మాజీ ఎమ్మెల్యేకు హైకోర్టులో ఊరట… ఇకనైనా అజ్ఞాతం వీడతారా?

గత నెల 27 తేదీన శ్రీకాకుళం జిల్లా, సరుబుజ్జిలి మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వినతులు స్వీకరిస్తున్న అధికారులని సమీక్ష నిర్వహించాలన్న నెపంతో ఎంపీడీఓ కార్యాలయంలోకి పిలిపించి వారిని దుర్భాషలాడి, బెదిరింపులకు పాల్పడి, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారన్న ఆరోపణలపై సరుబుజ్జిలి ఎంపీడీఓ దామోదరరావు, మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ పై సరుబుజ్జిలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.  పోలీసులు అరెస్టు చేస్తారన్న భయంతో కూన రవికుమార్ అప్పటి నుంచి […]

మాజీ ఎమ్మెల్యేకు హైకోర్టులో ఊరట... ఇకనైనా అజ్ఞాతం వీడతారా?
Follow us

| Edited By:

Updated on: Sep 26, 2019 | 6:26 PM

గత నెల 27 తేదీన శ్రీకాకుళం జిల్లా, సరుబుజ్జిలి మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వినతులు స్వీకరిస్తున్న అధికారులని సమీక్ష నిర్వహించాలన్న నెపంతో ఎంపీడీఓ కార్యాలయంలోకి పిలిపించి వారిని దుర్భాషలాడి, బెదిరింపులకు పాల్పడి, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారన్న ఆరోపణలపై సరుబుజ్జిలి ఎంపీడీఓ దామోదరరావు, మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ పై సరుబుజ్జిలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.  పోలీసులు అరెస్టు చేస్తారన్న భయంతో కూన రవికుమార్ అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లి పోయాడు. ఈ నెల 25 తేదీన అతడికి హైకోర్టు లో బెయిల్ మంజూరు అయింది. అయినా ఇంకా అతడు అజ్ఞాతంలోనే వున్నాడు. అతనిపై ఈ ఒక్క కేసు మాత్రమే ఇప్పటి వరకూ నమోదు అయ్యింది. ఈ కేసులో అతడితో పాటు మరో 11 మందిపై కూడా కేసు నమోదు కావటం అందులో పది మంది అరెస్టు కావడం కూడా జరిగింది. కేసు నమోదైన తరువాత కూన ఇంటివద్ద హైడ్రామా నెలకొంది. పోలీసులు సోదాలు నిర్వహించడానికి ప్రయత్నించగా కూన రవి  భార్య ప్రమీల వారిని అడ్డుకున్నారు.  వారంట్ లేకుండా ఎలా సోదాలు చేస్తారంటూ మండిపడ్డారు. దీంతో కూన రవికుమార్ ఇంటివద్ద ఒక ఏ‌ఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్, మహిళా హోం గార్డును పికెటింగ్ కోసం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా తమ్మినేని సీతారాంపై టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు.

అయితే… శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేత, ఆముదాలవలస మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ గౌడ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. కేసుల్లో చిక్కుకున్న కూన అరెస్టు కాకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం మంగళవారం విచారణ నిర్వహించింది. అనంతరం కూన రవికుమార్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ హయాంలో కూన ప్రభుత్వ విప్‌గా పనిచేశారు.

ఈ కేసులో కూన రవికుమార్ శ్రీకాకుళం జిల్లా కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నించినా కోర్టు మంజూరు చేయలేదు. దీంతో నేరుగా హైకోర్టును ఆశ్రయించగా మంగళవారం బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే ఈ బెయిల్ పత్రాలు తీసుకుని కూన రవికుమార్ గురువారం ఆముదాలవలస కోర్టుకు హాజరుకానున్నారు.. ఈ నేపథ్యంలో కూన రవికుమార్‌ను మరో కేసులో అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు వైసీపీ ప్రభుత్వం కావాలనే తమ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం కూన రవికుమార్‌ను అరెస్టు చేస్తే జిల్లా టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.