<urlset xmlns:xsi="http://www.w3.org/2001/XMLSchema-instance" xmlns:image="http://www.google.com/schemas/sitemap-image/1.1" xsi:schemaLocation="http://www.sitemaps.org/schemas/sitemap/0.9 http://www.sitemaps.org/schemas/sitemap/0.9/sitemap.xsd http://www.google.com/schemas/sitemap-image/1.1 http://www.google.com/schemas/sitemap-image/1.1/sitemap-image.xsd" xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9"><url><loc>https://tv9telugu.com/photo-gallery/function-style-cauliflower-masala-curry-recipe-rich-gravy-for-rice-roti-and-chapathi-1911500.html</loc><lastmod>2026-09-14T21:40:49+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/cauliflower-masala-curry-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Cauliflower Masala Curry (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/cauliflower-masala-curry-1.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు: 1 పెద్ద కాలీఫ్లవర్, అర స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, రుశనగ నూనె, అర స్పూన్ ఆవాలు, రెండు రెమ్మల కరివేపాకు, 3  ఉల్లిపాయలు తరుగు
5 నుండి 6 పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 పెద్ద నాటు టమోటాలు, 2 స్పూన్ల కారం పొడి, పచ్చికొబ్బరి ముక్కలు, తాజా కొత్తిమీర తరుగు, 3 స్పూన్ల ధనియాలు, అర స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగాలు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/cauliflower-masala-curry-2.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానం: గిన్నెలో 2 లీటర్ల నీళ్లు పోసి ఉప్పు, పసుపు వేసి మరిగించాలి. నీళ్లు కాగగానే కట్ చేసిన కాలీఫ్లవర్ ముక్కలను వేసి హై ఫ్లేమ్‌పై సరిగ్గా 2-3 నిమిషాలు మాత్రమే ఉడికించాలి ఎక్కువసేపు ఉంచితే మెత్తబడిపోతాయి. అనంతరం నీటిని పూర్తిగా వడకట్టి ముక్కలను పక్కన ఉంచాలి. దీనివల్ల పువ్వులో ఉండే పురుగులు, గుడ్లు పూర్తిగా తొలగిపోతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/cauliflower-masala-curry-3.jpg</image:loc><image:caption><![CDATA[ పాన్‌లో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసి లో ఫ్లేమ్‌లో దోరగా వేయించి చల్లారాక మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే పచ్చికొబ్బరి ముక్కలను నీళ్లు కలపకుండా మిక్సీలో మెత్తటి పేస్ట్‌లా సిద్ధం చేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/cauliflower-masala-curry-4.jpg</image:loc><image:caption><![CDATA[ బాండీలో వేరుశనగ నూనె వేడిచేసి ఆవాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ లోకి రాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేపాలి. ఆపై సన్నగా తరిగిన నాటు టమోటా ముక్కలు వేసి మూతపెట్టి నూనె పైకి తేలేంత వరకు మెత్తగా మగ్గనివ్వాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/cauliflower-masala-curry-5.jpg</image:loc><image:caption><![CDATA[ టమోటాలు మగ్గాక కారం పొడి, కొద్దిగా పసుపు వేసి కలపాలి. ఆ వెంటనే సిద్ధం చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు, పచ్చికొబ్బరి పేస్ట్ మరియు ముప్పావు కప్పు నీళ్లు పోసి కలపాలి. మూతపెట్టి చిన్న మంటపై 7-8 నిమిషాలు ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి. ఆ తర్వాత సిద్ధం చేసుకున్న స్పెషల్ మసాలా పొడిని చల్లి, పువ్వులు విరిగిపోకుండా నెమ్మదిగా కలిపి మరో 2-3 నిమిషాలు చిన్న మంటపై మగ్గనివ్వాలి. కూర చిక్కబడి నూనె పైకి తేలగానే కొత్తిమీర చల్లుకుని దించేయాలి. అంతే, ఫంక్షన్ల రుచితో ఘుమఘుమలాడే కాలీఫ్లవర్ మసాలా కర్రీ సిద్ధం! వేడివేడి అన్నం, జొన్న రొట్టెలు, పుల్కా, చపాతీల్లోకి ఇది తిరుగులేని కాంబినేషన్! ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/spiritual/vinayaka-chavithi-muslim-couple-fosters-unity-in-podili-with-ganesh-pooja-1911483.html</loc><lastmod>2026-09-14T21:32:59+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/vinayaka-chavithi-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Vinayaka Chavithi ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/muslim-couple-offers-prayers-to-lord-ganapathi.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రకాశం జిల్లా: వినాయక చవితి వేడుకల్లో మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే ఘటన ప్రకాశం జిల్లా పొదిలిలో చోటుచేసుకుంది. ముస్లిం దంపతులు స్వయంగా గణేష్ విగ్రహాన్ని సమకూర్చడమే కాకుండా.. వినాయక మండపంలో పీటలపై కూర్చొని శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ దృశ్యం స్థానికులను ఆకట్టుకుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/muslim-couple-offers-prayers-to-lord-ganapathi-1.jpg</image:loc><image:caption><![CDATA[ పొదిలి పట్టణంలోని టైలర్స్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో విఘ్నేశ్వరుడి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా షేక్ రబ్బాని దంపతులు హాజరయ్యారు. గణేష్ విగ్రహాన్ని సమకూర్చిన వారు.. మండపంలో ప్రత్యేక పూజల్లోనూ పాల్గొన్నారు. పూజారుల సూచనల మేరకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ గణనాథుడికి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/muslim-couple-puja.jpg</image:loc><image:caption><![CDATA[ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని షేక్ రబ్బాని దంపతులు ఆకాంక్షించారు. పూజా కార్యక్రమాల్లో కాలనీవాసులు, స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పొదిలి ప్రాంతంలో హిందూ, ముస్లింలు పరస్పరం ఒకరి పండుగల్లో మరొకరు పాల్గొంటూ మతసామరస్యాన్ని చాటుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/muslim-couple-lord-ganapathi-puja.jpg</image:loc><image:caption><![CDATA[ శివరాత్రి సందర్భంగా జరిగే రథోత్సవంలో ముస్లిం మహిళలు పాల్గొని రథాన్ని లాగుతుంటే.. పీర్ల పండుగ సమయంలో హిందూ సోదరులు నిప్పుల గుండంలో నడిచి మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ కనిపించే సంప్రదాయంగా చెబుతున్నారు. అలాగే హిందువుల పండుగల సందర్భంగా జరిగే పూజా కార్యక్రమాల్లో ముస్లిం కుటుంబాలు పాల్గొంటుంటారు. ఈద్‌ వేడుకల్లోనూ హిందూ కుటుంబాలు కలిసి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సోదరభావాన్ని చాటుకుంటున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/muslim-couple-offers-lord-ganapathi-puja.jpg</image:loc><image:caption><![CDATA[ మతాలు వేరైనా.. మనుషులంతా ఒక్కటేననే సందేశాన్ని చాటుతున్న ఈ సంప్రదాయం మరోసారి పొదిలిలో కనిపించింది. గణపతి మండపంలో ముస్లిం దంపతులు పూజలు నిర్వహించిన ఘటన మతసామరస్యం, సోదరభావానికి ప్రతీకగా నిలిచింది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/high-protein-veg-rice-recipe-senagapappu-paneer-pulao-for-lunch-box-1911485.html</loc><lastmod>2026-09-14T21:20:27+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/protein-veg-rice-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Protein Veg Rice (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/protein-veg-rice-1.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు: 1 కప్పు బాస్మతి బియ్యం లేదా సాధారణ బియ్యం, అర కప్పు పచ్చిశనగపప్పు, పన్నీర్ ముక్కలు 100 గ్రాముల, అర కప్పు సోయా చంక్స్ , సరిపడా  క్యారెట్, బంగాళదుంప ముక్కలు, 1 పెద్ద ఉల్లిపాయ తరుగు,  3 పచ్చిమిర్చి, 2 - సన్నగా తరిగిన టమోటాలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర తరుగు, బిర్యానీ దినుసులు -బిర్యానీ ఆకు, యాలకులు 2, లవంగాలు 3, అనాసపువ్వు, దాల్చిన చెక్క, మిరియాలు 10, జాపత్రి, 4 టేబుల్ స్పూన్ల నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, పావు టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, మరియు  3 కప్పుల నీళ్లు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/protein-veg-rice-2.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానం: ఒక గిన్నెలో ఒక కప్పు బాస్మతి బియ్యం, అర కప్పు పచ్చిశనగపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి కనీసం ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. అడుగు మందపాటి గిన్నెలో రెండు చెంచాల నూనె వేసి మీడియం సైజులో కోసిన పన్నీర్ ముక్కలను వేసి పచ్చిదనం పోయేలా లేతగా వేయించి పక్కన ఉంచాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/protein-veg-rice-3.jpg</image:loc><image:caption><![CDATA[ అదే గిన్నెలో మరో రెండు స్పూన్ల నూనె వేడిచేసి బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, చెక్క, మిరియాలు, జాపత్రి వేసి లో ఫ్లేమ్‌లో మంచి సువాసన వచ్చేవరకు వేయించాలి. ఆపై ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసి పచ్చివాసన పోయేలా వేపాలి. ఇందులోనే క్యారెట్, బంగాళదుంప ముక్కలు, వేడినీళ్లలో నానబెట్టి గట్టిగా పిండిన సోయా చంక్స్ వేసి నిమిషం పాటు వేయించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/protein-veg-rice-4.jpg</image:loc><image:caption><![CDATA[ తగినంత ఉప్పు, పసుపు, సన్నగా తరిగిన టమోటా ముక్కలు వేసి టమోటా మెత్తబడే వరకు మగ్గించాలి. ఇప్పుడు బియ్యం, పప్పు కలిపి ఒకటిన్నర కప్పు తీసుకున్నాం కాబట్టి కొలత ప్రకారం 3 కప్పుల వేడి నీళ్లను పోయాలి. ఎసరు మరుగుతున్నప్పుడు నానబెట్టిన బియ్యం, శనగపప్పును నీళ్లు వడకట్టి వేయాలి. అలాగే వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసి కలపాలి. మూతపెట్టి మీడియం మంటపై 3 నిమిషాలు ఉడికించాలి. ఎసరు కాస్త ఇగిరి దగ్గరపడుతున్నప్పుడు మంటను లో ఫ్లేమ్‌లోకి మార్చి నీరంతా పూర్తిగా ఆవిరయ్యే వరకు దమ్ చేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/protein-veg-rice-5.jpg</image:loc><image:caption><![CDATA[  అన్నం చక్కగా ఉడికిన తర్వాత పైనుంచి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, అన్నం విరిగిపోకుండా కింద నుంచి పైకి ఒకసారి నెమ్మదిగా కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేసి 5 నిమిషాలు మూతపెట్టి వదిలేయాలి. అంతే, అన్నం పొడిపొడిగా, ముద్దకట్టకుండా వచ్చే హై-ప్రోటీన్ శనగపప్పు పన్నీర్ రైస్ సిద్ధం! వేడివేడి రైతా లేదా పెరుగు పచ్చడితో తిన్నా.. వట్టిగానే తిన్నా అద్భుతమైన రుచినిస్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/ketu-transit-2026-these-6-zodiac-signs-may-see-financial-gains-career-growth-and-new-opportunities-1911417.html</loc><lastmod>2026-09-14T20:43:25+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ketu-transit-effects-telugu.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ketu Transit Effects Telugu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rashifal1-2.jpg</image:loc><image:caption><![CDATA[ Ketu Transit Effects Telugu: వేద జ్యోతిషశాస్త్రంలో కేతువును నీడ గ్రహంగా, రహస్యమైన, ఆధ్యాత్మిక స్వభావం కలిగిన గ్రహంగా పరిగణిస్తారు. సాధారణంగా కేతువును అశుభ గ్రహంగా భావించినప్పటికీ.. జాతకంలో అనుకూల స్థానంలో ఉన్నప్పుడు ఆకస్మిక ధనలాభాలు, మానసిక స్పష్టత, ఆధ్యాత్మిక పురోగతితో పాటు వ్యాపార, వృత్తి రంగాల్లో విజయాలను అందించగలడని జ్యోతిష్య నమ్మకం. ప్రస్తుతం కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. సూర్యుడు అధిపతిగా ఉన్న సింహరాశిలో కేతువు సంచారం కొన్ని రాశుల వారికి ప్రత్యేక ఫలితాలను అందిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాబోయే మూడు నెలల కాలంలో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభం కావడం, కొత్త అవకాశాలు లభించడం, ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చని అంచనా. ఈ సంచారం వల్ల ఎక్కువగా ప్రయోజనం పొందే ఆరు రాశులు ఏవో చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rashifal2-2.jpg</image:loc><image:caption><![CDATA[ మేష రాశి: ఈ రాశి వారికి కేతువు సంచారం అనుకూల ఫలితాలను అందించవచ్చు. ముఖ్యంగా ఐదో ఇంటిపై కేతువు ప్రభావం ఉండటంతో విద్య, పరిశోధన, సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు లభించే అవకాశం ఉంది. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు చేతికి రావచ్చు. పెట్టుబడులు లేదా ఇతర అనూహ్య మార్గాల ద్వారా ఆకస్మిక ఆర్థిక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్వాసం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rashifal3-2.jpg</image:loc><image:caption><![CDATA[ మిథున రాశి: ఈ రాశి వారికి కేతువు సంచారం ధైర్యాన్ని, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచవచ్చు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పోటీని సమర్థంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మీ వ్యూహాలు మంచి ఫలితాలను అందించవచ్చు. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి లేదా ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ మూడు నెలల్లో అనుకూల అవకాశాలు లభించవచ్చని చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rashifal4-2.jpg</image:loc><image:caption><![CDATA[ సింహ రాశి: కేతువు నేరుగా సింహరాశిలోనే సంచరిస్తుండటంతో ఈ రాశివారిలో ఆత్మవిశ్లేషణ, ఆధ్యాత్మిక ఆలోచనలు పెరగవచ్చు. వ్యక్తిత్వంలో మార్పులు చోటుచేసుకుని నాయకత్వ లక్షణాలు మరింత బలపడే అవకాశం ఉంది. వృత్తి, సామాజిక రంగాల్లో గుర్తింపు పెరగవచ్చు. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అవసరమని జ్యోతిష్య సూచనలు చెబుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rashifal5-1.jpg</image:loc><image:caption><![CDATA[ తులా రాశి: ఈ రాశి వారికి కేతువు సంచారం ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండవచ్చు. పదకొండో ఇంటిపై ప్రభావం కారణంగా కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకునే అవకాశం ఉంది. పొదుపు పెరగడంతో పాటు పెద్దలు, అన్నదమ్ములు లేదా ఉన్నతాధికారుల నుంచి సహకారం లభించవచ్చు. చాలా కాలంగా నెరవేరని కొన్ని కోరికలు ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rashifal6-1.jpg</image:loc><image:caption><![CDATA[ ధనుస్సు రాశి: ఈ రాశి వారికి కేతువు సంచారం అదృష్టాన్ని పెంచే అవకాశాలు ఉన్నాయి. తొమ్మిదో ఇంటిపై కేతువు ప్రభావంతో ఆధ్యాత్మికత, ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరగవచ్చు. దూర ప్రయాణాలు అనుకూల ఫలితాలను ఇవ్వవచ్చు. విదేశాల్లో చదువు లేదా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rashifal7.jpg</image:loc><image:caption><![CDATA[ కుంభ రాశి: ఈ రాశి వారికి కేతువు సంచారం వ్యాపార రంగంలో కొత్త అవకాశాలను తీసుకురావచ్చు. ఏడో ఇంటి ప్రభావంతో కొత్త భాగస్వామ్యాలు ఏర్పడటం, పాత వ్యాపార వివాదాలు పరిష్కారం కావడం, కొత్త ఒప్పందాలు కుదరడం వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చు. విదేశీ సంస్థలు, దిగుమతి-ఎగుమతి రంగాల్లో ఉన్నవారికి మంచి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో కూడా భాగస్వామితో పరస్పర అవగాహన పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తంగా.. కేతువు సంచారం ఈ ఆరు రాశుల వారికి ఆర్థిక, వృత్తి, వ్యాపార, ఆధ్యాత్మిక రంగాల్లో భిన్నమైన అనుకూల ఫలితాలను అందించే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్వాసం. అయితే వ్యక్తిగత జాతకంలోని గ్రహస్థితులు, దశలు, భుక్తులను బట్టి ఫలితాలు మారవచ్చు. 
