమాలు, ఇటు షోస్ అంటూ తెగ బిజీగా ఉంటుంది. ఇప్పుడు ముంబైలోని ఆమె విలాసవంతమైన ఇంటికి సంబంధించిన ఒక దృశ్యం నెట్టింట వైరలవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/madhuri-dixit-life.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ ఇంటిలోని ప్రతి మూలా మాధురి, ఆమె భర్త డాక్టర్ శ్రీరామ్ నేనేల ఇష్టాయిష్టాలను ప్రత్యేకంగా తెలియజేస్తుంది. 5500 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఈ ఇంటి ప్రత్యేకత ఏమిటంటే, దీని నుండి కనిపించే అద్భుతమైన సముద్ర దృశ్యం, ఆధునిక సాంకేతికత, ప్రఖ్యాత చిత్రకారుడు ఎం. ఎఫ్. హుస్సేన్ కళాకృతుల అద్భుతమైన సమ్మేళనం. మాధురి, డాక్టర్ శ్రీరామ్ నేనేల ఇల్లు ముంబైలోని ఒక బహుళ అంతస్తుల భవనంలోని 53వ అంతస్తులో ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/madhuri-dixit-house.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ ఇంటి నుండి అరేబియా సముద్రం , ముంబై నగర దృశ్యం చాలా అందంగా కనిపిస్తుంది. ఈ ఇంటిని ప్రముఖ వాస్తుశిల్పి అపూర్వ ష్రాఫ్ రూపొందించారు. మాధురి ఆమె భర్తకు ఇంటి గురించి చాలా స్పష్టమైన ఆలోచన ఉంది. కుటుంబానికి సౌకర్యవంతంగా ఉండేలా, ఆధునికంగా ఉంటూనే సరళంగా ఉండే ఇల్లు. అందుకే, ఇంటి లోపలి భాగంలో సరళ రేఖలు, తటస్థ రంగులు, విశాలమైన ప్రదేశాలకు ప్రాధాన్యత ఇవ్వబడింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/madhuri-dixit-home.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ ఇంట్లోకి అడుగుపెట్టగానే ఎం.ఎఫ్. హుస్సేన్ గీసిన రంగురంగుల చిత్రాలు అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. హుస్సేన్ మాధురికి కొన్ని ప్రత్యేకమైన చిత్రాలను బహుమతిగా ఇచ్చారు. ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర హుస్సేన్ గీసిన గణేశుడి చిత్రాలను చూడవచ్చు. డాక్టర్ శ్రీరామ్ నేనే సాంకేతికత పట్ల ఆసక్తిగలవారు, అందుకే ఇంట్లో స్మార్ట్ ఆటోమేషన్‌ను కూడా విస్తృతంగా ఉపయోగించారు. లైటింగ్ నుండి ఇంటిలోని వివిధ సౌకర్యాల వరకు ఆధునిక సాంకేతికతను ఉపయోగించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/madhuri-dixit-telugu.jpg</image:loc><image:caption><![CDATA[ అయినప్పటికీ, సాంకేతికతను ఉపయోగిస్తున్నప్పటికీ, ఇంటి ప్రశాంతమైన, ఆకర్షణీయమైన రూపాన్ని కాపాడుకున్నారు. ఈ ఇంట్లో హోమ్ థియేటర్ , ఒక ప్రత్యేక సంగీత గది కూడా ఉన్నాయి. ఈ గదిలో గిటార్లు, డ్రమ్ములు పియానో ​​ఉన్నాయి. కుటుంబంతో కలిసి సంగీతాన్ని ఆస్వాదించడానికి ఈ స్థలాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. ఇది కాకుండా, ఒక ఆటోమేటెడ్ బార్ , అత్యాధునిక గౌర్మెట్ కిచెన్ కూడా ఈ ఇంటి ఆకర్షణలో భాగం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/madhuri-dixit-fam.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంత ఖరీదైన, ఆధునికమైన ఇంటి వెనుక మాధురికి ఒక భావోద్వేగభరితమైన కోణం కూడా ఉంది. ఆమెకు ఇల్లు అంటే కేవలం విలాసం లేదా అలంకరణ మాత్రమే కాదు, కుటుంబంతో కలిసి విశ్రాంతిగా, సంతోషంగా సమయం గడిపే ప్రదేశం కూడా. సముద్రపు ప్రశాంత దృశ్యం, కళ, సంగీతం , కుటుంబం కోసం ఏర్పాటు చేసిన ప్రదేశాలు ఈ ఇంటికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగత స్పర్శను అందిస్తాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/katte-pongali-recipe-make-temple-style-katte-pongali-soft-and-delicious-at-home-1906605.html</loc><lastmod>2026-09-08T12:50:08+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/katte-pongal-4.jpg</image:loc>
					<image:title><![CDATA[ Katte Pongal 4 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/katte-pongal-4.jpg</image:loc><image:caption><![CDATA[ కట్టెపొంగలి అంటే చాలామందికి ఇష్టమైన వంటకం. ఇది అల్పాహారంగా, తేలికపాటి రాత్రి భోజనంగా, లేదా ప్రత్యేకించి పండుగ సందర్భాలలో దేవాలయాలలో ప్రసాదంగా ప్రసిద్ధి చెందింది. అయితే, దీనిని హోటల్ స్థాయిలో కమ్మగా, మృదువుగా, నోటిలో కరిగిపోయేలా ఎలా తయారుచేయాలో చాలామందికి తెలియదు. శ్రావణిస్ కిచెన్ ఈ వీడియో ద్వారా, అటువంటి ఖచ్చితమైన కట్టెపొంగలిని ఇంట్లోనే సులభంగా తయారుచేసుకునే ఒక అద్భుతమైన పద్ధతిని పంచుకుంది. ఈ రెసిపీని అనుసరిస్తే 100% సంతృప్తికరమైన ఫలితం లభిస్తుందని నొక్కి చెప్పబడింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/katte-pongal-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ రెసిపీలో అతి ముఖ్యమైన ట్రిక్ ఏమిటంటే బియ్యం మరియు పెసరపప్పును సమాన నిష్పత్తిలో తీసుకోవడం. సాధారణంగా ఇంట్లో తయారుచేసేటప్పుడు, పప్పు క్వాంటిటీని బియ్యంతో పోలిస్తే తక్కువగా (ముప్పావు కప్పు లేదా సగం కప్పు) తీసుకుంటారు. కానీ, హోటల్స్ మరియు దేవాలయాలలో కమ్మని, మృదువైన కట్టెపొంగలి కోసం బియ్యం, పప్పు రెండింటినీ సమాన కొలతల్లో వాడుతారు. ఇది కట్టెపొంగలి రుచిని, మృదుత్వాన్ని గణనీయంగా పెంచుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/katte-pongal-2.jpg</image:loc><image:caption><![CDATA[ కావాల్సిన పదార్థాలు..  బియ్యం: 1 కప్పు (సుమారు 180 గ్రాములు) - సాధారణ బియ్యం లేదా రేషన్ బియ్యం, పెసరపప్పు: 1 కప్పు, నీళ్లు: 6 కప్పులు (మొదట 3 కప్పులు, తర్వాత 3 కప్పులు వేడి నీళ్లు), నెయ్యి: 1 టేబుల్ స్పూన్ (ఉడికించడానికి), అర కప్పు (పోపు కోసం), ఉప్పు: 1.5 టీస్పూన్ (రుచికి సరిపడా), నూనె: 1 టేబుల్ స్పూన్ (పోపు కోసం), జీలకర్ర: 1 టీస్పూన్, అల్లం ముక్కలు: 1 టీస్పూన్ (సన్నగా తరిగినవి), మిరియాలు: 1.5 టీస్పూన్, జీడిపప్పు పలుకులు: 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి: 3 (సన్నగా తరిగినవి), కరివేపాకు: కొద్దిగా, ఇంగువ: పావు టీస్పూన్ చొప్పున తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/katte-pongal-3.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా ఒక కప్పు పెసరపప్పును కడాయిలోకి తీసుకుని, తక్కువ మంటపై నెమ్మదిగా రంగు మారే వరకు వేయించాలి. ఎక్కువ మంటపై వేయిస్తే పప్పు త్వరగా రంగు మారి లోపల పచ్చిగా ఉండవచ్చు. వేయించిన పప్పును ఒక కప్పు బియ్యంతో కలిపి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. కుక్కర్‌లో మూడు కప్పుల నీళ్లు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, రుచికి సరిపడా ఉప్పు వేసి, మూతపెట్టి హై ఫ్లేమ్‌లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. మూడు విజిల్స్ వచ్చిన తర్వాత, కుక్కర్ ఆవిరి పూర్తిగా పోయాక మూత తీయాలి. పప్పు, అన్నం చక్కగా ఉడికిపోయి ఉంటాయి. ఒకసారి కలిపి, పక్కన వేడి చేసుకున్న మరో మూడు కప్పుల నీటిని నెమ్మదిగా కలుపుతూ పొంగలిని మృదువుగా చేయాలి. అన్ని నీళ్లను ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా కలుపుతూ ఉండాలి. పొంగలి మరీ గట్టిగా కాకుండా, మరీ పల్చగా కాకుండా, ఇక్కడ చూపిన విధంగా మధ్యస్థ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మరో రెండు నిమిషాలు ఉడికించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/katte-pongal-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఒక చిన్న కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె, అర కప్పు నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక, జీలకర్ర, సన్నగా తరిగిన అల్లం, మిరియాలు వేసి కొద్దిగా వేయించాలి. ఆ తర్వాత జీడిపప్పు పలుకులు వేసి లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. చివరగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి పోపును బాగా వేయించి సిద్ధంగా ఉన్న పొంగలిలో కలపాలి. పోపును కలిపిన తర్వాత, పొంగలిని అంతా కలిసేలా బాగా కలపాలి. అద్భుతమైన రుచితో, సువాసనతో కూడిన కట్టెపొంగలి రెడీ అవుతుంది. ఈ కట్టెపొంగలిని వేడివేడిగా పల్లి చట్నీ, పల్లి కొబ్బరి చట్నీ లేదా సాంబార్‌తో వడ్డిస్తే అద్భుతమైన రుచిని ఆస్వాదించవచ్చు. ఈ పద్ధతిని అనుసరించి కట్టెపొంగలిని తయారుచేస్తే రుచి అదిరిపోద్ది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/sun-transit-in-virgo-6-zodiac-signs-set-to-gain-wealth-authority-and-fame-1906558.html</loc><lastmod>2026-09-08T12:10:22+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sun-transit-21.