దారుణం.. 40 వీధి కుక్కలకు విషం పెట్టిన వ్యక్తి.. షాకింగ్ రీజన్

ఒడిశాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తన మేకను ఓ కుక్క కరిచిందన్న కారణంతో.. ఊర్లో ఉన్న అన్ని కుక్క‌ల‌కు విషం ఇచ్చి చంపేశాడు ఓ వ్యక్తి.

దారుణం.. 40 వీధి కుక్కలకు విషం పెట్టిన వ్యక్తి.. షాకింగ్ రీజన్
Follow us

| Edited By:

Updated on: Jun 26, 2020 | 9:56 PM

ఒడిశాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తన మేకను ఓ కుక్క కరిచిందన్న కారణంతో.. ఊర్లో ఉన్న అన్ని కుక్క‌ల‌కు విషం ఇచ్చి చంపేశాడు ఓ వ్యక్తి. క‌ట‌క్ జిల్లాలోని మ‌హంగ టౌన్‌లో ఈ అమానుష ఘ‌ట‌న జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. బ్ర‌హ్మానంద మాలిక్ అనే వ్య‌క్తి,  ఒక మేక‌ను పెంచుకుంటున్నాడు. ఆ మేక‌ను ఇటీవ‌ల ఓ వీధి కుక్క దాడి చేసింది. ఆ దాడిలో మేక తీవ్రంగా గాయ‌ప‌డింది. దీంతో మాలిక్ కుక్క జాతిపైన కక్ష పెంచుకున్నాడు.

ఊరిలోని కుక్క‌ల‌న్నింటిని చంపేయాల‌ని నిర్ణ‌యించుకున్న మాలిక్.. అందుకు మరో వ్యక్తి సాయం తీసుకున్నాడు. ఇద్దరు కలిపి మాంసంలో విషం కలిపి ఊర్లోని కుక్కలన్నింటికి పెట్టారు. అది తిని ఊర్లోని 40 కుక్క‌లు మృతి చెందాయి. ఇక ఈ ఘ‌ట‌న‌ తెలుసుకున్న మ‌హంగ‌ స‌ర్పంచ్, పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు స‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. నిందితులు పరారీలో ఉండటంతో.. వారి కోసం గాలింపు చర్యలను మమ్మురం చేశారు.