(Disclaimer: ఈ కథనంలోని వివరాలు జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా చెప్పబడిన ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఫలితాలు మారవచ్చు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/know-these-three-films-based-on-the-true-story-have-been-released-over-the-span-of-53-years-and-each-one-became-a-sensation-1911446.html</loc><lastmod>2026-09-14T20:39:27+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rustom-movie-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Rustom Movie ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rustom-movie.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పటివరకు సినీ పరిశ్రమలో నిజ సంఘటనల ఆధారంగా అనేక సినిమాలు విడుదలయ్యాయి. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై ఊహించని విజయాన్ని అందుకున్నాయి. భారతదేశ చరిత్రలో అలాంటి ఒక కేసు ఉంది. అది ఆ సమయంలో పెద్ద సంచలనం సృష్టించింది. ఈ హై ప్రొఫైల్ కేసు ఆధారంగా ఇప్పటివరకు మూడు సినిమాలు విడుదలయ్యాయి. విశేషం ఏమిటంటే, ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద చాలా ప్రజాదరణ పొందాయి. అంతేకాదు, ఈ కేసు ఆధారంగా వచ్చిన సినిమాకు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నేరుగా జాతీయ అవార్డును అందుకున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rustom-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఒక నావికాదళ అధికారి కాల్చిన మూడు తూటాలు, ఆ తర్వాత ముంబై కోర్టులో జరిగిన కేసు, దేశ న్యాయవ్యవస్థ గమనాన్ని మార్చివేశాయి. 1959 నాటి &#039;కె. ఎం. నానావతి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర&#039; కేసు భారత నేర, న్యాయ చరిత్రలో అక్షరాలా ప్రకంపనలు సృష్టించింది. దేశ భద్రత కోసం నావికాదళంలో నియమితులైన కమాండర్ కవాస్ మాణెక్‌షా నానావతి, తన భార్య ప్రియుడైన ప్రేమ్ అహుజాను కాల్చి చంపారు. అప్పట్లో ఇది సంచలనం సృష్టించిన కేసు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rustom-film-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ కేసు అప్పటి ప్రఖ్యాత న్యాయవాది రామ్ జెఠ్మలానీకి అపారమైన జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టింది. నానావతికి కోర్టులో యావజ్జీవ కారాగార శిక్ష విధించినప్పటికీ, ఆయనపై ప్రజలకు ఉన్న అపారమైన నమ్మకం, సానుభూతి కారణంగా ఆ తర్వాత మహారాష్ట్ర గవర్నర్ విజయలక్ష్మి పండిట్ ఆయన శిక్షను తగ్గించారు. ఈ ప్రసిద్ధ కేసు బాలీవుడ్‌ను కూడా ఎంతగానో ఆకర్షించింది. ఈ కేసు ఆధారంగా గత 50 ఏళ్లలో, ముగ్గురు వేర్వేరు దర్శకులు ఇదే కేసుపై గొప్ప చిత్రాలను రూపొందించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rustom-ott.jpg</image:loc><image:caption><![CDATA[ నానావతి ఉదంతం ఇంకా తాజాగానే ఉండగా, 1963లో దర్శకుడు ఆర్. కె. నాయర్ ఆ సంఘటన ఆధారంగా &#039;యే రాస్తే హై ప్యార్ కే&#039; అనే పేరుతో మొదటి చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో నానావతి పాత్ర స్ఫూర్తితో ప్రముఖ నటుడు సునీల్ దత్ &#039;అనిల్ సాహ్ని&#039; అనే ప్రధాన పాత్రను పోషించారు. ఆయనతో పాటు లీలా నాయుడు, అశోక్ కుమార్ ముఖ్య పాత్రలు పోషించారు. అప్పట్లో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rustom-telugu.jpg</image:loc><image:caption><![CDATA[ పదేళ్ల తర్వాత, 1973లో, దిగ్గజ గీత రచయిత గుల్జార్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టి నానావతి వ్యవహారాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లారు. దేశంలోనే అగ్రశ్రేణి గీత రచయిత అయినప్పటికీ, గుల్జార్ &#039;అచానక్&#039; చిత్రంలో ఒక్క పాటను కూడా చేర్చకుండా చాలా సాహసోపేతమైన ప్రయోగం చేశారు. అదే కేసు 2016లో దర్శకుడు టిను సురేష్ దేశాయ్ బ్లాక్‌బస్టర్ చిత్రం &#039;రుస్తోమ్&#039; తెరకెక్కించారు. నటుడు అక్షయ్ కుమార్ నావికాదళ అధికారి రుస్తోమ్ పావ్రి పాత్రకు ఎంతగా జీవం పోశారంటే, ఈ నటనకు గాను ఆయన &#039;ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారం&#039; గెలుచుకున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/samantha-shares-her-seemantham-photos-wih-hher-husband-raj-nidimoru-1911376.html</loc><lastmod>2026-09-14T20:00:33+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/samantha-8.jpg</image:loc>
					<image:title><![CDATA[ Samantha ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/samantha-7.jpg</image:loc><image:caption><![CDATA[ టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ప్రస్తుతం గర్భిణి అన్న సంగతి తెలిసిందే. ఇటీవలే మా ఇంటి బంగారం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సామ్.. ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సమంతకు గోద్ భరాయి (సీమంత) వేడుకలను ఘనంగా నిర్వహించారు కుటుంబసభ్యులు. అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ షేర్ చేస్తూ శ్రీవిద్య ఉపాసనతో కూడిన ఈ వేడుక గురించి ఇన్ స్టా వేదికగా రాసుకొచ్చారు సామ్. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/samantha-films-1.jpg</image:loc><image:caption><![CDATA[ మన సంప్రదాయాల పట్ల నాకు ఎప్పుడూ ఎంతో గౌరవం ఉంది. ప్రతి ఆచారం వెనుక ఉన్న అంతరార్థం నాకు పూర్తిగా తెలియకపోవచ్చు; కానీ మంత్రోచ్ఛారణలోని ధ్వని, ఆ జపం ద్వారా ఉత్పన్నమయ్యే శక్తి, ప్రాచీన ఆచారాలు తరతరాలుగా ఎంతో శ్రద్ధతో మనకు అందించబడిన విధానం. వీటన్నింటి వెనుక ఏదో లోతైన విశిష్టత దాగి ఉందని నేను ఎప్పుడూ నమ్ముతాను అంటూ రాసుకొచ్చారు సామ్. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/samantha-mom-1.jpg</image:loc><image:caption><![CDATA[ కళా ఆవరణం (శ్రీ కల్పం): శ్రీవిద్య సాంప్రదాయంలో గర్భవతికి నిర్వహించే ఒక ప్రత్యేకమైన పూజా విధానం. ఇందులో దేవికి చెందిన 94 కళలను, తల్లి శరీరంలోని ఏడు చక్రాల ద్వారా ఆవాహన చేస్తారు. పవిత్ర జలం, మంత్రోచ్ఛారణతో ఆ చక్రాలను శుద్ధి చేసి శక్తినంతం చేస్తారు అని తెలిపారు.  దీని ద్వారా అమ్మవారి దివ్య గుణాలు ఆ మహిళలో చైతన్యం నింపుతాయని భావిస్తారు. తనలోని మరో ప్రాణానికి రూపమిస్తున్న సృష్టికర్తగా తల్లిని గౌరవించడం.. ఆమె గర్భంలో పెరుగుతున్న బిడ్డకు ఇదొక ఆశీర్వాదం మాత్రమే కాదు.. కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న మహిళకు ఆశీర్వచనమే. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/samantha-movies-1.jpg</image:loc><image:caption><![CDATA[ శ్రీ చక్ర యంత్రం &amp; ఖడ్గమాల: అభిషేకం తర్వాత, తల్లిని శ్రీ చక్ర యంత్రం మధ్యలో కూర్చోబెడతారు. దేవీ ఖడ్గమాల స్తోత్రం చదువుతూ తొమ్మిది ఆవరణలలోని దేవతలను స్మరిస్తారు. రక్షణ, సంస్కారం: ఈ మంత్రోచ్ఛారణ తల్లి , బిడ్డ చుట్టూ ఒక రక్షాకవచాన్ని  ఏర్పాటు చేస్తుందని, పుట్టకముందే బిడ్డకు ఒక ఆధ్యాత్మిక సంస్కారాన్ని అందిస్తుందని నమ్ముతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/samantha-news-1.jpg</image:loc><image:caption><![CDATA[ అనుభూతి: వేడుక గురించి ముందస్తు అవగాహన లేకపోయినా, ఈ అనుభవం ద్వారా ఎంతో ఆశీర్వదించబడినట్లుగా ఆధ్యాత్మిక ప్రశాంతత లభించింది. ఇదిలా ఉంటే.. గతంలో భూతశుద్ధి పద్ధతిలో సమంత, రాజ్ నిడిమోలు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పుడు వీరిద్దరి వివాహ పద్ధతి బాగా ట్రెండ్ అయ్యింది. సమంత సీమంతం వేడుకలో ఆమె స్నేహితురాలు శిల్ప  పాల్గొన్నారు. మెగా కోడళ్లు, ఉపాసన, లావణ్య, నీరజా కోన, నజ్రియా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cricket-photos/naman-dhir-655-runs-in-sher-e-punjab-t20-league-2026-with-49-fours-and-49-sixes-1911317.html</loc><lastmod>2026-09-14T19:11:31+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ipl-naman-dhir-runs-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ipl Naman Dhir Runs ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/naman-dhir.jpg</image:loc><image:caption><![CDATA[ Sher-E-Punjab T20 League 2026: షేర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్ 2026 మూడవ సీజన్‌ను అమృత్‌సర్ సుర్మా గెలుచుకుంది. ఫైనల్‌లో లుధియానా లయన్స్‌ను 8 వికెట్ల తేడాతో ఏకపక్షంగా ఓడించింది. అభిషేక్ శర్మ గైర్హాజరీలో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన నమన్ ధీర్, టోర్నమెంట్‌లోనే స్టార్‌ ప్లేయర్‌గా నిలిచాడు. అతను తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/naman-dhir-runs.jpg</image:loc><image:caption><![CDATA[ నమన్ ధీర్ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ 10 మ్యాచ్‌లలో 72.78 సగటుతో 655 పరుగులు సాధించాడు. అతనికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్, ఉత్తమ బ్యాట్స్‌మెన్ అవార్డులు లభించాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ipl-naman-dhir-runs.jpg</image:loc><image:caption><![CDATA[ నమన్ ధీర్ బౌలర్లను చెడుగుడు ఆడేసుకున్నాడు. అతను కొట్టిన బౌండరీల సంఖ్యే ఇందుకు నిదర్శనం. అతను ఈ టోర్నమెంట్‌లో అత్యధికంగా 49 సిక్సర్లు, అలాగే 49 ఫోర్లు బాదాడు. అతని స్ట్రైక్ రేట్ 217.61గా ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/prabhsimran-singh.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రభసిమ్రన్ సింగ్ రెండవ స్థానంలో నిలిచాడు. అతను తొమ్మిది మ్యాచ్‌లలో 82.14 సగటుతో 575 పరుగులు చేశాడు. అతను 34 సిక్సర్లు, 57 ఫోర్లు కొట్టగా, అతని స్ట్రైక్ రేట్ 201.05గా ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sher-e-punjab-t20-league-2026.jpg</image:loc><image:caption><![CDATA[ షేర్-ఎ-పంజాబ్ టోర్నమెంట్‌లో బ్యాట్స్‌మెన్ల ఆధిపత్యం చెలాయించినప్పటికీ, కుడిచేతి ఫాస్ట్ బౌలర్ సాహిల్ భాస్కర్ తన బౌలింగ్‌తో ప్రత్యేక ముద్ర వేశాడు. అతను 10 మ్యాచ్‌లలో అత్యధికంగా 20 వికెట్లు పడగొట్టాడు. అతడిని ఉత్తమ బౌలర్‌గా ప్రకటించారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/shani-nakshatra-transit-these-4-zodiac-signs-may-see-luck-financial-gains-and-career-growth-1911292.html</loc><lastmod>2026-09-14T17:55:29+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/shani-nakshatra-transit.jpg</image:loc>
					<image:title><![CDATA[ Shani Nakshatra Transit ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rashifal1-1.jpg</image:loc><image:caption><![CDATA[ వేద జ్యోతిషశాస్త్రంలో శని దేవుడిని కర్మ ఫలదాతగా, న్యాయానికి ప్రతీకగా భావిస్తారు. శని గ్రహం నెమ్మదిగా సంచరించినప్పటికీ, దాని ప్రభావం దీర్ఘకాలం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతారు. శని తన గతి లేదా నక్షత్రాన్ని మార్చినప్పుడు, దాని ప్రభావం వ్యక్తుల వృత్తి, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం వంటి అంశాలపై ఉంటుందని జ్యోతిష్యంలో విశ్వాసం ఉంది. ప్రస్తుతం శని ఉత్తరాభాద్రపద నక్షత్రంలో సంచరిస్తున్నట్లు జ్యోతిష్య గణనలు సూచిస్తున్నాయి. ఉత్తరాభాద్రపద నక్షత్రాన్ని జ్ఞానం, సహనం, ఆధ్యాత్మికత, స్థిరత్వానికి ప్రతీకగా పరిగణిస్తారు. కర్మకు కారకుడైన శని ఈ నక్షత్రంలో సంచరించడం వల్ల కష్టపడే వారికి ఆలస్యంగానైనా స్థిరమైన ఫలితాలు లభించే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు భావిస్తున్నారు. ఈ సంచారం ముఖ్యంగా వృషభం, తుల, మకరం, కుంభ రాశుల వారికి అనుకూల ఫలితాలను అందించే అవకాశం ఉందని జ్యోతిష్యంలో చెబుతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rashifal2-1.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభ రాశి: వృత్తిలో పురోగతి.. ఆర్థిక లాభాలు.. వృషభ రాశి వారికి ఈ శని సంచారం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఆదాయం, లాభాలకు సంబంధించిన విషయాల్లో పురోగతి కనిపించవచ్చు. చాలాకాలంగా ఉద్యోగంలో జీతం పెంపు లేదా పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త అందే అవకాశం ఉంది. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు, భాగస్వామ్యాల ద్వారా లాభాలు రావచ్చు. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి కూడా ప్రయోజనం పొందే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్వాసాలు సూచిస్తున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rashifal3-1.jpg</image:loc><image:caption><![CDATA[ తుల రాశి: ఉద్యోగంలో మంచి అవకాశాలు.. ఆస్తి కల నెరవేరే అవకాశం.. తుల రాశివారికి శని గ్రహం ప్రాధాన్యత కలిగిన గ్రహంగా పరిగణించబడుతుంది. ఈ కాలంలో వృత్తి, ఆర్థిక, కుటుంబ విషయాల్లో స్థిరత్వం పెరగవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు రావచ్చు. ముఖ్యంగా పెద్ద సంస్థలు లేదా విదేశీ కంపెనీల నుంచి అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఇల్లు, స్థలం లేదా వాహనం కొనుగోలు చేయాలనే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. కుటుంబంలో చాలాకాలంగా కొనసాగుతున్న విభేదాలు తగ్గి, సానుకూల వాతావరణం ఏర్పడవచ్చని భావిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rashifal4-1.jpg</image:loc><image:caption><![CDATA[ మకర రాశి: ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం.. మకర రాశికి శని అధిపతి. అందువల్ల శని సంచారం ఈ రాశివారికి ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఈ కాలంలో ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడవచ్చు. చాలాకాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి వచ్చే అవకాశం ఉంది. బ్యాంకు బ్యాలెన్స్ పెరగడంతో పాటు పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయ్యే సూచనలు కనిపించవచ్చు. మీ మాటతీరు, చర్చించే విధానం ముఖ్యమైన విషయాల్లో ప్రయోజనం కలిగించవచ్చు. వ్యాపారంలో కొత్త భాగస్వాములు పరిచయం కావచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rashifal5.jpg</image:loc><image:caption><![CDATA[ కుంభ రాశి: ప్రతిష్ట పెరుగుతుంది.. విదేశీ అవకాశాలు.. కుంభ రాశికి కూడా శని అధిపతి. ఈ కారణంగా ఉత్తరాభాద్రపద నక్షత్రంలోని శని సంచారం కుంభ రాశివారికి అనుకూలంగా ఉండవచ్చని జ్యోతిష్యులు భావిస్తున్నారు. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం, సామాజిక ప్రతిష్ట పెరగవచ్చు. ఉద్యోగం లేదా వ్యాపారంలో మీపై నమ్మకం పెరిగే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు, విదేశీ సంస్థలతో వ్యాపారం లేదా ఉద్యోగ సంబంధాలు ఉన్నవారికి ఆర్థికంగా ప్రయోజనం కలగవచ్చు. ఆరోగ్యంపై కూడా గతంలో కంటే మెరుగైన పరిస్థితి ఏర్పడుతుందని జ్యోతిష్య విశ్వాసాలు చెబుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rashifal6.jpg</image:loc><image:caption><![CDATA[ శని అనుగ్రహం కోసం ఏం చేయాలి?

జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం శని అనుకూల ఫలితాల కోసం కొన్ని పరిహారాలను సూచిస్తారు. శనివారం ఇనుప పాత్రలో ఆవనూనె తీసుకుని అందులో ముఖాన్ని చూసిన అనంతరం ఆ నూనెను దానం చేయడం. ప్రతిరోజూ లేదా శనివారం హనుమాన్ చాలీసా పఠించడం. శనివారం సాయంత్రం రావి చెట్టు వద్ద ఆవనూనెతో దీపం వెలిగించడం. శని దేవుడిని భక్తిశ్రద్ధలతో పూజించడం, పేదలకు లేదా అవసరంలో ఉన్నవారికి దానం చేయడం. 
(Disclaimer: ఈ కథనంలోని వివరాలు వేద జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా చెప్పబడినవి. వ్యక్తిగత జాతకంలోని గ్రహస్థితులు, దశలు, అంతర్దశలను బట్టి ఫలితాలు మారవచ్చు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/rs-50-lakh-fund-how-much-should-you-invest-via-sip-to-build-a-fund-of-inr-rs-50-lakh-in-15-years-1911284.html</loc><lastmod>2026-09-14T17:41:38+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/royal-enfield-bullet-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Royal Enfield Bullet ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/royal-enfield-bullet-6-1.jpg</image:loc><image:caption><![CDATA[ చాలా మంది పెట్టుబడిదారులు తమ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి మ్యూచువల్ ఫండ్ SIP లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ఇప్పుడు ఒక ప్రముఖ మార్గంగా మారింది. రూ. 50 లక్షల ఫండ్‌ను ఏర్పాటు చేయడానికి ఎల్లప్పుడూ ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి నెలా పెట్టుబడి పెట్టాల్సిన మొత్తం ప్రధానంగా పెట్టుబడి కాలం, ఆశించిన రాబడిపై ఆధారపడి ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sip-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఒక పెట్టుబడిదారుడు 15 సంవత్సరాలలో 50 లక్షల రూపాయల ఫండ్‌ను సృష్టించాలనుకుంటున్నాడని అనుకుందాం. సగటు వార్షిక రాబడి 12 శాతంగా భావిస్తే, నెలకు సుమారు 10,100 రూపాయల SIPతో 15 సంవత్సరాలలో సుమారు 50 లక్షల 45 వేల రూపాయల ఫండ్‌ను సృష్టించవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sip-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ సందర్భంలో 15 సంవత్సరాలలో పెట్టుబడిదారుని మొత్తం పెట్టుబడి సుమారు 18 లక్షల 18 వేల వరకు అవుతుంది. సంవత్సరానికి సగటున 12 శాతం రాబడి వస్తే, వడ్డీ రూపంలో మరో 32 లక్షల 27 వేల వరకు అవుతాయి. అంటే, దీర్ఘకాలిక పెట్టుబడి, చక్రవడ్డీ ప్రయోజనంతో మొత్తం నిధి 50 లక్షల మార్కును దాటగలదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sip-3.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే, రాబడి రేటు తక్కువగా ఉంటే, నెలవారీ SIP మొత్తాన్ని పెంచాల్సి ఉంటుంది. 8 శాతం వార్షిక రాబడిని పరిగణనలోకి తీసుకుంటే 15 సంవత్సరాలలో రూ. 50 లక్షల లక్ష్యాన్ని చేరుకోవడానికి, నెలకు సుమారు రూ. 14,449 పెట్టుబడి అవసరం కావచ్చు. 9 శాతం రాబడి వద్ద, నెలవారీ SIP సుమారు రూ. 13,213, 10 శాతం రాబడి వద్ద సుమారు రూ. 12,64, 11 శాతం రాబడి వద్ద సుమారు రూ. 10,997 ఉండవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sip-4.jpg</image:loc><image:caption><![CDATA[ రూ. 50 లక్షల లక్ష్యాన్ని వేగంగా చేరుకోవాలనుకునే వారు, పెట్టుబడి రిస్క్‌ను పెంచుకోవడానికి బదులుగా నెలవారీ SIP మొత్తాన్ని పెంచుకోవడాన్ని పరిగణించవచ్చు. ఉదాహరణకు నెలకు రూ. 10,100కు బదులుగా రూ. 11,100 పెట్టుబడి పెట్టడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవడానికి పట్టే సమయాన్ని తగ్గించుకోవచ్చు. అయితే, 8 నుండి 12 శాతం రాబడులకు సంబంధించిన ఈ లెక్కలు పూర్తిగా ఊహాజనితమైనవని గుర్తుంచుకోవడం ముఖ్యం. మ్యూచువల్ ఫండ్ల వాస్తవ రాబడులు మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. హెచ్చుతగ్గులకు లోనవుతాయి. అందువల్ల, పెట్టుబడి పెట్టే ముందు మీ స్వంత రిస్క్ భరించే సామర్థ్యాన్ని, ఆర్థిక లక్ష్యాలను పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం. (గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం ప్రమాదకరమని ఇక్కడ పేర్కొనడం ముఖ్యం. పెట్టుబడిదారుగా, డబ్బు పెట్టుబడి పెట్టే ముందు ఎల్లప్పుడూ నిపుణుడిని సంప్రదించండి.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/royal-enfield-bullet-350-rs-100-petrol-1-litre-mileage-35-kilometer-1911254.html</loc><lastmod>2026-09-14T16:48:10+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/royal-enfield-bullet-4-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Royal Enfield Bullet ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/royal-enfield-bullet-4.jpg</image:loc><image:caption><![CDATA[ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 (Royal Enfield Bullet 350) బైక్ బలమైన డిజైన్, ఐకానిక్ లుక్, 350cc ఇంజిన్ కోరుకునే వారికి ఒక అద్భుతమైన ఎంపిక. బలమైన రోడ్ ప్రెజెన్స్ ఉన్నప్పటికీ మైలేజ్ విషయంలో కూడా ఇది ఆకట్టుకుంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/royal-enfield-bullet-1.jpg</image:loc><image:caption><![CDATA[ లీటరుకు ఎంత ఇస్తుంది?: సాధారణంగా Bullet 350 ఒక లీటరు పెట్రోల్‌కు దాదాపు 35 కిలోమీటర్ల (35 kmpl) మైలేజ్ ఇస్తుంది. 100 రూపాయల పెట్రోల్‌కు ఎంత ప్రయాణిస్తుంది? రూ.100 పెట్రోల్ పోయిస్తే ఈ బైక్ దాదాపు 30 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.. (గమనిక: రోడ్డు పరిస్థితి, ట్రాఫిక్, డ్రైవింగ్ శైలి, బైక్ మైంటెనెన్స్ ఆధారంగా మైలేజ్ మారవచ్చు). ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/royal-enfield-bullet-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంజిన్ సామర్థ్యం: ఇందులో 349cc, సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కలదు. ఇది 20.2 PS (14.87 kW) పవర్, 6,100 rpm ఉత్పత్తి చేస్తుంది. ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ద్వారా ఇది మెరుగైన రైడింగ్ అనుభూతిని ఇస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/royal-enfield-bullet-3.jpg</image:loc><image:caption><![CDATA[ గ్రాండ్ పవర్: రోజూవారీ ప్రయాణాలతో పాటు హైవేలలో ప్రయాణించడానికి ఇది చాలా అనువుగా ఉంటుంది. గేర్‌బాక్స్: ఇందులో 5-స్పీడ్ గేర్‌బాక్స్ అందించింది. దీనివల్ల నగరంలో ట్రాఫిక్‌లో గానీ, హైవేలపై అధిక వేగంలో గానీ గేర్లు సులభంగా మార్చుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/royal-enfield-bullet-5.jpg</image:loc><image:caption><![CDATA[ గ్రౌండ్ క్లియరెన్స్: 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం వల్ల గుంతలు, స్పీడ్ బ్రేకర్లను సులభంగా దాటవచ్చు. 1,390 mm వీల్‌బేస్ బైక్‌కు ప్రయాణంలో మంచి స్టెబిలిటీ (స్థిరత్వం) ఇస్తుంది. ఇక ధర విషయానికొస్తే..  ఢిల్లీలో Royal Enfield Bullet 350 ఆన్-రోడ్ ధర దాదాపు రూ.2 లక్షల వరకు ఉంది. (నగరం, వేరియంట్, కంపెనీ ధరల మార్పుల బట్టి ఆన్-రోడ్ ధర మారవచ్చు). రోజూవారీ ప్రయాణాలకు, అలాగే లాంగ్ రైడ్స్ చేయడానికి పవర్, లుక్స్, మంచి మైలేజ్ (లీటరుకు 35 కి.మీ) కోరుకునే వారికి రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఒక మంచి ఆప్షన్. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/sports-photos/why-team-india-not-take-prize-money-after-winning-asia-cup-2026-check-reason-here-1911234.html</loc><lastmod>2026-09-14T16:28:33+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/team-india-prize-money-4.jpg</image:loc>