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sun Transit ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sun-transit-1-21.jpg</image:loc><image:caption><![CDATA[ గ్రహ రాజైన రవి గ్రహం ఈ నెల(సెప్టెంబర్) 16 నుంచి అక్టోబర్ 16 వరకు తనకు మిత్ర క్షేత్రమైన కన్యారాశిలో సంచారం ప్రారంభించడం జరుగుతుంది. రవికి కన్యా రాశి సంచారం వల్ల బలం పెరుగుతుంది. ఈ రాశిలో ఉన్నంత వరకు కొన్ని రాశులకు ఊహించని ఆదాయాన్ని, అధికారాన్ని అనుగ్రహించడం జరుగుతుంది. ఆదాయం పెరగడం, ఐశ్వర్యం కలగడంతో పాటు తప్పకుండా జనాకర్షణను, పేరు ప్రఖ్యాతులను పెంచే అవకాశం ఉంటుంది. వృషభం, కర్కాటకం, సింహం. వృశ్చికం, ధనుస్సు, మకర రాశులకు అత్యంత అనుకూలమైన కన్యా రాశిలో రవి మరింత శక్తిమంతంగా వ్యవహరిస్తూ ఈ రాశుల వారికి శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/2-vrushaba-rasi-41-3.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభం: ఈ రాశికి చతుర్ధాధిపతి అయిన రవి పంచమ స్థానంలో ప్రవేశించడం వల్ల ఏ ప్రయత్నం చేపట్టినా సఫలమవుతుంది. ప్రతి పనినీ పట్టుదలగా సాధించుకోవడం జరుగుతుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. మరింత మంచి సంస్థలోకి మారి ఉన్నత పదవిని చేపట్టే అవకాశం కూడా ఉంది. నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. షేర్లు, స్పెక్యులే షన్లు బాగా లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/4-karkataka-rashi-41-1.jpg</image:loc><image:caption><![CDATA[ కర్కాటకం: ఈ రాశికి ధనాధిపతి అయిన రవి తృతీయ స్థానంలో ప్రవేశించిన దగ్గర నుంచి ఆదాయ వృద్ధికి అనేక అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఎటువంటి ఆర్థిక ప్రయత్నమైనా అనుకూల ఫలితాలనిస్తుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఈ రాశివారి సలహాలు, సూచనల వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలకు మించిన పురోగతి చోటు చేసుకుంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/5-simha-rashi-21-2.jpg</image:loc><image:caption><![CDATA[ సింహం: రాశ్యధిపతి రవి ధన స్థానంలో సంచారం వల్ల ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు దాదాపు పూర్తిగా పరిష్కారమవుతాయి. కుటుంబ జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఇంట్లో పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు జరుగుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో, రాజకీయ ప్రము ఖులతో, ఉన్నతాధికారులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికంగా ఉన్నత స్థితి లభిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/8-vrushchika-rashi-21-1.jpg</image:loc><image:caption><![CDATA[ వృశ్చికం: ఈ రాశికి దశమాధిపతి అయిన రవి లాభ స్థానంలో ప్రవేశించడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవడం జరుగుతుంది. మరింత మంచి సంస్థలోకి మారడానికి కూడా అవకాశం ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఘన విజయాలు సాధిస్తాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. వృత్తి, వ్యాపారాలు రాబడిపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/9-dhanusu-rashi-11-1.jpg</image:loc><image:caption><![CDATA[ ధనుస్సు: ఈ రాశికి భాగ్య స్థానాధిపతి అయిన రవి దశమ స్థానంలో ప్రవేశించడం వల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పదోన్నతులు కలగడం, జీతభత్యాలు పెరగడం, మరింత మంచి ఉద్యోగంలోకి మారడం వంటివి జరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆర్థికంగా మంచి అదృష్టం పడుతుంది. చదువులు, ఉద్యోగాలపరంగా విదేశీ అవకాశాలు అంది వస్తాయి. ప్రముఖులైన వ్యక్తులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. సంతాన యోగం కలుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/10-makara-rashi-53.jpg</image:loc><image:caption><![CDATA[ మకరం: ఈ రాశికి భాగ్య స్థానంలో ప్రవేశిస్తున్న రవి వల్ల ఈ రాశివారికి అనేక విధాలుగా అదృష్టాలు కలు గుతాయి. ప్రభుత్వ ఉన్నతోద్యోగానికి సంబంధించిన పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజ యాలు సాధిస్తారు. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. పిత్రార్జితం లభిస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఆస్తి వివాదాలు సానుకూలపడతాయి. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/ginger-and-coriander-for-gas-and-acidity-this-simple-home-remedy-may-help-soothe-digestive-discomfort-1906502.html</loc><lastmod>2026-09-08T12:02:06+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ginger.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ginger ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ginger-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ మనలో చాలా మంది ఉదయాన్నే గ్యాస్, ఎసిడిటీతో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. అయితే, మీరు ఉదయం పూట దీనిని తీసుకుంటే చాలు. ఇంకా చెప్పాలంటే పరగడుపున దీనిని తీసుకుంటే ఇంకా మంచిది. ఒక చిన్న ఆహారపు అలవాటును మార్చుకోవడం వలన మీ పొట్టను మంచిగా క్లీన్ అవుతుంది. మరి, అసలు లేట్ చేయకుండా అదేంటో ఇక్కడ చూద్దాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/dhaniyallu-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ బిజీ లైఫ్ లో సరైన పోషకాహారం తీసుకోకపోవటం వలన ఎన్నో సమస్యలు వస్తాయి. ఇంకా, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే 
ఎన్నో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా, జీర్ణ సంబంధిత సమస్యలు  వస్తాయి. ఇంకా గ్యాస్, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. కాబట్టి, ఇవి తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/dhaniyallu-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇవి తగ్గించుకోవటానికి ఈ పల్లెటూరి చిట్కా గురించి తెలుసుకుందాం. ముందుగా ఒక స్పూన్ ధనియాలను తీసుకుని బాగా వేయించుకోవాలి. ఇంకా దీనిలో కొద్దిగా ధనియాలు, అల్లం ముక్క ఉన్న నీటిని పోసి వాటినిపేస్ట్ గా దాని నుంచి రసం తీయాలి. 
