కరోనాతో USలో చనిపోయిన నలుగురు ఇండియన్స్ వీరే..!
ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఎంతలా పట్టిపీడిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే దీని బారిన పడి 60వేల మంది వరకు ప్రాణాలు కోల్పోగా.. 12లక్షలకు పైగా ఆస్పత్రి పాలయ్యారు. ఈ క్రమంలో మన దేశంలో ఇప్పటికే 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. ఇతర దేశాల్లో కూడా మన దేశానికి చెందిన వారు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో తాజాగా అమెరికాలో కూడా మన దేశానికి చెందిన వారు కరోనా ఎఫెక్ట్తో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కరోనా పాజిటివ్తో […]
ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఎంతలా పట్టిపీడిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే దీని బారిన పడి 60వేల మంది వరకు ప్రాణాలు కోల్పోగా.. 12లక్షలకు పైగా ఆస్పత్రి పాలయ్యారు. ఈ క్రమంలో మన దేశంలో ఇప్పటికే 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. ఇతర దేశాల్లో కూడా మన దేశానికి చెందిన వారు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో తాజాగా అమెరికాలో కూడా మన దేశానికి చెందిన వారు కరోనా ఎఫెక్ట్తో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కరోనా పాజిటివ్తో నలుగురు భారతీయులు మృతిచెందినట్లు మలయాళ సంఘం తెలిపింది.
మృతులు అలెయమ్మ కురియకోస్ (65), తనకచన్ ఎంచెనట్టు (51), అబ్రహం శామ్యూల్ (45), ష్వాన్ అబ్రహం (21) గా గుర్తించారు. వీరంతా న్యూయార్క్లో మరణించినట్లు ఉత్తర అమెరికా కేరళ సమాఖ్య (FOKNA) పేర్కొంది. మృతుల కుటుంబాలకు.. కేరళా సమాఖ్య తమ ప్రగాఢ సానుభూతిని తెలిపింది. కరోనా వైరస్ సోకిన కుటుంబాలతో.. ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వారి పరిస్థితులను తెలుసుకుంటున్నామని.. అవసరమైన సహాయక చర్యలు చేపడుతున్నట్లు న్యూయార్క్లోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ వెల్లడించింది.
కాగా.. ప్రస్తుతం అమెరికాలో కరోనా విళయతాండవం సృష్టిస్తోంది. ఇప్పటికే అక్కడ లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో రోజు రోజుకూ మరణాల సంఖ్య పెరుగుతుండటం కలవరపెడుతోంది.