					<image:title><![CDATA[ Team India Prize Money (4) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/team-india-prize-money-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ మహిళల టీ20 ఆసియా కప్ 2026ను భారత్ గెలుచుకుంది. ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి భారత జట్టు టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టు ట్రోఫీని ఎందుకు అందుకోలేదు.. కానీ, ప్రైజ్ మనీని ఎందుకు స్వీకరించలేదో మీకు తెలుసా? ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/team-india-prize-money-3.jpg</image:loc><image:caption><![CDATA[ మహిళల టీ20 ఆసియా కప్ 2026 కోసం అధికారికంగా ఎలాంటి ప్రైజ్ మనీని ప్రకటించనప్పటికీ, గత సంవత్సరాలలో ఛాంపియన్ జట్లు రూ. 21 కోట్ల వరకు (సుమారు $2.1 బిలియన్లు), రన్నరప్ జట్లు రూ. 10.5 కోట్ల వరకు (సుమారు $1.05 బిలియన్లు) అందుకున్నాయి ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/team-india-prize-money-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఆసియా కప్ గెలిచినందుకు వచ్చే ప్రైజ్ మనీని భారత్ స్వీకరించదు. దానికి బదులుగా, ఆ డబ్బును ఇతర క్రికెట్ బోర్డులకు విరాళంగా ఇస్తుంది. తద్వారా ఆయా దేశాల్లో క్రికెట్ అభివృద్ధి కోసం కృషి చేస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/team-india-prize-money-1.jpg</image:loc><image:caption><![CDATA[ మహిళల టీ20 ఆసియా కప్ 2026 ట్రోఫీని కూడా భారత జట్టు అందుకోలేదు. ఏసీసీకి అధిపతిగా, పీసీబీకి ఛైర్మన్‌గా, అన్నింటికంటే ముఖ్యంగా పాకిస్తాన్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉన్న మోసిన్ నఖ్వీ కారణంగానే భారత మహిళల జట్టు ఈ నిర్ణయం తీసుకుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/team-india-prize-money.jpg</image:loc><image:caption><![CDATA[ గత ఏడాది పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం, భారత పురుషుల జట్టు మొదట మోసిన్ నఖ్వీకి ట్రోఫీని అందజేయకుండా ఆసియా కప్‌కు నిరసన తెలిపింది. ఇప్పుడు, భారత మహిళల క్రికెట్ జట్టు కూడా అదే చర్యను పునరావృతం చేసింది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/eco-friendly-21-foot-sasya-ganapathi-in-anakapalle-unique-ganesha-idol-made-with-16000-plants-attracts-devotees-1911189.html</loc><lastmod>2026-09-14T15:27:30+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/eco-friendly-21-foot-sasya-ganapathi-in-anakapalle.jpg</image:loc>
					<image:title><![CDATA[ Eco Friendly 21 Foot Sasya Ganapathi In Anakapalle ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/eco-friendly-sasya-ganapathi.jpg</image:loc><image:caption><![CDATA[ మొక్కలతో ప్రత్యేకంగా రూపొందించిన సస్య గణపతి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. వినాయక నవరాత్రి ఉత్సవాల ద్వారా భక్తితో పాటు పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/eco-friendly-sasya-ganapathi-3.jpg</image:loc><image:caption><![CDATA[ 16  వేల మొక్కలతో గణపతి విగ్రహాన్ని రూపొందించాలని అనుకున్నారు కానీ.. అంతకుమించి ఈ వినాయక విగ్రహం ఏర్పాటు చేసేందుకు మొక్కలు వినియోగించారు. 21 అడుగుల ఎత్తు వరకు విగ్రహం తీర్చిదిద్దారు . వినాయక ప్రతిమతో పాటు పరిసర ప్రాంతాలను మొక్కలతో అలంకరించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/eco-friendly-sasya-ganapathi-4.jpg</image:loc><image:caption><![CDATA[ అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ప్రతిబింబించేలా మరో 60 వేల మొక్కలతో ఏర్పాటు చేసిన మండపం, ప్రతిమను ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ప్రారంభించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/eco-friendly-sasya-ganapathi-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ సస్య గణపతి విగ్రహం కోసం మొక్కలను కడియపులంకలో పెంచారు. ఆర్గానిక్ పద్ధతిలో పెంచి ప్రత్యేకంగా వినాయక చవితి కోసం తీసుకువచ్చారు. మిగిలిన అలంకారం మొక్కలను వివిధ రాష్ట్రాల నుంచి, వాటిలో విదేశీ మొక్కలు కూడా ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/eco-friendly-sasya-ganapathi-1.jpg</image:loc><image:caption><![CDATA[ సస్య గణపతి మొక్కల అలంకారంతోపాటు వాటర్ఫాల్, కొలను ఏర్పాటు చేసి అందులో చేపలు వేశారు. దీంతో పాటు పక్షులను కూడా ఆ ప్రాంతంలో ఉంచారు. ప్రకృతిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశాన్ని సస్య గణపతి ద్వారా ప్రజలకు అందిస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు. పర్యావరణహిత ఆలోచనతో ఏర్పాటు చేసిన ఈ గణపతి భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందన్నారు. అక్టోబర్ 4వ తేదీ వరకు భక్తులకు సస్య గణపతి దర్శనమిస్తారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/tv9-celebrates-vinayaka-chavithi-with-eco-friendly-clay-idol-special-puja-held-at-tv9-headquarters-1911197.html</loc><lastmod>2026-09-14T15:26:40+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/tv9-vinayaka-chavithi-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Tv9 Vinayaka Chavithi (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/tv9-vinayaka-chavithi-1.jpg</image:loc><image:caption><![CDATA[ తెలుగు రాష్ట్రాలతోపాటు.. దేశవ్యాప్తంగా వినాయక చవితి సందడి నెలకొంది. గల్లీ గల్లీలో వినాయకుని మండపాలు దర్శనం ఇస్తున్నాయి. ఎటు చూసినా గణపయ్య నామ స్మరణతో మారుమోగుతోంది.. ఉదయం నుంచి భక్తులు.. భక్తిశ్రద్ధలతో గణేష్ విగ్రహలను ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతీ గడపా గణనాథుని నామస్మరణతో మార్మోగుతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/tv9-vinayaka-chavithi-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ క్రమంలోనే మీడియా దిగ్గజం టీవీ9 ప్రధాన కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా, కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడు లాగే ఈ ఏడాది కూడా పర్యావరణ హితమైన మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించి టీవీ9 కుటుంబ సభ్యులంతా కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/tv9-vinayaka-chavithi-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ పవిత్ర కార్యక్రమంలో టీవీ9 ఛానల్ ముఖ్య అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఛానల్ సీఎఫ్‌ఓ శివానంద పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నాలు తొలగాలని, రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/tv9-vinayaka-chavithi-4.jpg</image:loc><image:caption><![CDATA[ వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని టీవీ9 ఆఫీస్‌లో జరిగిన ఈ వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. హెచ్‌ఆర్ కల్యాణ్, అడ్మిన్ రాము, ఎడిటర్ వీరభద్రరావు తదితరులు వినాయక పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/tv9-vinayaka-chavithi-5.jpg</image:loc><image:caption><![CDATA[ కార్యాలయం మొత్తం పూలు, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించడంతో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం సిబ్బంది అందరూ కలిసి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ప్రతి ఏటా ఇలాగే జర్నలిస్టులు, సిబ్బంది ఒకచోట చేరి పండుగను ఘనంగా జరుపుకోవడం శుభ పరిణామమని యాజమాన్యం పేర్కొంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/actress-sona-says-she-rejected-16-film-offers-to-work-with-comedian-vadivelu-1911152.html</loc><lastmod>2026-09-14T14:21:50+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sona-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sona ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sona-pics.jpg</image:loc><image:caption><![CDATA[ సినీ పరిశ్రమలో నటీనటులు ఎదుర్కొనే ఇబ్బందులు, వ్యక్తిగత అనుభవాలు అప్పుడప్పుడు చర్చనీయాంశంగా మారుతుంటాయి. ముఖ్యంగా తమ కెరీర్‌లో ఎదురైన చేదు అనుభవాల గురించి నటీనటులు బహిరంగంగా మాట్లాడినప్పుడు ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా దక్షిణాది నటి సోనా హైడెన్ చేసిన వ్యాఖ్యలు కూడా సినీ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ప్రముఖ తమిళ కమెడియన్ వడివేలుతో కలిసి నటించడానికి వచ్చిన ఏకంగా 16 సినిమా అవకాశాలను తాను తిరస్కరించినట్లు ఆమె వెల్లడించారు. ఇంతకీ ఆమె ఎందుకు ఆ అవకాశాలను వదులుకున్నారు? అసలు ఏం జరిగింది? ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sona-pic.jpg</image:loc><image:caption><![CDATA[ తమిళం, తెలుగు, మలయాళం చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి సోనా హైడెన్ తన గ్లామర్ పాత్రలతో పాటు నిర్మాతగా, వ్యాపారవేత్తగా కూడా గుర్తింపు పొందారు. 2000ల ప్రారంభం నుంచి దక్షిణాది సినిమాల్లో కనిపించిన ఆమె, రజనీకాంత్ నటించిన కుశేలన్ చిత్రంలోనూ నటించారు. ఈ సినిమా తెలుగులో కథానాయకుడు పేరుతో విడుదలైంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sona-photo.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే  గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వడివేలు గురించి సోనా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. కుశేలన్ సినిమా తర్వాత వడివేలుతో కలిసి నటించేందుకు తనకు దాదాపు 16 సినిమా అవకాశాలు వచ్చాయని ఆమె తెలిపారు. కానీ ఆ అవకాశాలన్నింటినీ తాను తిరస్కరించినట్లు వెల్లడించారు. వడివేలుతో కలిసి నటించడంపై సోనా మాట్లాడుతూ, ఆయనను భరించడం తనకు చాలా కష్టంగా అనిపించిందని పేర్కొన్నారు. కొన్ని విషయాలను బహిరంగంగా చెప్పలేనని, గతంలోనూ ఈ అంశంపై మాట్లాడినట్లు ఆమె తెలిపారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sona-latest.jpg</image:loc><image:caption><![CDATA[ వడివేలుతో కలిసి నటించేందుకు నాకు 16 సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ వాటన్నింటినీ తిరస్కరించాను. ఆయనను భరించడం చాలా కష్టం. కొన్ని విషయాలను బహిరంగంగా చెప్పలేను. నాకు నా ఆత్మగౌరవం చాలా ముఖ్యం అంటూ సోనా కామెంట్స్ చేసినట్టు పలు మీడియా కథనాలు వచ్చాయి. అయితే వడివేలు తనను ఏ విధంగా ఇబ్బందిపెట్టారనే విషయాన్ని ఆమె పూర్తిగా వివరించలేదు. దీంతో ఆమె వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sona.jpg</image:loc><image:caption><![CDATA[ తన సినీ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని సోనా గత ఇంటర్వ్యూలో చెప్పినట్లు కథనాలు పేర్కొన్నాయి. ఒక దశలో నటనను పూర్తిగా వదిలేయాలని కూడా అనిపించిందని, పరిశ్రమలో ప్రతి ఒక్కరినీ నమ్మలేని పరిస్థితులు ఎదురయ్యాయని ఆమె వెల్లడించారు. వ్యక్తిగత అనుభవాల కారణంగానే కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నట్లు తెలిపారు. అయితే తన నిర్ణయాల విషయంలో ఆత్మగౌరవానికి ప్రాధాన్యత ఇస్తానని సోనా స్పష్టం చేశారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/actress-shruti-marathe-on-trolls-regarding-her-weight-1911128.html</loc><lastmod>2026-09-14T14:15:46+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/shrumarathe-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Shrumarathe ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/shrumarathe.jpg</image:loc><image:caption><![CDATA[ సినీ తారల వ్యక్తిగత జీవితాలు, వారి లుక్స్, ఫిట్‌నెస్‌ గురించి సోషల్ మీడియాలో నిత్యం చర్చ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల శరీరాకృతిపై కొందరు నెటిజన్లు చేసే కామెంట్స్ తీవ్ర విమర్శలకు దారితీస్తుంటాయి. అయితే ఈ ట్రోలింగ్ ప్రభావం సెలబ్రిటీల మానసిక ఆరోగ్యంపై ఎంతగా ఉంటుందో తాజాగా నటి శ్రుతి మరాఠే చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మరాఠీ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రుతి మరాఠే. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/shrumarathe-new.jpg</image:loc><image:caption><![CDATA[ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర: పార్ట్ 1’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ పోషించిన పాత్రలకు భార్యగా, తల్లిగా కనిపించి ఆకట్టుకుంది. సినిమాలో ఆమె పాత్రకు ప్రత్యేకంగా పేరు లేకపోయినా.. ప్రేక్షకులు ఇప్పటికీ ఆమెను ‘దేవర భార్య’గా గుర్తుంచుకుంటున్నారు. దేవర తర్వాత శ్రుతి మరాఠేకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించింది. తాజాగా ఆమె నటించిన హిందీ వెబ్ సిరీస్ ‘ప్రీతమ్ అండ్ పెడ్రో’ కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ సిరీస్‌లో ఆమె శ్రద్ధా సర్దేశాయ్ పాత్రలో నటించింది.   ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/shrumarathe-photo.jpg</image:loc><image:caption><![CDATA[ తన కెరీర్ ప్రారంభ దశలో బాడీ షేమింగ్, సోషల్ మీడియా ట్రోలింగ్‌ను ఎదుర్కొన్న విషయాన్ని శ్రుతి గతంలో పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై ఆమె తన అనుభవాలను పంచుకుంది. తొలినాళ్లలో తాను చేసిన మరాఠీ సీరియల్ ప్రసారమైన తర్వాత కొందరు ప్రేక్షకులు తన శరీరాకృతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆమె గుర్తుచేసుకుంది. ముఖ్యంగా ‘నువ్వు చాలా లావుగా ఉన్నావు’ అంటూ వచ్చిన కామెంట్స్ తనను తీవ్రంగా బాధించాయని తెలిపింది. ఆ సమయంలో తాను చాలా చిన్న వయసులో ఉండటంతో ఇలాంటి విమర్శలను ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదని చెప్పింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/shrumarathe-pic.jpg</image:loc><image:caption><![CDATA[ శ్రుతి మరాఠే మాట్లాడుతూ.. తన శరీరాకృతిపై గతంలో ఎన్నో రకాలుగా కామెంట్స్ చేశారని తెలిపింది. ఒకప్పుడు లావుగా ఉన్నావంటూ విమర్శించినవారే.. ఇప్పుడు సన్నగా మారిపోయావంటూ మాట్లాడుతున్నారని చెప్పింది. ప్రజలు మన శరీరాల గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటారు. మనం లోపల ఎలా ఫీల్ అవుతున్నామో, మనకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయో తెలుసుకోవడానికి వారు ప్రయత్నించరు. ఒకప్పుడు నేను చాలా లావుగా ఉన్నానని అన్నారు. ఆ కామెంట్స్ నన్ను ఎంతో ఒత్తిడికి గురిచేశాయి. ఇప్పుడు నేను చాలా సన్నగా మారిపోయానని అంటున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/shrumarathe-pics.jpg</image:loc><image:caption><![CDATA[ గత 15–20 ఏళ్లుగా ఇలాంటి మాటలు వింటూనే ఉన్నాను. అందుకే ఇప్పుడు ఈ కామెంట్స్ వింటే నాకు నవ్వొస్తుంది అని శ్రుతి చెప్పుకొచ్చింది. తనపై వచ్చిన ట్రోలింగ్ కారణంగా మానసికంగా ఎంతో ఇబ్బందిపడ్డానని శ్రుతి మరాఠే వెల్లడించింది. ఒక వ్యక్తి శరీరాకృతిని పదేపదే విమర్శించడం వల్ల వారి ఆత్మవిశ్వాసం దెబ్బతినడంతో పాటు మానసిక ఆరోగ్యంపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని ఆమె అభిప్రాయపడింది. అయితే ప్రస్తుతం తాను అలాంటి విమర్శలను పట్టించుకోవడం లేదని స్పష్టం చేసింది ఈ అందాల తార.  ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/benefits-of-ajwain-and-black-salt-water-for-digestion-and-gas-relief-1911111.html</loc><lastmod>2026-09-14T13:55:06+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ajwain-and-black-salt-water.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ajwain And Black Salt Water ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ajwain-benefits-4.jpg</image:loc><image:caption><![CDATA[ అజీర్ణం, గ్యాస్ సమస్యకు చెక్‌ పెట్టడంలో వాము చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ చిట్కాను మన పూర్వికుల కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. తిన్న వెంటనే మీకు అజీర్తిగా అనిపిస్తే వెంటనే కొన్ని నీటిలో వాము వేసి బాగా మరిగించిన.. చల్లార్చిన తర్వాత తాగండి.. ఇది కడుపు ఉబ్బరం గ్యాస్ సమస్యల నుంచి తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తుంది.అంతేకాదు మీరు అందులో కాస్త నల్ల ఉప్పు కలిపితే రిజల్ట్స్ మరింత మెరుగ్గా ఉంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ajwain-benefits-3.jpg</image:loc><image:caption><![CDATA[ వాములో థైమోల్ అనే మూలకం పుష్కలంగా ఉంటుంది.. ఇది జీర్ణక్రియను వేగవంతం చేసి.. ఆమాశయంలో జీర్ణ రసాల ఉత్పత్తిని పెంచడం ద్వారా ఆహారాన్ని వేగంగా విచ్ఛిన్నం చేస్తుంది. మీరు ఎక్కవగా తిన్నప్పుడూ లేదా తిన్న వెంటనే కడుపులో భారంగా అనిపిస్తే.. ఒక్కసారి ఈ పానియం తాగడం వల్ల పూర్తి ఉపశమనం పొందుతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ajwain-benefits-2.jpg</image:loc><image:caption><![CDATA[ వాము నీటిలో కొంచెం నల్ల ఉప్పు కలిపి తాగడం వల్ల జీర్ణక్రియ ఇంకా ఆరోగ్యవంతంగా మారుతుంది. దీనిని ఎలా వాడాలి అంటే.. ఒక టీ స్పూన్ వామును రాత్రి మొత్తం నీటిలో నానబెట్టి.. మరుసటి రోజు అందులో కొద్దిగా నల్ల ఉప్పు వేసి దాన్ని బాగా కలిపి తాగవ్చు. దీనిని మీరు వేడి చేయాల్సిన అవసరం కూడా ఉండదు.. ఇలా తాగడం వల్ల  కడుపులోని హానికరమైన బ్యాక్టీరియా, సూక్ష్మజీవులను సులభంగా నాశనం చేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ajwain-benefits-1.jpg</image:loc><image:caption><![CDATA[ అలాగే ఈ వాము నీరులో నల్ల ఉప్పు కలిపి తాగడం వల్ల శరీరానికి అవసరమయ్యే సోడియం, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా పుష్కలంగా అందుతాయి. మీకు సరిగ్గా ఆకలి వేయకున్నా, లేదా మీరు ఎక్కవగా తిన్నప్పుడు కడుపులో గజిబిజిగా అనిపించినా ఈ నీరు తాగడం వల్ల ఉపశమనాన్ని పొందుతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ajwain-benefits.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ఈ వాము నీరు అందిరికీ ఒకేలాంటి ప్రయోజనాలు అందించకపోవచ్చు. కాబట్టి ఎక్కువ రోజులుగా అసిడిటీ,  ఛాతీలో మంట, అధిక రక్తపోటు, ఇతర తీవ్రమైన కడుపు సంబంధిత వ్యాధులతో బాధపడేవారైతే కచ్చితంగా వైద్యులను సంప్రదించిన తర్వాతే, వారి సూచన మేకు మాత్రం ఈ నీటిని తాగండి. Note: పైన పేర్కొన్న అంశాలు, ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని TV9 దృవీకరించలేదు! ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/bendakaya-pachadi-a-traditional-andhra-pachadi-that-tastes-amazing-with-hot-rice-1911082.html</loc><lastmod>2026-09-14T13:03:03+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/okra-chutney.jpg</image:loc>
					<image:title><![CDATA[ Okra Chutney ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/okra-chutney.jpg</image:loc><image:caption><![CDATA[ కావాల్సిన పదార్థాలు.. బెండకాయలు - 250 గ్రాములు, టమాటాలు - 4, ఎండుమిరపకాయలు - 15 (కారం ప్రకారం మార్చుకోవచ్చు), పచ్చిశనగపప్పు - 1 టేబుల్ స్పూన్, ధనియాలు - అర టీ స్పూన్, జీలకర్ర - 1 టీ స్పూన్, కరివేపాకు - గుప్పెడు, చింతపండు - చిన్న ఉసిరికాయ సైజు, నూనె - 2 టేబుల్ స్పూన్లు + తాలింపుకు, ఉప్పు - రుచికి సరిపడా, వెల్లుల్లి రెబ్బలు - 8, తాలింపు గింజలు - 1 టీ స్పూన్ (తాలింపుకు) చొప్పున తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/okra-chutney-2.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టి, అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడి అయిన తర్వాత, 15 ఎండుమిరపకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. తరువాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ధనియాలు మరియు గుప్పెడు కరివేపాకు వేసి, మీడియం మంటపై బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. కరివేపాకు ఎక్కువ వేసుకుంటే పచ్చడికి మంచి రుచి వస్తుంది. మీ కారానికి తగినట్లుగా ఎండుమిరపకాయల సంఖ్యను సర్దుబాటు చేసుకోవచ్చు. ఇవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/okra-chutney-5.jpg</image:loc><image:caption><![CDATA[ అదే పాన్ లో మరో టీ స్పూన్ నూనె వేసి, మూడు నాలుగు సార్లు కడిగి, తుడుచి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పావు కిలో బెండకాయలను వేయాలి. బెండకాయ ముక్కలను జిగురు లేకుండా బాగా వేగేలా మీడియం మంటపై వేయించుకోవాలి. ఇవి కూడా చక్కగా వేగిన తర్వాత ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/okra-chutney-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు అదే పాన్ లో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న నాలుగు టమాటాలను వేయాలి. టమాటాలు త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు, చిన్న ఉసిరికాయ సైజు చింతపండు వేసి ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టి టమాటాలు మెత్తగా మగ్గేంతవరకు ఉడికించాలి. టమాటాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/okra-chutney-4.jpg</image:loc><image:caption><![CDATA[ అన్నీ చల్లారిన తర్వాత, ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించుకున్న ఎండుమిరపకాయల దినుసులు, ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినంత ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత మగ్గబెట్టిన టమాటా మిశ్రమాన్ని వేసి మెత్తగా రుబ్బుకోవాలి. చివరగా, వేయించుకున్న బెండకాయ ముక్కలను వేసి ఒక్కసారి మాత్రమే తిప్పుకోవాలి. బెండకాయ ముక్కలు మరీ మెత్తగా కాకుండా, కాస్త బరకగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే పచ్చడి రుచిగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/okra-chutney-1.jpg</image:loc><image:caption><![CDATA[ పచ్చడిని ఒక బౌల్ లోకి తీసుకున్న తర్వాత, మళ్లీ స్టవ్ మీద పాన్ పెట్టి, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. నూనె వేడి అయిన తర్వాత, ఒక టీ స్పూన్ తాలింపు గింజలు, రెండు ఎండుమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఈ వేయించిన తాలింపును పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ రుచికరమైన బెండకాయ పచ్చడిని ఫ్రిడ్జ్ లో నిల్వ చేసుకుంటే వారం రోజుల పాటు తాజాగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి, ఉల్లిపాయ ముక్కలతో కలిపి ఈ పచ్చడిని ఆస్వాదిస్తే, దాని రుచి మిమ్మల్ని మరో లోకానికి తీసుకెళ్తుంది. ఈ రెసిపీని మీరు కూడా ప్రయత్నించండి.. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/gold-prices-crash-on-vinayaka-chavithi-gold-rates-fall-sharply-for-second-consecutive-day-1910992.html</loc><lastmod>2026-09-14T10:18:44+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-9.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-1-7.jpg</image:loc><image:caption><![CDATA[ వినాయక చవితి పండుగ రోజు బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. గోల్డ్ రేట్లు భారీగా పతనమయ్యాయి. గంటల్లోనే ఉన్నట్లుండి కుప్పకూలాయి. వరుసగా రెండో రోజు ధరలు పడిపోయాయి. పండుగ పూట ఇది శుభపరిణామంగా చెప్పవచ్చు. వచ్చే నెలలో దసరా పండుగ కూడా రానున్న క్రమంలో బంగారం ధరలు దిగిరావడం కొనుగోలుదారులకు భారీ ఊరటగా చెప్పవచ్చు. ఈ పతనం తర్వాత సెప్టెంబర్ 14వ తేదీన దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-2-7.jpg</image:loc><image:caption><![CDATA[ హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,090కి చేరుకోగా.. సోమవారం ఒక్కరోజే రూ.490 డౌన్ అయింది. 22 క్యారెట్ల రేటు రూ.1,41,250 వద్ద కొనసాగుతుండగా.. ఈ రోజు రూ.450 క్రాష్ అయ్యాయి. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-3-7.jpg</image:loc><image:caption><![CDATA[ చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,090 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,250కు లభిస్తున్నాయి. బెంగళూరులో 24 క్యారెట్ల క్యారెట్ల రేట్లు రూ.1,54,090 పలుకుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,41,250గా ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-4-7.jpg</image:loc><image:caption><![CDATA[ దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,54,240 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,400 వద్ద ట్రేడవుతున్నాయి. ఇక వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి. ఢిల్లీలో కిలో వెండి రూ.2.45 లక్షలుగా ఉంది. హైదరాబాద్‌లో కిలో సిల్వర్ రేటు రూ.2.50 లక్షలుగా ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-5-6.jpg</image:loc><image:caption><![CDATA[ చెన్నైలో కిలో వెండి రూ.2.50 లక్షలుగా ఉండగా.. బెంగళూరులో రూ.2.45 లక్షల వద్ద కొనసాగుతోంది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో గోల్డ్ రేట్లు ప్రభావితం అవుతున్నాయి. ఈ అంచనాల వల్ల డాలర్, బాండ్ ఈల్డ్స్‌కి గిరాకీ పెరిగింది. దీంతో బంగారం ధరల తగ్గుతూ వస్తోంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/godhuma-rava-prasadam-recipe-easy-10-minute-annavaram-style-wheat-rava-halwa-1910871.html</loc><lastmod>2026-09-14T09:00:02+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/godhuma-rava-prasadam-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Godhuma Rava Prasadam (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/godhuma-rava-prasadam-1.jpg</image:loc><image:caption><![CDATA[ ముఖ్యంగా అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో పెట్టే ప్రసాదం రుచిని ఇంట్లోనే తేలికగా రీక్రియేట్ చేయవచ్చు. తెల్ల గోధుమ రవ్వ కంటే బ్రౌన్ కలర్‌లో ఉండే ఎర్ర గోధుమ రవ్వను నేతిలో దోరగా వేయించి బెల్లంతో వండితే ఆ కమ్మదనం ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తుంది. ఈ క్విక్ అండ్ టేస్టీ ప్రసాదం తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/godhuma-rava-prasadam-2.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు: 1 కప్పు ఎర్ర గోధుమ రవ్వ, తీపికి సరిపడా తురిమిన బెల్లం(సుమారు 1 నుండి ఒకటింపావు కప్పు), 1 నుండి ఒకటింపావు కప్పల నీళ్లు, పావు కప్పు నెయ్యి, 10-12 జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ కిస్‌మిస్, అర టీస్పూన్ యాలకుల పొడి, టెంపుల్ ఫ్లేవర్ కోసం చిటికెడు పచ్చకర్పూరం ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/godhuma-rava-prasadam-3.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానం: స్టవ్ వెలిగించి బాండీలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగించాలి. అందులో జీడిపప్పు పలుకులు, కిస్‌మిస్ వేసి దోరగా బంగారు రంగు వచ్చేవరకు వేయించి ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే నేతిలో ఒక కప్పు ఎర్ర గోధుమ రవ్వను వేసి చిన్న మంటపై 3-4 నిమిషాల పాటు కమ్మటి సువాసన వచ్చే వరకు ఓపికగా వేయించాలి. రవ్వ నేతిలో ఎంత చక్కగా వేగితే ప్రసాదానికి అంత అద్భుతమైన టేస్ట్ వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/godhuma-rava-prasadam-4.jpg</image:loc><image:caption><![CDATA[ రవ్వ వేగిన తర్వాత అందులో 3 కప్పుల వేడి నీళ్లను కొద్దికొద్దిగా పోస్తూ కలపాలి. ఉండలు కట్టకుండా చూసుకుంటూ మూతపెట్టి మీడియం మంటపై రవ్వ మెత్తగా అయ్యే వరకు 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. రవ్వ పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే తీపి పదార్థాన్ని కలపాలి.  రవ్వ మెత్తబడిన తర్వాత తురిమిన బెల్లం వేసి బాగా కలపాలి. బెల్లం కరుగుతున్న కొద్దీ మిశ్రమం కాస్త పలుచబడుతుంది. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి బెల్లం రవ్వలో కలిసిపోయి దగ్గరపడే వరకు కలుపుతూ ఉడికించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/godhuma-rava-prasadam-5.jpg</image:loc><image:caption><![CDATA[ మిశ్రమం చిక్కబడుతున్నప్పుడు మిగిలిన నెయ్యి, యాలకుల పొడి, చిటికెడు పచ్చకర్పూరం మరియు వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్‌మిస్‌లను వేసి బాగా కలపాలి. హల్వా బాండీ అంచులను వదిలి నెయ్యి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే అన్నవరం స్టైల్ కమ్మని గోధుమ రవ్వ ప్రసాదం సిద్ధం! దేవుడికి నైవేద్యంగా సమర్పించడానికి ఇది పరిపూర్ణమైన తీపి వంటకం. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/bank-holiday-alert-banks-closed-today-in-several-states-check-full-details-1910945.html</loc><lastmod>2026-09-14T08:32:27+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/bank-holidays-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Bank Holidays ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/bank-holiday-1.jpg</image:loc><image:caption><![CDATA[ బ్యాంక్ ఖాతాదారులు బ్యాంక్ సెలవుల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల మీ బ్యాంక్ లావాదేవీలను ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు. రోజువారీ నగదు అవసరాల కోసం బ్యాంకులతో ప్రతీఒక్కరికీ అవసరం ఉంటుంది. దీంతో బ్యాంక్ సెలవులు ఎప్పుడెప్పుడు ఉంటాయనేది తెలసుకోవడం ముఖ్యం. ఆర్బీఐ సెలవుల క్యాలెండర్ ప్రకారం బ్యాంకులు బంద్ అవుతాయి. జాతీయ, గెజిటెడ్ సెలవులు, రెండో శనివారం, ఆదివారంతో పాటు రాష్ట్రాల అధికారిక సెలవులు, పండుగల రోజున కూడా ఆర్బీఐ ప్రాంతాలను బట్టి సెలవులు ప్రకటిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/bank-holiday-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఆర్బీఐ బ్యాంకు సెలవుల జాబితాను జనవరిలో విడుదల చేస్తుంది. 2026 సంవత్సరానికి సంబంధించిన సెలవుల క్యాలెండర్ ప్రకారం బ్యాంకులు మూతపడతాయి. అందులో భాగంగా సెప్టెంబర్ 14వ తేదీన సోమవారం వినాయక చవితి పండుగ రావడంతో కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. ఏపీ, తెలంగాణ, బేలాపూర్, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, ముంబై, నాగ్‌పూర్, పనాజీలలో ఇవాళ బ్యాంకులు మూతపడనున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/bank-holiday-3.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రభుత్వ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు కూడా ఇవాళ బంద్ అవుతాయి. దీంతో ఖాతాదారులు దీనిని ముందే గమనించి చర్యలు తీసుకోవాలి. బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించాలనుకుంటే ముందుగానే సిబ్బందిని అడిగి సమాచారం తెలుసుకోండి. సెప్టెంబర్ 12 (రెండవ శనివారం), సెప్టెంబర్ 13 (ఆదివారం) రోజున బ్యాంకులు మూతపడగా.. సెప్టెంబర్ 11 శుక్రవారం బ్యాంక్ ఉద్యోగుల సమ్మెతో సేవలు ప్రభావితమయ్యాయి ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/bank-holiday-4.jpg</image:loc><image:caption><![CDATA[ సోమవారం కూడా బ్యాంకులు క్లోజ్ కానుండటంతో.. మొత్తం వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడినట్లు అయింది. తిరిగి మంగళవారం బ్యాంకులు ఓపెన్ కానున్నాయి. సెప్టెంబర్‌లో వారాంతపు సెలవులతో సహా ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు 14 రోజుల పాటు మూసివేయబడతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/bank-holiday-5.jpg</image:loc><image:caption><![CDATA[ బ్యాంకు సెలవు దినాల్లో దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. వినియోగదారులు ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. యూపీఐ, నెఫ్ట్, ఆర్టీజీఎస్ వంటి విధానాల్లో ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు. ఇక ఏటీఎంల ద్వారా కూడా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/job-change-astrology-6-zodiac-signs-likely-to-get-new-offers-and-career-opportunities-by-october-15-1910808.html</loc><lastmod>2026-09-13T22:24:27+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/job-astrology.jpg</image:loc>
					<image:title><![CDATA[ Job Astrology ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/2-vrushaba-rasi2.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో ఉద్యోగ స్థానాధిపతి శని సంచారం వల్ల ఉద్యోగంలో అందలాలు ఎక్కే అవ కాశం ఉంది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో కొద్ది కాలంగా కొనసాగుతున్న స్తబ్దత తొలగిపోయే సూచనలున్నాయి. జీతభత్యాలు పెరగడానికి, పదోన్నతులు లభించడానికి, కొత్త సవాళ్లను ఎదు ర్కోవడానికి అవకాశం ఉన్న ఉద్యోగంలోకి మారడం జరుగుతుంది. త్వరలో సవాళ్లతో కూడిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఒక సంస్థకు సర్వాధికారి అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/4-karkataka-rashi1-6.jpg</image:loc><image:caption><![CDATA[ కర్కాటకం: ఈ రాశిలోకి ఈ నెల 18న దశమాధిపతి కుజుడు ప్రవేశించబోతున్నందువల్ల ఉద్యోగంలో మార్పులు అనివార్యంగా కనిపిస్తున్నాయి. ఈ రాశిలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల విదేశీ ఉద్యోగాలకు బాగా అవకాశం ఉంది. ఉద్యోగంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం కంటే మెరుగైన ఉద్యోగంలోకి తప్పకుండా మారడం జరుగుతుంది. విదేశీ అవకాశాలు లభించడంతో పాటు ఉద్యోగరీత్యా విదేశీ పర్యటనలకు బాగా అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/6-kanya-rashi1-6.jpg</image:loc><image:caption><![CDATA[ కన్య: ఈ రాశికి ప్రస్తుతం దశమాధిపతి బుధుడు ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల అతి త్వరలో ఉద్యోగం మార డానికి, ఉద్యోగంలో మరింత పురోగతి చెందడానికి అవకాశం ఉంది. గురు, శుక్రులు కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల జీతభత్యాలు అంచనాలను మించి పెరగడానికి, పదోన్నతు లకు బాగా అవకాశం ఉంది. కొత్త ఉద్యోగంలో పదోన్నతితో పాటు శీఘ్ర పురోగతికి కూడా అవకాశం ఉంటుంది. అక్టోబర్ మొదటి వారంలో మరోసారి ఉద్యోగంలో మరింత ఉన్నత పదవి లభిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/7-tula-rashi2.jpg</image:loc><image:caption><![CDATA[ తుల: ఈ రాశికి దశమ స్థానం శుభ గ్రహాలతో ఉండడంతో పాటు, రాశ్యధిపతి శుక్రుడు కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో తప్పకుండా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో ఉన్నత పదవి చేపట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో స్థాన చలనానికి, ఒక విభాగానికి అధిపతి కావడానికి బాగా అవకాశం ఉంది. విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉద్యోగ రీత్యా తరచూ విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/8-vrushchika-rashi1-4.jpg</image:loc><image:caption><![CDATA[ వృశ్చికం: రాశినాథుడు కుజుడు భాగ్యస్థానంలో గురువుతో కలిసి ఉండడం, లాభ స్థానంలో బుదుడు ఉచ్ఛ స్థితిలో ఉండడం వంటి కారణాల వల్ల ఈ రాశివారి ఉద్యోగ జీవితం, వృత్తి, వ్యాపారాలు బాగా ఉచ్ఛ స్థితిలో ఉండే అవకాశం ఉంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుం టాయి. ఉద్యోగరీత్యా విదేశాలకు, దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. వీరికి త్వరలో మరింత మంచి ఉద్యోగం లభిస్తుంది. ఈ నెల చివరి లోగా ఒక సంస్థలో ఉన్నతాధికారి అవుతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/10-makara-rashi1-7.jpg</image:loc><image:caption><![CDATA[ మకరం: ఈ రాశికి సప్తమంలో ఉచ్ఛ స్థితిలో గురువు, భాగ్య స్థానంలో ఉచ్ఛ స్థితిలో బుధుడు, దశమంలో స్వస్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఈ నెల 15 నుంచి ఈ రాశివారికి ఉద్యోగంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభించడంతో పాటు జీతభత్యాలు బాగా వృద్ధి చెందుతాయి. విదేశీ సంస్థల నుంచి కూడా ఆఫర్లు, ఆహ్వానాలు అందు తాయి. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కూడా బిజీగాసాగుతాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/ghee-in-warm-water-every-morning-know-the-potential-health-benefits-1910777.html</loc><lastmod>2026-09-13T22:21:59+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/health-benefits-of-ghee.jpg</image:loc>
					<image:title><![CDATA[ Health Benefits Of Ghee ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ghee-in-warm-water.jpg</image:loc><image:caption><![CDATA[ నెయ్యి కేవలం రుచికే కాదు, పోషకాల గని. ఇందులో విటమిన్లు A, D, E, K లతో పాటు శరీరానికి ఎంతో మేలు చేసే ఫాస్పరస్, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ వంటి మూలకాలు పుష్కలంగా ఉంటాయి.
నిత్యం కడుపు ఉబ్బరం లేదా జీర్ణ రుగ్మతలతో బాధపడేవారికి ఈ పానీయం సరైన పరిష్కారం. ఇది ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, ఆహారం సులభంగా అరిగేలా చేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ghee-benefits.jpg</image:loc><image:caption><![CDATA[ గోరువెచ్చని నీటితో నెయ్యి కలవడం వల్ల పేగులలోని వ్యర్థాలు సులభంగా బయటకు పోతాయి. పదేపదే వేధించే అసిడిటీ, మలబద్ధకం సమస్యల నుంచి ఇది తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. వయసు పైబడటం వల్ల లేదా శీతాకాలంలో వచ్చే కీళ్ల నొప్పులు, జాయింట్ స్టిఫ్ నెస్ ను తగ్గించడంలో నెయ్యి నీరు సహాయపడుతుంది. ఇది కీళ్లను అంతర్గతంగా బలోపేతం చేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ghee-nutrition.jpg</image:loc><image:caption><![CDATA[ శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లను ఈ పానీయం బయటకు పంపుతుంది. దీనివల్ల ముఖంపై ఉండే మచ్చలు, మరకలు తొలగిపోయి చర్మం సహజమైన మెరుపును సంతరించుకుంటుంది. నెయ్యి తాగి నీరు తాగడం వల్ల కడుపు ఎక్కువ సమయం నిండినట్లు అనిపిస్తుంది. దీనివల్ల అనవసరమైన ఆకలి, అతిగా తినే అలవాటు తగ్గి సులభంగా బరువు తగ్గొచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/health-benefits-of-ghee-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ పానీయం జీర్ణవ్యవస్థను శుభ్రపరిచి, అసిడిటీ మరియు మలబద్ధకం సమస్యల నుండి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. కీళ్ల నొప్పులను తగ్గించడంలో, శరీరంలోని టాక్సిన్లను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా, ఆకలిని నియంత్రించి బరువు తగ్గడానికి కూడా దోహదపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/weight-management.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రతిరోజూ ఉదయం పరగడుపున గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ నెయ్యి కలిపి తాగడం వల్ల శరీరానికి ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని సెలబ్రిటీ న్యూట్రిషనిస్టులు పేర్కొంటున్నారు. ప్రతిరోజూ ఉదయం ఈ చిన్న అలవాటును మీ దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారా ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజంగా ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/karivepaku-pulusu-curry-recipe-healthy-curry-leaves-gravy-for-eyes-hair-and-blood-purification-in-telugu-1910795.html</loc><lastmod>2026-09-13T22:02:42+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/karivepaku-pulusu-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Karivepaku Pulusu (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/karivepaku-pulusu-1.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు: 2 కప్పుల కరివేపాకు, సరిపడినంత నూనె, అర స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి, గుప్పెడు - తొక్కలు వలిచినవి వెల్లుల్లి రెబ్బలు
2 నుండి 3 - చీలికలు పచ్చిమిర్చి, 4 సన్నగా తరిగిన ఉల్లిపాయలు, చిటికెడు పసుపు, 2 స్పూన్ల కారం పొడి, చేదును బ్యాలెన్స్ చేయడానికి బెల్లం, నిమ్మకాయ సైజు చింతపండు, రుచికి సరిపడా ఉప్పు మరియు సరిపడా నీళ్లు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/karivepaku-pulusu-2.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానం: స్టవ్ వెలిగించి బాండీ లేదా మట్టి పాత్రలో 2-3 స్పూన్ల నూనె వేడిచేయాలి. అందులో తడిలేని 2 కప్పుల కరివేపాకు వేసి మీడియం మంటపై ఆకులు బాగా క్రిస్పీగా మారే వరకు వేయించాలి. వేగిన కరివేపాకును నూనె రాకుండా గిన్నెలోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత మిక్సీ జార్‌లో లేదా రోట్లో వేసి చాలా మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/karivepaku-pulusu-3.jpg</image:loc><image:caption><![CDATA[ మిగిలిన నూనెలో సరిపడా నూనె చేర్చి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. అందులోనే గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు వేసి దోరగా వేపాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసి మూతపెట్టి ఉల్లిపాయలు మెత్తగా, ఎర్రగా మగ్గే వరకు మధ్యమధ్యలో కలుపుతూ వేయించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/karivepaku-pulusu-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఉల్లిపాయలు మగ్గాక పసుపు, కారం పొడి, గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్ మరియు చిన్న బెల్లం ముక్క వేసి కలపాలి. కరివేపాకులోని వగరు, ఘాటును బ్యాలెన్స్ చేసి కూరకు అద్భుతమైన రుచిని ఇవ్వడానికి బెల్లం చాలా అవసరం. ఇందులో అరకప్పు నీళ్లు పోసి మూతపెట్టి చిన్న మంటపై 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/karivepaku-pulusu-5.jpg</image:loc><image:caption><![CDATA[ కూర మెత్తగా మగ్గిన తర్వాత చింతపండు రసం, గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి ఉప్పు, కారాలు సరిచూసుకోవాలి. మూతపెట్టి చిన్న మంటపై నూనె పైకి తేలేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. మట్టి పాత్రలో వండితే ఈ కూర రుచి రెట్టింపవుతుంది. ఈ కరివేపాకు పులుసు కూరలో వెల్లుల్లిపాయలు నోట్లో వెన్నలా కరిగిపోతూ అమృతంలా ఉంటాయి. వేడివేడి అన్నం, జొన్న రొట్టెల్లోకి ఇది బెస్ట్ కాంబినేషన్! ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/biyyam-rava-undrallu-recipe-secret-tips-for-soft-and-crack-free-vinayaka-chavithi-kudumulu-1910766.html</loc><lastmod>2026-09-13T21:36:20+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/biyyam-rava-undrallu-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Biyyam Rava Undrallu (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/biyyam-rava-undrallu-1.jpg</image:loc><image:caption><![CDATA[ సూపర్ మార్కెట్లో లభించే బియ్యం రవ్వను  నేరుగా వాడకుండా.. మిక్సీ జార్‌లో వేసి కాసేపు పల్స్ మోడ్ లో ఒక్కసారి గ్రైండ్ చేయాలి. ఇలా చేయడం వల్ల రవ్వ కాస్త ఫైన్‌గా మారడంతో పాటు అందులోనే కాస్తంత పిండి కూడా తయారవుతుంది. ఈ పిండి రవ్వకు సరైన బైండింగ్‌ను ఇచ్చి, ఉండ్రాళ్లు చుట్టేటప్పుడు ఏమాత్రం విరిగిపోకుండా, పగుళ్లు లేకుండా నునుపుగా వచ్చేలా చేస్తుంది. ఇంట్లో బియ్యంతో చేసుకోవాలనుకుంటే బియ్యాన్ని కడిగి, ఆరబెట్టి మిక్సీలో రవ్వలా పట్టుకుని పిండిని జల్లించకుండా అలాగే వాడాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/biyyam-rava-undrallu-2.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు: 2 కప్పుల బియ్యం రవ్వ, అరగంట నానబెట్టిన  పావు కప్పు పచ్చిశనగపప్పు, ఒక కప్పు రవ్వకు 3 కప్పుల చొప్పున నీళ్లు, 1 టీస్పూన్ జీలకర్ర, పావు టీస్పూన్ ఇంగువ, 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము, 1 నుండి 2 టీస్పూన్ల నెయ్యి, రుచికి సరిపడా ఉప్పు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/biyyam-rava-undrallu-3.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానం: స్టవ్ వెలిగించి కడాయిలో 2 కప్పుల బియ్యం రవ్వను వేసి రంగు మారకుండా కేవలం వెచ్చబడే వరకు 2 నిమిషాలు వేయించి ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే కడాయిలో 6 కప్పుల నీళ్లు పోసి, రుచికి సరిపడా ఉప్పు వేసి మూతపెట్టి ఎసరును మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు నానబెట్టిన శనగపప్పును నీరు తీసేసి వేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/biyyam-rava-undrallu-4.jpg</image:loc><image:caption><![CDATA[ మూతపెట్టి మీడియం మంటపై 5 నిమిషాలు పప్పు పలుకుగా ఉడికే వరకు ఉంచాలి. ఆ తర్వాత జీలకర్ర, ఇంగువ, పచ్చి కొబ్బరి తురుము వేసి కలపాలి. ఇప్పుడు మంటను తగ్గించి, వేయించి పెట్టుకున్న రవ్వను కొద్దికొద్దిగా పోస్తూ ఉండలు కట్టకుండా గరిటెతో బాగా కలపాలి. ఇందులోనే 2 టీస్పూన్ల నెయ్యి వేసి మూతపెట్టి చిన్న మంటపై నీరంతా పూర్తిగా ఇగిరిపోయే వరకు మగ్గించి స్టవ్ ఆఫ్ చేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/biyyam-rava-undrallu-5.jpg</image:loc><image:caption><![CDATA[ రవ్వ మిశ్రమం కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చేతిని చల్లటి నీళ్లలో ముంచుతూ నిమ్మకాయ సైజులో నునుపైన రౌండ్ ఉండ్రాళ్లుగా చుట్టుకోవాలి. ఇడ్లీ పాత్ర లేదా స్టీమర్ ప్లేట్‌కు కొద్దిగా నెయ్యి రాసి, తయారు చేసుకున్న ఉండ్రాళ్లను అమర్చాలి. ఆవిరి వస్తున్న స్టీమర్‌లో ఈ ప్లేట్ ఉంచి మూతపెట్టి మీడియం మంటపై సరిగ్గా 10 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి.అంతే, పైన మృదువుగా, లోపల పంటికి తగిలే శనగపప్పు క్రంచీనెస్‌తో ఎంతో కమ్మనైన బియ్యం రవ్వ ఉండ్రాళ్లు సిద్ధం! వినాయకుడికి నైవేద్యంగా సమర్పించడానికి ఇది పరిపూర్ణమైన ప్రసాదం. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/know-this-33-episodes-serie-aashram-now-trending-in-ott-1910756.html</loc><lastmod>2026-09-13T21:32:49+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/aashram.jpg</image:loc>
