జగన్ అనే నేను వస్తా…స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తా

జమ్మలమడుగు: వైఎస్సార్ జయంతి సందర్భంగా సొంత జిల్లా కడపలో సీఎం జగన్ పర్యటించారు. ఇడుపులపాయలో దివంగత సీఎం, తన తండ్రి రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత రైతు దినోత్సవం సందర్భంగా ఆయన జిల్లాలోని జమ్మలమడుగులో పాల్గొన్నారు.  కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్‌ పనులు నిలిచిపోయాయని.. గత పాలకులు దీనిపై ఎన్నో డ్రామాలు చేశారని ముఖ్యమంత్రి అన్నారు.  ఈ సందర్భంగా జిల్లా ప్రజల సమస్యలను ఉద్దేశించి జగన్‌ పలు వరాలు కురిపించారు. డిసెంబర్‌ 26న జగన్‌ అనే […]

జగన్ అనే నేను వస్తా...స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తా
Follow us

| Edited By:

Updated on: Jul 09, 2019 | 9:31 AM

జమ్మలమడుగు: వైఎస్సార్ జయంతి సందర్భంగా సొంత జిల్లా కడపలో సీఎం జగన్ పర్యటించారు. ఇడుపులపాయలో దివంగత సీఎం, తన తండ్రి రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత రైతు దినోత్సవం సందర్భంగా ఆయన జిల్లాలోని జమ్మలమడుగులో పాల్గొన్నారు.  కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్‌ పనులు నిలిచిపోయాయని.. గత పాలకులు దీనిపై ఎన్నో డ్రామాలు చేశారని ముఖ్యమంత్రి అన్నారు.  ఈ సందర్భంగా జిల్లా ప్రజల సమస్యలను ఉద్దేశించి జగన్‌ పలు వరాలు కురిపించారు.

డిసెంబర్‌ 26న జగన్‌ అనే నేను వచ్చి.. అదే ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తానని హామీ ఇచ్చారు సీఎం జగన్. మూడేళ్లలోనే ఆ ప్రాజెక్టును పూర్తిచేసి మీ అందరికీ అందిస్తానని మాటిస్తున్నానని ప్రజలకు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 20వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. చెన్నూరు షుగర్‌ ఫ్యాక్టరీని మళ్లీ తెరిపిస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్‌.. కరవు ప్రాంతం వ్యక్తినైనందునే  ప్రాజెక్టుల ప్రయోజనం గురించి తనకు తెలుసని అన్నారు.