టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు గుడ్ న్యూస్…
టీటీడీ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి ఫ్యామిలీ మెంబర్స్ కు బర్డ్లో ఫ్రీ మెడికల్ సర్వీసెస్ అందించనున్నారు. తిరుపతి పద్మావతి విశ్రాంతి గృహంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన బర్డ్ ట్రస్ట్ మీటింగులో పలు నిర్ణయాలు తీసుకున్నారు. సిమ్స్ తరహాలో టీటీడీ ఉద్యోగులు, పెన్షనర్లు వారి ఫ్యామిలీ మెంబర్స్ కు ఉచిత వైద్య సేవలు అందించి, సర్జరీలు చేసి.. టీటీడీ నుంచి బిల్లులు వసూలు చేసుకోవడానికి కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బర్డ్ ఆసుపత్రిలో పేషెంట్లకు […]
టీటీడీ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి ఫ్యామిలీ మెంబర్స్ కు బర్డ్లో ఫ్రీ మెడికల్ సర్వీసెస్ అందించనున్నారు. తిరుపతి పద్మావతి విశ్రాంతి గృహంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన బర్డ్ ట్రస్ట్ మీటింగులో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
సిమ్స్ తరహాలో టీటీడీ ఉద్యోగులు, పెన్షనర్లు వారి ఫ్యామిలీ మెంబర్స్ కు ఉచిత వైద్య సేవలు అందించి, సర్జరీలు చేసి.. టీటీడీ నుంచి బిల్లులు వసూలు చేసుకోవడానికి కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బర్డ్ ఆసుపత్రిలో పేషెంట్లకు ఫిజియోథెరపి చేయడానికి.. రోబో అసిస్టెడ్ గెయిట్ ట్రైనింగ్ థెరఫీ మెషీన్, బ్లడ్ సర్కులేషన్ ఎలా ఉందో గుర్తించడానికి ఉపయోగపడే 2డీ కలర్ డాప్లర్ మెషీన్ కొనుగోలు చేయడానికి కమిటీ అంగీకారం తెలిపింది. ఆర్థోపెడిక్ మెడికల్ ట్రీట్మెంట్ లో నిపుణులైన తిరుపతికి చెందిన విద్యాసాగర్, నెల్లూరుకు చెందిన ప్రొఫెసర్ కృష్ణారెడ్డి, డాక్టర్ గురువారెడ్డి సర్వీసెస్ ఫ్రీగా ఉపయోగించుకోవడానికి కమిటీ ఆమోదించింది. బోర్డు సభ్యులు శివశంకరన్, డాక్టర్ నిశ్చిత.. బర్డ్ డైరెక్టర్ డాక్టర్ మదన్ మోహన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీటింగులో పాల్గొన్నారు. ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో బసంత్ కుమార్ పద్మావతి గెస్ట్ హౌస్ నుంచి సమావేశంలో పాల్గొన్నారు.