ఆ దిశగా పరిశోధనలు చేస్తే కరోనాను నాశనం చేయొచ్చు

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా లక్షణాలు అందరిలోనూ ఒకే విధంగా కనిపించడం లేదు. కొంతమందిలో స్వల్ప లక్షణాలు, మరికొంతమందిలో తీవ్ర లక్షణాలు కనిపిస్తున్నాయి.

ఆ దిశగా పరిశోధనలు చేస్తే కరోనాను నాశనం చేయొచ్చు
Follow us

| Edited By:

Updated on: Aug 09, 2020 | 12:55 PM

Coronavirus Live Updates: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా లక్షణాలు అందరిలోనూ ఒకే విధంగా కనిపించడం లేదు. కొంతమందిలో స్వల్ప లక్షణాలు, మరికొంతమందిలో తీవ్ర లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే దాదాపు 40శాతం మందిలో ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోందని ప్రముఖ పరిశోధకురాలు, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని అంటు వ్యాధుల నిపుణురాలు మోనికా గాంధీ తెలిపారు. పలు చోట్ల నమోదైన కేసులను పరిశీలిస్తే.. అందులో చాలా మందికి లక్షణాలు లేకుండానే పాజిటివ్‌గా వచ్చినట్లు ఆమె వెల్లడించారు.

అంతేకాదు తీవ్ర లక్షణాలు ఉన్న వారితో కలిసి ఉన్న వారిలో కొంతమంది వైరస్ సోకలేదని మోనికా తెలిపారు. దీనికి గల కారణాలు అంతు చిక్కడం లేదని పేర్కొన్నారు. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వలనే వీరికి కరోనా సోకలేదా..? లేక కరోనా వైరస్ మోతాదులో తేడా ఉండటం వలన వీరు కోవిడ్‌ బారిన పడలేదా అన్నది మిస్టరీగా మారిందని మోనికా చెప్పుకొచ్చారు. ఈ మిస్టరీని చేధిస్తే వ్యాక్సిన్ అభివృద్ధిని వేగవంతం చేయొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. అలాగే రోగ నిరోధక శక్తికి కొత్త మార్గాలు ‌సృష్టించొచ్చు అని అన్నారు. ఈ దిశగా పరిశోధనలు సాగిస్తే కరోనాకు అడ్డుకట్ట వేయడంతో పాటు దానిని నాశనం చేయొచ్చని ఆమె పేర్కొన్నారు.

Read This Story Also: నల్గొండలో ఘ‌రానా దొంగ‌లు.. ఏకంగా ఎస్ఐ ఇంట్లోనే చోరీ