దీనిలో అర టేబుల్ స్పూన్ తేనె కలిపి దీనిని పరగడుపున తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిగా వేడి చేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/dhaniyallu-1.jpg</image:loc><image:caption><![CDATA[ మీరు దీనిని వరుసగా రెండు రోజులు తాగితే జీర్ణ సంబంధిత సమస్యలు  గ్యాస్, ఎసిడిటీ తగ్గుతాయి. ఇంకా కడుపు నొప్పి లాంటి సమస్యలు కూడా పోతాయి. ఈ సమస్యలను అశ్రద్ద చేస్తే ఇంకా  ఎక్కువయ్యే అవకాశం ఉంది. ధనియాలు,అల్లం అందరి ఇళ్ళలో  అందుబాటులో ఉంటుంది. దీనిని ఎప్పుడూ ఏదొక రకంగా వాడుతుంటారు. వీటిని తగ్గించడానికి  ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/dhaniyallu-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే, మీరు దీనిని మితంగానే తీసుకోవాలి మరి ఎక్కువగా తీసుకోకండి.  (నోట్ : మీరు వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తప్పసరిగా తీసుకోవాలి. ఇక్కడ అందించిన వివరాలు కేవలం మీ అవగాహనకు కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఇందులో రాసిన అంశాలకు టీవీ9 బాధ్యత వహించదని గమనించగలరు) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/gold-silver-prices-10-grams-22k-gold-increases-price-by-1100-check-gold-and-silver-hyderabad-latest-rates-1906517.html</loc><lastmod>2026-09-08T11:18:26+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-price-hike.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold Price Hike ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-1-2.jpg</image:loc><image:caption><![CDATA[ కొనుగోలు దారులకు బంగారం, వెండి ధరలు మరోసారి షాక్ ఇచ్చాయి. గత రెండ్రోజులు తగ్గి సుమారు రూ.1,50లక్షలకు దగ్గరకు వచ్చిన బంగారం, వెండి ధరలకు మంగళవారం ఒక్కసారిగా రెక్కలోచ్చాయి. కేవలం ఇవాళ ఒక్కరోజే తులం బంగారం రూ.1200, వెండిపై రూ.100 పెరిగింది. దీంతో ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో 24 క్యారట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,55,350 వద్ద ట్రేడవుతుండగా.. కేజీ వెండి ధర రూ.2,50,000 వద్ద ట్రేడవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-2-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ భారీ హెచ్చుతగ్గుల తర్వాత హైదరాబాద్‌లో 24 క్యారట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,55,350 గా ఉండగా ఉందయం ఈ ధర రూ.1,54, 140గా ఉంది, అదే 22 క్యారట్ల బంగారం ధర రూ.1,42,400 వద్ద ట్రేడువుతుండగా ఉదయం 6 గంటలకు ఈ ధర రూ.1,41,290గా ఉంది. అంటే కేవలం నాలుగు గంటల్లోనే బంగారం ధర వేలల్లో పెరిగింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-3-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబై, బెంగళూరు, పూణె నగరాల్లో ప్రస్తుతం 24 క్యారట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,55,350 గా ఉండగా, 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,42,400గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం ధర రూ.1,55, 500 గా ఉండగా.. చెన్నలో 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,670 వద్ద ట్రేడువుంతి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-4-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. కానీ ఈ సారి బంగారంతో పోల్చుకుంటే వెండి పెరుగుదల స్వల్పంగానే ఉంది. మంగళవారం కేజీ వెండిపై రూ.100 మాత్రమే పెరిగింది. ఈ పెరుగుదల తర్వాత దేశీయ మార్కట్‌లో కేజీ వెండి ధర రూ.2,50,000గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ.2,55,500గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులో సైతం ప్రస్తుతం ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-7.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే మీరు ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి.. బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పడూ మారుతూ ఉంటాయి. కాబట్టి మీరు బంగారం కొనాలని చూస్తుంటే మీ దగ్గర్లోని షోరూమ్‌కు వెళ్లి ప్రస్తుత ధరలను కనుక్కోండి. కొనే ముందు బంగరాం స్వచ్చమైందా లేదా అనేది హాల్‌మార్క్‌ ను బట్టి చూసుకోండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/nail-fungus-remedy-can-fenugreek-powder-aloe-vera-gel-and-garlic-help-know-the-facts-before-trying-this-home-remedy-1906451.html</loc><lastmod>2026-09-08T10:36:11+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/nail-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Nail 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/nail.jpg</image:loc><image:caption><![CDATA[ కాలి, చేతి గోళ్ల  చుట్టూ నొప్పితో నిద్ర సరిగా పట్టడం లేదా? గోళ్ల ఫంగస్ తో పాదాలు అందంగా లేవని బాధ పడుతున్నారా? ఈ టిప్స్ పాటిస్తే  హాస్పిటల్స్ చుట్టూ తిరిగే అవసరం లేదు. దీనికోసం ఇంట్లో దొరికే సాధారణ వస్తువులతోనే  చెక్ పెట్టొచ్చు. మరి , లేట్ చేయకుండా  అవేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/nail-1.jpg</image:loc><image:caption><![CDATA[ సాధారణంగా మనలో చాలా మందికి చేతి, కాలి గోర్లపై ఫంగల్ సమస్య వస్తుంది. ఈ సమస్యను మొదట్లోనే తుంచేయాలి లేదంటే 
పెద్ద సమస్యగా మారుతుంది. ఈ సమస్య వచ్చినప్పుడు అసలు లేట్ చేయకండి. అలాగే, వైద్యుని చెప్పినవి పాటిస్తూ ఇప్పుడు చెప్పే ఊరి చిట్కాలు ఫాలో అయితే ఉపశమనం పొందుతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/nail-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఒక చిన్న గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ మెంతి పొడి, ఒక టీ స్పూన్ ఆలోవెరా జెల్, 4 వెల్లుల్లి రెబ్బలు తీసి మెత్తని పేస్ట్ గా వేసి, ఇంకా దీనిలో దీనిని కొద్దిగా  పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని తీసుకుని పావుగంట తర్వాత వెచ్చని నీటితో క్లీన్ చేయాలి. ఈ విధంగా రోజులో రెండు సార్లు చేస్తే సరిపోతోంది. ఇంకా  సాయంత్రం కూడా ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/nail-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇలా ఈ సమస్య తగ్గేవరకు చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే  చేతి,కాలి గోళ్లపై ఏర్పడిన ఫంగస్, పుచ్చు గోళ్ళ సమస్యలు మొత్తం పోతాయి. మీరు దీనికోసం కొంత కాస్త సమయాన్ని కేటాయిస్తే చాలు. వెల్లుల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఫంగల్ లక్షణాలు పుచ్చు కూడా పోతోంది. ఇంకా నొప్పిని తగ్గించటానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/nail-4.jpg</image:loc><image:caption><![CDATA[ (నోట్ : మీరు వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తప్పసరిగా తీసుకోవాలి. ఇక్కడ అందించిన వివరాలు కేవలం మీ అవగాహనకు కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఇందులో రాసిన అంశాలకు టీవీ9 బాధ్యత వహించదని గమనించగలరు) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/lifestyle/food/traditional-telugu-vankaya-nuvvula-pachadi-authentic-brinjal-sesame-chutney-1906356.html</loc><lastmod>2026-09-08T09:00:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/brinjal-sesame-chutney.jpg</image:loc>