					<image:title><![CDATA[ Aashram ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/aashram-series-tleugu.jpg</image:loc><image:caption><![CDATA[ ఓటీటీ వేదికలపై సరికొత్త కథలతో ఎన్నో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లు వస్తుంటాయి. అయితే అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేస్తాయి. అలాంటి సిరీస్‌లలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటించిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఆశ్రమ్’ ఒకటి. గత ఆరేళ్లుగా ఈ సిరీస్ ఓటీటీ ప్రియులను విశేషంగా అలరిస్తోంది. ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్ 4వ సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/aashram-telugu.jpg</image:loc><image:caption><![CDATA[ ఒకప్పుడు బాలీవుడ్‌లో లవర్ బాయ్‌గా, యాక్షన్ హీరోగా గుర్తింపు పొందిన బాబీ డియోల్ కెరీర్ కొన్నాళ్లపాటు ఒడుదొడుకులకు గురైంది. అయితే &#039;ఆశ్రమ్&#039; సిరీస్ ఆయన సెకండ్ ఇన్నింగ్స్‌ను పూర్తిగా మార్చివేసింది. ఇందులో ఆయన ప్రతి నాయకుడి ఛాయలున్న &#039;బాబా నిరాలా&#039; పాత్రలో జీవించారు. ఈ సిరీస్ విజయం ఆయనను డిజిటల్ స్పేస్‌లో ఒక సూపర్ స్టార్‌గా నిలబెట్టింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/aashram-new.jpg</image:loc><image:caption><![CDATA[ దిగ్గజ దర్శకుడు ప్రకాష్ ఝా తెరకెక్కించిన ఈ సిరీస్, ఒక స్వయం ప్రకటిత దొంగ బాబా చుట్టూ తిరుగుతుంది. ధర్మం, ఆధ్యాత్మికత ముసుగులో అధికారం, డబ్బు, రాజకీయం , నేర ప్రపంచాన్ని అతను ఎలా నడిపించాడనేది ప్రధాన కథాంశం. సమాజంలో జరిగే మూఢనమ్మకాలు, రాజకీయ-నేర సంబంధాలను దర్శకుడు ఎంతో నైపుణ్యంతో చిత్రీకరించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/aashram-series.jpg</image:loc><image:caption><![CDATA[ సీజన్ 1ఆగస్టు 2020లో విడుదలైంది. ఇందులో మొత్తం 9 ఎపిసోడ్లు ఉన్నాయి. సీజన్ 2 నవంబర్ 2020లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులోనూ మొత్తం 9 ఎపిసోడ్లు ఉన్నాయి. సీజన్ 3 రెండు భాగాలుగా ప్రసారమైంది. మూడవ సీజన్ &#039;పార్ట్ A&#039; 2022లో (10 ఎపిసోడ్లు) &#039;పార్ట్ B&#039; 2025లో (5 ఎపిసోడ్లు) స్ట్రీమింగ్ అయ్యాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/aashram-telugu-ott.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పటివరకు వచ్చిన మూడు సీజన్లలో కలిపి మొత్తం 33 ఎపిసోడ్లు పూర్తి అయ్యాయి. ఐఎమ్‌డీబీలో కూడా ఈ సిరీస్‌కు చాలా మంచి రేటింగ్ లభించింది. ప్రస్తుతం ఈ మూడు సీజన్లను ప్రేక్షకులు అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ వేదికగా ఉచితంగా చూడొచ్చు. మూడో సీజన్ చివరలో కథ ఎంతో ఆసక్తికరమైన మలుపు తిరిగింది. బాబా నిరాలా నకిలీ సామ్రాజ్యం కూలిపోతుందా లేదా అతడు మళ్లీ తన చాకచక్యంతో తప్పించుకుంటాడా అనే ఉత్కంఠ సీజన్ 4పై భారీ అంచనాలను పెంచేసింది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/crispy-karam-borugulu-recipe-spicy-murmura-mixture-or-masala-muri-in-telugu-1910744.html</loc><lastmod>2026-09-13T21:12:09+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/karam-borugulu-7.jpg</image:loc>
					<image:title><![CDATA[ Karam Borugulu (7) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/karam-borugulu-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ప్రతి ఇంట్లోనూ ఈ బొరుగుల పోపును ఎంతో ఇష్టంగా చేసుకుంటారు. ట్రావెలింగ్ వెళ్లేటప్పుడు లేదా పిల్లల స్నాక్స్ బాక్స్‌ల కోసం ఒకసారి చేసి పెట్టుకుంటే కనీసం నెల రోజుల పాటు కరకరలాడుతూ తాజాగా ఉంటాయి.  ఈ సింపుల్ అండ్ క్రిస్పీ కారం బొరుగుల తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/karam-borugulu-2.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు: ఒక పెద్ద గిన్నెడు మరమరాలు / బొరుగులు, 2 టేబుల్ స్పూన్ల నూనె,  పావు కప్పు వేరుశనగ గుళ్లు, పావు కప్పు పుట్నాల పప్పు, ఆవాలు,  అర టీస్పూన్ జీలకర్ర, 6 నుండి 8 - కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు,  2 ఎండుమిర్చి, రెండు రెమ్మల తాజా కరివేపాకు, అర టీస్పూన్ పసుపు, 1 టీస్పూ కారం పొడి, పావు టీస్పూన్ చాట్ మసాలా లేదా గరం మసాలా, మరియు రుచికి సరిపడా ఉప్పు . ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/karam-borugulu-3.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానం: ఒకవేళ మీరు తీసుకున్న బొరుగులు కొద్దిగా మెత్తబడి ఉంటే.. ముందుగా పొడి బాండీలో వేసి చిన్న మంటపై 2 నిమిషాలు వేయిస్తే తిరిగి సూపర్ క్రంచీగా మారతాయి. స్టవ్ వెలిగించి వెడల్పాటి బాండీ లేదా కడాయి పెట్టి రెండు స్పూన్ల నూనె వేడిచేయాలి. నూనె వేడెక్కగానే పల్లీలు వేసి లో ఫ్లేమ్‌లో దోరగా వేయించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/karam-borugulu-4.jpg</image:loc><image:caption><![CDATA[ పల్లీలు సగం వేగిన తర్వాత పుట్నాల పప్పు వేసి మరో నిమిషం వేపాలి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, తుంచిన ఎండుమిర్చి, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు మరియు తాజా కరివేపాకు వేసి వేయించాలి. వెల్లుల్లి, కరివేపాకు మంచి సువాసన వచ్చే వరకు వేగనివ్వాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/karam-borugulu-5.jpg</image:loc><image:caption><![CDATA[ మంటను పూర్తిగా లో ఫ్లేమ్‌లో ఉంచి పసుపు, కారం పొడి, కొద్దిగా సాల్ట్ మరియు కాస్త చాట్ మసాలా లేదా గరం మసాలా వేసి నూనెలో త్వరగా కలపాలి. మసాలాలు మాడిపోకుండా వెంటనే జాగ్రత్తపడాలి. తాలింపు సిద్ధమైన వెంటనే బొరుగులను బాండీలో వేసి గరిటెతో కింద నుంచి పైకి అంతా సమంగా కలిసేలా బాగా కలపాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/karam-borugulu-6.jpg</image:loc><image:caption><![CDATA[ లో ఫ్లేమ్‌పై 2-3 నిమిషాలు కలుపుతూ వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ కారం బొరుగులు పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో భద్రపరిస్తే నెల రోజుల పాటు కరకరలాడుతూ ఎంతో తాజాగా ఉంటాయి. ఈ కారం బొరుగుల్లో సన్నటి ఉల్లిపాయ తరుగు, కొత్తిమీర, నిమ్మరసం పిండుకుని తింటే రోడ్డు పక్కన బండి మీద దొరికే &#039;ముంత మసాలా&#039; టేస్ట్ ఇంట్లోనే అదిరిపోతుంది! ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/andhra-kandi-podi-recipe-best-protein-gunpowder-for-idli-dosa-and-hot-rice-1910719.html</loc><lastmod>2026-09-13T20:59:27+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/kandi-podi-6-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Kandi Podi (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/kandi-podi-1.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు: 1/2 కప్పు కందిపప్పు, 1/2 కప్పు పచ్చిశనగపప్పు, 1/2 కప్పు పెసరపప్పు, 1/4 కప్పు మినప్పప్పు, 50 గ్రాములు  ఎండుమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల శొంఠి పొడి, పావు టీస్పూన్ ఇంగువ, రుచికి సరిపడా రాళ్ల ఉప్పు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/kandi-podi-2.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానం: బాండీని స్టవ్ మీద పెట్టి ఒక్క చుక్క కూడా నూనె వేయకుండా డ్రై రోస్ట్ చేయాలి. ఒక్కో పప్పు వేగడానికి ఒక్కో సమయం పడుతుంది కాబట్టి అన్నింటినీ ఒకేసారి కాకుండా విడివిడిగా వేయించుకోవాలి.  కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, మినప్పప్పులను వరుసగా లో ఫ్లేమ్‌లో మంచి సువాసన వచ్చి, దోరగా బంగారు రంగు మారే వరకు ఓపికగా వేయించి ప్లేట్‌లోకి తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/kandi-podi-3.jpg</image:loc><image:caption><![CDATA[ లోపలి వరకు వేగితేనే పచ్చివాసన పోయి పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అదే పాన్‌లో ఎండుమిరపకాయలను వేసి మంట తగ్గించి వేయించాలి ముఖ్యంగా మాడకుండా చూసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర, ఇంగువ వేసి పాన్ వేడికే ఒక్క నిమిషం వేపి స్టవ్ కట్టేయాలి. వేయించిన పప్పులు, దినుసులు పూర్తిగా గది ఉష్ణోగ్రతకు చల్లారే వరకు వేచి ఉండాలి. వేడి మీద మిక్సీ పడితే ఆవిరికి పొడి ముద్దవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/kandi-podi-4.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా మిక్సీ జార్‌లో వేయించిన ఎండుమిర్చి, జీలకర్ర, శొంఠి, ఉప్పు వేసి బరకగా తిప్పాలి. ఆ తర్వాత చల్లారిన పప్పులన్నీ వేసి కాస్త రవ్వలా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తటి పౌడర్‌లా కాకుండా కొద్దిగా బరకగా ఉంటేనే అన్నంలో కలుపుకున్నప్పుడు పంటి కింద పప్పులు క్రంచీగా తగులుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/kandi-podi-5.jpg</image:loc><image:caption><![CDATA[ పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడని గాజు సీసాలో భద్రపరిస్తే 2-3 నెలల పాటు తాజాగా ఉంటుంది. వేడివేడి నెయ్యి అన్నంలోకి మాత్రమే కాకుండా.. వేడి ఇడ్లీలు, నెయ్యి కారం దోశలపై ఈ పొడి చల్లుకుంటే ఆ రుచి నెక్స్ట్ లెవెల్! ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/andhra-pradesh-and-telangana-rain-alert-heavy-rains-thunderstorms-and-gusty-winds-likely-on-september-14-monday-1910666.html</loc><lastmod>2026-09-13T20:14:52+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/weather-alert-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Weather Alert ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rain-alert.jpg</image:loc><image:caption><![CDATA[ అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. ఈ తరుణంలో సోమవారం వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. సోమవారం కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మధ్యప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర విదర్భ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది రాబోయే 24 గంటల్లో రాజస్థాన్ , గుజరాత్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందన్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ap-rain.jpg</image:loc><image:caption><![CDATA[ దీని ప్రభావంతో సోమవారం (14-09-2026) మన్యం,  అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు,మార్కాపురం, నంద్యాల, కడప, అన్నమయ్య,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు.ప్రజలు చెట్ల క్రింద, హోర్డింగ్స్ వద్ద నిలబడరాదన్నారు. అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/telangana-rains.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక తెలంగాణలోనూ పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఈ తరుణంలో వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం, వరంగల్‌, ఆదిలాబాద్‌, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ap-rain-alert-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఆదవారం ఏపీలోని ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ప్రధానంగా.. అల్లూరి జిల్లా కించూరులో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో వాగువంకలు పొంగిపొర్లుతున్నాయి. మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. GK వీధి మండలం ఐస్ గెడ్డ జలపాతం ఉధృతంగా ప్రవహిస్తూ కనువిందు చేస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rain-alert1.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రకాశం జిల్లా అద్దంకిలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. పెనుగాలుల ధాటికి చెట్లు విరిగిపడ్డాయి. కరెంటు స్తంభాలు నేలకొరగడంతో సరఫరాకు అంతరాయం కలిగింది. NTR జిల్లా వ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో విజయవాడ- హైదరాబాద్‌ హైవేలో భారీవృక్షం నేలకూలింది. ఇక.. కోస్తా, రాయలసీమకు వాతావరణ శాఖ మూడు రోజుల వర్షసూచన చేసింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rain-alert3.jpg</image:loc><image:caption><![CDATA[ తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాను భారీవర్షాలు ముంచెత్తాయి. మంచిర్యాల జిల్లాలోని పలు మండలాల్లోనూ వాగులువంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కన్నెపల్లిలో రికార్డ్‌ స్థాయి వర్షపాతం నమోదైంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు మండలాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది. అశ్వాపురం, బూర్గంపాడు, కరకగూడెం మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. వర్షాల ధాటికి మణుగూరు బొగ్గుగని బురదతో నిండడంతో ఉత్పత్తి ఆగిపోయింది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/jabardasth-actress-rohini-enjoying-vacation-with-her-family-in-london-see-photos-1910618.html</loc><lastmod>2026-09-13T18:45:26+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/jabardasth-rohini.jpg</image:loc>
					<image:title><![CDATA[ Jabardasth Rohini ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/jabardasth-rohini.jpg</image:loc><image:caption><![CDATA[ జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రోహిణి కూడా ఒకరు. తనదైన డిఫరెంట్ స్లాంగ్ , అద్భుతమైన కామెడీ టైమింగ్ తో అందరినీ కడుపుబ్బా నవ్వించే రోహిణి ఇప్పుడు బుల్లితెరపై స్టార్ కమెడియన్ గా వెలుగొందుతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/jabardasth-rohini-1.jpg</image:loc><image:caption><![CDATA[ &#039;కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సీరియల్ తో మొదలైన రోహిణి ప్రయాణం.. జబర్దస్త్ కామెడీ షోతో మరింత ఊపందుకుంది. దీంతో పాటు శ్రీదేవీ డ్రామా కంపెనీ తదితర టీవీ షోలతోనూ బుల్లితెర ఆడియెన్స్ కు బాగ దగ్గరైపోయిందీ స్టార్ కమెడియన్ ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/jabardasth-rohini-2.jpg</image:loc><image:caption><![CDATA[ వలం టీవీ షోలతోనే కాదు సినిమాలు, వెబ్ సిరీసులతోనూ మెప్పిస్తోంది రోహిణి. ముఖ్యంగా సేవ్ ది టైగర్స్ మూడు సీజన్లలోనూఈ జబర్దస్త్ నటి కీలక పాత్రలు పోషించింది. తనదైన కామెడీతో ఓటీటీ ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/jabardasth-rohini-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇదిలా ఉంటే ప్రస్తుతం చేతి నిండా టీవీ షోస్, సినిమాలతో బిజీగా ఉంటోన్న రోహిణీ తాజాగా లండన్ వెకేషన్ కు వెళ్లిపోయింది. తన తల్లి, అక్కతో కలిసి అక్కడి పర్యాటక ప్రదేశాలన్నింటినీ చుట్టేస్తోంది. అంతేకాదు తన టూర్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/jabardasth-rohini-4.jpg</image:loc><image:caption><![CDATA[ కాగా సినిమాలు, టీవీ షోస్ సంగతి తప్పితే రోహిణి ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు. అయితే ఇప్పుడు షేర్ చేసిన ఫొటోల్లో రోహిణి తల్లితో పాటు ఆమె అక్క కూడా కనిపించింది. దీంతో ఈ  ఫొటోలను చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/jabardasth-rohini-5.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుతం బుల్లితెరపై జగద్దాత్రి అనే సీరియల్ లో కీలక పాత్ర పోషిస్తోంది రోహిణ. అలాగే మరొకవైపు వరుస టీవీ షోలతో పాటు సినిమాలలో కూడా సత్తా చాటుతోంది.  ప్రస్తుతం రోహిణి ఏకంగా 4 చిత్రాలకు ఈమె సైన్ చేసినట్లు తెలుస్తోంది ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/crispy-masala-vada-frying-tips-keep-vadas-golden-crunchy-and-perfectly-cooked-1910540.html</loc><lastmod>2026-09-13T16:47:33+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/masala-vadalu.jpg</image:loc>
					<image:title><![CDATA[ Masala Vadalu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/masala-vadalu-1.jpg</image:loc><image:caption><![CDATA[ సాయంత్రం వేళ వేడి వేడిగా, కరకరలాడే మసాలా వడలు రుచి చూడాలంటే నేరుగా వీధి బండి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే, స్ట్రీట్ స్టైల్ రుచితో మసాలా వడలను సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీలో కొన్ని ముఖ్యమైన చిట్కాలు పాటిస్తే, వడలు చల్లారినా కూడా తమ క్రిస్పీనెస్‌ను కోల్పోవు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/masala-vadalu-2.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా, పచ్చిశనగపప్పును రెండు లేదా మూడు గంటల పాటు నానబెట్టాలి. ఎక్కువసేపు నానబెడితే వడలు మెత్తగా మారే అవకాశం ఉంది. నానిన పప్పును నీళ్లు లేకుండా వడకట్టి, అందులోంచి కొద్దిగా పప్పును పక్కన పెట్టి, మిగిలిన పప్పును నీళ్లు కలపకుండా  రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, బియ్యం పిండి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/masala-vadalu-3.jpg</image:loc><image:caption><![CDATA[ నానిన పప్పులోంచి నీళ్లు పూర్తిగా తీసేసి, ఒక గుప్పెడు నానిన పచ్చిశనగపప్పును పక్కన పెట్టుకోవాలి. మిగిలిన పప్పును మిక్సీ జార్‌లో వేసి, నీళ్లు అస్సలు కలపకుండా  రుబ్బుకోవాలి. పప్పును మెత్తగా రుబ్బకూడదు, అక్కడక్కడా పప్పు గింజలు మిగిలి ఉన్నా పరవాలేదు. మెత్తగా రుబ్బితే వడలు క్రిస్పీగా రావు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/masala-vadalu-4.jpg</image:loc><image:caption><![CDATA[ రుబ్బుకున్న పప్పును ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని, పక్కన పెట్టుకున్న గుప్పెడు పచ్చిశనగపప్పును అందులో కలపాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి తరుగు, అల్లం తురుము, ధనియాలు, జీలకర్ర, తరిగిన కరివేపాకు, పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు, బియ్యం పిండి, రుచికి సరిపడా ఉప్పు వేసి అన్నిటినీ బాగా కలపాలి. నీళ్లు అస్సలు కలపకుండా ఉల్లిపాయలు, ఆకుకూరల్లోని తేమతోనే పిండిని గట్టిగా కలుపుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/masala-vadalu-5.jpg</image:loc><image:caption><![CDATA[ డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను కడాయిలో వేసి మీడియం మంటపై వేడి చేయాలి. నూనె ఎక్కువ వేడిగా ఉండకూడదు, అలాగని తక్కువ వేడిగానూ ఉండకూడదు. మధ్యస్థమైన వేడిలో ఉండాలి. నూనె వేడైన తర్వాత, పిండిని చిన్న చిన్న వడలుగా ఒత్తుకుని, మీడియం మందంతో, మరీ పల్చగా  కాకుండా వేడి నూనెలో వేయాలి. ఒకేసారి కడాయి నిండా కాకుండా, నూనెకు సరిపడా వడలను వేయాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, వడలు బంగారు రంగులోకి మారి, నురుగు తగ్గి, కరకరలాడేంత వరకు వేయించాలి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/do-you-know-this-rising-tollywood-actress-who-completed-her-mbbs-in-china-she-is-actress-kamakshi-bhaskarla-1910485.html</loc><lastmod>2026-09-13T14:17:42+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/actress-13.jpg</image:loc>
