‘నేను బీజేపీ-ఆర్ఎస్ఎస్ వెంటే’, నేవీ మాజీ అధికారి మదన్ శర్మ
మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రేపై కార్టూన్ వేసినందుకు శివసేన కార్యకర్తల దాడికి గురైన నేవీ మాజీ అధికారి మదన్ శర్మ-తానిక బీజేపీ-ఆర్ఎస్ఎస్ వాదినే అని ప్రకటించారు. తనపై ఎటాక్ చేసినప్పుడు వారు, నువ్వు బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాడివని ఆరోపణలు..
మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రేపై కార్టూన్ వేసినందుకు శివసేన కార్యకర్తల దాడికి గురైన నేవీ మాజీ అధికారి మదన్ శర్మ-తానిక బీజేపీ-ఆర్ఎస్ఎస్ వాదినే అని ప్రకటించారు. తనపై ఎటాక్ చేసినప్పుడు వారు, నువ్వు బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాడివని ఆరోపణలు చేశారని, కానీ ఇప్పుడు తను నిజంగానే ఈ రెండు ‘సంస్థలకు’ చెందినవాడినని అన్నారు. మంగళ వారం ముంబైలో రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీతో భేటీ అయి వఛ్చిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. నాపై జరిగిన ఎటాక్ గురించి గవర్నర్ కు వివరించా. ఈ దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకునేలా చూస్తానని గవర్నర్ నాకు హామీ ఇచ్చారు.. అని మదన్ శర్మ చెప్పారు. గత శనివారం మదన్ శర్మపై దాడికి దిగిన శివసేన నేత కమలేష్ కదంతో సహా మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి అదే రోజు బెయిలుపై విడుదల చేశారు. కాగా శివసేన నేత సంజయ్ రౌత్ ఈ దాడిని పరోక్షంగా సమర్థించారు. దేనికైనా రియాక్షన్ అంటూ ఉంటుందన్నారు.