					<image:title><![CDATA[ Brinjal Sesame Chutney ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/andhra-style-brinjal-sesame-chutney-1.jpg</image:loc><image:caption><![CDATA[ Andhra Style Brinjal Sesame Chutney: సాంప్రదాయ తెలుగు వంటకాలలో వంకాయ నువ్వుల రోటి పచ్చడికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం రుచిని మాత్రమే కాకుండా, ఆహారాన్ని మరింత తృప్తినిచ్చేలా చేస్తుంది. వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే ఈ పచ్చడి ఇచ్చే అనుభూతి వర్ణనాతీతం. ఈ రెసిపీని సులభంగా ఇంట్లో తయారుచేసుకోవచ్చు, రోటి పచ్చడి ప్రియులకు ఇది తప్పకుండా నచ్చుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/andhra-style-brinjal-sesame-chutney-5.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీకి కావలసిన పదార్థాలు: తెల్ల నువ్వులు: 2 టేబుల్ స్పూన్లు, నూనె: 7-8 టేబుల్ స్పూన్లు (వేయించడానికి, తాలింపునకు), ధనియాలు: 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి: 10-12, జీలకర్ర: 1/4 టీస్పూన్ (వేయించడానికి), 1/4 టీస్పూన్ (తాలింపునకు), ముదురు తెల్ల వంకాయలు: 300 గ్రాములు (ముక్కలుగా కోయాలి), ఉప్పు: రుచికి సరిపడా, చింతపండు: నిమ్మకాయంత పరిమాణం (నానబెట్టింది), చిన్న ఉల్లిపాయ: 1 (నాలుగైదు పాయలుగా చీరాలి), పసుపు: 1/2 టీస్పూన్, ఆవాలు: 1/4 టీస్పూన్, ఎండుమిర్చి: 2 ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు: 10-12 (దంచినవి), కరివేపాకు: 2 రెబ్బలు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/andhra-style-brinjal-sesame-chutney-4.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానం: 1.  నువ్వులను వేయించడం: ముందుగా ఒక మూకుడులో 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులని సన్నని సెగ మీద నిరంతరం కలుపుతూ చిట్లే వరకు వేయించాలి. నువ్వులు మాడిపోకుండా జాగ్రత్తపడటం చాలా ముఖ్యం, లేకపోతే పచ్చడి చేదుగా మారుతుంది. వేగిన నువ్వులని పక్కకు తీసి చల్లార్చాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/andhra-style-brinjal-sesame-chutney.jpg</image:loc><image:caption><![CDATA[ 2.  మసాలాలు వేయించడం: అదే మూకుడులో 4 టేబుల్ స్పూన్ల నూనె వేడిచేసి, అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 10-12 పచ్చిమిర్చి, 1/4 టీస్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. పచ్చిమిర్చి మీద అక్కడక్కడా మచ్చలు ఏర్పడే వరకు వేపి, వాటిని ప్లేట్‌లోకి తీసి చల్లారనివ్వాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/andhra-style-brinjal-sesame-chutney-6.jpg</image:loc><image:caption><![CDATA[ 3.  వంకాయలు మగ్గించడం: అదే మూకుడులో అవసరమైతే ఇంకొంచెం నూనె వేసి, 300 గ్రాముల ముదురు తెల్ల వంకాయ ముక్కలను వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. రోటి పచ్చడికి ముదురు వంకాయలు వాడటం మంచిది, ఎందుకంటే అవి పచ్చడికి కండరమైన ఆకృతిని ఇస్తాయి. లేత వంకాయలు చాలా త్వరగా పేస్ట్‌గా మారిపోతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/andhra-style-brinjal-sesame-chutney-3.jpg</image:loc><image:caption><![CDATA[ 4.  ముద్ద తయారుచేయడం (మిక్సీలో): చల్లారిన నువ్వులు, పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, నానబెట్టిన నిమ్మకాయంత చింతపండును కొద్దిగా నీళ్లు చేర్చి మిక్సీ జార్‌లో వేసి మెత్తని పేస్ట్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/andhra-style-brinjal-sesame-chutney-2.jpg</image:loc><image:caption><![CDATA[ 5.  పచ్చడి దంచడం (రోట్లో): ముందుగా రోట్లో చిన్న ఉల్లిపాయ పాయలను వేసి కచ్చాపచ్చాగా దంచాలి. ఉల్లిపాయను మిక్సీలో వేస్తే దాని ఆకృతి మారిపోతుంది. తరువాత మగ్గిన వంకాయ ముక్కలను వేసి ప్రతి ముక్క బాగా నలిగేలా దంచుకోవాలి. ఇప్పుడు మిక్సీలో గ్రైండ్ చేసుకున్న నువ్వుల ముద్దను వేసి బాగా దంచుకోవాలి. చివరగా 1/2 టీస్పూన్ పసుపు వేసి మరొకసారి బాగా దంచుకోవాలి. పచ్చడి చక్కటి ఆకృతిలోకి వచ్చే వరకు దంచడం ముఖ్యం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/andhra-style-brinjal-sesame-chutney-9.jpg</image:loc><image:caption><![CDATA[ 6.  తాలింపు సిద్ధం చేయడం: ఒక చిన్న కడాయిలో 3-4 టేబుల్ స్పూన్ల నూనె వేడిచేసి, అందులో 1/4 టీస్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి ముక్కలు, 1/4 టీస్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. తరువాత 10-12 దంచిన వెల్లుల్లి రెబ్బలు, 2 రెబ్బల కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/andhra-style-brinjal-sesame-chutney-8.jpg</image:loc><image:caption><![CDATA[ 7.  పచ్చడి కలుపుట: వేగిన తాలింపును దంచుకున్న వంకాయ పచ్చడిలో వేసి బాగా కలిపి దింపేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/andhra-style-brinjal-sesame-chutney-7.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ అద్భుతమైన వంకాయ నువ్వుల రోటి పచ్చడి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. కాస్త ఎక్కువ నూనెతో తాలింపు వేస్తే, ఈ పచ్చడి ఫ్రిజ్‌లో వారం రోజుల వరకు తాజాగా నిల్వ ఉంటుంది. నువ్వులు మాడిపోకుండా చూసుకుంటే, ఈ రెసిపీని ఎవరైనా సులభంగా తయారుచేసి ఆస్వాదించవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/elderly-farmer-stages-unique-protest-over-rs-19-lakh-deposit-sleeps-outside-cooperative-society-office-seeking-his-life-savings-1906440.html</loc><lastmod>2026-09-08T08:03:00+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/old-person-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Old Person 3 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/old-person.jpg</image:loc><image:caption><![CDATA[ జీవితాంతం చెమటోడ్చి దాచుకున్న కష్టార్జితం చేతికి అందక, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకపోవడంతో ఓ వృద్ధ రైతు కడుపుమండి వినూత్న నిరసనకు దిగారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలో వెలుగుచూసిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో (పీఏసీఎస్) ఏళ్ల తరబడి మూలుగుతున్న తమ సొమ్మును రాబట్టుకునేందుకు ఆ అన్నదాత చేసిన నిరసన అందరినీ కలచివేసింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/old-person-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం గ్రామానికి చెందిన చిట్టూరి నర్సింహమూర్తి స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సుమారు రూ. 