					<image:title><![CDATA[ Actress ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/kamakshi.jpg</image:loc><image:caption><![CDATA[ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రతి హీరోయిన్‌కు స్టార్‌డమ్ రావడం అంత సులభం కాదు. కొంతమంది హీరోయిన్లు వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్లుగా ఎదిగితే.. మరికొందరు మాత్రం చిన్న చిన్న పాత్రలతోనే ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటారు. అలాంటి నటీమణుల్లో కామాక్షి భాస్కర్ల ఒకరు. వైద్య విద్యను అభ్యసించి డాక్టర్‌గా పనిచేసిన ఈమె.. ఆ తర్వాత నటనపై ఆసక్తితో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం విభిన్నమైన పాత్రలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/kamakshi-photo.jpg</image:loc><image:caption><![CDATA[  కామాక్షి భాస్కర్ల చైనాలో ఎంబీబీఎస్ చదివారు. అనంతరం హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌లో కొంతకాలం వైద్యురాలిగా పనిచేసినట్లు పలు కథనాలు పేర్కొంటున్నాయి. అయితే, సినిమాలపై ఉన్న ఆసక్తితో వైద్య వృత్తిని పక్కనపెట్టి నటన వైపు అడుగులు వేశారు. మోడల్‌గా కూడా తన కెరీర్‌ను ప్రారంభించిన ఆమె.. 2018లో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ టైటిల్‌ను గెలుచుకున్నారు. అదే ఏడాది మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనల్స్ వరకు చేరుకున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/kamakshi-photo-new.jpg</image:loc><image:caption><![CDATA[ కామాక్షి భాస్కర్ల సినీ ప్రయాణంలో తొలినాళ్లలో చిన్న చిన్న పాత్రలు పోషించారు. అయితే, 2021లో వచ్చిన ‘మా ఊరి పొలిమేర’ సినిమా ఆమె కెరీర్‌కు కీలక మలుపుగా నిలిచింది. ఈ చిత్రంలో లక్ష్మీ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గ్రామీణ నేపథ్యంలోని హారర్, థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా మంచి ఆదరణ పొందడంతో కామాక్షికి కూడా గుర్తింపు పెరిగింది. ఆ తర్వాత వచ్చిన మా ఊరి పొలిమేర 2లోనూ లక్ష్మీ పాత్రలో మెప్పించారు. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి. దీంతో హారర్, థ్రిల్లర్ కథలకు సరిపోయే నటిగా కామాక్షికి మంచి పేరు వచ్చింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/kamakshi-photos.jpg</image:loc><image:caption><![CDATA[  ‘మా ఊరి పొలిమేర’ సినిమాల తర్వాత కామాక్షి భాస్కర్లకు వరుసగా అవకాశాలు వచ్చాయి. ‘విరూపాక్ష’, ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’, ‘ఓం భీమ్ బుష్’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. అంతేకాకుండా ‘ఝాన్సీ’, ‘సైతాన్’, ‘దూత’ వంటి వెబ్ సిరీస్‌లలోనూ కీలక పాత్రలు పోషించారు. హారర్, థ్రిల్లర్ మాత్రమే కాకుండా కామెడీ, డ్రామా వంటి విభిన్న జానర్లలోనూ తన నటనా ప్రతిభను చూపిస్తున్నారు. కథకు, పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/kamakshi-pic.jpg</image:loc><image:caption><![CDATA[  కామాక్షి భాస్కర్ల నటించిన ‘షో టైమ్’ చిత్రం 2025లో విడుదలైంది. ఇందులో ఆమె శాంతి పాత్రలో కనిపించారు. అలాగే ‘12A రైల్వే కాలనీ’, ‘లైలా’ వంటి చిత్రాల్లోనూ నటించారు. 2026లో ‘మెన్షన్ హౌస్ మల్లేశ్’, ‘డాకోయిట్: ఎ లవ్ స్టోరీ’ వంటి సినిమాల్లో ఆమె భాగమయ్యారు.ఇక కామాక్షి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘పొలిమేర 3’ ఒకటి. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గత రెండు భాగాల్లో నటించిన కీలక తారాగణం తిరిగి కనిపించనుంది. హారర్, థ్రిల్లర్ నేపథ్యంలోని ఈ ఫ్రాంచైజీ మూడో భాగంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/kamakshi-pics.jpg</image:loc><image:caption><![CDATA[ డాక్టర్‌గా స్థిరపడే అవకాశం ఉన్నప్పటికీ తనకు ఇష్టమైన నటనా రంగాన్ని ఎంచుకున్న కామాక్షి భాస్కర్ల.. ఇప్పుడు టాలీవుడ్‌లో విభిన్నమైన పాత్రలు చేసే నటిగా ఎదుగుతున్నారు. గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్నారు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈమె ఫొటోలు తరచూ అభిమానులను ఆకట్టుకుంటుంటాయి. చిన్న పాత్రలతో ప్రారంభమైన ఈమె ప్రయాణం.. ఇప్పుడు వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో మరింత ఆసక్తికరంగా మారింది. రాబోయే రోజుల్లో కామాక్షి భాస్కర్ల మరిన్ని వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తారేమో చూడాలి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/flax-seeds-and-sunflower-seeds-for-eye-health-nutrients-that-may-support-better-vision-1910475.html</loc><lastmod>2026-09-13T14:06:19+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/avise-ginjalu-1-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Avise Ginjalu 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/avise-ginjalu-4.jpg</image:loc><image:caption><![CDATA[ అవిసె గింజల్లో ఇవి పుష్కలంగా ఉంటాయి. జింక్, లూటిన్, జియోగ్జాంతిన్ అనే మూడు పోషకాలు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా కంటి కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుండి కాపాడతాయి. గుమ్మడి గింజలు, జనపనార విత్తనాలు వీటిని అందిస్తాయి. విటమిన్ సి ,  విటమిన్ ఇ కంటి రెటీనాలోని కణజాలం, ముఖ్యంగా DNA డ్యామేజ్‌ను అరికట్టి, కణాల ఆరోగ్యానికి కీలక పాత్ర పోషిస్తాయి.  అవిసె గింజల్లో ఈ పోషకం పుష్కలంగా ఉంటుంది. ఈ గింజల పొడిని కూరల్లో, కారప్పొడిలో లేదా నేరుగా వేయించి తీసుకోవడం వల్ల ఒమేగా-3 సమృద్ధిగా లభిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sun-flower.jpg</image:loc><image:caption><![CDATA[ పొద్దుతిరుగుడు పప్పులో విటమిన్ ఇ, జామకాయ, ఉసిరికాయలో విటమిన్ సి అధికంగా ఉంటాయి. చివరగా, విటమిన్ ఏ రంగులను గుర్తించడానికి, రేచీకటి రాకుండా నివారించడానికి అవసరం. మునగాకు, కరివేపాకు, కొత్తిమీర వంటి ఆకుకూరల్లో ఇది అధికం. ఈ పోషకాలతో పాటు, కళ్లకు తగినంత విశ్రాంతి ఇవ్వడం అత్యవసరం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sun-flower-2.jpg</image:loc><image:caption><![CDATA[ రోజుకు ఏడు, ఎనిమిది గంటల నిద్ర లేదా ఇంటికి వచ్చాక లైట్లు తగ్గించి కళ్లకు ఒత్తిడి లేకుండా చూసుకోవడం వలన  కంటి కణాలు రీఛార్జ్ అవుతాయి. ఈ జాగ్రత్తలు పాటిస్తే కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కంటి రెటీనాలోని ఔటర్ సెగ్మెంట్ లో ఉండే ఫోటోరిసెప్టార్లను ఆరోగ్యంగా ఉంచడంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి కంటి కణజాలాన్ని రక్షించి, చూపును మెరుగుపరుస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/a-gummadi.jpg</image:loc><image:caption><![CDATA[ కంటి లోపల కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుండి కాపాడి, డ్యామేజ్ అవ్వకుండా నిరోధిస్తాయి. కంటిలో ఈ మూడు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం శాస్త్రీయంగా నిరూపితమైంది. గుమ్మడి గింజలు, జనపనార విత్తనాలు ఈ పోషకాలకు అద్భుతమైన వనరులు. వీటిని పొడి చేసుకుని ఆహారంలో భాగంగా చేసుకోవడం లేదా ఉండలుగా చేసి తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/a-gummadi-1.jpg</image:loc><image:caption><![CDATA[ కంటి రెటీనాలో ఉండే పది పొరలలోని కణాలలో DNA డ్యామేజ్‌ను అరికట్టడానికి, కణాల ఆరోగ్యాన్ని కాపాడటానికి విటమిన్ సి అత్యవసరం. DNA డ్యామేజ్ అయితే కణం డ్యామేజ్ అవుతుంది, అది చివరికి చూపుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. జామకాయ  ఎండిన ఉసిరికాయ ముక్కలు విటమిన్ సికి గొప్ప వనరులు. తాజా పండ్లు కూడా విటమిన్ సిని అందిస్తాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/why-you-should-never-store-onions-and-potatoes-together-tips-to-prevent-sprouting-and-rot-1910466.html</loc><lastmod>2026-09-13T14:05:54+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/why-you-should-never-store-onions-and-potatoes-together.jpg</image:loc>
					<image:title><![CDATA[ Why You Should Never Store Onions And Potatoes Together ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/onion-potato-storage-tips-2.jpg</image:loc><image:caption><![CDATA[ మార్కెట్‌ నుంచి తెచ్చిన వెంటనే కూరగాయలను ఒక ర్యాక్‌లో వేసేస్తుంటారు జనాలు. అయితే కొందరు వాటిని సపరేట్ చేసి నిల్వ చేస్తే.. మరి కొందరు మాత్రం అన్నింటిని ఇకే దగ్గర పెడుతుంటారు. ముఖ్యంగా ఉల్లిపాయలు, ఆలుగడ్డలను ఇలా స్టోర్ చేయడం అస్సలు మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల అవి త్వరగా పాడయ్యయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/onion-potato-storage-tips-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఉల్లిపాయలను విడిగా ఎందుకు ఉంచాలి?: ఉల్లిపాయలను ఎప్పుడూ విడిగా గాలితగిలేలా, చల్లగా ఉండే ప్రాంతాల్లో మాత్రమే పెట్టాలి. ఎందుకంటే ఉల్లిపాయల్లో తేమ ఎక్కువైతే అవి బూజు పట్టడం లేదా కుళ్ళిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. వీలైతే వీటి కోసం ప్రత్యేకంగా దొరికే జాలిలో నిల్వ చేయాలని సూచిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/onion-potato-storage-tips-1.jpg</image:loc><image:caption><![CDATA[ బంగాళాదుంపలతో కలిపి ఎందుకు పెట్టకూడదు?: నార్మల్‌గా బంగాళదుంపలను ఎక్కువ రోజులు స్టోర్ చేస్తే.. అవి మొలకెత్తి ప్రమాదం ఉంది.. ఈ సమయంలో అవి ఇథిలీన్ వంటి వృక్ష హార్మోన్ల రిలీజ్ చేస్తాయి. దీని వల్ల వాటి చుట్టూ ఉండే తేమ, గాలి పరిస్థితుల్లో మార్పులు వచ్చి అవి త్వరగా మొలకలెత్తడం లేదా కుళ్లిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ రెండింటి ఎప్పుడూ కలిపి ఉంచవద్దు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/onion-potato-storage-tips.jpg</image:loc><image:caption><![CDATA[ సేఫ్‌గా ఎలా నిల్వ చేయాలి: వీటిని పాడవుకుండా నిల్వ చేయాలి అంటే.. ఉల్లిపాయలు, బంగాళాదుంపలను వేర్వేరు బుట్టల్లో, చల్లని, పొడి, గాలి బాగా ఆడే ప్రాంతాల్లో మాత్రమే స్టోర్ చేయండి. అంతేకాదు ఇంట్లో నేరుగా ఎండ పడే ప్లేస్‌లో వీటిని పెట్టవద్దు. అలాగే మిగతా కూరగాయల్లా వీటిని ఫ్రిజ్‌లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/onion-potato-storage-tips-4.jpg</image:loc><image:caption><![CDATA[ అలాగే మీరు స్టోర్ చేసిన ఉంచిన బంగాళదుంపలు మెత్తబడినా, అవి మొలకెత్తినా జాగ్రత్తగా ఉండండి.. ఉల్లిపాయల్లో ఏదైనా తేమ చేరినా, మెత్తబడినా లేదా బూజు పట్టినా వాటిని వెంటనే వేరుచేయండి. ఇలాంటి వాటిని అలానే ఉంచడం వల్ల మిగతావి కూడా పాడయ్యే ఛాన్స్ ఉంది. అంతేకాదు.. నల్లగా మారినా లేదా బూజు వచ్చిన ఉల్లిపాయలు, మొలకలు వచ్చిన ఆడుగడ్డలను తినకపోవడమే మంచింది.. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/tapeshwaram-maha-laddu-making-how-giant-ganesh-chaturthi-laddus-are-prepared-for-ganesh-mandaps-1910435.html</loc><lastmod>2026-09-13T13:16:29+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/laddu-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Laddu 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/laddu.jpg</image:loc><image:caption><![CDATA[ వినాయక చవితి సందర్భంగా ప్రతిష్ఠించే మహాగణపతికి సమర్పించే మహా లడ్డూ ప్రసాదం తయారీ కార్యక్రమానికి తాపేశ్వరం గ్రామ ఆవరణలో ప్రత్యేకంగా 10 కేజీలు మొదలుకొని 100 కేజీల వరకు ఇక్కడ నుంచి రాష్ట్రం నలుమూలకు మహా గణనాథుడి లడ్డూలు వెళుతుంటాయి. వినాయక చవితి సందర్భంగా వినాయక లడ్డూలను ఎలా తయారు చేస్తారు మేకింగ్ ఎలా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/laddu-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఒక పది కేజీలు లడ్డు తయారు చేయాలంటే ఎంతమంది వంట మేస్త్రులు ఉండాలి. మండపాల్లో పెట్టే లడ్డు ప్రత్యేకత ఏంటి..ప్రతి ఏడాది ఆనవాయితీగా కొనసాగుతున్న సంప్రదాయంలో భాగంగా తాపేశ్వరం పరిసరాల్లో ఉన్న ఏ స్వీట్ షాపు చూసినా గణనాథుడు లడ్డూలతో కలకలాడుతుంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/laddu-2.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రతి గణనాథుని మండపాలకు తాపేశ్వరం నుండి పెద్ద ఎత్తున లడ్డూలు. టన్నులు కొద్ది వెళ్తుంటాయి ముఖ్యంగా   సురుచి సంస్థకు చెందిన మిఠాయి షాపు నుండి పెద్ద ఎత్తున తెలంగాణకు కూడా భారీ లడ్డులు తరలి వెళుతుంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/laddu-3.jpg</image:loc><image:caption><![CDATA[ భక్తిశ్రద్ధలతో మాలధారణ కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం మహాగణపతికి సమర్పించే మహా లడ్డూ ప్రసాదం తయారీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.  సురిచి అంటే తెలియని వారు ఎవరు ఉండరు గతంలో ఖైరతాబాద్ గణనాథుడికి  ఆరు టన్నుల భారీ లడ్డూను పంపించిన ఘనత ఈ స్వీట్ షాప్ ది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/laddu-4.jpg</image:loc><image:caption><![CDATA[ మరి ఇక్కడ తయారయ్యే లడ్డూల గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు తాపేశ్వరం అడిగి పెడితే చాలు నెయ్యి సువాసనలతో గణనాథుడు లడ్డూలు మనకు స్వాగతం పలుకుతాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/vinayaka-chavithi-astrology-taurus-libra-set-for-success-as-lord-ganesha-brings-major-opportunities-1910349.html</loc><lastmod>2026-09-13T11:56:24+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ganesh-12.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ganesh ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ganesh-2-2.jpg</image:loc><image:caption><![CDATA[ హిందువులు పండుగల్లో ముఖ్యమైన పండుగ వినాయక చవితి. మరో 24 గంటల్లో వినాయకుడిని భక్తితో పూజిస్తారు. శివుడు, పార్వతుల చిన్న కుమారుడైన వినాయకుడి పుట్టినరోజనే వినాయక చవితిగా జరుపుకుంటారు. ప్రతి ఏడాది ఈ పండుగను భాద్రపదమాసం శుక్ల చతుర్థి తిథి రోజున వినాయక చవితి జరుపుకుంటారు. ఈ సారి రెండు రాశుల వారికి మేలు చేయబోతున్నాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ganesh-1-2.jpg</image:loc><image:caption><![CDATA[ వినాయక చవితి సమయంలో కొన్ని గ్రహాల కలయికలు రెండు రాశుల వారికి వరాల వర్షం కురవబోతోంది. ఒక్కసారి వినాయకుడు వీరి జీవితాల్లో ఎంటర్ అయితే అన్ని మారిపోతాయి.  ప్రతికూల పరిస్థితులు పోయి  సానుకూలమైన ఫలితాలను జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/tula-rashi-4.jpg</image:loc><image:caption><![CDATA[ తులారాశి: చంద్రుడు, శుక్రుడు ఈ రాశిలో బలంగా ఉన్నారు ఇక వీరికి తిరుగులేదు. ఇంకా మీకు మెరుగైన సంబంధాల వలన అదృష్టం మొత్తం మారుతుంది. ఇంకా కొత్తగా ఆర్థిక అవకాశాలు కూడా వస్తాయి. ఈ రాశి వారు మొదలు పెట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు.  పిల్లల విషయంలో శుభ వార్తలు వింటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/vrushbha-rashi-1.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభ రాశి : వినాయకుడు వలన మొత్తం మంచిగా ఉండబోతోంది. ఇంకా గొప్పగా మారనుంది. కొందరి వ్యక్తుల వలన జరగవు అని అనుకున్న పనులు కూడా జరుగుతాయి. వ్యాపారాల్లో  డబ్బుతో పాటు అధిక లాభాలు వస్తాయి. అలాగే, ఆర్థిక సమస్యలు కూడా మొత్తం పోతాయి.  ఆకస్మిక లాభాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/astro-1-9.jpg</image:loc><image:caption><![CDATA[ Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/gold-prices-fluctuate-this-week-rates-see-marginal-decline-across-major-cities-1910350.html</loc><lastmod>2026-09-13T11:31:40+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-prices-7.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold Prices ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-prices-1-2.jpg</image:loc><image:caption><![CDATA[ బంగారం ధరల్లో భారీ కదలికలు నమోదువుతున్నాయి. ఒక రోజు తగ్గుతుండగా.. తర్వాతి రోజు పెరుగుతూ వస్తోన్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు ఇందుకు కారణంగా చెప్పవచ్చు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, డాలర్ బలపడుతున్న క్రమంలో పసిడి ధరలు ఊహకందని రీతిలో మార్పులు లోనవుతున్నాయి. దీంతో ఎప్పుడు తగ్గుతాయో.. ఎప్పుడు పెరుగుతాయో తెలియక కొనుగోలు చేయాలనుకునేవారు గందరగోళానికి గురవుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-prices-2-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ వారం గోల్డ్ రేట్లు తారుమారయ్యాయి. ఊహించని విధంగా మార్పులు జరిగాయి. సెప్టెంబర్ 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు గోల్డ్ రేట్లు ఒడిదొడుకులకు లోనయ్యాయి.  ఈ వారం మొత్తం మీద చూస్తే ధరలు స్వల్పంగా తగ్గాయి.  వారం రోజుల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? ఏయే నగరాల్లో ఎలా మారాయి? అనే విషయాలు తెలుసుకుందాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-prices-3-2.jpg</image:loc><image:caption><![CDATA[ సెప్టెంబర్ 6వ తేదీన హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,800 వద్ద ప్రారంభమవ్వగా.. సెప్టెంబర్ 12 నాటికి రూ.1,54,580కి చేరుకుంది. ఇక 22 క్యారెట్ల రేటు సెప్టెంబర్ 6న రూ.1,41,900 వద్ద ప్రారంభమవ్వగా.. శనివారం నాటికి రూ.1,41,700కి చేరుకున్నాయి. వారంలో స్వల్పంగా తగ్గాయని చెప్పవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-prices-4-2.jpg</image:loc><image:caption><![CDATA[ చెన్నైలో సెప్టెంబర్ 6న 24 క్యారెట్ల ధర రూ.1,54,800గా ఉండగా.. సెప్టెంబర్ 12న రూ.1,54,580కి చేరుకుంది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,41,900గా ఉండగా.. శనివారం నాటికి రూ.1,41,700కి చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,950 వద్ద ప్రారంభమవ్వగా.. 12వ తేదీ నాటికి రూ.1,54,730కి చేరుకుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-prices-5-2.jpg</image:loc><image:caption><![CDATA[ దేశ రాజధాని ఢిల్లీలో ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,42,050 నుంచి రూ.1,41,850కి చేరుకుంది. గత మూడు వారాలుగా ధరలు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో కొనుగోలుదారులు ఊరట చెందుతున్నారు. ఆదివారం గోల్డ్ రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/purnam-boorelu-how-to-make-crispy-and-delicious-traditional-sweet-boorelu-1910323.html</loc><lastmod>2026-09-13T11:24:25+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/purnam-burelu-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Purnam Burelu 6 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/purnam-burelu-6.jpg</image:loc><image:caption><![CDATA[ పూర్ణం బూరెల క్రిస్పీనెస్‌కు, ఆకృతికి పిండి తయారీ చాలా కీలకం. ముందుగా, ఒక పెద్ద గిన్నెలో ఒక కప్పు మినపగుళ్లు, రెండు కప్పుల రేషన్ బియ్యం లేదా మీరు అన్నం వండుకునే సోనా మసూరి బియ్యం తీసుకోవాలి. ఇక్కడే ఒక ప్రత్యేక చిట్కా ఉంది. బయటి పిండికి మంచి రుచిని, కమ్మదనాన్ని అందించడానికి ఒక టేబుల్‌స్పూన్ పచ్చి శెనగపప్పును కూడా వేయాలి. ఈ మూడింటిని రెండు నుండి మూడు సార్లు శుభ్రంగా కడిగి, సరిపడా నీళ్లు పోసి కనీసం నాలుగు నుండి ఐదు గంటల పాటు నానబెట్టాలి. కావాలంటే ముందు రోజు రాత్రి కూడా నానబెట్టుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/purnam-burelu-4.jpg</image:loc><image:caption><![CDATA[ నానిన తర్వాత, బియ్యం, పప్పుల నుండి అదనపు నీటిని తీసివేసి, మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. నీటిని ఎక్కువగా పోయకుండా, చాలా తక్కువ నీటితో, పిండిని చాలా మెత్తగా, గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి, అంటే స్పూన్‌తో తీసి పోసినప్పుడు రిబ్బన్ లాగా జారాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని, వెంటనే పూర్ణం వేయకుండా, కనీసం రెండు గంటల పాటు మూత పెట్టి పక్కన ఉంచాలి. ఈ సమయం పిండిని సహజంగా పులియబెట్టి, పూర్ణం బూరెలు వంట సోడా వేయకుండానే చక్కగా పొంగేలా చేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/purnam-burelu-5.jpg</image:loc><image:caption><![CDATA[ పిండి పులిసిన తర్వాత, రుచికి సరిపడా ఉప్పు, ఒక టీస్పూన్ చక్కెర (ఇది బూరెలకు మంచి బంగారు రంగును, రుచిని ఇస్తుంది) వేసి బాగా కలపాలి. ఇక్కడే మరొక ముఖ్యమైన చిట్కా.. పూర్ణం బయటి పొరను మరింత క్రిస్పీగా చేయడానికి, వేయించే ముందు ఒక టేబుల్‌స్పూన్ పొడి బియ్యప్పిండిని వేసి పిండిలో పూర్తిగా కలిసేలా చేయాలి. ఇది పూర్ణం బూరెలు చిదిమిపోకుండా కూడా సహాయపడుతుంది. పూర్ణం కోసం, అదే కొలత కప్పుతో ఒక కప్పు పచ్చి శెనగపప్పును శుభ్రంగా కడిగి, ఒక గంట పాటు నానబెట్టాలి. నానబెట్టిన పప్పును ఒకటిన్నర కప్పుల మంచి నీళ్లతో ప్రెషర్ కుక్కర్‌లో వేసి, మీడియం ఫ్లేమ్‌లో మూడు నుండి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. నీళ్లు ఎక్కువగా మిగలకుండా చూసుకోవాలి. పప్పు చక్కగా ఉడికిన తర్వాత, గరిటెతో లేదా మాషర్‌తో మరీ మెత్తటి పేస్ట్ లా కాకుండా, అక్కడక్కడ కొన్ని పలుకులు ఉండేలా మ్యాష్ చేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/purnam-burelu-1.jpg</image:loc><image:caption><![CDATA[ మెత్తగా మ్యాష్ చేసిన పప్పులో, అదే కప్పుతో ఒక కప్పు తురిమిన బెల్లం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి, లో టు మీడియం ఫ్లేమ్‌లో బెల్లం కరిగి పూర్ణం దగ్గరపడే వరకు కలుపుతూ ఉడికించాలి. పూర్ణం మరీ పల్చగా ఉండకూడదు, గట్టిగా, ఉండలు చేయడానికి అనుకూలంగా మారిన తర్వాత, ఒక టేబుల్‌స్పూన్ నెయ్యి మరియు అర టీస్పూన్ యాలకుల పొడి వేసి కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. పూర్ణాన్ని త్వరగా చల్లబరచడానికి కుక్కర్ అంచులకు పల్చగా పరచాలి. పూర్తిగా చల్లారిన తర్వాత, చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని, పూర్ణం మిశ్రమం నుండి మధ్యస్థ పరిమాణంలో ఉండలు చేసుకోవాలి. ఈ కొలతలతో సుమారు 12 పూర్ణం ఉండలు వస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/purnam-burelu-3.jpg</image:loc><image:caption><![CDATA[ పూర్ణం బూరెలు వేయించడానికి నూనె బాగా వేడిగా ఉండాలి. తయారైన పూర్ణం ఉండలను పులిసిన పిండిలో ముంచి, పిండి ఉండ చుట్టూ పూర్తిగా కవర్ అయ్యేలా చూసుకోవాలి. అనుభవజ్ఞులు చేతులతో నేరుగా నూనెలోకి వేయగలరు. కొత్తగా ప్రయత్నించేవారు, ఒక స్పూన్‌తో ఉండను పిండిలో ముంచి, అదనపు పిండిని గిన్నె అంచులకు రాసి, నెమ్మదిగా నూనెలోకి జారవిడవాలి. ఈ పద్ధతి బూరెలకు మంచి ఆకృతిని ఇస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/purnam-burelu-2.jpg</image:loc><image:caption><![CDATA[ నూనెలో వేసిన వెంటనే బూరెలను కదపకూడదు. అవి రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో వేగిన తర్వాత అవే పైకి తేలుతాయి. అప్పుడు నెమ్మదిగా కలుపుకుంటూ, బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచి నిదానంగా వేయించడం వల్ల బూరెలు లోపల వరకు చక్కగా ఉడికి, బయట క్రిస్పీగా తయారవుతాయి. తొందరపడి హై ఫ్లేమ్‌లో వేయిస్తే బయట రంగు వచ్చి లోపల పచ్చిగా ఉంటాయి. వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుని, దేవుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఈ విధంగా తయారుచేసిన పూర్ణం బూరెలు ఉదయం చేసినా సాయంత్రం వరకు క్రిస్పీగా ఉంటాయి, అస్సలు మెత్తబడవు. ఒకసారి ప్రయత్నిస్తే మళ్ళీ మళ్ళీ ఇదే పద్ధతిని పాటిస్తారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/sabja-seeds-benefits-2-teaspoons-daily-may-support-bone-health-and-nutrient-intake-1910335.html</loc><lastmod>2026-09-13T11:21:00+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/saja.jpg</image:loc>
