ఏదెలా ఉన్నా.. నేను కాంగ్రెస్కే మద్దతిస్తా..!
కాబోయే దేశ ప్రధాని ఎవరన్నది 23న తెలుస్తుందన్నారు మాజీ ప్రధాని దేవెగౌడ. ఫలితాలు ఎలాఉన్నా.. తాము మాత్రం కాంగ్రెస్తోనే ఉంటామని క్లారిటీ ఇచ్చేశారు. తిరుమల వచ్చిన ఆయన.. వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దేవెగౌడ వెంట కర్ణాటక సీఎం కూమారస్వామి కూడా ఉన్నారు. పుట్టిన రోజు వేడుకలకు దేవెగౌడ ఫ్యామిలీ తిరుమలకు రావడం కొన్నాళ్లుగా వస్తోన్న ఆచారం. లోక్సభ ఫలితాలకు సంబంధించి ఈసారి క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు మాజీ ప్రధాని. తమ సర్వే ప్రకారం […]
కాబోయే దేశ ప్రధాని ఎవరన్నది 23న తెలుస్తుందన్నారు మాజీ ప్రధాని దేవెగౌడ. ఫలితాలు ఎలాఉన్నా.. తాము మాత్రం కాంగ్రెస్తోనే ఉంటామని క్లారిటీ ఇచ్చేశారు. తిరుమల వచ్చిన ఆయన.. వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నారు.
దేవెగౌడ వెంట కర్ణాటక సీఎం కూమారస్వామి కూడా ఉన్నారు. పుట్టిన రోజు వేడుకలకు దేవెగౌడ ఫ్యామిలీ తిరుమలకు రావడం కొన్నాళ్లుగా వస్తోన్న ఆచారం. లోక్సభ ఫలితాలకు సంబంధించి ఈసారి క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు మాజీ ప్రధాని. తమ సర్వే ప్రకారం కర్ణాటకలో కాంగ్రెస్ – జేడీఎస్ కూటమి 18 సీట్లను కైవసం చేసుకుంటుందన్నారు. మంచి వర్షాలు కురిసి తమిళనాడు, కర్ణాటక రైతులు సుభిక్షంగా ఉండానలి శ్రీవారిని కోరినట్టు సీఎం కుమార స్వామి తెలిపారు.