19 లక్షలు డిపాజిట్ చేశారు. వృద్ధాప్యంలో తమ అవసరాలకు అక్కరకు వస్తాయన్న ఆశతో పొదుపు చేసుకున్న ఆ మొత్తాన్ని తిరిగి తీసుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. కార్యాలయం చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతున్నా అధికారులు రకరకాల సాకులు చెబుతూ కాలయాపన చేస్తుండటంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. చివరకు విసిగిపోయిన నర్సింహమూర్తి సోమవారం ఏకంగా మంచాన్ని తీసుకువచ్చి సహకార సంఘం కార్యాలయం ఎదుట వేసుకుని అక్కడే పడుకుని నిరసన వ్యక్తం చేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/old-person-2.jpg</image:loc><image:caption><![CDATA[ పొలాల్లో దిగి పనిచేసే శారీరక సత్తువ తమకు ఇప్పుడు లేదని, వృద్ధాప్యంలో మందుల ఖర్చులు, నిత్య జీవనానికి ఆసరాగా ఉంటాయనే ఉద్దేశంతోనే పైసా పైసా కూడబెట్టి సొసైటీలో డిపాజిట్ చేశామని నర్సింహమూర్తి, ఆయన భార్య లక్ష్మీదేవి కన్నీటిపర్యంతమయ్యారు. తీరా అవసరమైన సమయంలో అసలు సొమ్ము ఇవ్వకపోగా, కనీసం వడ్డీ కూడా చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆ వృద్ధ దంపతులు వాపోయారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/old-person-4.jpg</image:loc><image:caption><![CDATA[ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన కరువైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవసాయ సహకార సంఘంలో రైతుల డిపాజిట్ల గోల్‌మాల్ వ్యవహారం నిన్నమొన్నటిది కాదు. సుమారు 180 మంది రైతులకు సంబంధించిన దాదాపు రూ. 4.40 కోట్ల డిపాజిట్లు పక్కదారి పట్టినట్లు 2019లోనే విచారణ అధికారులు గుర్తించారు. ఆ అక్రమాలు నిర్ధారణ జరిగి ఏళ్లు గడుస్తున్నా, బాధిత రైతులకు ఇవ్వాల్సిన సొమ్ము మాత్రం ఇంకా పరిష్కారం కాలేదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/old-person-5.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుతం దాదాపు రూ. 3.32 కోట్ల మేర డిపాజిట్ సొమ్ము రైతులకు బకాయి పడి ఉన్నట్లు తెలుస్తోంది. నర్సింహమూర్తి చేపట్టిన ఈ ఆందోళనకు మద్దతుగా పలువురు బాధితులు, డిపాజిట్‌దారులు పెద్ద ఎత్తున తరలివచ్చి నిరసనలో పాలుపంచుకున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని రైతులకు రావాల్సిన డిపాజిట్లను తక్షణమే ఇప్పించాలని డిమాండ్ చేశారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/saturn-transit-2026-these-2-zodiac-signs-may-get-a-strong-chance-to-buy-a-new-home-or-property-1906417.html</loc><lastmod>2026-09-08T07:19:43+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/shani.jpg</image:loc>
					<image:title><![CDATA[ Shani ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/astro-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు బాధాకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/astro-1-4.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిషశాస్త్రంలో శని సంచారం చాలా ముఖ్యమైనదని పండితులు కూడా చెబుతున్నారు. జ్యోతిష్యులు చెప్పేదాని బట్టి  2026లో జరగబోయే శని మార్పు వలన రెండు రాశుల వారి జాతకం టర్న్ అవుతుంది ఇంకా చెప్పాలంటే ఆర్థిక, వ్యాపార, కుటుంబ జీవితంలో కూడా వీళ్ళు కూడా ఊహించని విధంగా మార్పులు వస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/mituna-rashi-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పటికే కష్టాల్లో ఉన్నవారు త్వరలోనే గట్టెక్కుతారు ఇంకా  కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్నవారు గుడ్ న్యూస్ లు వింటారు.  ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త ప్రమోషన్ వస్తుంది. ఇంకా వ్యాపారస్తులు కొత్త అవకాశాలను కూడా పొందుతారు. ఈ సమయంలో ఇల్లు లేదా కారు కొనుగోలు చేస్తారు. ఒక్క దెబ్బకు మొత్తం మారుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/tula-rashi-3.jpg</image:loc><image:caption><![CDATA[ డబ్బులు రావడంతో కొత్త ఇల్లు,  భూమి కూడా కొనుగోలు చేస్తారు ఇంకా వీరి కలలు కూడా నెరవేరుతాయి. కొందరికి కొత్త వాహనం కూడా కొనుగోలు చేస్తారు.ఇప్పటిదాకా అసాధ్యం అనుకున్న వాటిని చేస్తారు. ఇంకా పట్టుదలతో కూడా అన్ని పనులు సకాలంలో  పూర్తి చేస్తారు. ఇంకా సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/astro-8.jpg</image:loc><image:caption><![CDATA[ Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/butterfly-pea-flower-benefits-anti-aging-memory-eye-health-blue-tea-1906347.html</loc><lastmod>2026-09-08T07:05:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/shanku-pushpam-benefits.jpg</image:loc>
					<image:title><![CDATA[ Shanku Pushpam Benefits ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/shanku-pushpam-health-uses.jpg</image:loc><image:caption><![CDATA[ Shanku Pushpam: ప్రకృతి మనకు అందించిన అద్భుతమైన వాటిలో శంఖపుష్పం (Clitoria Ternatea), లేదా బటర్ ఫ్లై పీ ఫ్లవర్ ఒకటి. కేవలం ఒక చుక్క నిమ్మరసం కలిపితే రంగు మారిపోయే దీని మంత్రం లాంటి స్వభావం, అనేక ఆరోగ్య రహస్యాలను తనలో నిక్షిప్తం చేసుకుంది. సాంప్రదాయ ఆయుర్వేదం, సహజ ఆరోగ్య పద్ధతులలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. మన పూర్వీకులు దీనిని సంస్కృతంలో అపరాజిత అని పిలిచేవారు, అంటే దేనికీ ఓడిపోనిది అని అర్థం. ఈ పేరు, కణాల క్షీణతను అడ్డుకుని యవ్వనాన్ని కాపాడటంలో దీనికి ఉన్న అద్భుతమైన శక్తిని ప్రతిబింబిస్తుంది. అందుకే దీనిని అమరత్వపు పుష్పం అని కూడా పిలుస్తుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/shanku-pushpam-health-benefits.jpg</image:loc><image:caption><![CDATA[ యాంటీ ఏజింగ్, చర్మ ఆరోగ్యం: శంఖపుష్పం ముదురు నీలి రంగుకు ప్రధాన కారణం, ఇందులో అత్యధికంగా ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యంగా ఆంథోసైనిన్స్. ఈ యాంటీఆక్సిడెంట్లు మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి. మనం బ్లూ టీని క్రమం తప్పకుండా సేవించినప్పుడు, ఈ ఆంథోసైనిన్స్ చర్మంలోని కొల్లాజెన్ అనే కీలకమైన ప్రొటీన్‌ను దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడతాయి. కొల్లాజెన్ చర్మానికి సాగే గుణాన్ని, దృఢత్వాన్ని అందిస్తుంది. దీని రక్షణ వల్ల చర్మంపై ముడతలు, సన్నని గీతలు త్వరగా ఏర్పడకుండా నిరోధించబడతాయి. తద్వారా చర్మం సహజమైన మెరుపుతో యవ్వనంగా కనిపించడానికి తోడ్పడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/shanku-pushpam-1.jpg</image:loc><image:caption><![CDATA[ మెదడు ఆరోగ్యం, జ్ఞాపకశక్తి: శంఖపుష్పం మెదడు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కొన్ని పరిశోధనలు ఈ పువ్వు మెదడులో ఎసిటైల్ కోలిన్ అనే ముఖ్యమైన న్యూరోట్రాన్స్మిటర్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుందని సూచిస్తున్నాయి. ఎసిటైల్ కోలిన్ జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, అభ్యాస సామర్థ్యాలలో కీలక పాత్ర పోషిస్తుంది. దీని స్థాయిలు పెరగడం వల్ల అల్జీమర్స్ వంటి నరాల సంబంధిత సమస్యలను నివారించడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు. అంతేకాకుండా, ఇది అధిక మానసిక ఒత్తిడిని తగ్గించి, మానసిక స్పష్టతను, ప్రశాంతతను అందించడంలో కూడా దోహదపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/shanku-pushpam.jpg</image:loc><image:caption><![CDATA[ కంటి ఆరోగ్యం: ఈ అద్భుత పుష్పంలో ప్రోయాంథోసైనిడిన్స్ అనే మరో రకమైన యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి నరాల్లో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. నేటి డిజిటల్ యుగంలో ఎక్కువ స్క్రీన్ టైం కారణంగా కలిగే కంటి అలసట, కళ్ళు పొడిబారడం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందడంలో ఇవి చాలా ఉపయోగపడతాయి. కంటి చూపును మెరుగుపరచడానికి, కంటి సంబంధిత వ్యాధులను నివారించడానికి కూడా శంఖపుష్పం టీ సహాయపడగలదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/shankupushpam-helath-benefits.jpg</image:loc><image:caption><![CDATA[ శంఖపుష్పం టీ తయారీ: ఈ ఆరోగ్యకరమైన బ్లూ టీని తయారుచేసుకోవడం చాలా సులభం. నాలుగైదు ఎండిన లేదా తాజా శంఖపుష్పాలను ఒక కప్పు వేడి నీటిలో వేసి ఐదు నిమిషాల పాటు నాననివ్వాలి. తరువాత పువ్వులను తీసేసి, టీలో రుచికి తగినంత నిమ్మరసం, కొద్దిగా తేనె కలుపుకోవచ్చు. నిమ్మరసం కలపగానే టీ నీలి రంగు నుంచి పర్పుల్ రంగులోకి మారడం ఒక వింతైన అనుభూతినిస్తుంది. రాత్రి పడుకునే ముందు లేదా సాయంత్రం వేళల్లో ఈ టీని తాగడం వల్ల మంచి రిలాక్సేషన్ లభిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/shankupushpam-uses.jpg</image:loc><image:caption><![CDATA[ శంఖపుష్పం, కేవలం అందమైన పువ్వు మాత్రమే కాదు, ఆరోగ్యానికి, దీర్ఘాయువుకు సంబంధించిన అనేక అద్భుత రహస్యాలను తనలో దాచుకున్న ప్రకృతి ప్రసాదం. మన పెరట్లోనే లభించే ఇలాంటి అందమైన పువ్వులు మన ఆరోగ్యానికి నిజమైన రక్షణ కవచాలు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/shankupushpam.jpg</image:loc><image:caption><![CDATA[ గమనిక: శంఖపుష్పం (Aparajita / Butterfly Pea) చావును ఆపగలదు అనడంలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ హిందూ పురాణాలలో, ఆయుర్వేదంలో దీనికి ఉన్న విశిష్టత వల్ల దీనిని &#039;అపరాజిత&#039; (ఎప్పటికీ ఓటమి లేనిది లేదా మరణం లేనిది) అని పిలుస్తారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/knee-joint-pain-at-a-young-age-experts-explain-why-excess-salt-may-affect-joint-health-and-why-okra-isnt-a-joint-lubricant-1906323.html</loc><lastmod>2026-09-07T22:18:22+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/salt-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Salt ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/salt.jpg</image:loc><image:caption><![CDATA[ నేటి కాలంలో చిన్న వయసులోనే కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ మధ్య జిగురు తగ్గడం వంటి సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఈ సమస్యకు ప్రధాన కారణం జీవనశైలి మార్పులేనని నిపుణులు తెలిపారు. ఇంకా ఈ బెండకాయలు తినడం వలన కీళ్ళలో జిగురు పెరుగుతుందనేది  అపోహని నిపుణులు కొట్టిపారేశారు. శరీరంలో జిగురు ఉత్పత్తి అవడానికి బయటి నుంచి ఏ పదార్థాలు అవసరం లేదని, శరీరం సహజంగానే దానిని ఉత్పత్తి చేస్తుందని చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/salt-1.jpg</image:loc><image:caption><![CDATA[ కీళ్ళ మధ్య జిగురు తగ్గడానికి ప్రధాన కారణం అధిక ఉప్పు వినియోగం ఉప్పు కేవలం నాలుక రుచి కోసమే తప్ప, శరీరానికి బయటి నుంచి అవసరం లేదని అంటున్నారు. మనం అధికంగా తీసుకునే ఉప్పు శరీరంలో పేరుకుపోయి, ఇది కీళ్ళ సందుల్లోని జిగురును ఉత్పత్తి చేసే కణజాలాన్ని, కార్టిలేజ్‌ను నాశనం చేస్తుందని అంటున్నారు.  జిగురును తిరిగి పొందాలంటే ఉప్పును తక్కువగా తీసుకోవాలని ఆయన చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/salt-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఉప్పుతో పాటు, కీళ్ళ కదలికలు లేకపోవడం కూడా జిగురు తగ్గడానికి కారణమని, అందువల్ల వ్యాయామాలు చేయడం ద్వారా కీళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని అంటున్నారు. బెండకాయలోని జిగురు కడుపులో యాసిడ్ల వల్ల నశించిపోతుందని, అది నేరుగా కీళ్ళకు అసలు చేరదని అంటున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/salt-3.jpg</image:loc><image:caption><![CDATA[ కీళ్ళ మధ్య జిగురు ఉత్పత్తిని పాడుచేసే ప్రధాన కారకం ఉప్పేనని అంటున్నారు. మనం తీసుకునే ఉప్పు కేవలం రుచి కోసమేనని, శరీరానికి బయటి నుంచి ఉప్పు అవసరం లేదని, కూరగాయలు, పండ్లు, గింజలలో సహజంగా ఉండే సాల్ట్ సరిపోతుందని అంటున్నారు. 
రోజుకు 10-15 గ్రాముల ఉప్పు తింటున్నామని, ఇది శరీరానికి ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/salt-4.jpg</image:loc><image:caption><![CDATA[ శరీరం ఈ అధిక ఉప్పును ఖాళీ ప్రదేశాలలో, ముఖ్యంగా కీళ్ళ సందులలో నిల్వ చేస్తుందని తెలిపారు. ఉప్పుకు ఉన్న గుణం ఏమిటంటే అది కణజాలాన్ని నాశనం చేస్తుంది. స్టీల్ డబ్బాలు, ఇనుప వస్తువులు, సిమెంట్ స్లాబ్‌లు కూడా ఉప్పు ప్రభావానికి గురై ఎలా దెబ్బతింటాయో అలాగే అని అంటున్నారు. ఇంకా  కీళ్ళ సందుల్లో పేరుకుపోయిన ఉప్పు జిగురును ఉత్పత్తి చేసే కార్టిలేజ్‌ను, సైనోవియల్ మెంబ్రేన్‌ను దెబ్బతీసి, జిగురు ఉత్పత్తిని ఆటంకపరుస్తుందని చెప్పారు. అందుకే చిన్న వయసులోనే జిగురు తగ్గి, కీళ్ళ నొప్పులు వస్తున్నాయని అంటున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/actress-taapsee-pannu-starrer-movie-gandhari-trending-number-one-in-ott-1906272.html</loc><lastmod>2026-09-07T21:30:46+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gandhari-movie-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gandhari Movie ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gandhari.jpg</image:loc><image:caption><![CDATA[ బాలీవుడ్ నటి తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన కొత్త చిత్రం ప్రస్తుతం తెగ ట్రెండింగ్ అవుతుంది. తాప్సీ నటించిన యాక్షన్-క్రైమ్ థ్రిల్లర్ &#039;గాంధారి&#039;, 2026 సెప్టెంబర్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. విడుదలైనప్పటి నుండి ఈ చిత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి, నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్ జాబితాలో నంబర్ 1 స్థానానికి చేరుకుంది. &#039;గాంధారి&#039; కథ ఒక తల్లి చుట్టూ తిరుగుతుంది. అలాగే ఈ సినిమాలోని సీన్స్, ట్విస్టులు ఆద్యంతం మిమ్మల్ని కట్టిపడేస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gandhari-film.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ చిత్రంలో తాప్సీ పన్ను బాని అనే తల్లి పాత్రను పోషించింది. తన కూతురు అపహరణకు గురైన తర్వాత, ఆమెను కనుగొనడానికి ఎంతకైనా తెగిస్తుంది. ఈ ప్రయాణంలో ఆమె ఎన్నో ప్రమాదకరమైన అడ్డంకులను ఎదుర్కొంటుంది. అయినప్పటికీ, తన కూతురిని తిరిగి పొందాలనే ఆమె దృఢ సంకల్పం, ప్రతి అడ్డంకిని అధిగమించే శక్తిని ఆమెకు ఇస్తుంది. ఈ సినిమా కథ కేవలం యాక్షన్ ప్రధానంగానే కాకుండా, ఒక తల్లి పడే భావోద్వేగ సంఘర్షణపై కూడా దృష్టి పెడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gandhari-movie.jpg</image:loc><image:caption><![CDATA[ తన బిడ్డ భద్రత పట్ల తల్లికి ఉండే భయం, ఆ బిడ్డ కోసం ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కోవడానికి ఆమె సిద్ధంగా ఉండటమే ఈ చిత్రంలో భావోద్వేగ పరంగా ప్రధానాంశం. &#039;గాంధారి&#039; చిత్రంలో తాప్సీ పన్ను మరోసారి యాక్షన్ పాత్రలో కనిపించనుంది. బాని పాత్ర శారీరకంగా చాలా సవాలుతో కూడుకున్నదని చిత్ర నిర్మాతలు కూడా తెలిపారు. &#039;గాంధారి&#039; చిత్రానికి కనికా ధిల్లాన్ రచన, నిర్మాణం చేయగా, దేవాశిష్ మఖిజా దర్శకత్వం వహించారు. ఇది తాప్సీ, కనికల పునఃకలయిక. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gandhari-ott.jpg</image:loc><image:caption><![CDATA[ గతంలో వీరిద్దరూ &#039;హసీన్ దిల్‌రూబా&#039;, &#039;ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రూబా&#039; వంటి ప్రాజెక్టులలో కలిసి పనిచేశారు. ఈ చిత్రంలో తాప్సీతో పాటు ఇష్వాక్ సింగ్, ఛాయా కదమ్, స్వస్తిక ముఖర్జీ, మీతా వశిష్ట్ , జతిన్ సర్నా కూడా నటించారు. ముఖ్యంగా, మరాఠీ నటి ఛాయా కదమ్ కూడా ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆమె నటనతో పాటు, ఆ పాత్ర కోసం ఆమె చేసిన భాషా సన్నాహాలు కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gandhari-telugu.jpg</image:loc><image:caption><![CDATA[ తాప్సీ పర్ఫార్మెన్స్, యాక్షన్ సీన్లు బాగున్నప్పటికీ... కథనంలో బలమైన ఎమోషన్స్, లాజిక్ లోపించడం వల్ల సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది. కంటిచూపు కోల్పోయిన తల్లిగా, కూతురి కోసం తెగించి పోరాడే పాత్రలో తాప్సీ అత్యద్భుతంగా నటించింది. సినిమాలో తాప్సీ చేసిన స్టంట్, ఫైట్ సీక్వెన్సెస్ చాలా నేచురల్‌గా, పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారు. తాప్సీ పన్ను వన్-మెన్ షో , యాక్షన్ సీన్ల కోసం ఒకసారి చూడదగ్గ సినిమా. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/when-should-you-plant-a-money-plant-at-home-vastu-says-this-direction-can-attract-prosperity-1906223.html</loc><lastmod>2026-09-07T21:02:30+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/goddess-lakshmi-money-plant.jpg</image:loc>
					<image:title><![CDATA[ Goddess Lakshmi Money Plant ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/best-day-to-plant-money-plant.jpg</image:loc><image:caption><![CDATA[ వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో మనీ ప్లాంట్ నాటడం వల్ల ఆర్థిక శ్రేయస్సు, ప్రశాంతత చేకూరుతాయి. అయితే దీనిని సరైన రోజున, సరైన దిశలో నాటినప్పుడే పూర్తి ప్రయోజనాలు లభిస్తాయి. వాస్తు నిపుణుల ప్రకారం మనీ ప్లాంట్ నాటడానికి అత్యంత శుభప్రదమైన రోజు ఏది..? అలాగే మనీ ప్లాంట్‌ను ఎల్లప్పుడూ ఇంటికి ఏ దిశలోనే ఉంచాలి. అనేది తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు.. దీనివల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి, సానుకూల శక్తితో పాటు ఆర్థిక ఎదుగుదల లభిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/money-plant-direction-according-to-vastu.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య, వాస్తు శాస్త్రాల ప్రకారం, మనీ ప్లాంట్ నాటడానికి శుక్రవారం అత్యంత శుభప్రదమైన రోజు. శుక్రవారం సంపదకు, వైభవానికి అధిదేవత అయిన శ్రీమహాలక్ష్మికి అంకితం చేయబడిన రోజు. ఈ రోజున మనీ ప్లాంట్ నాటడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఇంట్లో ధనధాన్యాలకు కొదవ ఉండదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/money-plant-on-friday.jpg</image:loc><image:caption><![CDATA[ Money Plant On Friday ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/money-plant-south-east-direction.jpg</image:loc><image:caption><![CDATA[ శుక్రవారం శుక్ర గ్రహానికి సంకేతం. జాతకంలో శుక్రుడి స్థానం బలంగా ఉంటే సుఖసంతోషాలు, ఐశ్వర్యం లభిస్తాయి. అందువల్ల శుక్రవారం నాడు ఈ మొక్కను నాటడం విశేష ఫలితాలను ఇస్తుంది. అలాగే, మనీ ప్లాంట్‌ను ఎప్పుడూ ఇంటికి ఆగ్నేయ దిశలో మాత్రమే ఉంచాలి. ఆగ్నేయ దిశకు అధిపతి గణపతి కాగా, గ్రహం శుక్రుడు. అందువల్ల ఆగ్నేయంలో మనీ ప్లాంట్ ఉంచడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు నశించి, సానుకూల శక్తి పెరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/money-plant-9.jpg</image:loc><image:caption><![CDATA[ ఏ దిశలో ఉంచకూడదు?: మనీ ప్లాంట్‌ను పొరపాటున కూడా ఈశాన్యం దిశలో ఉంచకూడదు. ఈశాన్యానికి అధిపతి గురు గ్రహం. శుక్రుడు, గురువు శత్రు గ్రహాలు కావడం వల్ల ఈశాన్యంలో మనీ ప్లాంట్ ఉంచితే ఆర్థిక నష్టాలు, గృహంలో అశాంతి కలిగే ప్రమాదం ఉంది. మనీ ప్లాంట్ తీగలు నేలను తాకకూడదు, ఎల్లప్పుడూ పైకి ఎదిగేలా తాడు లేదా కర్ర సహాయంతో కట్టాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/when-to-plant-money-plant-at-home.jpg</image:loc><image:caption><![CDATA[ ఎండిపోయిన లేదా పసుపు రంగులోకి మారిన ఆకులను ఎప్పటికప్పుడు తొలగించాలి. మనీ ప్లాంట్‌ను ఇతరులకు బహుమతిగా ఇవ్వకూడదు, ఇది మీ ఇంటి లక్ష్మిని ఇతరులకు ఇచ్చినట్లే అని నమ్ముతారు. సరైన వాస్తు నియమాలు పాటిస్తూ శుక్రవారం రోజున ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ నాటడం వల్ల ఇంట్లో ఆర్థిక స్థిరత్వం ఏర్పడి, సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/gold-loan-jewellery-stolen-from-bank-custody-compensation-rules-and-what-to-do-1906224.html</loc><lastmod>2026-09-07T20:48:56+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-jewellery1-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold Jewellery ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-jewellery1.jpg</image:loc><image:caption><![CDATA[ Gold Jewellery: తరచుగా బంగారు రుణం తీసుకునేటప్పుడు, ఆభరణాలను బ్యాంకు లేదా రుణ సంస్థ వద్ద తాకట్టు పెట్టవలసి ఉంటుంది. రుణం తిరిగి చెల్లించేలోపు బ్యాంకు ఆధీనంలో ఉన్న ఆభరణాలు దొంగిలించినా లేదా పోగొట్టుకున్నా, ఆ నష్టానికి ఎవరు పరిహారం చెల్లించాలి? ఆ పరిహారం ఎలా అందుతుందనే ప్రశ్న తలెత్తుతుంది. అయితే, ఈ సందర్భంలో బ్యాంకు బాధ్యత, పరిహారం మొత్తం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-jewellery2.jpg</image:loc><image:caption><![CDATA[ తాకట్టు పెట్టిన బంగారం దొంగిలిస్తే ఏం చేయాలి?: మీరు తాకట్టు పెట్టిన బంగారం దొంగతానానికి గురైందని మీకు తెలిస్తే వెంటనే బ్యాంకుకు తెలియజేయండి. అలాగే, జరిగిన సంఘటనకు సంబంధించిన రాతపూర్వక ప్రకటనను, పోలీసు ఫిర్యాదు లేదా ఎఫ్‌ఐఆర్ కాపీని బ్యాంకును అడగండి. బ్యాంకుతో మీరు జరిపిన సంభాషణలన్నింటినీ, అన్ని పత్రాలను భద్రపరచుకోండి. సంభాషణ సమయంలో దొంగతనం జరిగిన పరిస్థితులు ఏమిటో, నష్టాన్ని భర్తీ చేయడానికి ఎలాంటి విధానాలు అనుసరిస్తున్నారో బ్యాంకును రాతపూర్వకంగా అడగండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-jewellery3.jpg</image:loc><image:caption><![CDATA[ పరిహారం పొందడానికి ఈ పత్రాలను ఉంచుకోండి: మీ బంగారాన్ని డిపాజిట్ చేసినప్పుడు మీరు పొందిన తాకట్టు రసీదు, బంగారు రుణ ఒప్పందం, ఆభరణాల విలువ మదింపు నివేదిక వంటి పత్రాలను భద్రపరచుకోండి. ఈ పత్రాలు బ్యాంకులో ఏ ఆభరణాలు డిపాజిట్ అయ్యాయో, వాటి బరువు, విలువను నిరూపించగలవు. అలాగే, బంగారం ఫోటో, కొనుగోలు బిల్లును కూడా భద్రపరచుకోండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-jewellery4.jpg</image:loc><image:caption><![CDATA[ బ్యాంకు వడ్డీతో పాటు డబ్బు చెల్లించాల్సి వస్తుందా? : సాధారణంగా దొంగతనంపై పరిహారం, వడ్డీ మొత్తం కేసు పరిస్థితులు, బ్యాంకు బాధ్యత, ఒప్పందం, బీమా, వర్తించే చట్టం ఆధారంగా నిర్ణయిస్తారు. అందువల్ల ప్రతి సందర్భంలోనూ బంగారం పూర్తి విలువ లేదా వడ్డీ స్వయంచాలకంగా చెల్లిస్తారని కూడా గ్యారంటి ఉండదు. నియమ నిబంధనలను బట్టి, అలాగే మీ బంగారం దొంగతనానికి గురైన పరిస్థితులను బట్టి మీకు పరిహారం వస్తుందని గుర్తించుకోండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-jewellery5.