గద్దర్‌ను కలిసిన కాంగ్రెస్ లీడర్ అంజన్‌ కుమార్ యాదవ్

తెలంగాణ ప్రజలు మానవతా విలువలతో ఉన్నారని అన్నారు ప్రజాగాయకుడు గద్దర్. టీఆర్ఎస్ నేతలు చెబుతున్న మాటలకు ఉబ్బిపోవడానికి ప్రజలు బెలూన్లు కాదన్నారాయన. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి.. రుణం తీర్చుకోవాలంటే.. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న 16 మంది ఎంపీలను గెలిపించాలని ప్రజలను కోరారు గద్దర్. సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి అంజన్‌ కుమార్ గద్దర్‌ను కలిసి మద్దతు కోరారు. ఈ సందర్భంగా మాట్లాడిన గద్దర్ సెక్కులరిజానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. దేశంలో రాచరికాన్ని పోలిన […]

గద్దర్‌ను కలిసిన కాంగ్రెస్ లీడర్ అంజన్‌ కుమార్ యాదవ్
Follow us

| Edited By:

Updated on: Mar 28, 2019 | 3:22 PM

తెలంగాణ ప్రజలు మానవతా విలువలతో ఉన్నారని అన్నారు ప్రజాగాయకుడు గద్దర్. టీఆర్ఎస్ నేతలు చెబుతున్న మాటలకు ఉబ్బిపోవడానికి ప్రజలు బెలూన్లు కాదన్నారాయన. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి.. రుణం తీర్చుకోవాలంటే.. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న 16 మంది ఎంపీలను గెలిపించాలని ప్రజలను కోరారు గద్దర్. సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి అంజన్‌ కుమార్ గద్దర్‌ను కలిసి మద్దతు కోరారు. ఈ సందర్భంగా మాట్లాడిన గద్దర్ సెక్కులరిజానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. దేశంలో రాచరికాన్ని పోలిన మోడీ పాలన అంతంకావాలన్నారు ప్రజాగాయకుడు గద్దర్.