					<image:title><![CDATA[ Saja ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sabja.jpg</image:loc><image:caption><![CDATA[ ఎముకలు బలంగా ఉండాలంటే క్యాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం అవసరం. విటమిన్ డి తోనే ఈ పోషకాలు శరీరానికి అందుతాయి. వీటి లోపం వల్ల ఎముకలు గుల్లబారే ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలు వస్తాయి. చాలామంది క్యాల్షియం అంటే పాలు గుర్తు చేసుకుంటారు. 100 గ్రాముల పాలలో సుమారు 120 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. అయితే, పాలు కంటే తక్కువ ఖర్చులో, ఎక్కువ క్యాల్షియం అందించే ఆహారాలలో సబ్జా గింజలు ఒకటి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sabja-1.jpg</image:loc><image:caption><![CDATA[ 100 గ్రాముల సబ్జా గింజలలో 700 నుంచి 750 మిల్లీగ్రాముల క్యాల్షియం లభిస్తుంది. అంటే కేవలం ఒక స్పూన్ (15 గ్రాములు) సబ్జా గింజలు తీసుకుంటే 100 నుంచి 115 మిల్లీగ్రాముల క్యాల్షియం, 50-60 మిల్లీగ్రాముల మెగ్నీషియం, అధిక మొత్తంలో ఫాస్ఫరస్ లభిస్తాయి. ఇది ఒక చిన్న గ్లాసు పాలు తాగినప్పుడు లభించే క్యాల్షియంతో సమానం. రోజుకు రెండు స్పూన్ల సబ్జా గింజలు వాడితే శరీరానికి కావాల్సిన క్యాల్షియంలో 50% అందుతుంది. ఎముకల పుష్టికే కాకుండా, సబ్జాలు రక్తంలో క్షార స్వభావాన్ని పెంచి, ఆమ్ల స్వభావాన్ని తగ్గిస్తాయి. ఇది మొత్తం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా ఏడాది పొడవునా సబ్జా గింజలను ఉపయోగించుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sabja-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఎముకల ఆరోగ్యానికి క్యాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు అవసరం. ఈ పోషకాలను శరీరం గ్రహించాలంటే విటమిన్ డి సమృద్ధిగా ఉండాలి. విటమిన్ డి లోపిస్తే, ఎంత క్యాల్షియం తీసుకున్నా అది శరీరానికి పూర్తి స్థాయిలో అందదు. ఎముకలు బలహీనపడి, ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యల బారిన పడకుండా ఉండాలంటే, క్యాల్షియం సమృద్ధిగా ఉండే ఆహారాలను మనం నిత్యం తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sabja-3.jpg</image:loc><image:caption><![CDATA[ క్యాల్షియం అనగానే మనలో చాలామందికి మొదట గుర్తుకు వచ్చేది పాలు. 100 గ్రాముల పాలలో సుమారు 120 మిల్లీగ్రాముల క్యాల్షియం లభిస్తుంది. రోజుకు అర లీటరు పాలు తాగితే పెద్దవారికి అవసరమైన 500-600 మిల్లీగ్రాముల క్యాల్షియం కొంతవరకు అందుతుంది. అయితే, గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు సుమారు 900 మిల్లీగ్రాముల క్యాల్షియం అవసరం. ఈ అవసరాలను తీర్చడానికి పాలు ఒక్కటే సరిపోవు, అంతేకాకుండా పాలు కంటే తక్కువ ఖర్చుతో, అధిక క్యాల్షియం అందించే అనేక సహజ ఆహారాలు ఉన్నాయి. వాటిలో సబ్జా గింజలు అగ్రస్థానంలో ఉన్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sabja-4.jpg</image:loc><image:caption><![CDATA[ సబ్జా గింజలను సాధారణంగా వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరచడానికి, డీహైడ్రేషన్ నివారించడానికి ఉపయోగిస్తుంటారు. అయితే, వీటి ఆరోగ్య ప్రయోజనాలు కేవలం వేసవి కాలానికే పరిమితం కావు. సబ్జా గింజలు అత్యంత గొప్ప క్యాల్షియం వనరు అని అనేక పరిశోధనలు రుజువు చేశాయి. 100 గ్రాముల సబ్జా గింజలలో సుమారు 700 నుంచి 750 మిల్లీగ్రాముల క్యాల్షియం లభిస్తుంది. ఇది పాలలో లభించే క్యాల్షియం కంటే అనేక రెట్లు ఎక్కువ. ఒక టీస్పూన్ (సుమారు 15 గ్రాములు) సబ్జా గింజలను తీసుకుంటే, 100 నుంచి 115 మిల్లీగ్రాముల క్యాల్షియం శరీరానికి అందుతుంది.  రోజుకు రెండు స్పూన్ల సబ్జా గింజలను తీసుకోవడం వలన మన రోజువారీ క్యాల్షియం అవసరాలలో దాదాపు 50% తీర్చవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/vinayaka-chavithi-annadanam-recipe-easy-dal-and-potato-curry-for-500-people-1910312.html</loc><lastmod>2026-09-13T10:44:28+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/tamata-pappu.jpg</image:loc>
					<image:title><![CDATA[ Tamata Pappu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/tamata-pappu-2.jpg</image:loc><image:caption><![CDATA[ మరో 24 గంటల్లో వినాయకుడి పూజలు అందుకోనున్నాడు. ఇక ఈ సమయంలో నైవేద్యాలు, అన్నదానం వంటివి చేస్తుంటారు. వినాయకుడి అన్నదానంలో మీరు పప్పు, బంగాళాదుంప కూరలు ఇలా చిట్కాలను పాటిస్తే  500 మందికి పెట్టొచ్చు. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం ఇక్కడ చూద్దాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/tamata-pappu-1.jpg</image:loc><image:caption><![CDATA[ టమాటా పప్పుకు కావాల్సిన పదార్థాలు: 18 కిలోలు కందిపప్పు , 10 కిలోలు టమాటాలు,  8 కిలోలు ఉల్లిపాయలు, 3 కేజీలు  పచ్చిమిర్చి, 
పావుకిలో పసుపు, 800 గ్రాములు కారం , మూడు కేజీలు ఉప్పు,  రెండు కేజీలు చింతపండు, రెండు కేజీలు కొత్తిమీర ,కేజీ కరివేపాకు, 
ఆవాలు, జీలకర్ర తాలింపుకు, మూడు లీటర్లు నూనెను తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/tamata-pappu-3.jpg</image:loc><image:caption><![CDATA[ టమాటా పప్పు తయారీ విధానం: ముందుగా కందిపప్పును తీసుకుని బాగా కడిగి కొంతసేపు దీనిని నానబెట్టి పెద్ద పెద్ద పాత్రల్లో  ఉడికించాలి. ఇక ఇప్పుడు పెద్ద కళాయి ఆయిల్ వేసి బాగా వేడి చేసి దానిలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి పోపు పెట్టాలి.నాలుగు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా దీనిలో వేసి కూడా టమాటాలు కలపాలి ఇవి మెత్తగా అయినా తరువాత పసుపు, కారం వేసి ఉడికించిన పప్పు, చింతపండు రసం, ఉప్పు వేసి ఒకటికి మూడు సార్లు బాగా తిప్పి పోపు వేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/potato-curry-1.jpg</image:loc><image:caption><![CDATA[ బంగాళాదుంప కూరకు కావాల్సిన పదార్థాలు: 50 కేజీలు బంగాళాదుంపలు, 9 కిలోలు ఉల్లిపాయలు, 3 కేజీలు పచ్చిమిర్చి,  ఒక కిలో కారం, 250 గ్రాములు పసుపు , 3 కేజీలు ఉప్పు , అరకిలో ఆవాలు, 400 గ్రాములు జీలకర్ర,  ఒక కిలో కరివేపాకు, 5 కిలో మీటర్లు,  రెండు కేజీలు  కొత్తిమీర, రెండు కేజీలు కరివేపాకు ను తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/potato-curry.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానం: ముందుగా బంగాళాదుంపలను తీసుకుని బాగా ఉడికించి దాని పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
ఆ తరువాత ఒక పెద్ద గిన్నెలో ఆయిల్ వేడి చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి పోపు పెట్టాలి.  పచ్చిమిర్చి వేసి వేయించాలి.
పసుపు, కారం, ఉప్పు వేసి దుంపలకు మసాలా పట్టేలా  దీనిని కలపాలి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/knee-pain-relief-exercises-and-diet-changes-fruits-tiffins-that-may-support-joint-health-1910284.html</loc><lastmod>2026-09-13T09:59:55+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/fruits.jpg</image:loc>
					<image:title><![CDATA[ Fruits ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pulka-3.jpg</image:loc><image:caption><![CDATA[ మోకాళ్ళ నొప్పులతో బాధపడే చాలా మందికి కీళ్ళ మధ్య జిగురు తగ్గడం ప్రధాన కారణం. జిగురు ఉత్పత్తిని పెంచి, నొప్పి నుండి ఉపశమనం పొందడానికి శస్త్రచికిత్సకు వెళ్లకుండానే ఇంట్లోనే చక్కటి మార్గాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనికి మీరు రెండు ప్రధాన నియమాలలో మార్పులు చేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/fitness.jpg</image:loc><image:caption><![CDATA[ మొట్టమొదటిది, కీళ్ళ సందుల్లో జిగురు పెరగాలంటే వ్యాయామం తప్పనిసరి. కదలికల వల్ల ఉత్పత్తి అయ్యే వేడిని చల్లార్చడానికి, రాపిడిని తగ్గించడానికి శరీరం సహజంగా జిగురును స్రవిస్తుంది. కాళ్ళు కదపకుండా కూర్చుంటే జిగురు ఉత్పత్తి తగ్గిపోతుంది. మోకాళ్ళపై భారం పడకుండా చేసే వ్యాయామాలు జిగురును పెంచుతాయి. కుర్చీలో కూర్చుని కాళ్ళను నేలకు ఆనకుండా పైకి లేపి, బిగించి, దించటం, మంచంపై పడుకుని గాలిలో సైకిల్ తొక్కడం, కాళ్ళను మడిచి చాచడం వంటివి సులభమైన వ్యాయామాలు. ఇవి కండరాలను బలపరిచి, జాయింట్లను లూబ్రికెంట్ చేస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/fitness-1.jpg</image:loc><image:caption><![CDATA[ రెండవది, ఆహారంలో మార్పులు. ఉదయం, సాయంత్రం పండ్లు మాత్రమే తీసుకోవాలి. మధ్యాహ్నం భోజనంలో ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. బరువు తగ్గడానికి అన్నం మానేసి పుల్కా, ఎక్కువ కూరలు తీసుకోవాలి. ఈ నియమాలు పాటించడం వలన మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. రెండు లేదా మూడు కుర్చీలను దగ్గరగా వేసుకుని, ఒక కుర్చీలో కూర్చొని కాళ్ళను నేలకు ఆనకుండా మరొక కుర్చీపై ఉంచాలి. ఆ కాళ్ళను నేరుగా పైకి లేపి, కొన్ని క్షణాలు బిగించి, నెమ్మదిగా కిందికి దించాలి. దీనిని పదేపదే చేయాలి. ఇది మోకాళ్ళ కండరాలను బలపరుస్తుంది. జాయింట్లలో స్టిఫ్‌నెస్ తగ్గి, జిగురు ఉత్పత్తి పెరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pulka.jpg</image:loc><image:caption><![CDATA[ ఒక నెల రోజుల పాటు ఉదయం, సాయంత్రం టిఫిన్లు (ఇడ్లీ, దోస, చపాతీలు వంటివి) మానేసి, కేవలం పండ్లు మాత్రమే తినాలి. ఇది బలాన్ని ఇస్తూనే, శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. మధ్యాహ్నం భోజనంలో వండేటప్పుడు ఉప్పు వేయకుండా, దింపిన తర్వాత తినేటప్పుడు తక్కువ మొత్తంలో చల్లుకోవాలి. ఉప్పు తగ్గించడం వల్ల కీళ్ళ మధ్య జిగురు దెబ్బతినకుండా, కార్టిలేజ్ అరగకుండా కాపాడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pulka-4.jpg</image:loc><image:caption><![CDATA[ అన్నం బదులు పుల్కాలు, ఎక్కువ కూరలతో ఆహారం తీసుకోవాలి. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. బరువు తగ్గడం మోకాళ్ళపై భారాన్ని తగ్గిస్తుంది పండ్లు తినడం ప్రారంభించిన 20-30 రోజుల తర్వాత, రెండు రకాల మొలకెత్తిన విత్తనాలను ఆహారంలో చేర్చుకోవచ్చు. పండ్లు తినడానికి గంట ముందు వెజిటబుల్ జ్యూస్, సాయంత్రం కొబ్బరి నీళ్ళు లేదా చెరుకు రసం తీసుకోవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/why-are-general-coaches-placed-at-the-front-and-back-of-trains-heres-the-real-reason-1910264.html</loc><lastmod>2026-09-13T08:52:58+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/railways.jpg</image:loc>
					<image:title><![CDATA[ Railways ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/indian-railway-1.jpg</image:loc><image:caption><![CDATA[ రైళ్లల్లో ప్రయాణించనివారంటూ ఎవరూ ఉండరు. ఒక్కసారైనా ట్రైన్‌లో జర్నీ చేసి ఉంటారు. దూరపు ప్రాంతాలకు వెళ్లేవారు సౌకర్యవంతంగా ఉంటుందనే ఉద్దేశంతో రైలు ప్రయాణాన్ని ఇష్టపడతారు. అయితే రైళ్లల్లో అనేక కేటగిరీ క్లాస్‌లు ఉంటాయి. జనరల్, స్లీపర్, ఏసీ కోచ్‌లు ఉంటాయి. ఈ కోచ్‌ల అమరిక అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఏసీ, స్లీపర్ బోగీలు మధ్యలో ఉంటే.. జనరల్ కోచ్‌లు రైలు ముందు, వెనుక భాగంలో ఉంటాయి. జనరల్ కోచ్‌లు ముందు లేదా వెనుక భాగంలోనే ఎందుకు ఉంటాయనే అనుమానం చాలామందికి కలుగుతూ ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/indian-railways-3.jpg</image:loc><image:caption><![CDATA[ జనరల్ కోచ్‌లను రైలు మధ్యలో ఉంచితే.. ఫ్లాట్‌ఫామ్‌పై ఒకేచోట భారీగా జనం చేరే పరిస్థితి ఉంటుంది. అదే ముందు, వెనుక భాగంలో ఉంచడం వల్ల ప్రయాణికుల రద్దీని వేర్వేరు ప్రాంతాల్లోకి విభజించినట్లు అవుతుంది. దీని వల్ల తొక్కిసలాటలు వంటివి చోటుచేసుకోవు. స్లీపర్, ఏసీ కోచుల్లోకి ఎక్కేవారికి కూడా అసౌకర్యం ఉండదు. ఫ్లాట్‌ఫామ్‌పై ప్రయాణికుల కదలికలను క్రమబద్దీకరించడంలో ఇది సహాయపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/indian-railways-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఫ్లాట్ ఫామ్ మధ్యభాగంలో స్లీపర్, ఏసీ కోచ్‌లు ఉండటం వల్ల బోర్డింగ్ సమయంలో గందరగోళం తగ్గుతుంది. వృద్దులు, పిల్లలు రిజర్వుడ్ కోచ్‌లకు సులభంగా చేరుకోవచ్చు. అంతేకాకుండా ఒకే ప్రాంతంలో ఎక్కుమంది ప్రయాణికులు ఉంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు నియంత్రించడం కష్టతరం అవుతుంది. అదే ఇలా విభజించడం వల్ల వేగంగా చర్యలు చేపట్టవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/indian-raiwlays-5.jpg</image:loc><image:caption><![CDATA[ స్టేషన్ నిర్వహణ, భద్రత కోసమే జనరల్ బోగీలను రైలు ముందు, వెనుక భాగంలో అమర్చుతారు. అయితే ప్రతీ రైలులో కోచ్‌ల అమరిక అనేది ఒకేలా ఉండదు. కొన్ని రైళ్లలో వేరేచోట ఉండవచ్చు. దీంతో మీరు ప్రయాణం చేసే సమయంలో స్టేషన్‌లో డిస్‌ప్లే బోర్డులు, కోచ్ పొజిషన్ సూచనలను పాటించండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/indian-railways-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే దీని వెనుక పెద్ద రీజన్ ఉంది. ట్రైన్ సేఫ్టీ, ప్రయాణికుల భద్రత కోసమే అలా ఏర్పాటు చేస్తారు. ప్రయాణికుల రద్దీ ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకూడదనే ఉద్దేశంతో జనరల్ కోచ్‌లను ముందు, వెనుక భాగంలో అమర్చుతారు. జనరల్ బోగీల్లో ఎక్కువ రష్ ఉంటుంది. నాన్ రిజర్వుడు కోచ్‌లు కావడంతో ఎంతమంది అయినా ఎక్కవచ్చు. దీంతో నిరంతరం కిటకిటలాడుతూ ఉంటుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/skin-warts-home-remedies-can-garlic-and-onion-juice-help-reduce-warts-naturally-1910248.html</loc><lastmod>2026-09-13T08:49:27+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pulipirlu-4.jpg</image:loc>
					<image:title><![CDATA[ Pulipirlu 4 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pulipirlu-3.jpg</image:loc><image:caption><![CDATA[ మనలో ఎంతో మంది పులిపిర్ల సమస్యతో బాధపడుతున్నారు. ఇవి ముఖం చేతుల మీద ఉంటే ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా ఈ 
బాధను ఎవరికీ చెప్పుకోలేకుండా ఉంటుంది. మీరు ఖర్చు లేకుండా మీ ఇంట్లో ఉండే వస్తువులతోనే వీటిని వదిలించుకోవచ్చు. 
మరి, అస్సలు లేట్ చేయకుండా దీనిని ఎలా తీసుకోవాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pulipirlu.jpg</image:loc><image:caption><![CDATA[ మీ ముఖం, మెడ, చేతులపై ఉన్న పులిపిర్లు  మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? వాటిని తగ్గించుకోవడానికి హాస్పిటల్స్ చుట్టూ వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో దొరికే వాటితో ఈ పులిపిర్లను ఎలా రాలిపోయేలా చేయోచ్చు. ఇది తెలిసిన తరువాత ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యాం అని అనుకోకుండా ఉండలేరు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pulipirlu-1.jpg</image:loc><image:caption><![CDATA[ వెల్లుల్లి, ఉల్లిపాయ రసం రసం:  నిజం చెప్పాలంటే ఈ పులిపుర్లు మీ శరీరం మీద ఉంటే ఎలాంటి సమస్య ఉండదు. కానీ,  కొన్ని సార్లు దురద ఉంటాయి. ఈ పులిపిర్లను వదిలించుకోవడానికి వెల్లుల్లి, ఉల్లిపాయ మంచిగా పని చేస్తాయి. ఇంకా దీనిలో కొద్దిగా ఉప్పు కలిపి ఈ పులిపుర్లు ఉన్నచోట  రాస్తే  కొద్దీ  రోజుల్లోనే ఈ పులిపిర్లు రాలిపోతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pulipirlu-2.jpg</image:loc><image:caption><![CDATA[ అరటిపండు తొక్క : మీరు రోజూ రాత్రి పడుకునే ముందు ఈ అరటిపండు తొక్కను తీసుకుని వీటిపై రుద్దుతూ ఉంటే ఇవి రాలిపోతాయి. ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె లో కొంచం కర్పూరం కలిపి  రాస్తే ఇవి తగ్గుతాయి. ఈ పాత కాలం టిప్స్ ను మీరు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. వీటి నుంచి  తప్పక బయట పడవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pulipirlu-5.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే, మీరు దీనిని పాటించే ముందు వైద్యునిసలహాతోనే తీసుకోవాలి. అప్పుడు సమస్య పెద్దది కాకుండా ఉంటుంది.  (నోట్ : మీరు వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తప్పసరిగా తీసుకోవాలి. ఇక్కడ అందించిన వివరాలు కేవలం మీ అవగాహనకు కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఇందులో రాసిన అంశాలకు టీవీ9 బాధ్యత వహించదని గమనించగలరు) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/anakapalle-micro-artist-carves-intricate-lord-ganesha-on-pencil-tip-for-vinayaka-chavithi-1910256.html</loc><lastmod>2026-09-13T08:44:07+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/micro-artist-venkatesh-carves-miniature-ganesha-on-pencil-tip.jpg</image:loc>
					<image:title><![CDATA[ Micro Artist Venkatesh Carves Miniature Ganesha On Pencil Tip ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pencil-tip-ganesha-2.jpg</image:loc><image:caption><![CDATA[ అనకాపల్లిజిల్లా నక్కపల్లి మండలం దొడ్డిగొల్లు గ్రామంలో వెంకటేష్ అనే కళాకారుడు సూక్ష్మ కళాఖండాలు  రూపొందించడం హాబీ. ప్రతిసారి.. సందర్భానికి అనుగుణంగా సమాజానికి ఒక చక్కని మెసేజ్ ఇస్తుంటాడు వెంకటేష్‌. అనేక దేవతా మూర్తులు, మహానుభావుల విగ్రహాలు చెక్కి చిన్న వస్తువులపై తనదైన శైలిలో చెక్కి జీవం పోస్తున్నాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pencil-tip-ganesha-4.jpg</image:loc><image:caption><![CDATA[ దీంతో వెంకటే ప్రత్యేకమైన శిల్పిగా,  సూక్ష్మ కళాకారుడి గా ఖ్యాతి గడించాడు. ఇప్పటికే వందల సంఖ్యలో సూక్ష్మ కళాఖండాల రూపొందించి అవార్డులు, రివార్డులు కూడా సొంతం చేసుకున్నాడు వెంకటేష్. అయితే తాజాగా వినాయక చవితి సందర్భంగా ఆది దేవుడి పై భక్తితో పెన్సిల్ మొనపై అద్భుతమైన కళాఖండాన్ని చెక్కాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pencil-tip-ganesha-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఆయన చెక్కిన ఈ విగ్రహం ఎత్తు, వెడల్పు గురించి తెలుసుకుంటే ఔరా అనక మానరు. ఎందుకంటే ఆ విగ్రహం వెడల్పు ఆరు మిల్లీమీటర్లు, ఎత్తు 12 మిల్లీమీటర్లు. 4బి చార్ కోల్ పెన్సిల్ తో మొనపై ఈ సూక్ష్మ కళాఖండం చెక్కడానికి రెండు గంటల సమయం పట్టిందని అంటున్నాడు వెంకటేష్. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pencil-tip-ganesha-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ వినాయక చవితి సందర్భంగా భక్తులందరికి ఈ సూక్ష్మ విగ్రహం అంకితం చేస్తున్నట్టు తెలిపాడు వెంకటేష్. పెన్సిల్ మొనపై వెంకటేష్ చెక్కిన ఈ వినాయకుడి స్వరూపం ఇప్పుడు ఔరా అనిపిస్తుంది. ఆ విగ్నేశ్వరుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుతున్నాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pencil-tip-ganesha.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ఈ సూక్ష్మ కళాకారుడు వెంకటేష్ యుఎస్‌లో స్థిర పడ్డాడు. ప్రస్తుతం అతను చికాగోని రవాణా శాఖలో రోడ్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. సందర్భం వచ్చినప్పుడల్లా వెంకటేష్ ఇలా సూక్ష్మకలపై తన ఆసక్తిని ప్రదర్శిస్తూ ఉంటాడు. తెలుగు పండుగల సమయంలో తమ భక్తునిచ్చాడుకుంటూ ఉంటాడు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/kanipakam-vinayaka-chavithi-2026-21-day-brahmotsavam-begins-with-grand-celebrations-1910236.html</loc><lastmod>2026-09-13T08:14:28+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/lord-ganesh-6-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Lord Ganesh 6 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/lord-ganesh-12.jpg</image:loc><image:caption><![CDATA[ స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకుడి సన్నిధి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. వినాయక చవితి కి విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలిగి పోతోంది. రారండోయ్ వేడుక చూద్దాం అంటూ వినాయక చవితి సంబరంతో సందడి ప్రారంభం కానుంది. 21 రోజుల పాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు గణనాథుడి ఆలయం ఏర్పాట్లతో సిద్ధంగా ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/lord-ganesh-1-2.jpg</image:loc><image:caption><![CDATA[ సత్య ప్రమాణాల సన్నిధి చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయం వినాయక చవితి వేడుకలతో అంగరంగ వైభవంగా ఆకట్టు కుంటుంది. వినాయక చవితి ఉత్సవాలతో ప్రారంభమయ్యే గణనాథుడి బ్రహ్మోత్సవాలు 21 రోజులు పాటు జరగ నుండగా ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు వినాయక చవితి ఈ నెల 15న  గణనాథుడి బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం జరగ నుంది. ఈ నెల 14 వినాయక చవితి నుంచి  వార్షిక బ్రహ్మోత్సవ సంబరాలు జరగనుండగా నవరాత్రి ఉత్సవాలు ఈనెల 23 న జరిగే తెప్పోత్సవంతో ముగియ
నున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/lord-ganesh-2-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 4 వరకు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తున్న దేవస్థానం ఈ మేరకు విస్తృత ఏర్పాట్లు చేసింది. స్వయంభు వరసిద్ధి వినాయకుడి సన్నిధిని విద్యుత్ దీప అలంకరణలు ఫల పుష్పాలతో  అలంకరించింది. విజ్ఞాలకు అధిపతి అయిన గణనాథుడి దర్శనం కోసం వచ్చే భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేసింది. దేశంలో ఎక్కడా లేని రీతిలో 21 రోజులపాటు కాణిపాకం ఆలయంలోనే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నా యంటున్న ఆలయ అర్చకులు చవితి రోజు గణనాథుడి వ్రతం, కళ్యాణం నిర్వహించనున్నారు. ఇక భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూ లైన్లను ఏర్పాటు చేసిన ఆలయ యంత్రాంగం వినాయక చవితి రోజు అర్ధరాత్రి 2  గంటలకు ఉభయదారులు నిర్వహించే అభిషేకం,  అనంతరం 3 గంటల నుంచి భక్తులకు స్వామి వారి సర్వదర్శనం కల్పించనుంది. వినాయక చవితి నుంచి వచ్చే అక్టోబర్ 4 వరకు ఆర్జిత సేవలను రద్దు చేసింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/lord-ganesh-3-2.jpg</image:loc><image:caption><![CDATA[ బ్రహ్మోత్సవాలను విజయ వంతం చేసేందుకు ఇప్పటికే చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే అన్ని శాఖల అధికారులతో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించగా వికలాంగులు,  వయో వృద్దులు, చంటి బిడ్డల తల్లులకు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేసారు. కాణిపాకం ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను కూడా  అలంకరించిన దేవస్థానం గణపతి హోమం యధావిధిగా నిర్వహించనుంది. వినాయక చవితి రోజున చందనం అలంకరణతో దర్శనం ఇవ్వనున్న వినాయకుడికి గణేష్ మాల ధరించిన భక్తులు పెద్ద సంఖ్యలో మొక్కులు చెల్లించుకోనున్నారు. ఇక అదే రోజు పుష్పకావిడి సమర్పించనుండగా రాత్రి కాణిపాకం ఆలయ వీధుల్లో సిద్ధి బుద్ధి సమేత గణనాథుడు దర్శనం ఇవ్వనున్నారు. ఈ నెల 15న ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా రాత్రి హంస వాహనంపై గణనాథుడు దర్శనం ఇవ్వనున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/lord-ganesh-4-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక వినాయకుడి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వినాయక చవితి రోజు ఉదయం 10 గంటలకు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించ నున్నారు. వినాయక చవితి రోజున దాదాపు లక్ష మందికి పైగానే భక్తులు వస్తారన్న అంచనాతో ఏర్పాట్లు చేసిన దేవాదాయ శాఖ బ్రహ్మోత్సవాల నిర్వహణకు ప్రత్యేక బడ్జెట్ ను కూడా కేటాయించింది. విద్యుత్ దీప అలంకరణలతో పాటు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేసిన దేవస్థానం సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామంటోంది.