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే మీరు బ్యాంకులో ఎంత బంగారం తాకట్టు పెట్టారు..? దీని విలువ, అలాగే దొంగతనం ఎలా జరిగింది? ఇలా అన్ని విధాలుగా దర్యాప్తు కొనసాగుతుంది. ఆ తర్వాత ఆర్బీఐ నిబంధనల ప్రకారం పరిహారం లభిస్తుందని గుర్తించుకోండి. అలాగే బంగారం తాకట్టుకు సంబంధించిన అన్ని పత్రాలను పరిశీలిస్తారు అధికారులు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/raspberries-5-amazing-health-benefits-of-this-nutrient-rich-superfruit-1906206.html</loc><lastmod>2026-09-07T20:41:44+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/raspberry-nutrition.jpg</image:loc>
					<image:title><![CDATA[ Raspberry Nutrition ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/eat-raspberries-regularly.jpg</image:loc><image:caption><![CDATA[ వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది: రాస్ప్‌బెర్రీస్‌లో ఆంథోసైనిన్లు, క్వెర్సెటిన్, విటమిన్ సి వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. కణాలు దెబ్బతినకుండా రక్షించడంతో పాటు శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇవి సమర్థవంతంగా పనిచేస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/raspberry-benefit.jpg</image:loc><image:caption><![CDATA[ గుండె ఆరోగ్యానికి, కొలెస్ట్రాల్ తగ్గింపునకు: ఈ పండ్లలోని పొటాషియం రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. అలాగే రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో రాస్ప్‌బెర్రీస్ ఎంతగానో తోడ్పడతాయి. వీటిలోని ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ రక్త ప్రసరణను మెరుగుపరిచి, గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/raspberries.jpg</image:loc><image:caption><![CDATA[ బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ: రాస్ప్‌బెర్రీస్‌లో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఉత్తమమైన పండు. అంతేకాకుండా, వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/benefits-of-eating-raspberries.jpg</image:loc><image:caption><![CDATA[ మెదడు పనితీరు మెరుగుపడుతుంది: వీటిలోని యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి. క్రమం తప్పకుండా రాస్ప్‌బెర్రీస్ తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి, దృష్టి, నాడీ వ్యవస్థ పనితీరు మెరుగై, న్యూరోడీజెనరేటివ్ వ్యాధుల నుండి రక్షణ లభిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/raspberry-benefits-for-health.jpg</image:loc><image:caption><![CDATA[ మెరిసే చర్మం కోసం: రాస్ప్‌బెర్రీస్‌లోని విటమిన్ సి చర్మానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇది చర్మ స్థితిస్థాపకతను పెంచి, ముడతలు, మచ్చల వంటి వృద్ధాప్య సంకేతాలను నివారిస్తుంది. చర్మాన్ని యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంచడంలో ఈ పండు అద్భుతమైన పాత్ర పోషిస్తుంది. రాస్ప్‌బెర్రీస్ కేవలం ఒక రుచికరమైన పండు మాత్రమే కాదు, శరీరానికి సర్వరోగ నివారిణిలా పనిచేసే అద్భుతమైన సూపర్ ఫుడ్. మన దినచర్యలో ఈ పండును భాగం చేసుకోవడం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/lucky-zodiac-signs-after-marriage-find-your-fortune-post-wedding-and-prosperity-1906141.html</loc><lastmod>2026-09-07T20:10:10+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rashi-phalalu-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Rashi Phalalu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rashi-phalalu-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ కుంభ రాశి : కుంభ రాశి వారికి పెళ్లి తర్వాత అసలైన జీవితం ప్రారంభం అవుతుంది. వీరికి మంచి భాగస్వామి దొరకడంతో చాలా ఆనందంగా ఉంటారు. అంతే కాకుండా అన్ని విధాలుగా వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. వివాహం తర్వాత వీరి సంపద పెరుగుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. అన్ని విధాలుగా వీరికి చాలా శుభ సూచకంగా ఉంటుంది. అద్భుతంగా కలిసి వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rashi-phalalu-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ సింహ రాశి : సింహ రాశి వారికి వివాహం తర్వాత పట్టింది బంగారం, ముట్టింది ముత్యమే అవుతుంది. భాగస్వామి అండ సహకారం ఉండటం వలన వీరికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ఆర్థికపరమైన సమస్యలు కూడా అన్ని తొలిగిపోతాయి. వైవాహిక జీవితం ఎలాంటి సమస్యలు లేకుండా ఆనందంగా కొనసాగుతుంది. అన్ని విధాలుగా వీరికి వివాహం తర్వాత అద్భుతంగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rashi-phalalu-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ తుల రాశి : తుల రాశి వారికి వివాహం తర్వాత భాగస్వామితో కలిసి వస్తుంది. అంతే కాకుండా వీరికి ఆర్థికంగా కూడా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరతాయి. ఈ రాశి వారు వివాహం తర్వాత ప్రభుత్వ ఉద్యోగం సాధించే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా వీరికి వీరి సంతానం ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు లాభిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rashi-phalalu-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభ రాశి :  వృషభ రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా వీరు చాలా సహన వంతులు, సంబంధాలకు చాలా గొప్ప ప్రాముఖ్యతను ఇస్తుంటారు. అంతే కాకుండా ఈ రాశి వారు చాలా నిబద్ధతగా ఉంటారు. వీరి సామాజిక జీవితం చాలా ఆనందంగా గడిచిపోతుంది. మానసికంగా, కూడా వీరు చాలా బలంగా ఉంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rashi-phalalu-6-1.jpg</image:loc><image:caption><![CDATA[ ధనస్సు రాశి : ధనస్సు రాశి వారు క్రమశిక్షణ కలిగి ఉంటారు. వీరికి కూడా చాలా ఓపిక సహనం ఉంటుంది. వీరు తమ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ రావడమే కాకుండా, సమాజంలో మంచి గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు. వీరికి వివాహం తర్వాత చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. అన్ని విధాలుగా బాగుంటుంది. ]]></image:caption></image:image></url></urlset>