పక్కా స్కెచ్ వేసిన జవాన్లు.. నలుగురు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. నగర సమీపంలోని లస్సీపోరా వద్ద ఉగ్రవాదులు ఉన్నారని పక్కా సమాచారం అందడంతో.. భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. అయితే వారిని చూసిన ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో.. అప్రమత్తమైన జవాన్లు ఎదరుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. సంఘటన స్థలంలో మూడు ఏకే రైఫిల్స్ను స్వాధీనం చేసుకున్నారు. కాగా మరి కొందరు ఉగ్రవాదులు పారిపోవడంతో.. వారి కోసం గాలింపు చేపడుతున్నారు.
జమ్ముకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. నగర సమీపంలోని లస్సీపోరా వద్ద ఉగ్రవాదులు ఉన్నారని పక్కా సమాచారం అందడంతో.. భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. అయితే వారిని చూసిన ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో.. అప్రమత్తమైన జవాన్లు ఎదరుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. సంఘటన స్థలంలో మూడు ఏకే రైఫిల్స్ను స్వాధీనం చేసుకున్నారు. కాగా మరి కొందరు ఉగ్రవాదులు పారిపోవడంతో.. వారి కోసం గాలింపు చేపడుతున్నారు.