శాసనమండలి సభ్యుల ప్రమాణ స్వీకారం
తెలంగాణ శాసనమండలి సభ్యులుగా నవీన్రావు, పట్నం మహేందర్ రెడ్డి, తేరా చిన్నప్పరెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నలుగురి చేత మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు మండలి విప్ రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కూడా హాజరయ్యారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్ రెడ్డి, వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ […]
తెలంగాణ శాసనమండలి సభ్యులుగా నవీన్రావు, పట్నం మహేందర్ రెడ్డి, తేరా చిన్నప్పరెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నలుగురి చేత మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు మండలి విప్ రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కూడా హాజరయ్యారు. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్ రెడ్డి, వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ నుంచి తేరా చిన్నప్పరెడ్డి విజయం సాధించారు. ఎమ్మెల్యేల కోటా కింద నవీన్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన కొత్త ఎమ్మెల్సీలకు మంత్రులు అభినందనలు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే వీరిని గెలిపించాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.