పెరిగిన పెట్రోల్ వినియోగం
కరోనా కట్టడి నెమ్మదిగా తొలుగుతోంది. దీంతో జనం రోడ్లపై వస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, పరిశ్రమలు తెరుచుకోవటంతో పనుల్లో బిజీగా మారుతున్నారు. దీంతో ఇంతకాలం డీలాపడిన పెట్రో ఉత్పత్తుల అమ్మకాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. లాక్ డౌన్ నేపథ్యంలో వాహనాలను రెండు నెలల పాటు సరిగ్గా రోడ్డెక్కనీయలేదు. సుదీర్ఘ ప్రయాణాల ఊసే లేదు. స్థానికంగా బైకులు తిరగడమే తప్ప కార్లు దాదాపు రెండు నెలల పాటు కనిపించలేదు. ఈ నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ల వినియోగం ఏ మాత్రం లేకుండా […]
కరోనా కట్టడి నెమ్మదిగా తొలుగుతోంది. దీంతో జనం రోడ్లపై వస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, పరిశ్రమలు తెరుచుకోవటంతో పనుల్లో బిజీగా మారుతున్నారు. దీంతో ఇంతకాలం డీలాపడిన పెట్రో ఉత్పత్తుల అమ్మకాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. లాక్ డౌన్ నేపథ్యంలో వాహనాలను రెండు నెలల పాటు సరిగ్గా రోడ్డెక్కనీయలేదు. సుదీర్ఘ ప్రయాణాల ఊసే లేదు. స్థానికంగా బైకులు తిరగడమే తప్ప కార్లు దాదాపు రెండు నెలల పాటు కనిపించలేదు. ఈ నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ల వినియోగం ఏ మాత్రం లేకుండా పోయింది.
రొటీన్ గా జరిగే అమ్మకాలతో పోలిస్తే కనీసం 20-30 శాతం అమ్మకాలు కూడా జరగలేదని ఆ రెండు నెలల గణాంకాలు చెబుతున్నాయి. మార్చి 21 నుంచి మే రెండో వారం వరకూ అదే పరిస్థితి …. పెట్రోల్, డీజిల్ అమ్మకాలు చాలా వరకూ తగ్గాయి. అయితే ఇప్పుడు పెట్రో ఉత్పత్తుల అమ్మకాలు మళ్లీ ఊపందుకున్నాయని కేంద్రం ప్రకటించింది. ఎంతలా అంటే.. లాక్ డౌన్కు ముందు జరిగిన అమ్మకాలతో పోలిస్తే 60 శాతం నుంచి 65 శాతం అమ్మకాలు ఇప్పుడు పెరిగాయని తెలిపింది. పెట్రో ఉత్పత్తుల అమ్మకాల్లో దేశం పుంజుకుంటోందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. అంతే కాదు.. ఈ నెల (జూన్) చివరినాటికి పెట్రో ఉత్పత్తుల అమ్మకాలు లాక్ డౌన్ పూర్వపు స్థాయికి వచ్చేస్తాయని కూడా ఆయన అంచనా వేశారు.