దారుణ ప్రమాదం..ఒక్కరు కూడా ప్రాణాలతో మిగల్లేదు..
కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి అవుట్ కట్స్లో దారుణమైన యాక్సిడెంట్ జరిగింది. మితిమీరిన వేగం నాలుగు నిండు ప్రాణాలను బలిగొంది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు అతి వేగంగా వచ్చిన కారు డివైడర్కి తగిలి పక్కనే ఉన్న మర్రి చెట్టును ఢీకుంది. ఈ ఘటనలో నలుగురు స్పాట్లోనే మృతి చెందారు. మృతులను నిజామాబాద్ జిల్లా కోటగల్లీలోని పద్మానగర్కు చెందిన లావణ్య(35), రోష్ని(17) తల్లీకూతుళ్లతో పాటు నవీపేటకు చెందిన ప్రశాంత్(18), సుశీల్(20)గా ఐడెంటిఫై చేశారు. వారి కజిన్ […]
కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి అవుట్ కట్స్లో దారుణమైన యాక్సిడెంట్ జరిగింది. మితిమీరిన వేగం నాలుగు నిండు ప్రాణాలను బలిగొంది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు అతి వేగంగా వచ్చిన కారు డివైడర్కి తగిలి పక్కనే ఉన్న మర్రి చెట్టును ఢీకుంది. ఈ ఘటనలో నలుగురు స్పాట్లోనే మృతి చెందారు. మృతులను నిజామాబాద్ జిల్లా కోటగల్లీలోని పద్మానగర్కు చెందిన లావణ్య(35), రోష్ని(17) తల్లీకూతుళ్లతో పాటు నవీపేటకు చెందిన ప్రశాంత్(18), సుశీల్(20)గా ఐడెంటిఫై చేశారు. వారి కజిన్ అరుణ్ అనే వ్యక్తిని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సెండాఫ్ ఇచ్చి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కారు నుజ్జునుజ్జయిన పరిస్థితి బట్టి ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. కారులో మృతదేహాలు ఇరుక్కుపోవడంతో బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు అధికారులు.