ఫుడ్ బిజినెస్ ప్రారంభించాలనుకుంటున్న వారికి ఇకపై మరింత ఈజీ..
ఫుడ్ బిజినెస్ ప్రారంభించాలనుకుంటున్న వారికి ఇకపై మరింత ఈజీ కానుంది. ఫుడ్ వ్యాపారస్తులు లైసెన్సులు, రిజిస్ట్రేషన్ సేవలు సులభంగా అందించడం కోసం.. ఫుడ్ రెగ్యులేటర్ సంస్థ FSSAI కొత్త ఆన్లైన్ ఫ్లాట్ఫామ్ను ప్రారంభించింది. ఎవరైనా ఫుడ్ బిజినెస్ చేయాలనుకున్నవారు నేరుగా..
ఫుడ్ బిజినెస్ ప్రారంభించాలనుకుంటున్న వారికి ఇకపై మరింత ఈజీ కానుంది. ఫుడ్ వ్యాపారస్తులు లైసెన్సులు, రిజిస్ట్రేషన్ సేవలు సులభంగా అందించడం కోసం.. ఫుడ్ రెగ్యులేటర్ సంస్థ FSSAI కొత్త ఆన్లైన్ ఫ్లాట్ఫామ్ను ప్రారంభించింది. ఎవరైనా ఫుడ్ బిజినెస్ చేయాలనుకున్నవారు నేరుగా.. ఈ ఆన్లైన్ ద్వారా లాగిన్ అయి.. ఈజీగా లైసెన్స్ను పొందవచ్చు.
ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ల రిజిస్ట్రేషన్కు, లైసెన్స్ల జారీకి భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా) కొత్త ఆన్లైన్ వేదికను లాంచ్ చేసింది. 2011 నుంచే ఫుడ్ లైసెంసింగ్ అండ్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ పేరిట.. ఈ సంస్థ ఇప్పటివరకూ 70 లక్షల లైసెన్సులను, రిజిస్ట్రేషన్లను జారీ చేసినట్టు తెలిపింది. ప్రస్తుతం 35 లక్షల లైసెన్సులు, రిజిస్ట్రేషనల్ లావాదేవీలు చురుకుగా జరుగుతున్నాయని.. ఇదే సమయంలో ‘ఫుడ్ సేఫ్టీ కంప్లైన్స్ సిస్టమ్’ వేదికను అప్గ్రేడ్ చేసి నూతన ఆన్లైన్ వేదికను కూడా లాంచ్ చేసినట్టు ఈ సంస్థ పేర్కొంది.
ఈ ఫ్లాట్ ఫామ్ను దీని మొబైల్ యాప్తో ఇంటిగ్రేడ్ చేయడమే కాక, ఐటీ వేదికలతో అనుసంధానం చేస్తారని ఈ అథారిటీ వివరించింది. ఫుడ్కు సంబంధించి ఎలాంటి మోసాలు జరగకుండా, రిస్క్ లేకుండా చూడటంతో పాటు.. లైసెన్సింగ్, రిజిస్ట్రేషన్లల విధానంలో కొత్త మార్పులు తెచ్చేందుకు ఈ సంస్థ శ్రీకారం చుట్టింది.
Food regulator #FSSAI said it has launched a new online platform for granting licenses and registration to food business operators (FBOs) as well as regulatory complianceshttps://t.co/qu3c1Hx6JS
— FinancialXpress (@FinancialXpress) May 30, 2020
ఇది కూడా చదవండి:
నోరు అదుపులో ఉంచుకోవాలి.. జారొద్దు.. బాలయ్యపై నాగబాబు ఘాటు వ్యాఖ్యలు
నందమూరి ఫ్యామిలీ నుంచి మల్టీ స్టారర్.. స్టోరీ రెడీ చేస్తోన్న కళ్యాణ్ రామ్?