నకిలీ స్పిరిట్ తాగి నలుగురు మ‌ృతి

విశాఖ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మద్యం అనుకుని నకిలీ స్పిరిట్ తాగి నలుగురు మృతి చెందారు. మరికొందరు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు. బాధితులకు విశాఖ కేజీహెచ్ లో చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ఈ ఘటనపై ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావును సమాచారమడిగి తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్. […]

నకిలీ స్పిరిట్ తాగి నలుగురు మ‌ృతి
Follow us

| Edited By:

Updated on: Feb 25, 2019 | 10:26 AM

విశాఖ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మద్యం అనుకుని నకిలీ స్పిరిట్ తాగి నలుగురు మృతి చెందారు. మరికొందరు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు. బాధితులకు విశాఖ కేజీహెచ్ లో చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ఈ ఘటనపై ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావును సమాచారమడిగి తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్. అయితే.. ఈ ఘటనపై లోతుగా విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.