ఇక అధికార యంత్రాంగం సరదర్శనం భక్తుల క్యూ లైన్లు, స్వామి వారి ప్రసాదాలు, అల్పాహారం సరఫరాపై  ప్రత్యేక దృష్టి పెట్టింది. దాదాపు లక్షకు పైగా లడ్డూలను బఫర్ స్టాక్ గా  సిద్ధం చేసిన దేవస్థానం భద్రత కు పెద్ద పీట వేసింది. ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించనుంది. 500 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేయనుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/pachhi-chalimidi-recipe-traditional-vinayaka-chavithi-naivedyam-loved-for-its-simple-taste-1910224.html</loc><lastmod>2026-09-13T10:49:20+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pachi-chalimidi-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Pachi Chalimidi 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pachi-chalimidi-4.jpg</image:loc><image:caption><![CDATA[ పచ్చి చలిమిడి అనేది శ్రీరామనవమి, వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి , ఇతర పండుగలకు దేవునికి నైవేద్యంగా తయారు చేసే ఎంతో రుచికరమైన సాంప్రదాయ వంటకం. దీనికి కావాల్సిన పదార్దాలు, సులభంగా ఎలా తయారు చేయాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం .. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pachi-chalimidi-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ సాంప్రదాయ తీపి వంటకాన్ని ఎక్కువగా పండుగలు సమయంలో ఇంకా శుభకార్యాలలో తయారుచేస్తూ ఉంటాము. ముఖ్యంగా, ఆడపిల్లను పెళ్లి చేసుకుని అత్తగారి ఇంటికి పంపేటప్పుడు చేస్తారు. సారెగా పెట్టేటప్పుడు చలిమిడికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి చలిమిడిని అందరూ సులువుగా, పర్ఫెక్ట్ కొలతలతో, నోట్లో వెన్నలా కరిగిపోయేంత మృదువుగా ఎలా తయారుచేయాలో ఇక్కడ చూద్దాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pachi-chalimidi.jpg</image:loc><image:caption><![CDATA[ పచ్చి చలిమిడికి కావాల్సిన పదార్థాలు: రెండు కప్పుల బియ్యం పిండి  (పచ్చి బియ్యం పిండి లేదా అప్పటికప్పుడు బియ్యం పిండి), ఒక కప్పు బెల్లం, ముప్పావు కప్పు నెయ్యి,  రెండు టేబుల్ స్పూన్లు యాలకుల పొడి,  ఒక కప్పు నీరును తీసుకోవాలి. సరైన కొలతలతో దీనిని చెస్తే ఎంతో రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pachi-chalimidi-1.jpg</image:loc><image:caption><![CDATA[ రుచికరమైన, మెత్తని చలిమిడి కోసం మొదటి ముఖ్యమైన చిట్కా బియ్యాన్ని నానబెట్టడం. పిండి మృదువుగా, చలిమిడి ఎంతో రుచిగా ఉండాలంటే బియ్యాన్ని ఒక రోజంతా తప్పకుండా నానబెట్టాలి. ఇంట్లో సాధారణంగా వాడే బియ్యం కాకుండా, రేషన్ బియ్యాన్ని వాడటం వల్ల చలిమిడి మరింత బాగా వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pachi-chalimidi-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఒక పెద్ద పాత్ర తీసుకుని దానిలో జల్లెడ పట్టిన బియ్యం పిండిని దీనిలో తీసుకోవాలి. ఇంకా దీనిలో  తురిమిన బెల్లం కూడా  వేసి చేతితోనే  కలుపుకోవాలి. ఇంకా బెల్లం, బియ్యం పిండి కలిసిపోయేలా దీనిని కలుపుతుండాలి. బెల్లంలోని తేమ వలన పిండి ఒక ముద్దలా అవుతుంది. అవసరమైతే దీనిలో కొద్దిగా నీరు కానీ నెయ్యిని వేసుకోవాలి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/is-drinking-lemon-water-every-day-good-for-you-health-benefits-and-risks-explained-1910206.html</loc><lastmod>2026-09-13T07:27:20+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/lemon-water-benefits-and-side-effects-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Lemon Water Benefits And Side Effects ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/lemon-water-benefits-and-side-effects-1.jpg</image:loc><image:caption><![CDATA[ నిమ్మరసం నీళ్లు తాగడం వల్ల కలిగే అత్యంత ముఖ్యమైన, ప్రాథమిక ప్రయోజనం శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడం. సాధారణ నీటిని తగినంతగా తాగడానికి ఇష్టపడని వారికి నిమ్మరసం ఒక మంచి రుచిని అందిస్తుంది. శరీరంలో తగినంత నీటి శాతం ఉండటం వల్ల రక్తప్రసరణ మెరుగుపడటంతో పాటు శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. వ్యర్థాలను బయటకు పంపడానికి, కణాల పనితీరు సక్రమంగా సాగడానికి రోజంతా శరీరం తేమగా ఉండటం అత్యంత ముఖ్యం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/lemon-water-benefits-and-side-effects-2.jpg</image:loc><image:caption><![CDATA[ పోషకాల విషయానికి వస్తే నిమ్మకాయ విటమిన్ సి కి నిలయం. ఈ విటమిన్ శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా చర్మం, ఎముకలు, రక్తనాళాల పటిష్టతకు అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తికి విటమిన్ సి అత్యంత అవసరం. అలాగే నిమ్మలోని సిట్రేట్ కొన్ని రకాల మూత్రపిండాల రాళ్లు ఏర్పడే అవకాశాలను తగ్గించడంలో తోడ్పడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/lemon-water-benefits-and-side-effects.jpg</image:loc><image:caption><![CDATA[ జీవనశైలి మార్పుల పరంగా చూస్తే.. సోడాలు, కృత్రిమ ప్యాకేజ్డ్ జ్యూస్‌లు, అధిక చక్కెర ఉండే డ్రింక్స్‌కు నిమ్మరసం నీళ్లు అత్యుత్తమ ప్రత్యామ్నాయం. స్వీట్ డ్రింక్స్ స్థానంలో దీనిని అలవాటు చేసుకోవడం వల్ల శరీరంలోకి చేరే అదనపు కేలరీలు తగ్గి, పరోక్షంగా బరువు నియంత్రణకు మార్గం సుగమమవుతుంది. భోజనం తర్వాత ఒక గ్లాసు నిమ్మరసం తాగడం వల్ల కొందరిలో జీర్ణక్రియ తేలికగా అనిపించినప్పటికీ, ఇది అన్ని రకాల గ్యాస్ట్రిక్ సమస్యలను పూర్తిగా నయం చేస్తుందనుకోవడం పొరపాటు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/lemon-water-benefits-and-side-effects-4.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రయోజనాలతో పాటు కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. నిమ్మకాయలోని అధిక యాసిడ్ దంతాల పైపొర అయిన ఎనామెల్‌ను దెబ్బతీసే ప్రమాదం ఉంది. అందుకే నిమ్మరసాన్ని నేరుగా కాకుండా నీటిలో పలుచగా కలిపి తీసుకోవాలి. తాగిన వెంటనే నోటిని సాధారణ నీటితో పుక్కిలించి ఊయడం మంచిది. ఇప్పటికే తీవ్రమైన ఎసిడిటీ, గ్యాస్ట్రైటిస్ లేదా కడుపులో పుండ్లు ఉన్నవారు నిమ్మరసం అధికంగా తీసుకుంటే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/lemon-water-benefits-and-side-effects-3.jpg</image:loc><image:caption><![CDATA[ మొత్తంగా చూస్తే ప్రతిరోజూ తప్పనిసరిగా నిమ్మరసం తాగాలనే రూల్ ఏమి లేదు. పోషకాహారం, తగినంత నిద్ర, రోజూ సరిపడా నీరు తాగడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లలో ఇది ఒక చిన్న భాగం మాత్రమే. దీనిని ఒక వ్యాధి నివారణా మార్గంగానో లేక మాయా డిటాక్స్ ద్రవంగానో చూడకుండా, రోజువారీ శరీర హైడ్రేషన్‌ను కాపాడుకునే రుచికరమైన డ్రింక్‌గా పరిమిత మోతాదులో ఆస్వాదించడమే ఉత్తమం. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/sun-transit-september-2026-these-zodiac-signs-enter-golden-period-with-success-and-new-opportunities-1910195.html</loc><lastmod>2026-09-13T06:55:25+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/sun-transist-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sun Transist 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/astro-12.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/astro-1-8.jpg</image:loc><image:caption><![CDATA[ సూర్యుడు రెండు రాశుల వారికి సంతోషాలను తెచ్చి పెట్టనున్నాడు. ఇక ఈ నెలలో  రెండు సార్లు నక్షత్రం మారనున్నాడు. ఈ సమయంలో భారీ ప్రయోజనాలను చేకూరనున్నాయి. అన్ని పనుల్లో పెట్టిన దూసుకెళ్తారు. ఇక వీరిని ఎవరూ కూడా ఆపలేరు సమయం కూడా అనుకూలంగా ఉండనుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/mituna-rashi-2.jpg</image:loc><image:caption><![CDATA[ మిథున రాశి : వీరికి అన్ని రకాలుగా కలిసి రానుంది. ప్రతి పనిలో లక్ష్మి దేవి అనుగ్రహం ఉంటుంది. మీరు అప్పుగా ఇచ్చిన  డబ్బును తిరిగి ఇస్తారు. వీరి జీవితం  వీళ్ళు కూడా ఊహించని విధంగా మొత్తం మారుతుంది.  అప్పు ఇచ్చే వరకు మీరు వెళ్తారు మీరు ఎవరి వద్దా ఇంక తీసుకోరు. ఇంకా స్నేహితుల సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/simha-rashi-4.jpg</image:loc><image:caption><![CDATA[ సింహ రాశి:  మీరు ఎదురుచూస్తున్న సమయం వస్తుంది మీ జాతకమే మారిపోతోంది. ముఖ్య పనులు జరగవు అనుకున్నవి కూడా జరిగిపోతాయి. ఇంకా ఎక్కడ  వ్యాపారాలు మొదలు పెట్టినా కూడా  అక్కడ భారీ లాభాలు వస్తాయి.  ఒక్క దెబ్బకు డబ్బు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుంది బంధువులు కూడా వెతుక్కుంటూ వీరి దగ్గరికి వస్తారు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/astro-2-5.jpg</image:loc><image:caption><![CDATA[ Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/character-revealed-this-optical-illusion-photo-tells-if-you-are-innocent-1910137.html</loc><lastmod>2026-09-12T21:53:03+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/optical-illusion.jpg</image:loc>
					<image:title><![CDATA[ Optical Illusion ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/optical-illusion-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అనేక రకాలైన ఆప్టికల్ ఇల్యూషన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఓ ఇంట్రెస్టింగ్ ఇమేజ్ కూడా నెట్టింట వైరల్‌గా మారింది. అయితే దానిని చూస్తే, అందులో మీకు ఏది ముందుగా కనిపించిందో అదే మీ క్యారెక్టర్‌ను తెలపడమే కాకుండా, మీరు అమాయకులో కాదో కూడా తెలియజేస్తుందంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/optical-illusion-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఆప్టికల్ ఇల్యూషన్స్ ను ద్వారా మన వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడం ఒక ఆసక్తిని కలిగించే అంశం. అంతేకాకుండా దీని ద్వారా మెమోరీ పవర్ పెరుగుతుంది. అయితే పైన ఒక చిత్రం కనిపిస్తుంది. అందులో పుర్రె, ఒక అమ్మాయి కూడా ఉంది. కాగా, అందులో మీకు ముందుగా ఏది కనిపిస్తుందో, అదే మీ నిజమైన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/optical-illusion-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఒక వేళ మీరు ఫొటో చూసిన వెంటనే మీకు అందులో పుర్రె మాత్రమే కనిపించినట్లు అయితే, మీరు చాలా సౌమ్యులు అని అర్థం. అంతే కాకుండా మంచి తెలివితేటలు కలవారు. చాలా వ్యూహాత్మకంగా ఉంటారు. మీరు ఏ పని చేసినా దానిని ఒక పద్ధతి ప్రకారం చేస్తారు. లోతైన అవగాహన కలిగి ఉంటారు. ఒక నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారు. సవాళ్లను ఎదుర్కోవడంలో మీరు ముందుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/optical-illusion-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఒక వేళ మీరు గనుక అమ్మాయిని చూసి ఉంటే మీరు చాలా అమాయకులు అని అర్థం. చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు. అంతే కాకుండా ప్రమాదాలకు ఎక్కువగా భయపడరు. విశాల దృక్పథం కలిగి ఉంటారు. అంతే కాకుండా అందరితో చాలా కలివిడిగా ఉంటారు. ఈ రకమైన వారు కొన్ని సార్లు నమ్మిన వారి చేతిలోనే మోసపోతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/optical-illusion-5.jpg</image:loc><image:caption><![CDATA[ నోట్ : పైవార్తలో  ఇవ్వబడిన సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా, నిపుణల ద్వారా ఇవ్వడం జరిగినది మాత్రమే, టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు. ఇది కేవలం పాఠకుల ఆసక్తిమేరకు మాత్రమే ఇవ్వడం జరిగిందని గుర్తించాలి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/labha-drushti-rajayogam-unexpected-fortune-for-aries-virgo-libra-1910136.html</loc><lastmod>2026-09-12T21:50:59+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/labha-drusti-yogam.jpg</image:loc>
					<image:title><![CDATA[ Labha Drusti Yogam ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/labha-drusti-yogam-1.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే అతి త్వరలో, కుజ గ్రహం, సూర్యుడు సెప్టెంబర్ 15న ఒకదానికి ఒకటి 60 డిగ్రీల కోణంలో రాబోతున్నాయి. ఇలా రెండు గ్రహాలు దగ్గరగా రావడం వలన లాభదృష్టి యోగం ఏర్పడుతుంది. అయితే ఇది పన్నెండు రాశులపై ప్రభావం చూపగా, మూడు రాశుల వారికి మాత్రం ఊహించని విధంగా ప్రయోజనాలు చేకూర్చనుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే? ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/labha-drusti-yogam-3.jpg</image:loc><image:caption><![CDATA[ మేష రాశి : మేష రాశి వారికి లాభదృష్టి యోగం వలన అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీరు గత కొన్ని రోజుల నుంచి పడుతున్న బాధల నుంచి విముక్తి పొందుతారు. ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/labha-drusti-yogam-4.jpg</image:loc><image:caption><![CDATA[ కన్యా రాశి : కన్యా రాశి వారికి ఇది చాలా మంచి సమయం. దూర ప్రయాణాలు చాలా లాభదాయకంగా ఉంటాయి. ముఖ్యంగా రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు ఎక్కువ లాభాలను అందుకుంటారు. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. అన్ని విధాలుగా మీకు ఈ సమయం అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/labha-drusti-yogam-5.jpg</image:loc><image:caption><![CDATA[ తుల రాశి : తుల రాశి వారికి ఇది అద్భుతమైన సమయంగా చెప్పాలి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఈ రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అంతే కాకుండా డబ్బు పరంగా కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి మంచి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి కూడా ఇది చాలా అద్భుతమైన సమయం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/labha-drusti-yogam-2.jpg</image:loc><image:caption><![CDATA[ నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/dont-throw-away-chilli-leaves-surprising-benefits-for-eyes-heart-and-immunity-1910132.html</loc><lastmod>2026-09-12T21:39:24+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/green-chilli-leaves2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Green Chilli Leaves ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/green-chilli-leaves.jpg</image:loc><image:caption><![CDATA[ కంటి చూపు మెరుగుపడుతుంది: మిర్చి ఆకుల్లో విటమిన్ A అత్యధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా, రేచీకటి వంటి సమస్యలు రాకుండా నిరోధిస్తుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే కంటి సంబంధిత సమస్యలను తగ్గించడంలో ఇవి ఎంతగానో దోహదపడతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/green-chilli-leaves1.jpg</image:loc><image:caption><![CDATA[ గుండె ఆరోగ్యం మెండుగా ఉంటుంది: ఈ ఆకులలో ఉండే ఫైటోకెమికల్స్ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. రక్త ప్రసరణను వేగవంతం చేసి, రక్త నాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా చూస్తూ గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మిర్చి ఆకుల్లో విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి, సీజనల్ వ్యాధులు, జలుబు, దగ్గు వంటి ఇన్‌ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/green-chilli-leaves-3.jpg</image:loc><image:caption><![CDATA[ మధుమేహం, జీర్ణక్రియ నియంత్రణ: శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను క్రమబద్ధీకరించి, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి ఈ ఆకులు తోడ్పడతాయని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాకుండా, ఇవి జీర్ణ వ్యవస్థను శుభ్రపరిచి మలబద్ధకం సమస్యను నివారిస్తాయి. ఇందులోని యాంటీ సెప్టిక్ గుణాలు చర్మంపై వచ్చే చిన్నపాటి కురుపులు, అలర్జీలను తగ్గిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/green-chilli-leaves-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ ఆకులను ఎలా ఉపయోగించాలి?: పాలకూర, తోటకూర లాగానే మిర్చి ఆకులను శుభ్రం చేసి పప్పులో వేసి వండుకోవచ్చు లేదా వేపుడు లాగా చేసుకోవచ్చు. ఆకులను నీటిలో బాగా మరిగించి, కొద్దిగా మిరియాల పొడి కలిపి హెల్తీ సూప్‌లా తీసుకోవచ్చు. పచ్చిమిర్చి ఆకులతో రోటి పచ్చడి చేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/green-chilli-leaves-5.jpg</image:loc><image:caption><![CDATA[ గమనిక, జాగ్రత్తలు: మిర్చి ఆకులు కొద్దిగా ఘాటు స్వభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి వీటిని పరిమితంగానే ఆహారంలో తీసుకోవాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు లేదా తీవ్రమైన గ్యాస్ట్రిక్, అల్సర్ సమస్యలతో బాధపడేవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని తీసుకోవడం మంచిది. ]]></image:caption></image:image></url></urlset>